సింగరేణిపై కేంద్రం దొంగదెబ్బ  | Telangana: Balka Suman Comments On Central Govt Over Singareni | Sakshi
Sakshi News home page

సింగరేణిపై కేంద్రం దొంగదెబ్బ 

Published Sun, Dec 4 2022 1:18 AM | Last Updated on Sun, Dec 4 2022 1:18 AM

Telangana: Balka Suman Comments On Central Govt Over Singareni - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మోదీ ప్రభుత్వం సింగరేణిని బ్లాకుల వారీగా విక్రయిస్తోందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆరోపించారు. ఇటీవల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని సింగరేణిని విక్రయించబోమని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఈ వేలం వేశారని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.

శనివారం బెంగళూరులో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో సింగరేణిలోని 4 బ్లాకులతో పాటు దేశంలోని 141 బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. సింగరేణి బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గోదావరిఖని, మందమర్రి, బెల్లంపల్లిలో శనివారం ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేసినట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement