Balka Suman
-
చెన్నూరులో ఉప ఎన్నిక ఖాయం: బాల్క సుమన్
సాక్షి, తెలంగాణ భవన్: సూటు కేసు కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ జైలు పోవటం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. సీఎం రేవంత్ కాదు కాదా.. భగవంతుడు కూడా వివేక్ను కాపాడలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా జరుగుతాయి. సూటు కేసు కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ జైలు పోవటం ఖాయం. సీఎం రేవంత్ రెడ్డి.. వివేక్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాదు కదా.. భగవంతుడు కూడా వివేక్ను కాపాడలేడు.ఈడీ కేసు జరుగుతుంటే.. తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వివేక్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు వెళ్తాం. వివేక్.. అక్రమంగా వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచాడు. తెలంగాణ పోలీసులకు స్వామి భక్తి ఎక్కువైంది. పోలీసులు.. రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తోన్న పోలీసులు భవిష్యత్తులో బలికాక తప్పదు. ఈడీ విచారణ జరుగుతున్న కేసును పోలీసులు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జనవరిలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్.. ఈడీ విచారణకు హాజరయ్యారు. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీల వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. రూ. 8కోట్ల బ్యాంకు లావాదేవీలపై గతంలో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య జరిగిన రూ.100 కోట్ల లావాదేవీల వ్యవహారంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దీనిపై వివేక్ను ఈడీ ప్రశ్నించింది. గత ఏడాది నవంబర్లో విశాఖ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ సంస్థ అని గుర్తించి కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.ఇది కూడా చదవండి: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు -
రేవంత్ రెడ్డికి నాగార్జున 400 కోట్లు.
-
కేసీఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను: బాల్కసుమన్
సాక్షి,హైదరాబాద్:ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చర్చకు రావొద్దనే సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు. బుధవారం(సెప్టెంబర్18) సుమన్ మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి, కుటుంబ పాలన, దందాలు నడుస్తున్నాయని విమర్శించారు.‘హైడ్రా పేరుతో భయపెట్టి వసూళ్ల దందా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్.తమ్మడి కుంట ఎఫ్టీఎల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టిన సిపాయి హిమాయత్ సాగర్లో ఉన్న ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూల్చడంలేదు. నాగార్జునను 400 కోట్లు డిమాండ్ చేశారు. ఇవ్వనందుకే కూల్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌజ్లను కూల్చరు. ప్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. ప్రజా పాలన నడుస్తలేదు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతున్నారు. రేవంత్ టీమ్లో ఉండి ఫేక్ న్యూస్లు పెడుతున్న వారిని, అధికారులను కెసిఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా నేను వదిలి పెట్టను’ అని సుమన్ ఫైర్ అయ్యారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును 15 రోజుల్లో కూల్చేయండి: హైకోర్టు -
మా పార్టీ గుర్తుపై గెలిచిన MLA లను కొనుగోలు చేస్తుండు రేవంత్
-
పోచారం ఇంటి వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్పై చర్యలు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో, అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలోనే వారిద్దరూ హస్తం గూటికి చేరారు. ఇక, పోచారం ఇంట్లోనే సీఎం రేవంత్ ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోచారం శ్రీనివాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు.ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలీసుల కళ్లు గప్పి సీక్రెట్గా పోచారం ఇంట్లోకి వెళ్లారు. దీంతో, అక్కడ హైటెన్షన్ చోటుచేసుకుంది. కాగా, పోచారం ఇంటి వద్ద సెక్యూరిటీ వైఫల్యంపై సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ ఉండగానే బీఆర్ఎస్ నేతలు చొచ్చుకురావడంపై సీఎం సెక్యూరిటీ ఆరా తీసింది. భద్రతా లోపంపై నివేదిక ఇవ్వాలని ఏసీపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్.. పోచారం ఇంటి వద్దకు వెళ్లారు. పోచారం ఇంట్లోకి బాల్క సుమన్ చొరబడిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలపై చర్యలు ఉంటాయన్నారు.కాగా, ఆ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఎం రేవంత్ కాన్వాయ్ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో రాజకీయంగా రసవత్తరంగా మారింది. -
బీఆర్ఎస్పై ఇంత విద్వేషమా?
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, బీఆర్ఎస్ పార్టీపై విద్వేషంతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. స్వయంగా సీఎం నిర్వహిస్తున్న విద్యా శాఖలోనే గందరగోళ పరిస్థితి ఉంటే ఎలా అని నిలదీశారు. కేసీఆర్ ఫొటోలు, పేర్లు ఉన్నాయని స్కూలు పిల్లల పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం వెనక్కి తెప్పించడం దారుణమని వ్యాఖ్యానించారు.మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ రాకేశ్ కుమార్తో కలిసి బాల్క సుమన్ శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. వానాకాలం సీజన్కు సంబంధించి రైతు బంధు పంపిణీని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు.. హోం శాఖ స్వయంగా సీఎం అధీనంలో ఉన్నా ఆయన సొంత జిల్లాలో పట్ట పగలు వ్యక్తిని కొట్టి చంపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తున్నాయని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. మద్యం, ఇసుక, ఫ్లై యాష్ రవాణాలో కమీషన్లు తీసుకోవడంలో సీఎం బిజీగా వున్నారని బాల్క సుమన్ విమర్శించారు. -
‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు పరామర్శించారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బాల్క సుమన్లు శుక్రవారం ఉదయం ఆమెను కలిశారు. కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ సంబంధిత నేతలు ఆమెతో ములాఖత్ కావడం ఇదే మొదటిసారి. ములాఖత్ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా?. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోదీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారు?. కవిత దగ్గరనుంచి ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు, మనీలాండరింగ్ యాక్ట్ ఎలా వర్తిస్తుంది?. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. బీజేపీ లో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్ గా ఈడీ వ్యవహరిస్తోంది.విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీ ని బీజేపీ వాడుకుంటోంది. బాల్క సుమన్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. మానసికంగా బలంగా ఉన్నారు. విపక్ష నాయకులను అణిచివేయలనే అన్యాయంగా కవితను ఈకేసులో ఇరికించారు.లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన ఈడీ హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక.. ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా ఆమెను అరెస్ట్ చేయగా.. బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది. అంతకు ముందు సుప్రీం కోర్టు సూచనలతో ఆమె ట్రయల్ కోర్టు(ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు)లోనే బెయిల్ పిటిషన్లు వేశారు. ఇది రాజకీయ కక్షతోనే జరిగిన అరెస్టుగా ఆమె వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థల వాదనలో కోర్టు ఏకీభవించింది. ఆమె బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. -
రేవంత్, బాబుల మధ్య అదే చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తన గురువు చంద్రబాబుతో రెండు గంటల పాటు బేగంపేట ఎయిర్ పోర్టులో చర్చలు జరిపారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రేవంత్ను కలిసిన తర్వాతే చంద్రబాబు అమిత్ షాను కలిశారని వివరించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ను బీజేపీ వైపు తీసుకొస్తానని చంద్రబాబు అమిత్ షాకు హామీ ఇచ్చారని ఆరోపించారు. రేవంత్కు చంద్రబాబు ఎంత చెబితే అంతే అని వారు విశ్లేషించారు. తెలంగాణ భవన్లో శనివారం మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ ,క్రాంతి కిరణ్, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, రాకేష్ కుమార్, గట్టు రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. మోదీ వద్ద బీజేపీ సీఎంలకు దొరకని ప్రాధాన్యత కాంగ్రెస్ సీఎం రేవంత్కు దొరుకుతోందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీతో జత కట్టడం ఖాయంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. మోదీని రేవంత్ పెద్దన్నగా సంభోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపడిందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే, హిమంత్ బిశ్వశర్మగా మారుతారని ఆరోపించారు. బాబు మాదిరిగానే రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ కరువు చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణలో కరువు ఉండేదని, ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణలో మళ్ళీ కరువు వచ్చిందని వారు విమర్శించారు. రేవంత్ పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనల్లో ఇప్పటికే మార్పు వచ్చిందనీ, ఉపముఖ్యమంత్రి భట్టి ఫొటో ప్రకటనల్లో అదశ్యమయ్యిందన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనల్లో అమిత్ షా, చంద్రబాబు ఉంటారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకే తెలంగాణ ఉద్యమంపై రేవంత్ రైఫిల్ ఎక్కు పెట్టారని గుర్తు చేశారు. రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నరేంద్రమోడీ చేతిలో పెడుతున్న తీరును కాంగ్రెస్ శ్రేణులు గమనించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని బీజేపీ నేతలు ఇస్తున్న ప్రకటనలు రేవంత్ను దష్టిలో పెట్టుకుని ఇస్తున్నవేనని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఆరోపించారు. -
TS: ‘బాబు పాలనను గుర్తు చేస్తున్న శిష్యుడు’
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న చంద్రబాబు శిష్యుడు.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పిలుపు ఇచ్చారు. తాజా రాజకీయ పరిణామాలపై శనివారం సుమన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు-రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధం మరోసారి బయటపడిందని సుమన్ విమర్శలు గుప్పించారు. ‘‘చంద్రబాబు-రేవంత్ ఇద్దరూ భేటీ అయ్యి మాట్లాడుకున్నారు. ఆ తర్వాతే కాంగ్రెస్ మంత్రులు టీడీపీ ఆఫీస్కు పోయి చంద్రబాబుకి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక్కడే వాళ్ల గురుశిష్యుల బంధం బయటపడింది’’ అని సుమన్ అన్నారు. చంద్రబాబు పాలనలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందని.. ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్రెడ్డి మళ్లీ ఆనాటి పాలనను గుర్తు చేస్తున్నారని సుమన్ మండిపడ్డారు. ఇక.. బీజేపీతో రేవంత్ రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోందని సుమన్ అన్నారు. దేశంలో.. ఆఖరికి సొంత పార్టీ(బీజేపీ) సీఎంలకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉంది. అలాంటిది రేవంత్రెడ్డికి చాలా తేలికగా దొరుకుతోంది. రేవంత్ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీళ్ల షేక్హ్యాండ్, పలకరింపులు చూస్తే ఎవరికైనా తెలిసిపోతుందా విషయం. పార్లమెంట్ ఎన్నికల తరవాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం కన్ఫర్మ్ అయింది. గంపగుత్తగా, హోల్ సేల్ గా ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ చేతులో పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలారా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని బాల్క సుమన్ పేర్కొన్నారు. -
‘హత్యలు చేయటమే ఇందిరమ్మ రాజ్యమా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుంది అని కాంగ్రెస్ చెప్తోందని, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ప్రశ్నిస్తే దాడులు, నిర్బంధాలు, ఎదురిస్తే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మండిపడ్డారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘జర్నలిస్ట్ శంకర్పైన దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు. సాయి రామ్ రెడ్డి హస్తినాపురం కాంగ్రెస్ ప్రెసిడెంట్కి చెందిన అనుచరుడు. పథకం ప్రకారం శంకర్ను చంపాలని చూశారు. గొడవపడినట్టు ఇద్దరు మహిళలను పెట్టి పథకం ప్రకారం చేశారు. పాశవికంగా శంకర్పై దాడి జరిగింది. ఈ దాడిని అందరూ ఖండించాలి. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?. అక్షరంతో ప్రశ్నిస్తే అయుధంతో దాడులు చేస్తారా?. హత్యలు చేయటమే ఇందిరమ్మ రాజ్యమా?’అని బాల్క సుమన్ ప్రశ్నించారు. తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తోంది: క్రాంతి మాజీ ఎమ్మెల్యే ‘ఇది ప్రజా పాలన లాగా లేదు, ప్రతీకారంతో జరుగుతున్న పాలన లాగా కనిపిస్తుంది. సీఎం రేవంత్రెడ్డి తన ప్రమేయం లేకుండా తెలంగాణ వచ్చిందనే ప్రతీకారం ఉన్నట్టు ఉంది. అనేక మందిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి దాడులు గమనించాలి. ప్రజలకు సుపరిపాలన అందించే ఉద్దేశ్యం లేదు. ఇలాంటి దాడులను ఖండిస్తున్నాం’అని క్రాంతి మండిపడ్డారు. -
‘లీకుల ఇచ్చేది బీజేపీ.. వార్తలు రాయించేది బీజేపీ’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పొత్తుల గురించి ఎవరు మాట్లాడారు? అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. తాము కిషన్రెడ్డితో ఏమైనా.. ఎప్పుడైనా పొత్తుల గురించి ఉసెత్తమా? అని అన్నారు. సోమవారం బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ‘బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్రెడ్డి ఎందుకు ఎగిరి పడుతున్నారు. బీఆర్ఎస్ ఒక సెక్యూలర్ పార్టీ మా నాయకుడు సెక్యులర్ నాయకుడు. లీకుల ఇచ్చేది బీజేపీ.. వార్తలు రాయించేది బీజేపీ. .. గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. అక్కడ ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. యూట్యూబ్ ఛానెల్లు, మేధావులకు ఈ విద్యార్థినీల ఆత్మహత్యలు కనిపించడం లేదా?. మేధావులు స్పందించాలి. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే.. రాష్ట్రంలో సమస్యలు లేనట్టు ఢిల్లీకి చెక్కర్లు కొడుతున్నారు’ అని బాల్క సుమన్ విమర్శలు చేశారు. -
బాల్క సుమన్కు మంచిర్యాల పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేసి.. విచారణకు రావాలని ఆదేశించారు. హైదరాబాద్లో సుమన్కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యల చేసిన విషయం తెలిసిందే. అదే రోజు బాల్క సుమన్పై కాంగెస్ పార్టీ మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నేడు పోలీసులు బాల్క సుమన్ నోటీసులు జారీ చేశారు. తనకు వచ్చిన పోలీసు నోటీసులపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ తనపై అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొన్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. చదవండి: సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు -
బీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి: బలరాం నాయక్
-
సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు
మంచిర్యాల, సాక్షి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు . సోమవారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్, సీఎం రేవంత్రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను ఉద్దేశించి సీఎం హోదాలో రేవంత్ అనుచితంగా మాట్లాడారని అంటూనే.. ఈ క్రమంలో సీఎం రేవంత్పై బూతు పదజాలం వాడారు బాల్క సుమన్. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్ వేయడంతో.. సుమన్ ఊగిపోయారు. అంతేకాదు.. రేవంత్ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వెంటనే సంస్కారం అడ్డువస్తోందంటూ సర్దిచెప్పుకునే యత్నం చేశారాయన. ఆ ప్రసంగం వీడియో వైరల్ కావడంతో.. కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాల్క సుమన్పై సెక్షన్లు 294బీ, 504, 506 సెక్షన్లపై కేసు నమోదైనట్లు సమాచారం. 👉: బాల్క్ సుమన్పై ఎఫ్ఐఆర్ -
బాల్క సుమన్ను అదే ముంచేసిందా?
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే నన్ను మరోసారి అందలమెక్కిస్తాయి. నా విజయానికి తిరుగులేదు. నా గెలుపును ఎవరు కూడా ఆపలేరు. అంగ బలం,అర్థ బలం అన్ని ఉన్న నేను అవలీలగా గెలువబోతున్న అంటూ మితిమీరిన విశ్వాసమే చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ను నిండా ముంచింది అనే అభిప్రాయాలు నియోజకవర్గంలో వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ, సింగరేణి అధికారులను నిర్లక్ష్యంగా చూడటం. వ్యక్తిగత సహాయకులు నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడటం. సీనియర్ నాయకులతో నాకు పనిలేదు. నేను ఎవరితో పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ పార్టీ సీనియర్ నాయకులను పక్కకు పెట్టడం. బాల్క సుమన్ పేరు చెప్పుకొని పలువురు నాయకులు,కార్యకర్తలు సింగరేణి,ప్రభుత్వ అధికారులపై పెత్తనం చెలాయించడం.తప్పుడు సమాచారం సుమన్ కు చేరవేయడం. అసలయిన విషయాన్నీ చెప్పకుండా దాచిపెట్టడం. నచ్చని నాయకులపై సుమన్ కు చాడీలు చెప్పడం. మందమర్రి,రామకృష్ణపూర్లో సింగరేణి క్వార్టర్ ల విషయంలో సుమన్ను నమ్ముకున్న వారికీ కాకుండ, పార్టీ క్యాడర్ లో కొందరు అక్రమంగా కబ్జాకు పాల్పడి వారి బందువులకు క్వార్టర్లను ఇప్పించడం. మందమర్రిలో గిరిజనుల భూములను కబ్జా చేయడం వంటి చర్యలు సుమన్ రెండో విజయానికి అడ్డుగోడల నిలిచాయని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. కోటపల్లి మండలంలో రైతులను కాళేశ్వరం బ్యాక్ వాటర్ నష్టపరిచినా స్పందించకపోవడంతో ఆ మండల వాసులు సుమన్ను వ్యతిరేకించారు. స్థానికంగా ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా, హైదరాబాద్ కె ఎక్కువ సమయం ఇవ్వడం కూడా సుమన్ను నష్టపరిచిందనే ఆరోపణ కూడా ఉంది. ఎమ్మెల్యేగా,ప్రభుత్వ విప్ గా ,పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికినీ నియోజక వర్గం ప్రజలు ఆశించిన మేరకు అభివృద్ధికి నోచుకోలేదనే అభిప్రాయాలూ సైతం ఉన్నాయి. గెలిచిన వెంటనే మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపిస్తా అని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన సుమన్ ఆ హామీని నెరవేర్చకపోవడం కూడా అయన ఓటమికి మరొక కారణమయినదని చెప్పవచ్చు. -
TS Elections Result: చెన్నూర్లో నువ్వా? నేనా?
సాక్షి, మంచిర్యాల: హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమా. అభివృద్ధి తామే చేశామని.. మరో అవకాశం ఇస్తే ఇంకా చేస్తామని, చేసిందేమీలేదని.. తమకు అధికారం ఇస్తే సిసలైన అభివృద్ధి చూపిస్తామని.. ఇలా హామీల మీద హామీలతో ‘సై’ అంటూ ఎన్నికల సమరంలో దూకారు. మరి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో.. ఉమ్మడి ఆదిలాబాద్లోని మంచిర్యాల జిల్లా పరిధిలోని నియోజకవర్గం. బీఆర్ఎస్ నుంచి యువనేతగా గుర్తింపు ఉన్న బాల్క సుమన్ మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత గడ్డం వివేక్ వెంకటస్వామి బరిలో నిలవడం ఇక్కడ తీవ్ర చర్చకు దారి తీసింది. పెద్దపల్లి మాజీ ఎంపీలుగా.. స్థానికతను చూపిస్తూ ప్రచారం చేసుకున్నారు ఇద్దరూ. ఇక బీజేపీ తరఫున దుర్గం అశోక్ పోటీలో నిలిచారు. చెన్నూరులో పురుష ఓటర్లు 91,969.. మహిళా ఓటర్లు 92,141.. ట్రాన్స్జెండర్ ఓటర్లు ఏడు.. సర్వీస్ ఎలక్టోర్లు 133.. మొత్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,250. చెన్నూర్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 82.57 శాతం ఓటింగ్ రికార్డ్ కాగా.. ఈసారి ఎన్నికల్లో 79.97 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కోల్బెల్ట్ ఏరియా ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి. -
సుమన్కు సుడిగుండమే.. ‘చెన్నూరు’ ఆయన పట్టుతప్పుతోందా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్కు ఈ ఎన్నికలు సుడిగుండంలా మారాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు కొడుకులాంటి వాడినని చెప్పుకునే ఈ విద్యార్థి నాయకుడికి నియోజకవర్గంలో తన పట్టు తప్పుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆశించిన మైలేజీ రాక సొంత పార్టీలోనే విస్మయం కలిగిస్తోంది. 2014 ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి అప్పటి సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ అభ్యర్థి వివేక్పై అనూహ్యంగా గెలవడంతో సుమన్ ప్రజాప్రాతినిధ్య జీవితానికి తొలి అడుగు పడింది. 2018 ఎన్నికల్లో చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును కాదని ఎంపీగా ఉన్న సుమన్కు టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో టికెట్పై పెట్రోల్ ‘మంటల’ మధ్యలోనే ఎన్నికలు ఎదుర్కొన్నారు. చివరికి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ వెంకటేష్నేతపై 28వేల ఓట్ల తేడాతో గెలిచారు. ప్రస్తుతం రెండోసారి చెన్నూర్ టికెట్ దక్కించుకుని బరిలో ఉన్నారు. అభివృద్ధి చెప్పినా.. వ్యతిరేకతేనా? జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో పోలిస్తే చెన్నూర్లోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని ఎమ్మె ల్యే సుమన్, పార్టీ శ్రేణులు చెబుతుంటారు. ప్రత్యేక బుక్లెట్ వేసి మరీ ప్రచారం చేస్తున్నా వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. ప్రచారం మొదలైన తొలి రోజు నుంచే ఓటర్లు తిరగబడుతున్నారు. ఆర్కేపీ, ఊరు మందమర్రి, చెన్నూరు, గంగారంలో నిరసనలు ఎదురయ్యాయి. చిత్రంగా మందమర్రి, ఆర్కేపీ, చెన్నూరు ఈ మూడు పట్టణాలకు రెండు వందల కోట్ల చొప్పున నిధులు తెచ్చామని చెప్పినా ఆ మే రకు ఓట్లు రాలుతాయా? అంటే చెప్పలేని పరిస్థితి. సుమన్ ప్రజలకు అందుబాటులో లేక, ఆయన పేరు చెప్పి నియోజకవర్గంలో కొందరు నాయకుల దందాలే కొంపముంచే పరిస్థితికి తెచ్చాయని అంటున్నారు. కోటపల్లి పరిధిలో ఓ నాయకుడు చేస్తు న్న భూ కబ్జాలు, బెదిరింపులు, మద్యం దందాలు, సెటిల్మెంట్లు అక్కడి ఓట్లపై దెబ్బ పడుతున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ వర్గీయులను పక్కకు పెట్టి, కేసులు పెట్టించడంతో వారంతా దెబ్బకొట్టేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యే రెండో సెట్ నామినేషన్ వేసే సందర్భంలో ఎమ్మెల్సీని బతిమాలినా రాకపోతే, చివరకు పార్టీ హైకమాండ్తో చెప్పించుకోవల్సిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సొంత నియోజకవర్గ సీనియర్ నాయకుడినే ఆయన లెక్క చేయకపోగా కార్యకర్తలు, నాయకులకు ఫోన్లోనైనా అందుబాటులో ఉండరనే అపవాదు సామాన్య కార్యకర్తల్లో ఉంది. మందమర్రి, ఆర్కేపీలో సింగరేణి క్వార్టర్లు, భూములు ఎమ్మెల్యే అనుచరుల కబ్జాలు, ఆయన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడడంతో వందల కోట్ల అభివృద్ధి ఈ వ్యతిరేకత ముందు నిలవడం లేదు. -
ఓటమి భయంతోనే తనపై ఆరోపణలు: బాల్క సుమన్
-
విశాక ఇండస్ట్రీస్కు చెందిన రూ.8 కోట్లు ఫ్రీజ్!
సాక్షి, హైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్కు సంబంధించిన విశాక ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఆదేశాల మేరకు నగర పోలీసు ఉన్నతాధికారుల సూచనలతో ఈ చర్య తీసుకున్నట్లు మధ్య మండల డీసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం వెల్లడించారు. గత సోమవారం జరిగిన ఈ వ్యవహారంపై ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ విజిలెన్స్ కంపెనీ రామగుండంలోని వివేక్ ఇంటి చిరునామాతో ఉందని, ఆయన సంస్థ ఉద్యోగులే ఈ సంస్థ డైరెక్టర్లుగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. ఈ లావాదేవీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికే వివేక్ ఈ షెల్ కంపెనీ ఖాతా వినియోగిస్తున్నట్లు సీఈఓకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని సీఈఓ నగర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్లో ఉన్న విశాక ఇండస్ట్రీస్కు చెందిన ఓ గుర్తుతెలియని ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ సంస్థకు ఐడీబీఐ బ్యాంక్ బషీర్బాగ్ బ్రాంచ్లోకి బదిలీ అయినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం 10.57 గంటలకు జరిగిన ఈ లావాదేవీ అనుమానాస్పదంగా ఉండటంతో సైఫాబాద్ పోలీసులు ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయించారు. దీనిపై ఎన్నికల అధికారులతో పాటు ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర విభాగాలకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
ఆ సోదరుల ధనబలం ముందు బీఆర్ఎస్ ప్రతాపమెంత?
ఓ పార్టీ అభ్యర్థి మందమర్రి మండలం ఊరు రామకృష్ణాపూర్లో తన బలం పెంచుకునేందుకు 30 మందికోసం రూ.2లక్షలు ఖర్చు చేశాడు. దీంతో ఆ అభ్యర్థికే వారు జై కొట్టడం ప్రారంభించారు. పార్టీ కండువాలు కప్పుకొని రోజువారీగా ప్రచారం చేస్తున్నారు. ఓ వాడలో 30 మందిని మాత్రమే తనవైపు తిప్పుకొనేందుకే సదరు అభ్యర్థి అక్షరాల రూ.2లక్షలు ఖర్చు చేయడం విశేషం. ► ఇదీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి చేసే ఎన్నికల ఖర్చుకు చిన్న ఉదాహరణ. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఖరీదుగా మారాయి. జిల్లా పరిఽధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో మంచిర్యాల జనరల్, బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీ, ఖానాపూర్ (జన్నారం) ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలుగా ఉన్నాయి. సాధారణంగా జనరల్ స్థానంలో బలమైన నాయకులు పోటీలో ఉంటే అధికంగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా జనరల్ స్థానం కన్నా బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ విచ్చలవిడిగా డబ్బు ప్రవాహం పెరిగింది. పోటీలో ఉన్నవారు ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తుండగా ఎన్నికలు చాలా ఖరీదవుతున్నాయి. ధనబలమున్న గడ్డం సోదరులైన మాజీ మంత్రి వినోద్, మాజీ ఎంపీ వివేక్ రంగ ప్రవేశంతో ఎన్నికలు మరింత ప్రియమైపోయాయి. బీఆర్ఎస్ బలం తగ్గకుండా.. చెన్నూర్, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థులైన గడ్డం సోదరులకు దీటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య ఖర్చు చేయడంలో పోటీ పడుతున్నారు. ప్రచారం, నాయకులు, కార్యకర్తల చేరికలు, బహిరంగసభలు, సమావేశాలు, ర్యాలీలు కార్యక్రమాలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ బహిరంగసభలు విజయవంతం చేసేందుకు రూ.కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. దీంతో అధికార పార్టీ అభ్యర్థులకూ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రతిరోజూ ప్రత్యర్థులకు ఏ మాత్రం తగ్గకుండా కార్యక్రమాలు చేయడమో.. అంతకంటే భారీగా ప్లాన్ చేయడం కోసమో నోట్ల కట్టలు విప్పాల్సి వస్తోంది. మంచిర్యాల నియోజకవర్గం కంటే ఈ రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఖర్చు పోటాపోటీగా నడుస్తోంది. బీజేపీ అభ్యర్థుల హైరానా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల్లో ఓట్లు రాల్చేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే బీజేపీ అభ్యర్థులు హైరానా పడుతున్నారు. చెన్నూరు టికెట్ తెచ్చుకున్న దుర్గం అశోక్, బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆ రెండు పార్టీలతో డబ్బుల్లో పోటీపడలేకపోతున్నారు. అయినప్పటికీ తమ స్థాయికి మించి ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. పోటీలో ఎక్కడ వెనుకబడిపోతామనే భయంతో చేతి చమురు వదులుకోవాల్సి వస్తోంది. ఇక బీఎస్పీ, స్వతంత్రులుగా పోటీ చేస్తున్నవారైతే ఈ ఖర్చు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పోటీ పడలేక, పోటీ నుంచి తప్పుకోలేక ఇబ్బందిగానే ముందుకు సాగుతున్నారు. రోజుకు రూ.లక్షల్లోనే ఖర్చు తెల్లవారు మొదలు పొద్దుగుంకేదాకా ప్రచారమంతా ఖర్చుతోనే నడుస్తోంది. ర్యాలీలు, బహిరంగ సభలకు జనసమీకరణ, రవాణా, భోజనాలు, మద్యం, ఊరూరా ప్రచార రథాలు, ప్రకటనలు, కరపత్రాలు, కండువాలు, బహిరంగ సభలు, వసతులు తదితర వాటి కోసం రూ.లక్షల్లోనే ఖర్చవుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతీ అభ్యర్థి రూ.40లక్షల్లోపే ఖర్చు పరిమితి ఉంది. అయితే ఆ పరిమితి వాస్తవానికి ఎప్పుడో దాటిపోయింది. ఇతర పార్టీల నాయకులు తాము పార్టీ మారేందుకు ‘బేరసారాలు’ మొదలుపెట్టాక ఈ ఖర్చు మరింత పెరిగిపోయింది. నామినేషన్ల ఉపసంహరణలోనూ డబ్బు ప్రవావం ఉంటోంది. ఇక పోలింగ్ సమీపించే కొద్దీ ఈ నోట్ల ప్రవాహం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చుపై పకడ్బందీ నిఘా పెడితే ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట పడనుంది. -
సింగరేణి తెలంగాణ కంపెనీనే, కానీ..: సీఎం కేసీఆర్
సాక్షి, మంచిర్యాల: బీఆర్ఎస్కు బాస్లు ఢిల్లీలో ఉండరని.. తెలంగాణ ప్రజలే దీనికి బాస్లు అని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం మధ్యాహ్నాం మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మందమర్రి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు కేసీఆర్. ‘‘కాంగ్రెస్ నాయకుల చేతిలో ఏమీలేదు. ఢిల్లీలో కట్క వేస్తే ఇక్కడ ఆ పార్టీకి వెలుగు వస్తుంది. అంబేద్కర్ను పార్లమెంటు ఎన్నికలలో ఓడగొట్టింది ఈ కాంగ్రెస్ పార్టీనే. కానీ, బీఆర్ఎస్కు ప్రజలే బాస్లు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని అన్నారాయన. ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుంది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓడలు, విమానాలు, రైళ్లు అన్ని ప్రైవేటైజేషన్ చేస్తోంది. పేకాట క్లబ్ డబ్బులు సంపాదించినోడు మంచిర్యాలలో పోటీ చేస్తున్నారు. వాళ్లకు బుద్ది చెప్పాలి అని ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ‘‘ఈ సింగరేణి అచ్చం తెలంగాణాదే. సింగరేణి మన తెలంగాణ కంపెనీ. కానీ, కేంద్రం వద్ద అప్పులు తెచ్చి అది కట్టలేక నలభై తోమ్మిది శాతం వాటాల్ని కేంద్రానికి అమ్మింది కాంగ్రెస్ పార్టీనే. ప్రాజెక్టులు కట్టలేక ముంచింది కాంగ్రెస్. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగోట్టింది కాంగ్రెస్, కమ్యూనిస్టు లే’’ అని మండిపడ్డారాయన. ‘‘సూట్ కేసులతో వచ్చే వాళ్లు కావాలనా.. జేబులో పైసలు లేని సుమన్ కావాలనా? మీరే నిర్ణయం తీసుకోని ఓట్లు వేయండి’’ అని ప్రజలను కోరారాయన. ‘సుమన్ రాకముందు, సుమన్ వచ్చిన తర్వాత. చెన్నూరు ఏలా మారిందో చూసి ఓట్లు వేయాలి. సుమన్ మా ఇంట్లో ఉంటాడు.. నాతో ఉంటాడు. చైతన్యంతో ఆలోచించి బీఆర్ఎస్కు ఓటు వేయాలి’ అని ప్రజలను కోరారాయన. మహబూబ్నగర్, నల్లగొండ,మెదక్ జిల్లాలో సగం ప్రజలు వలసపోయేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారాయన. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. ఓటును అమ్ముకోవద్దు. వాళ్లెవరో చెప్పారని ఓటు వేయొద్దు. ఓటు మీ తలరాతను మారుస్తుంది. ఓటు వేసేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించండి. పార్టీ అభ్యర్థి నడవడికను విచారించి ఓటేయాలి అని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
అప్పుడు తండ్రిని ఓడించా.. ఇప్పుడు కొడుకుని ఓడిస్తా.. బాల్క సుమన్ ఛాలెంజ్
-
బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల: చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బహిరంగంగా చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్లో ఉన్నది మనవాళ్లేననని, తనని పంపింది తానేనని బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి తెలిపారు. చెన్నూర్లో ప్రజాశీర్వాద. ర్యాలీలో సుమన్ మాట్లాడుతూ.. ‘‘ కాంగ్రెస్లో మనవాళ్లు ఉన్నారు. వాళ్లను కాంగ్రెస్లోకి పంపించింది నేనే. ఆ కాంగ్రెస్ నాయకులు కూడా.. ఎన్నికల తర్వాత మన పార్టీలోకి వస్తారు. గతంలో చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంపీ వెంకటేశ్ మన పార్టీలోకే వచ్చారు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కూడ బీఆర్ఎస్కే వస్తారు.. ..ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రచారం కోసం వస్తే సహకరించండి. వాళ్ల ప్రచారాన్ని అడ్డుకోవొద్దు అని కార్యకర్తలను ఉద్దేశించి సుమన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో తన బినామీలు ఉన్నారన్న బాల్క సుమన్ వ్యాఖ్యలు ఇప్పుడు నియోజవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. -
బెల్లంపల్లి రాజకీయ చరిత్ర.. గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
బెల్లంపల్లి రిజర్వుడ్ నియోజకవర్గంలో 2014లో టిఆర్ఎస్ అభ్యర్ది దుర్గం చిన్నయ్య రెండోసారి గెలుపొందారు. ఇక్కడ మాజీ మంత్రి జి.వినోద్ బిఎస్పి పక్షాన పోటీచేసి ఓడిపోయారు. అంతకుముందు ఆయన టిఆర్ఎస్లో ఉన్నారు. టిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతో బిఎస్పి టిక్కెట్ తీసుకుని ఇక్కడ పోటీచేసి ఓటమి చెందారు. చిన్నయ్యకు 11276 ఓట్ల మెజార్టీ వచ్చింది. చిన్నయ్యకు మొత్తం 55026 ఓట్లు రాగా, వినోద్కు 31359 ఓట్లు తెచ్చుకున్నారు. కాగా మూడోస్థానం ఇండిపెండెంట్ అబ్యర్ధిగా ఉన్న కె.వేద పదివేలకుపైగా ఓట్లు తెచ్చుకున్నారు. సిపిఐ సీనియర్ ఎమ్మెల్యే గుండా మల్లేష్ డిపాజిట్ దక్కించు కోలేకపోయారు. కాంగ్రెస్ ఐ మద్దతు ఇచ్చినా ఫలితం లేకపోయింది. భారీ ఆదిక్యతతో.. బెల్లంపల్లి రిజర్వుడ్ నియోజకవర్గంలో 2009లో గెలిచి ఆ శాసనసభలో సిపిఐ పక్ష నేతగా ఉన్న గుండా మల్లేష్ వరసగా ఓటమి చెందారు. 2014లో బెల్లంపల్లిలో టిఆర్ఎస్ అభ్యర్ది దుర్గం చిన్నయ్య భారీగా 52,528 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో మల్లేష్ కూడా యాక్టివ్గా ఉన్నా ఫలితం దక్కేలేదు. 2014లో బెల్లంపల్లిలో టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్రకు 9167 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రముఖ బొగ్గు కేంద్రంగా ఉన్న బెల్లంపల్లి 2009లో రిజర్వుడ్ నియోజకవర్గంగా ఏర్పడింది. మల్లేష్ గతంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం (ఎస్.సి)లో మూడుసార్లు 1983, 1985, 1994లో విజయం సాధించారు.2009లో నాలుగో సారి గెలిచిన తరువాత మల్లేష్ సిపిఐ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
సింగరేణి ఏరియాలో బీజేపీ నేతలను తిరగనివ్వం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించబోమని ఓ వైపు చెప్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలానికి పెట్టిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి శుక్రవారం ఇక్కడి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నిర్వీర్యం చేసి పారిశ్రామికవేత్త అదానీకి అప్పగించాలని కేంద్రం చూస్తోందని, సింగరేణి ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పగించేలా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురాని పక్షంలో సింగరేణి ఏరియాలో ఆ పార్టీ నేతలను తిరగనివ్వబోమని హెచ్చరించారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించారు. పదో తరగతి పరీక్షపత్రాల లీకేజీ వ్యవహారం వెనుక ఢిల్లీ బీజేపీ నేతల హస్తం ఉందని, అందులో తెలంగాణ బీజేపీ నాయకులు కేవలం పాత్రధారులేనని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విజయోత్సవ ర్యాలీలా? ప్రశ్నపత్రాలను లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ విజయోత్సవ ర్యాలీలు ఎందుకు తీస్తుందో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఎస్సెస్సీ హిందీ పేపర్ లీకేజీ కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్దోషి కాదని, ఆయన తప్పు చేసినందునే పోలీసులకు తన ఫోన్ ఇవ్వడం లేదన్నారు. ఎన్ని పాపాలు చేసైనా సరే అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీని బ్రోకర్, జుమ్లా, పేపర్ లీక్ పార్టీగా ఆయన అభివర్ణించారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న సంజయ్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. -
పేపర్ లీక్ చేసింది బీజేపీ కార్యకర్తలే..!
-
సింగరేణిపై కేంద్రం దొంగదెబ్బ
సాక్షి, హైదరాబాద్: మోదీ ప్రభుత్వం సింగరేణిని బ్లాకుల వారీగా విక్రయిస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఇటీవల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని సింగరేణిని విక్రయించబోమని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఈ వేలం వేశారని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. శనివారం బెంగళూరులో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో సింగరేణిలోని 4 బ్లాకులతో పాటు దేశంలోని 141 బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. సింగరేణి బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గోదావరిఖని, మందమర్రి, బెల్లంపల్లిలో శనివారం ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేసినట్లు తెలిపారు. -
తెలంగాణ వైఖరిని ప్రశ్నిస్తున్న తీరు బాధాకరం: సుమన్
-
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై బాల్క సుమన్ కామెంట్స్
-
ప్రలోభాలతో చిల్లరవేషాలు వేస్తున్నారు: ఎంపీ బాల్కసుమన్
-
ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోందని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్హౌజ్ వేదికగా జరిగిన ఘటనను ఖండిస్తూ అధికార పార్టీ నేతలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర చండూరు: టీఆర్ఎస్ను చూస్తుంటే బీజేపీకి వెన్నులో వణుకు మొదలైందని, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి బీజేపీ తమను టార్గెట్ చేసిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. చండూరులో విలేకరు లతో మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలో సింహ యాజులు, రామచంద్ర భారతి, నందకుమార్ల ద్వారా టీఆర్ఎస్కు చెందిన గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్రెడ్డిలను రూ.100 కోట్లకు పైగా నగదు, కాంట్రాక్టులు, ఇతర పదవులను ఇవ్వజూపి బీజేపీలోకి రావాలని ప్రలోభ పెట్టే యత్నం జరిగిందని తెలిపారు. ఇదే విషయం తమ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం అందించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో భారీ మెజారీ్టతో గెలవబోతోందని.. బీజేపీ డిపాజిట్ కోల్పోతుందనే భయంతో కుట్రలకు తెర లేపుతోందని మండిపడ్డారు. బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అడ్డదారిన.. దొడ్డి దారిన కొనే యత్నం మొదలు పెట్టిందని సుమన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీ నాటకాలాడితే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రలోభాలకు లోనుకారు.. అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ పరిహాసం చేస్తోంది. ధనస్వామ్యంతో కొనుగోళ్ల పర్వం సాగిస్తోంది. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లొంగరు. బీఆర్ఎస్తో ఢిల్లీ పీఠం కదులుతుందనే భయం. కేసీఆర్కు ఆదరణ పెరుగుతున్నందునే ఈ కుతంత్రం. – మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మోదీ, అమిత్ షా ఆటలు సాగవు బీజేపీకి ప్రజాస్వామ్య విలువలు లేవు. టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు దురాలోచనతో అడ్డదారులు ఎంచుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే రకం కాదు. కేసీఆర్ ముందు మోదీ, అమిత్ షా ఆటలు సాగవు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి. – మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి మోదీ, అమిత్ షా కుట్ర దేశవ్యాప్తంగా కేసీఆర్కు వస్తున్న ఆదరణ ఓర్వలేక మోదీ, అమిత్ షా కుట్ర జరుగుతోంది. రాజగోపాల్రెడ్డి తరహాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరు. బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగే రకం కాదు. – మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలంగాణలో కుదరదు మునుగోడులో విజయం సాధించలేమనే భయంతోనే నీచ రాజకీయాలను బీజేపీ మొదలు పెట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మీ తరం కాదు. మహారాష్ట్ర రాజకీయాలు తెలంగాణలో కుదరదు. –శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ బేరసారాలకు లొంగదు టీఆర్ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదు. ఇది కే సీఆర్ పార్టీ ఎవరూ కొనుగోలు చేయలేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మా లక్ష్యం. – గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్ -
బుల్లెట్లతో ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏకే 47 రైఫిల్ బుల్లెట్లతో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ జవాన్. మొత్తం 62 బుల్లెట్లతో ‘జై బాల్క సుమన్’ అని టవల్పై ఇంగ్లిష్ అక్షరాలతో రాసి ఉన్న ఫొటో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. చెన్నూరులో టీఆర్ఎస్ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్లో ఈ ఫొటో పెట్టుకున్నాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం తెలిసింది. చెన్నూరుకు చెందిన వంగాల సంతోష్ సీఆర్పీఎఫ్ జవాన్. ప్రస్తుతం బీజాపూర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తన వద్ద ఉన్న బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు రాసి ఫొటో తీసి, వాట్సాప్లో పంపించాడు. దీన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు స్టేటస్గా పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే.. -
‘దేశ భవిష్యత్తు కోసం.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి’
సాక్షి, హైదరాబాద్: దేశ బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు ముక్తకంఠంతో కోరారు. దేశంలో మోదీ సారథ్యంలోని రాక్షసపాలన అంతం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించి సాధించడంతో పాటు ఏ విధంగానైతే అభివృద్ధి చేశారో, ఆ విధంగా దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు జాతీయ పార్టీ ఏర్పాటు చేసి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో అందుబాటులో ఉన్న 21 మంది టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శుక్రవారం తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందిగా సీఎం కేసీఆర్ను కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కావాలి కేసీఆర్.. రావాలి కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని దేశ ప్రజలు భావిస్తున్నారని బాల్క సుమన్ చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమై రాజకీయ శూన్యత ఏర్పడిందని, ఈ పరిస్థితుల్లో కేసీఆర్తో ప్రత్యామ్నాయ శక్తి ఏర్పాటవుతుందని అన్ని రాష్ట్రాల నేతలు, ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పాలన లో దేశంలోని ఏ వర్గానికీ మేలు జరగడం లేదని జీవన్రెడ్డి విమర్శించారు. రైతులు, యువత, మహి ళలు, దళిత, బలహీన వర్గాలకు చెందిన వారంతా కేసీఆర్ను కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ తరహా అభివృద్ధి కోసం దేశ ప్రజలంతా చూస్తున్నా రని చెప్పారు. కావాలి కేసీఆర్.. రావాలి కేసీఆర్ అని ప్రజలు అంటున్నారని తెలిపారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందని లింగయ్య యాదవ్ విమర్శించారు. జిల్లాల పార్టీ అధ్యక్షులే కాదని, అన్ని స్థాయిల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ జాతీయ రాజకీ యాల్లోకి రావాలని కోరుతున్నారని తెలిపారు. తెలంగాణపై మోదీ సర్కారు కుట్ర అమిత్ షా ఆగడాలకు అడ్డుకట్ట పడాలన్నా, మోదీ మెడలు వంచాలన్నా కేసీఆర్తోనే సాధ్యమని మాలోత్ కవిత చెప్పారు. దేశ ప్రజలంతా ఆయన రాకకోసం ఎదురుచూస్తు న్నారని అన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని ధ్వజమెత్తారు. దేశాన్ని మోదీ బ్రష్టు పట్టించారని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమని మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలంటే కేసీఆర్తోనే సాధ్యమని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని పద్మాదేవేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని చింతా ప్రభాకర్ చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని దాస్యం వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఒక విజన్ ఉన్న నాయకుడి కోసం దేశమంతా ఎదురుచూస్తున్నదని గువ్వల బాలరాజు పేర్కొన్నారు. దేశానికి కేసీఆర్ అవసరం ఉంది దేశానికి ప్రస్తుతం కేసీఆర్ అవసరం ఎంతో ఉందని, ఆయన దేశాన్ని పాలించాలని కోరుకంటి చందర్ పేర్కొన్నారు. దేశాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని సంపత్రెడ్డి అన్నారు. దేశాన్ని ఆవహించిన చీకటిని తొలగించే కాంతి రేఖ సీఎం కేసీఆర్ అని తాత మధు చెప్పారు. ఎంతో దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలని శంభీపూర్ రాజు అన్నారు. యావత్ దేశం కేసీఆర్ కోసం తెలంగాణ వైపు చూస్తున్నదని ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. పీవీ తర్వాత దేశానికి మరోసారి ప్రధానమంత్రిని అందించాలని కరీంనగర్ ఎదురు చూస్తోందని, కేసీఆర్ దేశానికి దారి చూపాలని జీవీ రామకృష్ణారావు చెప్పారు. మంచిరెడ్డి కిషన్రెడ్డి, ముజీబ్, తోట ఆగయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్!
సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లనున్నారు. హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది. జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాతే ఫ్రంట్లు, పొత్తులపై వివిధ పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఈ నెల 11న హైదరాబాద్కు మాజీ సీఎం కుమారస్వామి రానున్నట్లు తెలిసింది. చదవండి: రాజ్భవన్.. నివురుగప్పిన నిప్పు! ఈ క్రమంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శుక్రవారం మీడియాతో మాట్లాడూతూ కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిందేనన్నారు. జాతీయ రాజకీయాల కోసం కేసీఆర్ మరో ఉద్యమం చేయాలన్నారు. మేమంతా కేసీఆర్ వెంట ఉంటామని వారు ప్రకటించారు. ప్రత్యామ్నాయ శక్తి కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. కార్పొరేట్ గద్దలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో మత విద్వేషాలను రగిలిస్తున్నారని బాల్కసుమన్ మండిపడ్డారు. -
ప్రత్యర్థులను వేధించడంలో బీజేపీ రికార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థులను వేధించడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రికార్డులను బ్రేక్ చేసిందని, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా అరాచకాలకు హద్దు లేకుండా పోతోందని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎ.జీవన్రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితను సంబంధం లేని కేసులో ఇరికించాలనే బీజేపీ చిల్లర రాజకీయాలకు కేసీఆర్ భయపడరని స్పష్టం చేశారు. తెలంగాణలో అరాచకాలు సృష్టిస్తున్న మోదీ, అమిత్షాలపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ‘ఎమ్మెల్సీ కవిత తెలంగాణ బతుకమ్మ, ఆమె జోలికి వస్తే బీజేపీ బుగ్గిపాలు అవుతుంది. కవిత మీద ఆరోపణలు చేసిన వారి మీద లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయి. బీజేపీ రౌడీయిజం, మోడీయిజం తెలంగాణలో నడవవు’ అని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్రెడ్డి హెచ్చరించారు. 60లక్షల మంది కార్యకర్తల బలగమున్న టీఆర్ఎస్ తలచుకుంటే బీజేపీ కార్యకర్తలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. కళంకితులు, అక్రమార్కులకు అడ్డా బీజేపీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తుండటంతో మోదీ, అమిత్షాలకు వణుకు పుట్టి అంశాలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. కళంకితులు, అక్రమార్కులకు బీజేపీ అడ్డాగా మారిందన్నారు. సీబీఐ సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరిన సింధియా, హేమంత బిశ్వశర్మలపై ఈడీ విచారణ ఆగిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా ప్రత్యర్థి పార్టీలపై ఈడీ, సీబీఐలతో బీజేపీ దాడులు చేయిస్తోందన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సమయంలో బండి సంజయ్ నిక్కర్లు కూడా వేసుకోలేదని, ఆయనకు ఏ విషయంపైనా అవగాహన లేదని ఎద్దేవా చేశారు. అమిత్ షా బూట్లు మోసిన సంజయ్, తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకుల దాడిని సుమన్ ఖండించారు. కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగోళమవుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా హెచ్చరించారు. -
కిషన్రెడ్డి చేతగాని దద్దమ్మలా మిగిలిపోయారు: బాల్కసుమన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం నుంచి ఒక మంచిపనైనా చేయించడం చేతగాని దద్దమ్మగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మిగిలిపోయారంటూ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను మోసం చేస్తోంది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాదా?. కేంద్రమంత్రిగా తెలంగాణ కోటాలో ఉండి రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం తెచ్చాడు?. కేంద్రం తెలంగాణకు ఏ శాఖలోనైనా ఒక్క ప్రాజెక్టు ఇవ్వకున్నా నోరు మూసుకొని కూర్చుంది కిషన్ రెడ్డి కాదా?. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఒక్క హామీ నెరవేర్చకున్నా కిషన్ రెడ్డి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు?. కిషన్ రెడ్డిని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో గుమస్తాలు కూడా గుర్తు పట్టరు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు ఆనాడు రాజీనామా చేస్తే.. కిషన్ రెడ్డి చేయకుండా పారిపోయాడు. తెలంగాణ ద్రోహి కిషన్ రెడ్డి. తెలంగాణ గడ్డపై కాకుండా ఢిల్లీలో మోదీ, అమిత్ షా దగ్గర ఎగిరిపడితే బాగుంటుంది. దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్న మోసపు చరిత్ర బీజేపీది. కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు, నరేంద్రమోదీ వల్ల దేశానికి ఉపయోగం లేదు. నరేంద్రమోదీ ప్రజా ఖండన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోతారు. బీజేపీ ఒక దొంగలముఠా. జాతీయ కార్యవర్గ భేటీ పేరుతో బీజేపీ నాయకులు వసూళ్లకు దిగారు. దౌర్జన్యంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. బీజేపీ అవినీతి అక్రమాలు త్వరలో బయటపెడుతాం. పార్లమెంట్ సాక్షిగా వసూళ్ల దందాను నిలదీస్తాం. తెలంగాణకు ఇప్పటి దాకా ఏం చేశారో, రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చెప్పాలి' అని ఎమ్మెల్యే బాల్కసుమన్ బీజేపీని డిమాండ్ చేశారు. చదవండి: (ప్రధాని మోదీ రాక.. టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై కిషన్ రెడ్డి ఫైర్) -
బీజేపీ నేతల తీరు దుర్మార్గం: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరు దుర్మార్గమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద, ముఠా గోపాల్, డాక్టర్ మెతుకు ఆనంద్, నోముల భగత్, ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్చుగ్ సొంత రాష్ట్రం పంజాబ్లో ఏంచేయలేక ఇక్కడ ఏదో చేస్తానంటున్నారని, బండి సంజయ్ తన పార్లమెంట్ నియోజకవర్గం కరీంనగర్ను మరిచిపోయాడా అని ప్రశ్నించారు. బీజేపీ ఆఫీస్ దగ్గర పెట్టిన ‘సాలు దొర.. సెలవు దొర’అనే డిజిటల్ బోర్డు తీసేయాలని ఆయన హెచ్చరించారు. లేదంటే మోడీ బోర్డులు తెలంగాణ వ్యాప్తంగా పెట్టి చెప్పుల దండలు వేస్తామన్నారు. -
‘కేసీఆర్ జాతీయ పార్టీ’తో బీజేపీ, కాంగ్రెస్ల్లో వణుకు: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ జాతీయ పార్టీ అనగానే బీజేపీ, కాంగ్రెస్ల వెన్నులో వణుకు మొదలైందని ప్రభు త్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కులగజ్జి రేవంత్, మత పిచ్చి సంజయ్కి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీలు టి.భానుప్రసాద్ రావు, దండే విఠల్తో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు జాతీయ పార్టీలకు ఇద్దరు పిచ్చోళ్లు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారని, వారిని చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ కాదు.. ప్రాణం పోసే సంజీవని అని ప్రజలకు తెలుసన్నారు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని సుమన్ హెచ్చరించారు. బండి సంజయ్కి చేతనైతే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే రాష్ట్ర విభజన హామీలు అమలు చేయించి చూపించాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ టి.భాను ప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ అంటేనే కాంగ్రెస్ భయపడుతోందని, ప్రతిపక్ష పాత్ర పోషించే స్థితిలో లేదన్నారు. దేశంలో నియంత పాలన సాగుతోందని, దాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్ కొత్త ఎజెండా సిద్ధం చేస్తున్నారని తెలిపారు. -
టీఆర్ఎస్ పార్టీని చూస్తే జాతీయ పార్టీలకు వణుకు: బాల్క సుమన్
-
సుమన్ వేధింపులు భరించలేకే పార్టీ వీడాం
మందమర్రి రూరల్: ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వేధింపులు భరించలేకే తాము టీఆర్ఎస్ను వీడామని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి తెలిపారు. మందమర్రిలోని తమ నివాసంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవాలని బాల్క సుమన్ తమపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. ‘నా భార్య, పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా.. విప్ వేధింపులు భరించలేకనే మేం టీఆర్ఎస్ను వీడాం’ అని నల్లాల ఓదెలు ఉద్వేగానికి లోనయ్యారు. జెడ్పీ చైర్పర్సన్గా భాగ్యలక్ష్మి కి సుమన్ ఏనాడూ గౌరవం ఇవ్వలేదన్నారు. కనీసం మహిళగానూ చూడలేదన్నారు. బాల్క సుమన్ నియంతలా వ్యవహరిస్తూ.. అక్రమాలపై ప్రశ్నించిన వారిని, ఎదురుతిరిగిన వారిపై పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తన కేడర్ బలంతోనే గెలిచిన సుమన్.. గెలిచిన తర్వాత తమను ఏ కార్యక్రమానికీ పిలవలేదన్నారు. తన కొడుకులపై అక్రమకేసులు పెట్టిస్తానని, అరెస్ట్ చేయిస్తానని బెదిరించారని ఆరోపించారు. జాతీయ రహదారి కాంట్రాక్టర్ను బెదిరించి క్యాతన్పల్లిలో సుమన్ ఇల్లు కట్టించుకున్నారని చెప్పారు. సోనియాఆశీస్సులతో తాను ఎమ్మెల్యే అవుతానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ టికెట్పై గెలిచి, టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు వారి పదవికి రాజీనామా చేస్తే తానూ జెడ్పీటీసీ పదవికి, జెడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తానని భాగ్యలక్ష్మి తెలిపారు. -
కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ కావాలి
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ ఏడు దశాబ్దాల్లో కాంగ్రెస్, బీజేపీలు విలువైన కాలాన్ని వృథా చేశాయని, ఈ రెండు జాతీయ పార్టీల నుంచి భారత్కు ముక్తి లభించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గురువారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీల జాతీయ నేతలు తెలంగాణపై దండయాత్ర చేసేందుకు వస్తున్నారని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో బీజేపీ సర్కార్, దానిని నిలదీయడంలో కాంగ్రెస్ విఫలమయ్యాయని ఆరోపించారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కావాలో, బీజేపీపై పోరులో ఫైటర్గా మారాలో రాహుల్ తేల్చుకోవాలని సుమన్ అన్నారు. రేవంత్, జగ్గారెడ్డిలకు తగిన రీతిలో సమాధానం చెప్తామని బాల్క సుమన్ హెచ్చరించారు. -
విద్యార్థుల కోసం కొట్లాడతావా? కేసీఆర్ భజన చేస్తావా..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజకీయ జీవితం తన గడ్డంలో ఉన్న ఒక వెంట్రుకతో సమానమని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీ సీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానిం చారు. సుమన్కు దూకుడు బాగా ఎక్కువైందని, కేసీఆర్ మెప్పు కోసం చేస్తున్న ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్నారు. ఆయన గాంధీభవన్లో గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఓయూలో ఇద్దరు ముగ్గురు విద్యా ర్థులను చంపి, ఆ మృత దేహాల చేతుల్లో సుమన్ లేఖలు పెట్టినట్టు నాకు సమాచారం ఉంది. సుమన్ను విడిచిపెట్టేది లేదు. మా పార్టీ అధికా రంలోకి వచ్చాక ఈ విషయంలో విచారణ జరిపి స్తాం’ అని అన్నారు. కేసీఆర్ మెప్పు కోసం స్థాయి మరిచి మాట్లాడుతున్న సుమన్కు దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ ముందుకు గన్మెన్లు లేకుండా రావాలని సవాల్ విసిరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గురించి సుమన్కు అవసరం లేదని, రేవంత్కు కూడా అభిమాన సంఘాలు ఉన్నాయన్న విష యాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలని సూచించారు. విద్యార్థి నాయకుడిగా వచ్చిన సుమన్ విద్యార్థుల కోసం కొట్లాడుతాడో, కేసీఆర్కు భజన చేస్తాడో తేల్చుకోవాలని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అనుమతి కోసం ఐదు రోజులా? ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్గాంధీ పర్య టన కోసం అనుమతి అడిగి ఐదు రోజులవుతున్నా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని జగ్గారెడ్డి విమర్శిం చారు. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని టీఆర్ఎస్ నేతలు, కొందరు ఎమ్మెల్యేలు వీసీని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ పర్యటనపై చర్చించేందుకు ఈనెల 30న విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తు న్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. సమావేశంలో ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మానవ తా రాయ్, చెనగోని దయాకర్ పాల్గొన్నారు. -
రాహుల్ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్కు లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు రాహుల్గాంధీ క్షమాపణలు చెప్పాలా?’ అని ప్రశ్నించిన ఆయన ఒకరి గురించి మాట్లాడే ముందు తానేంటో ఆలోచించుకోవాలని సుమన్కు హితవు పలికారు. టీఆర్ఎస్ నేతలందరూ సోనియా, రాహుల్ల కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన పోసుకున్నా రుణం తీర్చుకోలేరన్నారు. గాంధీభవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటాన్ని ఎవరూ కాదనలేరని, కానీ సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే వీరి రాజకీయ జీవితం ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలన్నారు. ఉస్మానియాలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల శవాల మీద ఎంపీ, ఎమ్మెల్యే అయిన సుమన్.. తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాడో చెప్పాలని సవాల్ విసిరారు. ఉద్యమంలో త్యాగాలు చేసినవాళ్లు కనుమరుగైతే, సుమన్ లాంటి వాళ్లు ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే సుమన్ గ్రామ పంచాయతీ సభ్యుడు కూడా కాలేడన్నారు. ఓయూలో రాహుల్గాంధీ పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞతాభావం లేదని తేలిపోతుందని, రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతారో, కృతజ్ఞతా హీనులుగా మిగులుతారో టీఆర్ఎస్ నేతలే తేల్చుకోవాలని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. -
డ్రగ్స్ కేసు: బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు
-
‘పబ్’లో బీజేపీ, కాంగ్రెస్ నేతల బంధువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం మత్తులో జోగుతూ ఊగుతూ సాగుతోంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ ఘటనలో ఈ రెండు పార్టీల నేతల కుటుంబసభ్యులు, బంధు వులకు ప్రమేయం ఉందని ఆరోపించారు. పబ్ నిర్వాహకుడు ఉప్పల అభిషేక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఉప్పల శారదకు స్వయానా కుమారుడని, పబ్లో పోలీసులు అదుపుతీసుకున్న వారి జాబితాలో ఉన్న సూదిని ప్రణయ్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మేనల్లుడు అని బాల్క సుమన్ చెప్పారు. ఉప్పల శారదతో అభిషేక్, రేవంత్రెడ్డితో ప్రణయ్రెడ్డి ఉన్న ఫొటోలను ఆయన సోమవారం తెలంగాణ భవన్లో మీడియాకు విడుదల చేశారు. రెండు జాతీయ పార్టీల నేతల బంధువులే డ్రగ్స్ దందాలో ఉన్నందున ఆ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీలు కూడా అయిన బండి సంజయ్, రేవంత్రెడ్డి నైతిక బాధ్యత వహించి పార్టీ, ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్, గుట్కా, గుడుంబా, గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అందులో భాగంగానే పక్కా సమాచారంతో పోలీసులు పబ్పై దాడి చేసి డ్రగ్స్ గుట్టును రట్టు చేశారన్నారు. టీఆర్ఎస్పై చిల్లర విమర్శలు చేసే బీజేపీ, కాంగ్రెస్ నాయకుల చిత్తశుద్ది, నిజస్వరూపం బయటపడిందన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. పబ్లో డ్రగ్స్ ఘటనలో ఉన్న వారిని ఎన్కౌంటర్ చేయాలని ప్రకటించిన బీజేపీ నేతలు ఎవరిని ఎన్కౌంటర్ చేయాలో చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్, టీఎస్ఎండీసీ చైర్మన్ మన్నె క్రిషాంక్ పాల్గొన్నారు. చదవండి: Pub Drugs Case: బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. -
రేవంత్రెడ్డి చిప్పకూడు తింటావ్.. జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఓట్ల కోసం రేవంత్రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది. తెలంగాణ ద్రోహి రేవంత్రెడ్డి.. మళ్లీ చిప్పకూడు తినక తప్పదని నిప్పులు చెరిగారు. ‘‘కాంగ్రెస్ లోపాయికారిగా బీజేపీకి సహకరిస్తోంది. అమెరికా పర్యటనలో కేటీఆర్ రూ.7500 కోట్ల పెట్టుబడులు తెస్తున్నారు.. లూటీలు చేసేవారికి ఐటీ గురించి ఏం తెలుస్తోంది’’ అంటూ బాల్క సుమన్ దుయ్యబట్టారు. చదవండి: కేటీఆర్.. మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది!: రేవంత్ రెడ్డి -
రేవంత్రెడ్డికి చిప్ దొబ్బింది
సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని తక్షణమే ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. రేవంత్కు నాయకుడు అఖిల భారత పప్పు అయితే.. రేవంత్ తెలంగాణకు పప్పుగా తయారయ్యా డని ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ను ఎవరూ పట్టించుకోవడం లేదని, జైలులో చిప్ప కూడు తిన్నాక చిప్ దొబ్బిందని ఘాటుగా విమర్శించారు. రేవంత్ను తక్షణమే ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేస్తూ.. అందుకు తానే ఖర్చులు భరిస్తానన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయం గురించి రేవంత్రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, కాంగ్రెస్ పార్టీకి ఆయనే ఉరితాడుగా మారాడని ఎద్దేవా చేశారు. పరిగిలో పీసీసీ అధ్యక్షుడు కల్లు తాగిన కోతిలా వ్యవహరించారన్నారు. రేవంత్ బీజేపీ కోవర్ట్ అనే అనుమానం కలుగుతోందని, ఎన్నికల నాటికి కాంగ్రెస్ సీనియర్లను బయటికి పంపించి కాంగ్రెస్ను బీజేపీకి అమ్మే పనిలో ఉన్నాడన్నారు. రేవంత్కు నిలువెల్లా విషం తప్ప విషయ పరిజ్ఞానం లేదన్నారు. ఒడిశాలో సింగరేణికి చెందిన కోల్ బ్లాక్లో రూ.50 వేల కోట్ల కుంభ కోణం జరిగిందంటున్నాడని, అస్సలు నైనికోల్ బ్లాక్లో బొగ్గు విలువ కూడా రూ.50 వేల కోట్లు లేదని రేవంత్కు తెలుసా అని ప్రశ్నించారు. పీయూసీ చైర్మన్ ఎ.జీవన్రెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా ఉనికిని చాటుకునేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ తెలంగాణ బంధు అయితే రేవంత్ తెలంగాణ పాలిట తాలిబన్లా మారారని విమర్శిం చారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ రేవంత్ ఓ బ్లాక్మెయిలరన్నారు. జూబ్లిహిల్స్కు వస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తానని తెలిపారు. -
ప్రధాని మోదీ రాజ్యాంగ వ్యతిరేకి
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు సంబంధించిన అంశాలను పక్కనపెట్టి సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్, బీజేపీ వివాదాస్పదంగా మారుస్తున్నాయని, ప్రధాని మోదీ రాజ్యాంగ వ్యతిరేకిలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. రాజకీ యంగా పబ్బం గడుపుకునేందుకే జై శ్రీరామ్కు బదులుగా జై భీమ్ అంటున్నారని, కేసీఆర్కు వ్యతి రేకంగా కాంగ్రెస్, బీజేపీలు పన్నిన ఉచ్చులో దళి తులు చిక్కుకోవద్దని సూచించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, మెతుకు ఆనంద్తో కలిసి సోమవారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో సుమన్ మీడియాతో మాట్లాడారు. గతంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సమీక్షకు కమిటీ వేయడంతో పాటు అంబేడ్కర్కు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి కేబినెట్లో చోటు కల్పించిందన్నారు. రాజ్యాంగ సవరణలు, కొత్త రాజ్యాంగం వంటిది తెచ్చినా అంబేడ్కర్ స్ఫూర్తితోనే జరుగుతుందని, కేసీఆర్ చెప్పినంత మాత్రాన రాజ్యాంగం రాత్రికి రాత్రే మారదనే విషయం తెలిసి కూడా బీజేపీ అంశాన్ని పక్కదారి పట్టిస్తోందని సుమన్ మండిపడ్డారు. ముందు అంబేడ్కర్ను దూషించిన బీజేపీ మంత్రులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, సీఎం మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడం లేదని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. -
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు దుమారం
-
కేటీఆర్ కొడుకుపై తీన్మార్ మల్లన్న ట్వీట్ దుమారం.. బాల్క సుమన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాడీ షేమింగ్ చేస్తూ ట్వీట్ చేశాడనిటీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే దీనిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడితూ.. తన కొడుకును రాజకీయాల్లోకి లాగారంటూ దుయ్యబట్టారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీన్మార్ మల్లన్న కేటీఆర్ కుమారుడిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పిల్లల్ని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. దీని వెనుక బీజేపీ. బండి సంజయ్ కుట్ర ఉందని, ఇదే బీజేపీ సంస్కృతి అని విమర్శించారు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తన పద్దతి మార్చుకోవాలని, లేదంటే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ పార్టీ ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి తమ పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ‘నేను వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి చీము నెత్తురు ఉంటే నేను ఐటీ రిటర్న్స్ సమర్పిస్తున్న. క్కువ ఉన్నట్లు నిరూపించండి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై గతంలో అనేక సార్లు మేము కంప్లైంట్ చేశాం. రాష్ట్ర డీజీపీ స్పందించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది. ఎకేంద్రంలో ఖాళీగా ఉన్న 8 లక్షల 72వేల ఉద్యోగాలు ఇవ్వకుండా మోదీ గడ్డిపీకుతున్నారా. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయరో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. దీనికి బండి సంజయ్ మొదట సమాధానం చెప్పాలి. దమ్ముంటే బండి, అరవింద్, కిషన్ రెడ్డి బొగ్గు బ్లాకుల వేలం ఆపండి. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాగానే వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని బాల్క సుమన్ తెలిపారు. చదవండి: హిమాన్షును ఉద్దేశిస్తూ పోస్ట్.. స్పందించిన వైఎస్ షర్మిల తీన్మార్ మల్లన్నపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ పురపాలక ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై దుర్భాషలాడిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ బీ. దినేష్ శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛ ఉందంటూ తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న నవీవ్ను నిలువరించాలసిన అవసరం ఉందని అన్నారు. సోషల్ మీడియాపై తీవ్రంగా స్పందిస్తున్న బీజేపీ నేతలు ఆ పార్టీలో చేరిన మల్లన్నను ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. న్యాయస్థానం సైతం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని అన్నారు. ప్రస్తుతం షరతులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మల్లన్న బెయిల్ను రద్దు చేయాలని న్యాయస్థానం సైతం ఆశ్రయిస్తామని చెప్పారు. రాజకీయాల్లోకి కుటుంసభ్యులను లాగడం బీజేపీ విష సంస్కృతి... బీజేపీ నేతల తీరుపై మండిపడ్డ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ @BalkaSumanTRS. pic.twitter.com/Jak8uiPFkH — TRS Party (@trspartyonline) December 25, 2021 -
పదవి లేకుంటే పార్టీని తిట్టడమేనా..?
సాక్షి, హైదరాబాద్: పదవీ కాలం పూర్తవగానే టీఆర్ఎస్ను తిట్టడం కొందరికి ఫ్యాషన్గా మారిందని, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఉద్యోగ సంఘం మాజీ నేత విఠల్కు సీఎం కేసీఆర్ ఆరేళ్లు అవకాశమిచ్చి గౌరవించారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ద్వారా పదవులు పొంది వాటిని కోల్పోగానే పార్టీపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి బాల్కసుమన్ మంగళవారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తోన్న నిరసనను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో విందులతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ భార్య జమున పేరిట ఉన్న హేచరీస్ ప్రభుత్వ భూములతో పాటు ఎస్సీ, ఎస్టీల భూములను కబ్జా చేశారని మెదక్ కలెక్టర్ ఆధారాలతో సహా బయట పెట్టినందున ఈటల ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
బాల్కసుమన్పై కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, టీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్లపై లాలాగూడ పోలీసులు నమోదు చేసిన కేసును ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు శుక్రవారం కొట్టివేసింది. వీరిద్దరూ నేరం చేశారనేందుకు ఆధారాల్లేవని న్యాయమూర్తి జయకుమార్ తీర్పిచ్చారు. 2009లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తార్నాకలోని ఓ పెట్రోల్ బంక్ అద్దాలు పగులగొట్టారంటూ ఉస్మానియా వర్సిటీ పోలీసులు వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. -
దళిత ఎమ్మెల్యేలపై బీజేపీ ఫేక్ వీడియోలు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలపై బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఫేక్ వీడియోలు తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఫేక్ వీడియోలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని అదనపు డీజీపీ జితేందర్కు సుమన్ నేతృత్వంలో ఆరూరి రమేశ్, క్రాంతికిరణ్, మెతుకు ఆనంద్తో కూడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం శుక్రవారం ఫిర్యాదు చేసింది. అనంతరం సుమన్ మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డికి కూడా కుటుంబాలున్నాయని, బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుపైనా ఫేక్ వీడియోలు సృష్టించారని, దళిత నేతల ఎదుగుదలను బీజేపీ ఓర్చుకోవడం లేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్ర చారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగుతామని సంజయ్, ఈటల సహా ఎవర్నీ వదలబోమని సుమన్ హెచ్చరించారు. -
కమలం పడిపోకుండా ‘చేయి’ అడ్డుపడింది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ను ఈటల రాజేందర్కు తాకట్టు పెట్టారని, కమలం కింద పడకుండా ‘చేయి’అడ్డం పడిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు భారతీయ జనతా కాంగ్రెస్లా మారి టీఆర్ఎస్ను ఓడించాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు జాతీయ స్థాయిలో శత్రువులుగా ఉంటూ హుజూరాబాద్లో మాత్రం మిత్రులుగా మారడం సిగ్గు చేటన్నారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యేలు కృష్ణ మోహనరెడ్డి, క్రాంతి కిరణ్లతో కలిసి సుమన్ మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్లో నైతిక విజయం టీఆర్ఎస్దే అన్నారు. ‘బండి సంజయ్ ట్రిపుల్ ఆర్ అంటే ఏమో అనుకున్నాం. రాజాసింగ్, రఘునందన్రావుతో పాటు మరో ఆర్ అంటే రేవంత్రెడ్డి అన్నట్లుగా ఉంది’అని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్లో అసెంబ్లీ పుట్టినప్పటి నుంచి ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్కు అత్యల్ప ఓట్లు వచ్చాయంటే ఈటల రేవంత్తో కుమ్మక్కయ్యారనే విషయం బయటపడిందని చెప్పారు. కొనడం, అమ్మడం, తాకట్టు పెట్టడం రేవంత్కు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ‘ఈటల గెలిచాక కూడా రొటీన్ డైలాగులు మాట్లాడటం కాదు. మోదీ కాళ్లు మొక్కి హుజూరాబాద్కు ఏం ప్యాకేజీ తీసుకొస్తారో చెప్పాలి’అని డిమాండ్ చేశారు. ఈటల ఏడుపు ముఖం పెట్టి ఓట్లు తెచ్చుకున్నారని, కాంగ్రెస్, బీజేపీల అనైతిక పొత్తును ప్రజలు గమనిస్తున్నారని సుమన్ వ్యాఖ్యానించారు. వాపును చూసి బీజేపీ గెలుపు అనుకుంటోందని, ఈటల తప్పులు చేసి టీఆర్ఎస్ను వీడారన్న విషయం మరిచిపోవద్దని అన్నారు. -
ఖైదీలు జైల్లో.. అవినీతిపరులు బీజేపీలో..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మనదేశంలో ఖైదీలు జైల్లో ఉంటారని, అవినీతిపరులు మాత్రం బీజేపీలో ఉంటారని టీఆర్ఎస్ విప్ బాల్క సుమన్ అన్నారు. మంగళ వారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేక రులతో మాట్లాడారు. ఈటల, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. టీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బీజేపీ–ఈటల ఓటర్లను ప్రలో భాలకు గురిచేసే పనిలో పడ్డారని, చికెన్, మద్యం, నగదు పంచుతున్నారని ఆరోపించారు. దాదాపు 2000 మంది సాయుధ బలగాలను దింపి ఓటర్లను భయాందోళనలకు గురిచేస్తున్నా రన్నారు. హుజూరాబాద్ కల్లోలిత ప్రాంతంకాకున్నా ఇంతటి భారీ స్థాయిలో బలగాలను దించాల్సిన అవసరం ఏముం దని ప్రశ్నించారు. తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి, ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలు పాలైన గెల్లు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. చేతనైతే విభజన హామీలైన ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, గిరిజన వర్సిటీలను తీసుకురావాలని, పెట్రో, నిత్యా వసరాల ధరలను తగ్గించాలని సూచించారు. -
ప్రగతిభవన్ పనితీరు విలువ బండి సంజయ్కు తెలియదు..
-
ఇక రాబోయేది ప్రతిపక్షాల నిమజ్జనమే: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రను ఎవరూ పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. బేకార్ సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బురదలో బొర్లే పందికి పన్నీర్ వాసన తెల్వదని, బండి సంజయ్కు ప్రగతి భవన్ విలువ తెలియదన్నారు. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకు పురుడు పోసిన స్థలం ప్రగతి భవన్ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు వస్తున్న ప్రజాదరణ బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలే సీఎం కేసీఆర్ వెలకట్టలేని ఆస్తి అని బాల్క సుమన్ తెలిపారు. ‘సన్నాసి సంజయ్కు ఇది తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై అక్కసుతో బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు బికార్లు అన్న మాటల్ని బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. విషయం లేని లేఖ రాశారు సంజయ్. వినాయక నిమజ్జనం ముగిసింది. ఇక రాబోయేది ప్రతిపక్షాల నిమజ్జనమే. హుజురాబాద్లో వందకు వంద శాతం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడు. టీఆర్ఎస్ అంటే నమ్మకం బీజేపీ అంటే అమ్మకం. హుజురాబాద్లో జరిగే ఎన్నిక అబద్ధాల బీజేపీకి అభివృద్ధి చేసిన టీఆర్ఎస్కు మధ్య జరిగేది’ అని బాల్క సుమన్ పేర్కొన్నారు. చదవండి: యాక్సిడెంటల్ డెత్: సుమేధ ఘటనపై కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ -
‘రేవంత్ దమ్ముంటే హుజూరాబాద్లో డిపాజిట్ తెచ్చుకో’
కమలాపూర్: ‘నువ్వు పీసీసీ అధ్యక్షుడివి అయ్యాక జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక ఇది. నీకు దమ్ముంటే హుజూరాబాద్లో కాంగ్రెస్కు డిపాజిట్ తెచ్చుకో’అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘బిడ్డా రేవంత్రెడ్డి.. తెలంగాణ లో అక్కడక్కడ సభలు పెడుతున్నావు. కానీ, హుజూరాబాద్ గురించి ఎందుకు మాట్లాడుతలేవు? ఈటలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నవా?’అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర కాదని, అది విహారయాత్ర అని ఎద్దేవా చేశారు. -
రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్రావు డ్యాన్స్
-
రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్రావు డ్యాన్స్
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతూ పార్టీ విజయానికి బాటలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం కమలాపూర్లో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్లో డ్యాన్స్ చేసి అబ్బురపరిచారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్ కమలాపూర్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం సందర్భంగా కళాకారుల ధూమ్ధామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా’ అనే పాటకు మంత్రి హరీశ్ రావు ఎమ్మెల్యే బాల్క సుమన్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి డ్యాన్స్ చేశారు. పార్టీ కండువాలు పట్టుకుని గాల్లో తిప్పుతూ కొంత కాలు కదిపారు. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. కొన్ని సెకన్ల పాటు ఉన్నఈ వీడియో ఆకట్టుకుంటోంది. చదవండి: ‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు -
హుజురాబాద్ అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
-
ఉద్యమ ద్రోహులందరూ కేసీఆర్ పక్కన చేరారు: ఈటల
సాక్షి, కరీంనగర్: ఉద్యమ ద్రోహులందరూ కేసీఆర్ పక్కన చేరారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..హుజూరాబాద్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని, రంగనాయకసాగర్లో బేరాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆర్డీవో నేతృత్వంలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారుంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్స్.. టీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నానికి ఈటల ప్రయత్నించారని, అన్నం పెట్టిన వాళ్లకు సున్నం పెట్టాలని చూశారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్ఎస్తోనే హుజూరాబాద్లో అభివృద్ధి జరుగుతోందని ఆయనన్నారు. -
చదువు రాని సన్నాసి పీసీసీ అధ్యక్షుడు..
సాక్షి, ఇల్లందకుంట(కరీంనగర్): ‘నన్ను బానిస సుమన్ అంటుండ్రు. అవును.. నేను ప్రజలకు బానిసను. ఆదరించి అన్నంపెట్టిన టీఆర్ఎస్ పార్టీకి కట్టు బానిసనని గర్వంగా చెప్పుకుంటా..’ అని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సోషల్మీడియా వారియర్స్ సమ్మేళనంలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడారు. కొత్త బిచ్చగాడు పొద్దుఎరుగడు అన్నట్లు.. చదువు రాని సన్నాసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన 12మంది ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున కాకుండా అవతలి వైపున్న అభ్యర్థి ఈటల రాజేందర్ అండగా నిలిచారని అన్నారు. ఆర్టీసీ కార్మికులతో సమ్మె చేయించడంతో పాటు పార్టీకి వ్యతిరేకంగా పూణె, బెంగళూర్లో మీటింగ్లు పెట్టారని ఆరోపించారు. సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారం చేయడంలో బీజేపీ దిట్ట అని పేర్కొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జీవీ.రామకృష్ణారావు పాల్గొన్నారు. చదవండి: సూది గుచ్చడంలో తేడాతో రక్తంలో గడ్డలు! -
రేవంత్రెడ్డి ఓ దొరికిన దొంగ: ఎమ్మెల్యే బాల్క సుమన్
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి అంటున్నాడు. ఓటుకు నోటు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ రేవంత్రెడ్డి అంటూ మండిపడ్డారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమ్మేళనంలో బాల్క సుమన్ మాట్లాడుతూ, ఈటల రాజేందర్ను పెద్ద కొడుకులా కేసీఆర్ చూశాడని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి పని చేయకుండా అవతలోడికి పని చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను విమర్శించిన వ్యక్తి ఈటల అంటూ ఆయన దుయ్యబట్టారు. బీజేపీ చెప్పే అబద్దాలకు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మధ్య హుజురాబాద్లో పోటీ జరుగుతుందన్నారు. సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారం చేయడంలో బీజేపి దిట్ట, వాటిని తిప్పి కొట్టడంలో ముందు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. -
Balka Suman: ఈటల ‘లేఖ’ నిజమే!
హుజూరాబాద్: సీఎం కేసీఆర్కు ఈటల రాజేందర్ రాసినట్లు ఆయన లెటర్ ప్యాడ్తో ఉన్న లేఖ నిజమేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. అయితే దానిని నకిలీ లేఖగా బీజేపీ ప్రచారం చేస్తోందని అన్నారు. ఈటల రాసిన లేఖ ఫేక్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు. శనివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్కుమార్ అధ్యక్షతన ఇక్కడ జరిగిన టీఆర్ఎస్ సోషల్ మీడియా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట అభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్పై చేస్తున్న విమర్శలు సరికాదని, పార్టీని, కేసీఆర్ను ఈటల మోసం చేశారని విమర్శించారు. బీజేపీ వాళ్లు తనను బానిసగా తిడుతూ విమర్శలు చేస్తున్నారని, వాళ్ల తిట్లను దీవెనగా భావిస్తానని పేర్కొన్నారు. ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఈటల రాజేందరే సీఎం కావాలన్నప్పుడు వాళ్ల మాటలను ఈటల ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సమావేశంలో వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్కుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు తదితరులు పాల్గొన్నారు. వైరల్: ‘సీఎం కేసీఆర్కు ఈటల లేఖ’ కలకలం -
ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించిన సీఎం కేసీఆర్
సాక్షి, జగిత్యాల: మెట్పల్లిలోని రేగుంటలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. సుమన్ తండ్రి బాల్క సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. రోడ్డు మార్గాన మెట్పల్లి చేరుకున్న సీఎం రేగుంటలో సుమన్ను పరామర్శించి సురేష్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం సుమన్ కుటుంబ సభ్యులను కలిసి సురేష్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. అక్కటి నుంచి సీఎం హైదరాబాద్ బయల్దేరారు. కాగా మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్క సురేష్(62) కరోనాతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఇటీవల కన్నుమూశారు. -
ఎమ్మెల్యే బాల్క సుమన్కు పితృ వియోగం
చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి బాల్క సురేశ్ (60) శుక్రవారం మృతి చెందారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సురేశ్ మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా పని చేశారు. కాగా, తండ్రిని కోల్పోయిన ఎమ్మెల్యే బాల్కసుమన్కు సీఎం కేసీఆర్ ఫోన్లో పరామర్శించారు. టీఆర్ఎస్లో సురేశ్ చురుకైన పాత్ర పోషించారని శ్లాఘించారు. చదవండి: ఒక్క ఛాన్స్.. ఈటలపై పోటీకి సై అంటున్న నేతలు! కోవిడ్ మృతులకు రూ.4 లక్షల సాయం ఉత్తిదే.. -
దేవరయాంజాల్ భూములపై సమగ్ర విచారణ: బాల్క సుమన్
-
ఈ విజయం కేసీఆర్కు అంకితం: నోముల భగత్
నాగార్జునసాగర్: ఉప ఎన్నికలో తనను గెలిపించిన ఓటర్లకు, నాగార్జునసాగర్ ప్రజలకు విజేత నోముల భగత్ కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల అనంతరం స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ.. నన్ను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ప్రజలకు నా పాదాభివందనం అని తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు రుణపడి ఉంటానని చెప్పారు. నాన్న ఆశయాలు నెరవేరుస్తానని, అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ విజయం కేసీఆర్కు అంకితం అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని తెలిపారు. విజయంతో పొంగిపోవడం లేద: మంత్రి సాగర్ నియోజకవర్గంలో 19 వేలకు పైగా మెజార్టీ ఇచ్చి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మంత్రి జగదీశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం సీఎం కేసీఆర్ పట్ల నమ్మకానికి, నాయకత్వానికి నిదర్శనం అని పేర్కొన్నారు. చిన్న నిర్లక్ష్యానికి కేసీఆర్పై కాంగ్రెస్, బీజేపీ నోటికి వచ్చినట్లు మాట్లాడాయని తెలిపారు. ఈ విజయంతో పొంగిపోవడం లేదు అని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారని గుర్తుచేశారు. 60 ఏళ్లలో తాగు, సాగునీటికి ఇబ్బందులు పడ్డ నల్గొండ జిల్లా తెలంగాణ వచ్చాక రాష్ట్రంలోనే అత్యధికంగా వరి దిగుబడి తెచ్చిందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి నాగార్జునసాగర్పై గెలుపుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఈ ఫలితాలను చూసైనా బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మరు అని కొట్టిపడేశారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు కేంద్రం నుంచి రావాల్సిన వాటికోసం పోరాడండి అని సూచించారు. వాక్సిన్లు, రిమిడిసివర్ ఇంజక్షన్లు తేవడంలాంటివి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వంపై అనేక ఆరోపణలు, అబద్ధాలు చెప్పారు అని గుర్తు చేశారు. విషబీజాలు నాటితే ప్రజలు విశ్వసించరు అని పేర్కొన్నారు. ప్రతి మండలంలో టీఆర్ఎస్ఖే స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని చెప్పారు. చదవండి: బెంగాల్ తీర్పుతో బీజేపీ తెలుసుకోవాల్సింది -
సంజయ్.. నోరు అదుపులో పెట్టుకో!
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి ప్రభుత్వం ఏంచేస్తుందో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మాట్లాడటం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న విషయాన్ని జాతీయ మీడియాలో చూస్తే అర్ధమవుతుందన్నారు. మహమ్మారిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో కేంద్రాన్ని అడగాలని సంజయ్కు హితవు పలికారు. ఒక్కసారి ఢిల్లీలో ఏం జరుగుతోందో చూడాలని, అక్కడ ప్రధానమంత్రి ఉన్నారు కదా అని ప్రశ్నించారు. వైద్యారోగ్యశాఖలో డబ్బులు ఉన్నాయని సీఎం కేసీఆర్ ఆ శాఖను తీసుకున్నారని బండి అనడం దారుణమని, ఒక ఎంపీ ఇలా మాట్లాడడం బాధ్యతారాహిత్యమని, మీడియాతో మాట్లాడేటప్పుడు అన్ని చూసి మాట్లాడాలని హితవు పలికారు. ఈటల రాజేందర్ అంశంపై జరుగుతున్న పరిణామాలను బట్టి నిర్ణయాలు ఉంటాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు తలసాని సమాధానం ఇచ్చారు. బాల్క సుమన్ మాట్లాడుతూ, సీఎంపై బండి సంజయ్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎంకు కరోనా వచ్చినా రోజూ వైద్య కార్యదర్శి, హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నారన్నారు. చదవండి: వారికి వారే మాట్లాడుకొని వెళ్లారు!: కమిటీ నివేదిక -
ఈటల మాట ఎత్తకుండానే టీఆర్ఎస్ ప్రెస్మీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రమంతా మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై చర్చ నడుస్తోంది. తాజాగా ఈటల మంత్రిత్వ శాఖను ప్రభుత్వం లాగేసుకోంది. దీనిపై విస్తృత చర్చ నడుస్తున్న సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఈటల వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించారు. ఈటల పేరు ఎత్తకుండానే సమావేశం ముగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఏవో వ్యాఖ్యలు చేశారని వాటికి కౌంటర్ ఇచ్చేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు.. ‘బండి సంజయ్ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు. కొన్నింటికి హద్దూఅదుపులు ఉంటాయి. కరోనా కట్టడి విషయంలో కేంద్రం ఏం చేస్తుందో బండి సంజయ్ చెప్పాలి. కేంద్రం చేస్తున్న పనులను ప్రపంచ మీడియా ఏం చేస్తుందో సంజయ్ చూడాలి. బండి సంజయ్ చిల్లరగా, చీప్గా మాట్లాడటం ఎందుకు..? గతేడాది ప్రధాని చెప్పిన పనులు అన్ని చేశాం. బండి సంజయ్ బాధ్యతగా మాట్లాడాలి. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు సంజయ్. ఈటల విషయం సీఎం పరిధిలో ఉంది’. అనంతరం ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్పై బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమని తెలిపారు. మీడియా వ్యక్తులపైన కూడా విరుచుకుపడ్డారని చెప్పారు. ఏది పడితే అది మాట్లాడటం సంజయ్కి తగదని హితవు పలికారు. కోవిడ్పైన రోజు సీఎం సమీక్ష చేస్తుంన్నాడని తెలిపారు. బండి సంజయ్ది నోరా? మోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ సీఎం కేసీఆర్ సీఎస్తో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బట్టేబజ్ మాటలు మాట్లాడొద్దని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్కి కర్రు కాల్చి వాత పెట్టారని చెప్పారు. వాక్సిన్, రిమిడిసివర్ ఇంజెక్షన్లపై కేంద్రంపై మాట్లాడవెందుకు అని సంజయ్ని ప్రశ్నించారు. కరోనా విషయంలో ప్రజల్లో తిరుగుతుంది మా టీఆర్ఎస్ నేతలు అని.. మీరు తిరుగుతున్నారా? అని ప్రశ్నించారు. ఈ విధంగా విలేకరుల సమావేశం మమ అని ముగించారు. ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నా ఏం మాట్లాడకుండా కూర్చుండిపోయారు. విలేకరులు ఈటల విషయమై ప్రశ్నలు వేస్తుండగా అది తర్వాత వ్యవహారం అని చెబుతూ వెళ్లిపోయారు. చదవండి: ఆక్సిజన్ అందక కర్నూలులో ఐదుగురు మృతి చదవండి: కరోనాను మరిపించేందుకే ఈటల భూకబ్జా డ్రామాలు -
మా మౌనం.. గోడకున్న తుపాకీ
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేనోళ్లు.. అసలు పనిచేయని వాళ్లు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్పై గౌరవం లేకుండా ఎగిరి పడుతున్నరు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎంలను ఉరికించిన చరిత్ర మా విద్యార్థి సైన్యానికి ఉంది. కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న బఫూన్ గాళ్లు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నోరు వాడాల్సి వస్తే అందరి కంటే ఎక్కువ సత్తా కేసీఆర్కు ఉంది. ఉద్యమ సమయంలో ఎవరిని ఎలా చీల్చి చెండాడారో అందరికీ తెలుసు. మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు. గోడకు వేలాడుతున్న తుపాకీ కూడా మౌనంగానే ఉం టుంది. దాన్ని వాడటం మొదలుపెడితే దిమ్మతిరిగే సమాధానం వస్తుంది. విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటుంటే.. బీజేపీ నాయకులు మాత్రం వాట్సాప్ యూనివర్సిటీలో అబద్ధాలు నేర్చుకుంటున్నారు’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో శనివారం టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్లో కొన్ని స్థానాలు గెలిచిన బీజేపీ ఆగడం లేదు. గతంలో పైశాచిక ఆనందం కోసం మాట్లాడినోడు ఓటుకు కోట్లు కేసులో ఎగిరి పోయిండు. మీ లెక్కలు కూడా మా దగ్గర ఉన్నయి. కేసీఆర్ మౌనాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. దూషణలకు పాల్పడుతున్న వారికి మిత్తితో సహా బదులిస్తం. అవసరమొచ్చినప్పుడు బఫూన్ల భరతం పడతం’’ అని మండిపడ్డారు. బాత్ కరోడోమే.. కామ్ పకోడోంకీ దేశం కోసం.. ధర్మం కోసం అటూ నినాదాలు చేసే బీజేపీ నేతలకు తెలంగాణ భారతదేశంలో ఉందనే విషయం తెలియదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అభివృద్ధి గురించి తాము గణాంకాలతో సహా మాట్లాడితే మోదీ ప్రభుత్వం మాత్రం అరచేతిలో వైకుంఠం చూపుతోందని విమర్శించారు. ‘‘మోదీ బాత్ కరోడోమే.. కామ్ పకోడోంకీ (మాటలు కోట్లలో.. చేతలు పకోడీల్లా) అన్నట్టుగా ఉన్నయి. మేం ఉద్యోగాల గురించి మాట్లాడితే మోదీ పకోడీ గురించి మాట్లాడుతరు. రాష్ట్రానికి ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నవోదయ విద్యాలయాలు, మెడికల్ కాలేజీల ఏర్పాటులో కేంద్రం మొండి చెయ్యి చూపింది. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని మూసేస్తున్న బీజేపీ.. ఇక బయ్యారంలో ఉక్కు కర్మాగారం కడ్తుందా’’ అని కేటీఆర్ నిలదీశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో విద్యా ఉద్యోగ అవకాశాలను టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా పెంచిందన్నారు. న్యాయవాదులు, జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు కేటాయించామని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి యువత తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇరవై ఏండ్ల క్రితం 45 ఏండ్ల వయసులో కేసీఆర్ గులాబీ జెండాను ఎగరవేసి రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న పార్టీలను ఎదిరించి తెలంగాణ సాధించారని కేటీఆర్ గుర్తు చేశారు. పదవులను గడ్డిపోచలా వదిలేసిన కేసీఆర్ త్యాగాలు ఈ తరం పిల్లలకు తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు భరోసా కేసీఆర్.. భవిష్యత్తు కేటీఆర్: బాల్క సుమన్ రాష్ట్రానికి కేసీఆర్ భరోసా అయితే కేటీఆర్ భవిష్యత్తు అని, ఉద్యమంలో విద్యార్థుల పాత్రను దృష్టిలో పెట్టుకుని.. తమ లాంటి వారికి కేసీఆర్ అవకాశాలు ఇచ్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఎవరి సేవలు ఎలా వాడుకోవాలో కేసీఆర్కు తెలుసని, రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఆర్ఎస్వీ కేసీఆర్ వెంట నడవాలని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పని అయిపోయిందంటూ విమర్శలు చేస్తున్న వారికి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గుణపాఠం చెప్పాలన్నారు. టీఆర్ఎస్వి అభివృద్ది రాజకీయాలు అయితే బీజేపీది బట్టేబాజ్ రాజకీయమని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ వ్యాఖ్యానించారు. ఉద్యోగాలపై కేటీఆర్ ఇచ్చిన గణాంకాలను ప్రజలకు వివరించాలని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులకు టీఆర్ఎస్ రాజకీయ అవకాశాలు ఇచ్చిందని, రాష్ట్రంలో మరో 30 ఏండ్లు టీఆర్ఎస్ పాలన కొనసాగాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. కార్యక్రమంలో టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ రాకేశ్కుమార్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
బండి సంజయ్ మూల్యం చెల్లించక తప్పదు..
సాక్షి, హైదరాబాద్: దళితులనుద్దేశించి చెప్పులు కుట్టుకునే వారిగా, మొలలు కొట్టుకునేవారిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ఇందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీఆర్ఎస్కు చెందిన దళిత ఎమ్మెల్యేలు హెచ్చరించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎంఎస్. ప్రభాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గాదరి కిశోర్, కాలె యాదయ్య, ఆరూరి రమేశ్, చిరుమర్తి లింగయ్య, సుంకే రవిశంకర్, దుర్గం చిన్నయ్య, చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్.. ఆదివారం ఘాటుగా బహిరంగ లేఖ రాశారు. ‘నడిమంత్రపు సిరివస్తే కన్నూమిన్నూ కానకుండా విర్రవీగినట్టు సంజయ్ ప్రవర్తన ఉంది. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ సాటి మనుషులను అవమానపరుస్తున్నాడు. తలాతోక లేకుండా మాట్లాడే వ్యక్తిగా ముద్ర పడ్డ బండి.. మరోసారి దళితుల పట్ల అమానుష వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు దళితుల పట్ల బీజేపీ వైఖరికి అద్దం పడుతున్నాయి. బూజుపట్టిన సనాతన ఆలోచనలకూ, అంటరానితనానికి, దళితుల అణచివేతకు అద్దంపట్టేలా ఆయన వ్యాఖ్యలున్నాయి. ఆధునిక యుగంలో కూడా దళితుల స్థితిగతులు అలాగే ఉండాలని, దళితులు ఇంకా చెప్పులు కుట్టుకుని బతకాలని కోరుకునే విధంగా మాట్లాడటం దుర్మార్గం’ అని ఆ లేఖలో తీవ్రంగా ఆక్షేపించారు. అందరితో సమానంగా పోటీ... డాక్టర్ అంబేడ్కర్ కల్పించిన అవకాశాలతో అన్ని రంగాల్లో అందరితో పోటీపడి తాము ఉన్నతస్థానాలకు ఎదుగుతుండటం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మింగుడు పడటం లేదని విమర్శించారు. దళితులు అందరితో సమానంగా పోటీపడుతున్నారని సంజయ్ గుర్తిస్తే మంచిదని, లేదంటే ప్రజలే బీజేపీకి మొలలు కొడతారని హెచ్చరించారు. -
కలకలం రేపిన బాల్క సుమన్ వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల : కేవలం ఎన్నికల కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొండి చేస్తున్నారని, అడ్డందిడ్డం మాట్లాడుతున్న ఆయన నాలుక కోస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వానకాలంలో సాగైన ధాన్యాన్ని ప్రతిగింజ కొన్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం వారిని నట్టేట ముంచే చట్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక వ్యవసాయ మార్కెట్కమిటీ పాలకర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు, విప్ హాజరయ్యారు. ఢిల్లీలో రైతులు చలికి వణుకుతూ.. చట్టాల రద్దుకోసం దీక్ష చేస్తుంటే కేంద్రం చర్చల పేరిట కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. కేంద్రం మాత్రం కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని తాకట్టుపెడుతోందని విమర్శించారు. (పీసీసీ: కలకలం రేపిన రేవంత్ వ్యాఖ్యలు) బండి సంజయ్ గుడులు, బడులు, ఇండియా, పాకిస్తాన్ పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎన్నికల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడుతామని హెచ్చరించారు. కేసీఆర్ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం వల్లనే బండికి రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కరీంనగర్కు అప్పటి ఎంపీ వినోద్కుమార్ త్రిబుల్ ఐటీ తీసుకొస్తే.. దానిని కర్ణాటకలోని రాయచూర్కు తరలించారని, ఎంపీగా ఉన్న బండి ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. కేసీఆర్పై లేని పోని ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులను మహారాష్ట్రలోని బాల్ఠాక్రే శివసేన అనుచరుల శివసేన తరహ దాడులు చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలంగా మారాయి. టీఅర్ఎస్ ప్రజాప్రతినిధులు పరుష వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలలో హీట్ పుట్టించారు. మరి ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఏలా స్పందిస్తారో చూడాలి. (రేవంత్కు షాక్.. పీసీసీపై అనూహ్య నిర్ణయం!) ఉద్యమకారులను గుర్తిస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తున్నారని, ఆలస్యమైనా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తారని మంత్రి గంగుల అన్నారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో 1980లో రైతులు ఎదుర్కొన్న నష్టాలు, కష్టాలు పునరావృతం అవుతాయన్నారు. మంత్రి ఐకే.రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో శ్రీంసాగర్కు నీళ్లు వచ్చాయని, ఇప్పుడు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోందని పేర్కొన్నారు. విప్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నుంచి ఎలాంటి నిధులూ అందడం లేదని, కానీ.. బండి సంజయ్ మాత్రం కేసీఆర్పై అసత్యపు ఆరోపణలు చేస్తూ దొంగే దొంగదొంగ అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ను విమర్శిస్తే కరీంనగర్ గడ్డపైనే బట్టలు ఊడదీసి కొడుతామని హెచ్చరించారు. అంగీలు మార్చినట్లు రంగు మార్చే నాయకుడు ఒకరు, ప్రజాసమస్యలు, అభివృద్ధి అంటే తెలియకుండా.. వందల కోట్లు సంపాదించుకుని వచ్చిన మరో నాయకుడు రోజుకో ఊరు తిరుగుతున్నారని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, వారిని టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. త్వరలో చెన్నూర్ డివిజన్ కేంద్రంగా మందమర్రి, భీమారం, జైపూర్ మండలాలకు కొత్త వ్యవసాయ మార్కెట్యార్డు నిర్మాణం, కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ పురాణం సతీష్ మాట్లాడుతూ రైతువేదికలు పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో రాష్ట్రం బంగారు తెలంగాణ, ప్రాజెక్టులతో జలకసంతరించుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్రం 2014కు ముందు ఎలా ఉందో..? ఇప్పుడు ఎలా ఉందో గ్రహించాలని సూచించారు. ప్రమాణ స్వీకారానికి జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్యెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. మార్కెట్కమిటీ చైర్మన్గా పల్లె భూమేష్, వైస్చైర్మన్గా గోపతి లస్మయ్య, డైరెక్టర్లుగా అన్కం లక్ష్మి, తోకల సురేష్, తిప్పని తిరుపతి, జి, భీమయ్య, పి. ప్రభకార్, ఎండీ.షాబీర్ అలీ, అశోక్ కుమార్లడ్డా, కే.సురేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. పాలకవర్గాన్ని డీసీఎంస్ చైర్మన్ తిప్పని లింగయ్య, రైతు సమన్వయ సమితి జిల్లాఅధ్యక్షులు మోటపలుకుల గురువయ్య, గ్రంథాలయ చైర్మన్ రేణుగుంట్ల ప్రవీణ్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, సహకార సంఘం చైర్మన్ వెంకటేష్ అభినందించారు. -
నీ స్థాయేంటో తెలుసుకుని మాట్లాడు
సాక్షి, కరీంనగర్: భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ మీద ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆయన చేస్తున్న ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. సంస్కార హీనంగా మాట్లాడుతున్న బండి సంజయ్.. ఆయన స్థాయేంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. నీ పదవి కూడా కేసీఆర్ భిక్షే అని విమర్శించారు. ప్రజలు నిన్ను కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే నీ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశావని నిలదీశారు. మంగళవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ నిధులను ఢిల్లీలోనే ఆపించే చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని సంజయ్ను నిందించారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు హర్షిస్తారని వ్యాఖ్యానించారు. మేమూ నీలాగా చిల్లరగా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం అడ్డొస్తోందన్నారు. ఇప్పుడైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే అంతే ధీటుగా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. (చదవండి: కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలులోనే) నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై కూడా బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. పసుపు బోర్డు తెప్పిస్తానన్న ఎంపీ.. దాని గురించి తప్ప అన్నింటి మీదా మాట్లాడుతారని వ్యంగ్యాస్స్త్రాలు సంధించారు. ముందు నీ పార్లమెంట్ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చి తర్వాత రాష్ట్ర రాజకీయాలు మాట్లాడమని హితవు పలికారు. ఇక బాండు పేపర్ మీద రాసిచ్చిన వాగ్ధానం ఏమైందని సూటిగా ప్రశ్నించారు. మా మీద విమర్శలు చేసే ముందు ఈ హామీలను ఏం చేశారో సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. (చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు హాస్యాస్పదం ) -
పవన్ కళ్యాణ్పై బాల్కసుమన్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే ప్రతిపక్ష పార్టీల్లో టికెట్ల లొల్లి ఒడవట్లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'అభ్యర్థులను ప్రకటించడంలో టీఆర్ఎస్ ముందుంది. ఇవాళ్టి నుంచి కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ ఎన్నిలకను ప్రశాంతంగా నిర్వహిస్తోంది. రేపు హైదరాబాద్ను ప్రశాంతంగా ఉంచే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. మా అభ్యర్థుల్లో 50 శాతం విద్యావంతులు, 50 శాతం యువకులు ఉన్నారు. 70 శాతం కంటే ఎక్కువ ఎస్సీ, ఎస్టీలకు టికెట్లు ఇచ్చింది. టికెట్ల కేటాయింపులో టీఆర్ఎస్ సామాజిక న్యాయం పాటించింది. బీజేపీలో గెలిచిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారు. నిజామాబాద్లో పసుపు బోర్డ్ వచ్చిందా? బీజేపీ, కాంగ్రెస్కు గ్రేటర్ ప్రజలు తగిన బుద్ది చెప్తారు. కిషన్రెడ్డి నిస్సహాయుడు. రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లి అడుక్కుంటున్నాడు. (దమ్ముంటే లక్ష కోట్లు తెండి) ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కూడా బాల్క సుమన్ సెటైర్లు వేశారు. ‘పక్క రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ పోటీకి దిగుతాననడం హాస్యాస్పదం. ఆయనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనతో లేడు. అలాంటి పార్టీని, వ్యక్తిని బీజేపీ కలుపుకోవడంవిడ్డూరం. పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనోడు ఇక్కడ ఏం చేస్తాడు..?. విస్తృత ప్రయోజనాల కోసం పోటీచేయట్లేదంట.. ఈ మాటలు వింటుంటే జనాలు నవ్వుకుంటున్నారు' అంటూ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. (ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలి) -
కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు హాస్యాస్పదం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో టీఆర్ఎస్ తమ గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని, స్పీకర్ను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంఖ్యా బలం ఆధారంగా సమయమిస్తారని, అందులో భాగంగా కాంగ్రెస్కు 5 నిమిషా లు ఇవ్వాల్సి ఉండగా అదనంగా 10 నిమిషాలు కేటాయించారని తెలిపారు. పీవీకి భారతరత్న ఇవ్వడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. -
రేవంత్వి నిరాధార ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: గోపన్పల్లిలో దళితుల భూ ములను లాక్కున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఉద్దేశపూర్వకంగా నిరాధార ఆరోపణ లు చేస్తున్నారని ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, కర్నె ప్రభాకర్ విమర్శించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎ.జీవన్రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి ఆదివారం అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎదుటివారిపై బురదచల్లి రాజకీయ పబ్బం గడుపుకోవడం రేవంత్కు అలవాటు అని, 111 జీవో పరి«ధిలో ఉన్న వట్టినాగులపల్లి సర్వే నంబర్ 66/ ఈలో రేవంత్ బావమరిది జయప్రకాశ్రెడ్డి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. 111 జీవో పరిధిలో ఉన్న ప్రాంతంలో కాం గ్రెస్ నేతలకు ఎవరెవరికి భూములు ఉన్నాయో బయట పెడతామన్నారు. సంచలనాల కోసమే ఆరోపణలు సంచలనాల కోసమే మాట్లాడే రేవంత్రెడ్డి లాంటి నేతలు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమని, ఇలాంటి నాయకులు అవసరమో లేదో జాతీయ పార్టీలు ఆలోచించాలని కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ధర్మానికి కట్టుబడి ఉందని, కోర్టులంటే తమకు గౌరవం ఉందన్నారు. 111 జీవో పరిధిలో అతిపెద్ద భవనాన్ని నిర్మించిన రేవంత్ వ్యవహారం దొంగే దొంగ అన్న రీతిలో ఉందన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ కేరాఫ్ అడ్రస్గా మారుతున్నారని, పెయింటర్గా జీవితం ప్రారంభించిన ఆయన రూ.వేల కోట్లు ఎలా సంపాదించారో వెల్లడించాలని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. పీసీసీ పదవి కోసమే రేవంత్రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. -
బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోపన్పల్లిలో దళితుల భూములను లాక్కున వ్యక్తి రేవంత్ అని.. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికే బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. 111 జీవో పరిధిలో ఎరెవరికి భూములున్నాయో బయటపెడతామన్నారు. రేవంత్రెడ్డి చూపించిన భూములు కేటీఆర్వి కావని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ ఎదుగుదలను జీర్ణించుకోలేకే కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. (కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి) సంచలనాలు కోసమే.. సంచలనాలు కోసమే రేవంత్ రెడ్డి మాట్లాడతారని, అలాంటివారు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ విమర్శించారు. జాతీయ పార్టీకి ఇలాంటి నాయకుడు అవసరమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులమంతా ధర్మానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. కోర్టులంటే తమకు గౌరవం ఉందన్నారు. ప్రజలంతా ఒక్క వైపు ఉంటే.. రేవంత్ బృందం అంతా ఓ వైపు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడటం మానుకోవాలని రేవంత్కు ఆయన హితవు పలికారు. (జీవో 111 ఉల్లంఘనలపై నిజ నిర్ధారణ కమిటీ) వేల కోట్లు ఎలా సంపాదించారు.. బ్లాక్మెయిల్కి కేరాఫ్ అడ్రాస్గా రేవంత్రెడ్డిని పీయూసీ ఛైర్మన్ జీవన్రెడ్డి అభివర్ణించారు. రేవంత్ ఆరోపణలకు కేటీఆర్ సమాధానం కూడా చెప్పారని, అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పెయింటర్గా జీవితాన్ని ప్రారంభించిన రేవంత్.. వేల కోట్లు ఎలా సంపాదించారని జీవన్రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు నవ్వుకుంటున్నారు.. ప్రపంచం మెచ్చిన నేత కేటీఆర్ అని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఓటుకు నోటు కేసు చూసి రాజకీయాలు ఇలా ఉంటాయా అని సిగ్గుపడ్డామన్నారు. ఉప్పల్లో నువ్వు కొనుగోలు చేసిన భూముల సంగతి ఏమిటని రేవంత్ను ప్రశ్నించారు. వాటిని బయటపెడితే ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. పీసీసీ పదవి కోసమే ఆయన ఆరోపణలు చేస్తున్నారని సైదిరెడ్డి మండిపడ్డారు. -
రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉంది
సాక్షి, హైదరాబాద్ : ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బడ్జెట్ ప్రతిపాదించారన్నారు. సంక్షేమ, వ్యవసాయ రంగాలకు ఈ బడ్జెట్లో ప్రముఖ స్థానం కల్పించారని సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. పేద, మద్య తరగతి వర్గాలకు ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని నోముల నర్సింహయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక సామాజిక ఇంజనీర్ లాగా ఆలోచించి బడ్జెట్ను రూపొందించారని, దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ రంగంలో ఎలాంటి కోతలు విదించకపోవడం వెల్లడించారు. ఇరిగేషన్కు 11వేల కోట్లు కేటాయించడం కాంగ్రెస్కు చెంపపెట్టన్నారు. పాలమూరు-రంగారెడ్డి విషయంలో మా ప్రభుత్వం దృడ నిశ్చయంతో ఉందని తెలిపారు. 57 సంవత్సరాల వారందరూ పెన్షన్కు అర్హులని చెప్పిన సీఎం వారికి రూ.2016 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
రేవంత్ నేరాల పుట్ట బయటపడింది : సుమన్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మంత్రి కేటీఆర్పై అసత్య ప్రచారం చేస్తూ బట్టకాల్చి మీద వేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చెబుతున్న భూములు ఆక్రమించినవి కావని, 2014 అఫిడవిట్లోనే కేటీఆర్ పేర్కొన్నారని తెలిపారు. 8 ఎకరాల 9 గుంటల భూమి కేటీఆర్ సతీమణి పేరుమీద ఉన్నట్లు వివరించారు. గండిపేట సమీపంలోని ఫామ్హౌస్ను నాలుగు ఏళ్ల క్రితం కేటీఆర్ లీజుకు తీసుకున్నారని వెల్లడించారు. ఫామ్హౌస్కు రేవంత్ చెబుతున్న భూమికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని రేవంత్ క్షమాపణ చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు. (ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్) సోమవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన బాల్క సుమన్.. గోపనపల్లిలో దళితుల భూములను రేవంత్ తన సోదరులతో కలసి ఆక్రమించారని, ఆయన నేరాల పుట్ట బయటపడిందని ఆరోపించారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేటీఆర్పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను కాదుకదా ఏమీ పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. పేదలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాగా ప్రభుత్వ నిబంధనలకు అతిక్రమించి మంత్రి కేటీఆర్ ఫామ్హౌస్ నిర్మించారని రేవంత్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దానిని ముట్టడించేందుకు అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లిన రేవంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. -
‘కాంగ్రెస్ నేతలకు కళ్లు బైర్లు కమ్మాయి’
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయంతో కాంగ్రెస్, బీజేపీ నేతల కళ్లు బైర్లు కమ్మాయని.. రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఈయన బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సాధించిన మెజారిటీ భారతదేశ చరిత్రలో ప్రథమం అన్నారు. 130 సీట్లలో 122 గెలిచామని.. ఓ నాయకుడి మీద అఖండ విశ్వాసం ప్రకటించిన ఎన్నికలు ఇవే అన్నారు. ఉత్తమ్ కుమార్రెడ్డి హుజూర్నగర్ ఎమ్మెల్యే సీటు కోల్పోయినా బుద్ధి మార్చుకోలేదని.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పాలక మండలి ఎన్నికపై దుష్ప్రచారం చేస్తున్నారని రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. రాజ్యసభ బులెటిన్ ప్రకారంకేవీపీ రామచంద్ర రావును ఆంధ్రప్రదేశ్కి కేటాయించారని ఆయన గుర్తు చేశారు. ఉత్తమ్ ఎన్నికల కమిషన్ మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి కేవీపీ రామచంద్ర రావు ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా చేర్పించారని అన్నారు. మున్సిపల్ చట్టం రెండో చాప్టర్ ఐదో సెక్షన్ను ఉత్తమ్ చదువుకోవాలి హితవు పలికారు. ఎన్నికలు జరిగిన 30 రోజుల్లోపు కూడా ఎమ్మెల్సీ, ఎంపీలు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా చేరవచ్చు అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల చట్టాలను చదవరని.. వారికి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల ఆకారాలు పెరిగాయి కానీ బుద్ది పెరగలేదని.. ఇంకా వలసవాద భావజాలంతోనే ఉన్నారని విమర్శించారు. కావాలంటే కేవీపీని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా చేయండని.. ఎవరు వద్దన్నారని రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. చట్ట ప్రకారం నేరేడు చర్లలో టీఆర్ఎస్ గెలిచిందని.. తమ విజయాన్ని అపహాస్యం చేయడం కాంగ్రెస్, బీజేపీ నేతలకు తగదన్నారు. బీజేపీ లక్ష్మణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని.. బీజేపీని ప్రజలు తిరస్కరించినా ఆయన తీరు మారటంలేదని రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్రెడ్డివీధి భాగోతాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వ్యవస్థలను తప్పుబడుతున్న ఉత్తమ్ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలని సుమన్ డిమాండ్ చేశారు. పీసీసీ పదవిని కాపాడుకునేందుకు ఉత్తమ్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఎన్నిక జరిగినా టీఆర్ఎస్కే ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందీ పోయి గావు కేకలు పెడుతున్నారని అన్నారు. ఈవీఎంలతో ఎన్నికలు జరిగినా బ్యాలట్తో ఎన్నికలు జరిగినా విజయం టీఆర్ఎస్దే అన్నారు. గాలివాటంతో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలిచిందని ఆయన విమర్శించారు. లక్ష్మణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిపాజిట్ కోల్పాయారని సుమన్ ఎద్దేవా చేశారు. పదవి పోతుందనే లక్ష్మణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమను ఎంత తిట్టినా లక్ష్మణ్ పదవి పోవడం ఖాయమన్నారు. ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటి రెడ్డి, లక్ష్మణ్లు సీఎం కేసీఆర్, కేటీఆర్లపై వాడిన పరుష పదజాలాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో వచ్చే తీర్పే అంతిమమని ప్రతిపక్షాలు గ్రహించాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీ నేతలు మారాలని హితవు పలికారు. ఇక పరిపాలన, పురపాలనపైనే దృష్టి సారించి.. ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల మాదిరిగా తెలంగాణను తీర్చిదిద్దుతామని సుమన్ తెలిపారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
మీవి విద్వేష రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి, రక్తపుటేరులు పారించే లక్ష్యం బీజేపీది అని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన బీజేపీకి బహిరంగ లేఖ రాశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా చిల్లిగవ్వ ఇవ్వని మీ పార్టీతో బంగారు తెలంగాణ సాధ్యమా అని నిలదీశారు. ‘కాళేశ్వరానికి నిధులివ్వాలని, జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నెత్తీనోరూ కొట్టుకున్నా రూపాయి కూడా విదల్చని మీరు బంగారు తెలంగాణ చేస్తారంటే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? యూపీఏ–2 ప్రభు త్వం ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మూలన పడేసింది మీ ప్రభుత్వం కాదా? రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను కేంద్ర సర్కారు బుట్టదాఖలు చేసిందనే విషయం రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి తెలియదా? విభజన హామీలను గత ఐదేళ్లలో ఏనాడూ కేంద్రం పరిశీలించలేదు. వీటిపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎప్పుడైనా కేంద్రాన్ని అడిగిందా? అలాంటి మీరు బంగారు తెలంగాణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది’ అని సుమన్ పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలేవి? తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం అడుగడుగునా వివక్ష చూపించిందని బాల్క సుమన్ అన్నారు. విభజన చట్టంలోని ట్రైబల్, హార్టీకల్చర్ యూనివర్సిటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ‘ఖమ్మం జిల్లా బయ్యారంలో నిర్మించతలపెట్టిన ఉక్కు పరిశ్రమ ఏమైంది? ఖాజీపేటలో పెడతామ న్న కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తామన్న గ్రాంట్లు ఏమయ్యాయి? తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా ప్రతి జిల్లాకు ఇవ్వాల్సిన కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు ఎక్కడ’ అని నిలదీశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోగా అడుగడుగునా తెలంగాణపై విషం చిమ్ముతూ అబద్దాలు చెబుతూ వచ్చారని మండిపడ్డారు. -
కేటీఆర్.. మీతో ఛాయ్ కా, ఇంకేమైనా ఉందా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా గురువారం అసెంబ్లీ లాబీలో అసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పద్మా దేవేందర్ రెడ్డి, బాల్క సుమన్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎదురయ్యారు. కేటీఆర్ ఈ సందర్భంగా ఛాయ్ తాగుదాం రండి అంటూ శ్రీధర్బాబును ఆహ్వానించారు. ‘మీతో ఛాయ్పై చర్చనా ? ఇంకా ఏమైనా ఉందా ? వద్దు బాబు’ అంటూ శ్రీధర్ సమాధానం ఇవ్వడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. అనంతరం బాల్క సుమన్ను పలకరించిన శ్రీధర్బాబు..ఏదో వన భోజనాలు పెట్టించినట్టున్నావు అని చమత్కరిస్తూ... కాళేశ్వరం జలజాతర పేరిట సుమన్ నిర్వహించిన కార్యక్రమం గురించి ఆయన ప్రస్తావించారు. తానే కాదని, మంథని నియోజకవర్గంలో కూడా గతంలో భోజనాలు పెట్టించారని బాల్క సమాధానమిచ్చారు. ఇక ఇవాళ ఉదయం శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన వెంటనే విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డికి సభాపతి స్థానం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా శాసనసభ్యులు జగదీశ్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు శాసనసభ సమావేశాలకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పుష్పగుఛ్చం అందజేసి స్వాగతం పలికారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు గౌడ్కు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు స్వాగతం పలికారు. -
కాళేశ్వరం.. తెలంగాణకు వరం
చెన్నూర్రూరల్/చెన్నూర్ : కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతోందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ అన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో అన్నారం బ్యారేజీ వద్ద మంగళవారం జల జాతర, సామూహిక వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రులు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరంలాంటిదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర, మధ్య తెలంగాణకు 45 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని, హైదరాబాద్కు 40 టీఎంసీల తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 30 శాతం, మిషన్ భగీరథకు 60 శాతం నీరు అందుతుందని చెప్పారు. అయితే.. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తోందని విమర్శించారు. సామూహిక వనభోజనాలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాజెక్టుల గురించి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసిస్తుంటే.. ఇక్కడి ప్రతిపక్ష పార్టీలు మాత్రం రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో గోదావరి జలాల మీద ఏనాడూ ఒప్పందం కుదుర్చుకోలేదని విమర్శించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞుడిలా వ్యవహరించి ప్రాజెక్టులు నిర్మించి రైతాంగానికి నీరు అందిస్తున్నారని తెలిపారు. కాళేళ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎగువ, దిగువ ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరయ్యారని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో నదీ జలాలపై గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిందన్నారు. పక్క రాష్ట్రాలతో ఎలాంటి పంచాయితీ లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెన్నూర్ నియోజకవర్గంతోపాటు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్రావు, కోరుకంటి చందర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, నారదాసు లక్ష్మణ్రావు, మంచిర్యాల జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మంథని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, జక్కు శ్రీవర్షిణి పాల్గొన్నారు. -
ఎవరిని ఓడించడానికి నేను పనిచేయలేదు
-
కేటీఆర్కు విరాళం అందజేసిన సుమన్
రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం టీఆర్ఎస్ మంత్రులు, జెడ్పీ చైర్పర్సన్ల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 29 జిల్లా కార్యాలయాలకు సోమవారం రోజున శంకుస్థాపన నిర్వహించింది. అయితే ఈ నిర్మాణాలకు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తన వంతు విరాళం అందించారు. ఎమ్మెల్యేగా తన ఒక నెల జీతం 2,50,000 రూపాయలను విరాళంగా ప్రకటించారు. మంగళవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన సుమన్ ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును ఆయనకు అందజేశారు. ఈ విషయాన్ని సుమన్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. మరోవైపు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి పార్టీ తరఫున కొంత మొత్తం కేటాయించినప్పటికీ.. వాటిని అన్ని వసతులతో ఆదర్శంగా నిర్మించుకోవాలనే తలంపుతో పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ వంతుగా స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. -
రేవంత్ ఒక రాజకీయ టెర్రరిస్టు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్టు అని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కొడంగల్లో ఓడిపోయినా ఆయనకు బుద్ధి రాలే దని వ్యాఖ్యానించారు. బట్టకాల్చి మీద వేయ డం, బురద చల్లడం రేవంత్రెడ్డికి అలవాటు అని, ఆయన నోరు తెరిస్తే వేల కోట్ల రూపాయల కుంభకోణం అని మాట్లాడతారని మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో సుమన్ విలేకరులతో మాట్లాడుతూ ‘ఇంటర్ ఫలితాల్లో కొంత సాంకేతిక సమస్య వచ్చింది నిజమే. అప్పుడు ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్కు విద్యా శాఖకు లింక్ ఎలా పెడతారు? 2017 సెప్టెంబరు 27న గ్లోబరీనాకు రూ.4.30 కోట్లకు టెండర్లు ఇచ్చారు. ఇది విద్యాశాఖ పరిధిలోని అంశం. గ్లోబరీనాకు ఐటీ శాఖకు సంబంధం ఏంటి? ప్రభుత్వం స్పందించి సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదు. ప్రజలకోసం కాకుండా వాళ్లకోసం ఆందోళన చేస్తున్నా రు. గ్లోబరీనా, మాగ్నేటిక్ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషించింది. ఇంటర్ బోర్డులో కొంత మంది అధికారుల మధ్య ఉన్న విభేదాల కారణంగా గందరగోళం జరిగినట్లు తెలుస్తోంది’అని సుమన్ అన్నారు. -
ఆ రెండు కాంగ్రెస్ పోషించినవే : బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల వివాదంలో ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సున్నితమైన అంశంపై విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయంటూ మండిపడ్డారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ఇంటర్ ఫలితాల వెల్లడిలో టెక్నికల్ సమస్య వచ్చింది నిజమేనని అంగీకరించారు. ఇంటర్ బోర్డులో కొంతమంది అధికారుల మధ్య విభేదాల కారణంగానే గందరగోళం జరిగినట్లు తెలుస్తోందన్నారు. అయితే ఇందుకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఇంటర్ బోర్డు వ్యవహారం గురించి సీఎం కేసీఆర్ అధికారులతో మాట్లాడుతున్నారని.. బాధ్యులపై త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పోషించినవే.. ‘ గ్లోబరీనా, మాగ్నెటిక్ సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం పోషించినవే. ఇంటర్ బోర్డు వ్యవహారంలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. రూ. 4 కోట్ల టెండర్ను వేల కోట్లు అని రేవంత్ ఎలా మాట్లాడుతారు. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన దొంగ ఆయన. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్ట్. అసలు గ్లోబరీనాకు ఐటీ శాఖకు సంబంధం ఏమిటి. 24 గంటల్లోగా రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పాలి అని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. -
సుమన్ బామ్మర్ది వివాహం, హాజరైన కేటీఆర్
సాక్షి, నల్గొండ: చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కుటుంబంలో జరిగిన వివాహా కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సుమన్ బామ్మర్ది వెంకటేశ్ గౌడ్ వివాహం బుధవారం ఉదయం పావనితో జరిగింది. నల్గొండ జిల్లా చండురులో జరిగిన ఈ విహహా వేడుకకు హాజరైన కేటీఆర్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేటీఆర్తోపాటు రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి నరసింహారెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్లు కూడా వివాహా కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇటీవల కేటీఆర్ను స్వయంగా కలిసిన సుమన్ ఈ వివాహ వేడుకకు సంబంధించిన శుభలేఖను ఆయనకు అందజేశారు. -
తెలంగాణలో టీఆర్ఎస్.. ఆంధ్రాలో జగన్ కింగ్
సాక్షి, మంథని: దేశంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి బాగా లేదని, తెలంగాణలో టీఆర్ఎస్.. ఆంధ్రాలో జగన్ కింగ్ అని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంథనిలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం అధికంగా ఉందని, కాలం కలిసి వస్తే ఢిల్లీ గద్దెపై కేసీఆర్ను ప్రధానిగా చూస్తామన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని అన్నారు. మాజీ ఎంపీ వివేక్ పార్టీకి ద్రోహం చేశారని, ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. పెద్దపల్లి పాçర్లమెంట్ అభ్యర్థి బొర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితున్నయ్యానన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
సముచిత స్థానం కల్పిస్తే ద్రోహం చేస్తావా?
గోదావరిఖని/మంచిర్యాల: మాజీ ఎంపీ వివేక్కు టీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేయలేదని, ఆయన పార్టీకి తీరని ద్రోహం చేశారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విలేకరులతో, మంచిర్యాలలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి వివేక్ కుట్ర చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులతో టచ్లోనే ఉంటూ, వారికి ఆర్థికంగా సాయం చేయడం వల్లనే ధర్మపురిలో తన గెలుపు కష్టసాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అందుకే సీఎంతో మాట్లాడి, పార్టీ ద్రోహులకు టికెట్టు ఇవ్వొద్దని కోరినట్లు చెప్పా రు. 2013లో టీఆర్ఎస్లోకి వచ్చిన వివేక్.. 2014లో కాంగ్రెస్లోకి జంపు చేశారని, ఎంపీగా ఓడిపోయిన ఆయన్ను , సీఎం కేసీఆర్ పార్టీలోకి చేర్చుకుని గౌరవప్రదమైన ప్రభుత్వ సలహాదారు పదవిని ఇచ్చి సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. దళితుడివి కాదు ధనికుడివి: సుమన్ ‘వివేక్..నీవు దళితుడివి కాదు ధనికుడివి.. నీవు దళితులకు ఏమి చేశావు? డబ్బు ఉందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించావ్. నిజమైన దళితులం మేమే’అని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. వివేక్కు టీఆర్ఎస్ పార్టీ ఏం ద్రోహం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘వివేక్ దళితుడు కాదు’
సాక్షి, పెద్దపల్లి : అధికారం కోసమే మాజీ ఎంపీ వివేక్ గతంలో టీఆర్ఎస్లో చేరారని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. గోదావరిఖనిలో శనివారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు వివేక్ సోదరులు పథకాలు రచించారని ఆరోపించారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తిలను హైకమాండ్ గుర్తించే వివేక్కు టికెట్ ఇవ్వలేదన్నారు. అధికారం లేనిదే వివేక్ సోదరులకు నిద్రపట్టదని అందుకే పార్టీలు మారుతూ ఉంటారని ఎద్దేవా చేశారు. వివేక్ దళితుడు కాదని ధనవంతుడని విమర్శించారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు స్థాపించిన వివేక్ సోదరులు... పెద్దపల్లిలో ఎన్ని ఫ్యాక్టరీలు నిర్మించారో చెప్పాలన్నారు. -
నా ప్రేమ మీవల్లే సక్సెస్ అయింది: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. పద్మారావు గౌడ్తో తన వ్యక్తిగత అనుబంధం గురించి సభలోని సభ్యులతో పంచుకున్నారు. తన ప్రేమ వివాహానికి పద్మారావు గౌడ్ అన్నీ తానై ముందు నిలిచారని.. ఆయన వల్లే తన వివాహం జరిగిందని చెప్పారు. ఈ విషయం సభలో చెప్పవద్దో లేదో తనకు తెలియదని, కానీ పద్మారావు గౌడ్తో తనకున్న అనుబంధం గురించి చెప్పడానికి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానని తెలిపారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్వి అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు, వివాహానికి తన అత్త మామలు ఒప్పుకోలేదన్నారు. తాను ప్రేమించిన అమ్మాయి పద్మారావు సామాజిక వర్గానికే చెందినవారని, ఆ సమయంలో తనకంటూ ఏది లేదు కాబట్టి అత్త మామలు పిల్లనివ్వడానికి వెనుకాడారని చెప్పారు. దాంతో పద్మారావు అన్ననే వారితో మాట్లాడి ఒప్పించారని, భవిష్యత్తులో సుమన్ ఎమ్మెల్యే అవుతాడని పద్మారావు భరోసా ఇవ్వడంతో తన అత్త మామలు పెళ్లికి ఒప్పుకున్నట్టు సుమన్ తెలిపారు. పద్మారావు గౌడ్ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
గవర్నర్కు కేటీఆర్ న్యూఇయర్ విషెస్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం కేటీఆర్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఉన్నారు. -
అది చంద్రబాబు తెలివి తక్కువతనమే!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ను బూచిగా చూపించి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు పొందాలనుకుంటే అది చంద్రబాబునాయుడు తెలివితక్కువ తనమే అవుతుందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్రెడ్డి, బాల్క సుమన్లు అభిప్రాయపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఆ రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉంటాయో స్పష్టమవుతుందన్నారు. ఓటమికి చంద్రబాబు ఇప్పట్నుంచే సాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీలతో టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడూ రాజకీయ సంబంధాలు లేవని, కేవలం రాజ్యాంగబద్దమైన సంబంధమే ఉందని స్పష్టం చేశారు. పూటకో విధానంతో చంద్రబాబు ముందుకు పోతున్నారని మండిపడ్డారు. హైకోర్టు అఫడవిట్ గురించి మాట్లాడమని కేసీఆర్ అడిగితే ఎదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను గద్దే దించేందుకు కేసీఆర్ సూత్రదారి అయితే కేసీఆరే సీఎం అయ్యేవారు కదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అబద్దాలతో ఏపీ ప్రజలను వంచిస్తున్నారని తెలిపారు. తెలంగాణ కోసమే 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీలతో కేసీఆర్ పొత్తుపెట్టుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలను ఒప్పించిన ఘనత కేసీఆర్దేనని, చివరకు చంద్రబాబును కూడి ఒప్పించి ఆయన పార్టీతో పొత్తుపెట్టుకున్నారని పేర్కొన్నారు. 2004లో చంద్రబాబును బండకేసి కొట్టింది కాంగ్రెస్సేనని, 2009లో టీఆర్ఎస్తో పొత్తుకు ముందుకు వచ్చింది టీడీపీనే అని తెలిపారు. కేసీఆర్ బాబు దారిలోకి రాలేదని, చంద్రబాబే కేసీఆర్ దారిలోకి వచ్చారన్నారు. తాజా ఎన్నికల్లో మోదీతో కేసీఆర్ దోస్తీ అని చంద్రబాబు ఎంత మొత్తుకున్నా ప్రజలు నమ్మలేదన్నారు. గోబెల్సే ఆశ్చర్యపడే రీతిలో చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని, ఈ గోబెల్స్ సిద్దంతాలను తెలంగాణ ప్రజలు తిరస్కరించారని, రేపు ఏపీలో కూడా అదే జరుగుతుందని జోస్యం చెప్పారు. ఇంకా ఉమ్మడి హైకోర్టు ఎందుకు? రాష్ట్రాలు విడిపోయినా హై కోర్టు ఎందుకు కలిసి ఉండాలన్న కారణాన్ని బాబు చెప్పలేక పోయారని, నాలుగున్నరేళ్లలో హై కోర్టు భవనం కూడా కట్టలేకపోయారని విమర్శించారు. కేసీఆర్తో చంద్రబాబు పోటీపడలేరని, ఎవరిని అడిగినా.. తెలంగాణ అభివృద్ధి గురించి చెబుతారన్నారు. మోదీ, వైఎస్ జగన్లతో ఎలా వ్యవహరించాలో కేసీఆర్కు బాగా తెలుసన్నారు. పక్క రాష్ట్రాలతో సంబంధాల విషయంలో కేసిఆర్ రాజకీయ పరిణతితో వ్యవహరిస్తారన్నారు. కేసీఆర్ రాజకీయ పరిణతి తెలుసుకోవడానికి మహారాష్ట్రతో సాగునీటి ఒప్పందం ఒక్కటి చాలన్నారు. -
హిందీ, ఇంగ్లిష్ రాకుండా చక్రం తిప్పుతారా?
సాక్షి, హైదరాబాద్: కనీసం హిందీ, ఇంగ్లిష్ రాకుండా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఎలా సాధ్యమని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణభవన్లో ఆయన మాట్లాడారు. ఓ సారి హోదా కావాలని, మరోసారి వద్దని చెప్పే బాబు ఈ విషయంలో ఆయన విధానమెంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కుమారులను, జూనియర్ ఎన్టీఆర్ను ఎన్నికల కోసం వాడుకున్న మాట వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏపీ మంత్రులు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి తప్పకుండా సీఎం కేసీఆర్ లేఖ రాస్తారని స్పష్టం చేశారు. -
టీఆర్ఎస్లో పెద్దపల్లి పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనం తరం టీఆర్ఎస్లో కొత్త పంచాయితీలు మొదలవుతున్నాయి. పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ స్థానాల్లో మాజీ ఎంపీ వివేక్ టీఆర్ఎస్కు నష్టం కలిగించేలా వ్యవహరించారని ఎమ్మెల్యే లు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంపై పలువు రు ఎమ్మెల్యేలు నేరుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్కు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్(ధర్మపురి), దాసరి మనోహర్రెడ్డి(పెద్దపల్లి), బాల్క సుమన్(చెన్నూరు), సోమారపు సత్యనారాయణ(రామగుండం) గురువారం తెలం గాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు, తమకు ఇబ్బంది కలిగించేలా వివేక్ వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ ఇద్దరూ కలిసి, సోమారపు సత్యనారాయణ వేరుగా కేటీఆర్తో భేటీ అయ్యారు. వివేక్ టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించారని... బెల్లంపల్లిలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సోదరుడు వినోద్కు సహకరిం చారని కేటీఆర్కు వివరించినట్లు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇటీవల జరిగిన టీఆర్ఎస్ కృతజ్ఞత సభలోనూ పలువురు ద్వితీయశ్రేణి నేతలు ఎంపీ వివేక్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. ధర్మపురి, బెల్లంపల్లి, చెన్నూరులో బహిరంగంగానే వివేక్పై విమర్శలు చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కేటీఆర్కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ వివేక్ సైతం గురువారం కేటీఆర్ను కలిశారు. పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఎన్నికల పరిస్థితులపై కేటీఆర్తో మాట్లాడారు. తాను ప్రచారం చేసిన ప్రాంతాల్లో టీఆర్ఎస్కు ఎక్కువ మెజారిటీ వచ్చిందని వివేక్ కేటీఆర్కు వివరించినట్లు తెలిసిం ది. ఫిర్యాదులు, వివరణ నేపథ్యంలో పెద్దపల్లి లోక్సభ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలతోపాటు మాజీ ఎంపీ వివేక్తో కేటీఆర్ శుక్రవారం మరోసారి భేటీ కానున్నట్లు తెలిసింది. -
కాంగ్రెస్దే దిగజారుడుతనం: బాల్క
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలు పార్టీ మారుతున్నారని ప్రచారం చేస్తూ వారి వ్యక్తిత్వా న్ని కించపరిచేలా కాంగ్రెస్ పార్టీ దిగజారి ప్రవర్తిస్తోందని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ను బచ్చా అంటున్న టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఓ లుచ్చా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, కోదండరాంతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ పై నోట్ల కట్టలతో దండయాత్రకు వస్తున్నారని గవర్నర్ జోక్యం చేసుకుని ఇలాంటి వాటిని కట్టడి చేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమతో కలిసి బాల్కసుమన్ తెలంగాణభవన్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్పై కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి చేస్తున్న నిరాధార ఆరోపణలు శంకరాచార్యులకు, పీర్ల పండుగకు ముడిపెట్టినట్టు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ని వీడే ప్రసక్తే లేదని తుల ఉమ అన్నారు. పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. -
‘కాంగ్రెస్ నాయకులు కరెంట్ తీగలు పట్టుకోండి’
సాక్షి, నిజామాబాద్ : కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ ప్రజలకు ఏం చేసిందని అడుగుతున్నారు.. మీరంతా ఒక్కసారి కరెంట్ తీగలు పట్టుకోండి.. అప్పుడు తెలుస్తది మా ప్రభుత్వం ఏం చేసిందో అంటూ ధ్వజమెత్తారు టీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్. శుక్రవారం వేల్పూర్ మండలం లక్కొరాలో నిర్వహించన టీఆర్ఎస్ యువ సమ్మేళనానికి బాల్క సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ దొంగలు మాయమాటలు చెబుతున్నారు. కేసీఆర్ది కుటుంబ పాలన అంటున్నారు. మరి నెహ్రూ కుటుంబం నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు రాజకీయాల్లోకి వచ్చారు కదా. వారిది కుటుంబ పాలన కాదా అని బాల్క సుమన్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒక్క ఉద్యమంలో కూడా పాల్గొనలేదు. దమ్ముంటే ఫోటోలు పంపించండి అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ ప్రజలకు ఏం చేసింది అని అడుగుతున్నారు.. ఒక్కసారి కరెంట్ తీగలు పట్టుకోండి. మీకే తెలుస్తది అంటూ మండిపడ్డారు. రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని బాల్క సుమన్ తెలిపారురు. కరెంట్ అడిగితే కాల్పులు జరిపిన నీచుడు చంద్రబాబు అంటూ విమర్శించారు. నిరుద్యోగుల కోసం కేసీఆర్ రూ. 3016 నిరుద్యోగ భృతి ప్రకటించారు. ఎన్నికల తర్వాత అది కూడా అమల్లోకి వస్తుందని తెలిపారు. -
మహాకూటమి కాదు.. జఫ్పా కూటమి
-
సూపర్ ఛాన్స్.. ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు
సాక్షి, హైదరాబాద్ : ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే మంచి అవకాశం తెలంగాణ ప్రజలకు వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఓటుతో మహాకూటమిగా జతకట్టిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఎం పార్టీలకు బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం విస్తృత సమావేశానికి కేటీఆర్, ఎంపీ బాల్కసుమన్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు వీర సైనికుల్లా పనిచేశారన్నారు. ఆ సమయంలో ఇంట్లో పడుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఇంట్లో పడుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడేమో సైనికుడునని మాట్లాడుతున్నారు. ఇది రాహుల్ గాంధీకి తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరగుతున్న పోటీ అని తెలిపారు. తెలంగాణకు జై అన్నారు కాబట్టే గతంలో టీఆర్ఎస్ టీడీపీ, కాంగ్రెస్లతో పొత్తుపెట్టుకుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను హతమార్చిన కాంగ్రెస్, టీడీపీలతో కోదండరాం పొత్తుపెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెట్టడానికి కాంగ్రెసోళ్లు సిద్దమయ్యారన్నారు. కాంగ్రెసోళ్లు పెళ్లి కాని యువకులకు పెళ్లి కూడా చేస్తామని, అవసరమైతే వారికి తిండి కూడా తినిపిస్తామని, వారి పిల్లల డైపర్స్ కూడా మారుస్తామని హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో పెట్టిన మ్యానిఫేస్టోలో ఏం అమలు చేశారో చెప్పాలన్నారు. రాజధాని పేరిట వేల కోట్ల స్కామ్స్.. తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి విద్యార్థులే ఉన్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఓటుకు కోట్లలో దొరికిన నేతలు, కార్లలో కరెన్సీ కట్టలు దొరికిన నేతలు కూడా కేసీఆర్ మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణ మీద దోపిడీ కోసం దండయాత్రకు దిగుతున్నారు. ఏపీలో ఐటీ సోదాలు జరిగితే టీడీపీ నేతలు భయపడుతున్నారని, రాజధాని పేరిట వేల కోట్లు స్కామ్స్ చేశారని అందుకే భయపడుతున్నారని తెలిపారు. అలాంటి వాళ్లు మళ్లీ తెలంగాణను దోచుకోవడానికి సిద్దమవుతున్నారు. కాంగ్రెస్, టీడీపీకి ఒకే ఓటుతో బుద్ది చెప్పాలన్నారు. -
బాల్క సుమన్ నాల్క కోస్తాం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ, టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సుమన్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామంటూనే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక కోస్తామని, పిచ్చిపిచ్చి వేషాలేస్తే బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. కేసీఆర్ ఎంగిలి మెతుకులు తిని, కేటీఆర్ బూట్లు నాకుతాడు. ఢిల్లీలో కవిత బ్యాగులు మోసే చరిత్ర సుమన్దని విమర్శించారు. దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని సవాల్ విసిరారు. ఆదివారం గాంధీభవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, టీపీసీసీ కార్యదర్శి కేతురి వెంకటేశ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల జేఏసీ చైర్మన్ దరవల ఎల్లయ్యలు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటైతే దళి తుడిని ముఖ్యమంత్రిని చేసి కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్, సీఎం అయ్యాక సుమన్ను కాపలా కుక్కగా పెట్టుకొని ఉసిగొలుపుతున్నాడని దుయ్యబట్టారు. పెద్దపల్లి ఎంపీ పదవి ఓయూ విద్యార్థుల భిక్ష అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సుమన్కు కనీసం రబ్బరు చెప్పులు కూడా లేవని, ఎవరు కనపడితే వారి దగ్గర రూ.10 అడిగేవాడని, ఎంపీ అయ్యా క చందాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలతో లక్షలు సంపాదించిన చరిత్ర సుమన్దని అన్నారు. దళితుల మీద దాడులు జరిగితే కనీసం నోరుమెదపలేని సుమన్, రేవంత్రెడ్డిపై నోరు పారేసుకోవడం స్థాయికి తగదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన హత్యలు, ఆత్మహత్యలు, ఎంసెట్ లీకులు కేసీఆర్ డైరెక్షన్లో జరిగాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విచారణ తప్పదని హెచ్చరించారు. విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని, అమరులు, విద్యార్థులను విస్మరించిన టీఆర్ఎస్కు తగిన గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు. -
చంద్రబాబు ఏజెంట్వి నువ్వు..
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి చంద్రబాబు ఏజెంట్లా రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాడని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. రేవంత్ ఆర్థిక అరాచకవాది అని దుయ్యబట్టారు. శనివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ కార్యదర్శి గట్టు రాంచందర్రావులతో కలసి బాల్క సుమన్ విలేకరులతో మాట్లాడారు. ‘రేవంత్రెడ్డి స్వాతిముత్యంలో కమల్హాసన్ కాదు, విశ్వరూపం కమల్హాసన్. ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ విషయాలు ఏమీ చెప్పలేదు. బట్టకాల్చి మీద వేసినట్లుగా మాట్లాడుతున్నారు. మీడియాలో వచ్చిన ఏ ఒక్క అంశానికీ సమాధానం చెప్పలేదు. బాల్క సుమన్ మీద మాట్లాడతావా? తోలు తీస్తాం. రేవంత్ గురించి మాట్లాడేందుకు నేను చాలు. నన్ను మా పార్టీ వాళ్లు ఆపుతున్నారు. లేదంటే ఉరికించి కొడతా, తాట తీస్తా. కేసీఆర్ ఫామ్ హౌస్ వెయ్యి ఎకరాలంటున్నావ్. నిరూపించకపోతే గజ్వేల్లో బొంద పెడతాం. దమ్ముంటే విచారణ ఎదుర్కో. నీ బండారం బయటపెడతా. అసెంబ్లీలో బాల్క సుమన్ కూర్చుంటాడో.. రేవంత్ కూర్చుంటాడో తేల్చుకుందాం. నిప్పులాంటి కేసీఆర్ కుటుంబం మీద ఆరోపణలు చేస్తావా. చిల్లరగాళ్లను వెంట బెట్టుకొని మాట్లాడతావా. కేసీఆర్కు ఆస్తులు అవసరం లేదు. నీ ఆస్తులపై, నా ఆస్తులపై విచారణకు సిద్ధం. మా ఎమ్మెల్యేలపై, ఎంపీలపై ఐటీ సోదాలు జరిగాయి. నీ మీద ఐటీ సోదాలకు, టీఆర్ఎస్కు ఏం సంబంధం’అని ప్రశ్నించారు. -
రేవంత్ నీ తాట తీస్తా: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తా’ అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ముమ్మాటికి చంద్రబాబు ఏజెంటే అని ఆరోపించారు. ఆయన సింగపూర్ ఆస్తుల్లో రేవంత్ రెడ్డి బినామీ అని, ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు డబ్బుతోనే రేవంత్ రెడ్డి దొరికారన్నారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ, ఆర్థిక అరాచక వాదని, తెలంగాణకు పట్టిన చీడపురుగని మండిపడ్డారు. డొల్ల కంపెనీలు, అక్రమాస్తులపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే.. ‘చంద్రబాబే కేసీఆర్ను ఏం చేయలేకపోయారు. అలాంటిది నీవెంతా?. కేసీఆర్ వేల ఎకరాల ఫామ్ హౌస్ చూపిస్తావా? లేకపోతే అక్కడే బొందపెట్టాలా. అడ్డగొలుగా మాట్లాడితే తాట తీస్తా. బాగా ఎగిరిపడుతున్నావ్. నీ గురించి ప్రధాని మోదీ, కేసీఆర్లు కలిసి ఐటీ దాడులు చేపిస్తారా? మా పఠాన్చెరువు ఎమ్మెల్యే, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లపై కూడా ఐటీ సోదాలు జరిగాయి. వారికి లెక్కల్లో తేడా ఉంటే.. నోటీసులిచ్చి సోదాలు చేస్తారు. దీనికి టీఆర్ఎస్కు ఏం సంబంధం. నీ గురించి ఎవరికి తెలియదు. ఎన్ని బ్లాక్మెయిల్ పనులు చేశావ్.. నీ దోస్తులను ఎలా మోసం చేశావో తెలియదనుకుంటున్నావా? నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన తెలంగాణలో, విషపు మొక్కలా చంద్రబాబు ఏజెంట్లా తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నావ్. మిమ్మల్ని తిట్టడం మాకు రాదా? నీ తప్పుల గురించి రాసిన విలేకరులను, మీడియా సంస్థలను తిడతావా? నీవు తప్పు చేస్తే తప్పు అనవద్దా? దమ్ముంటే విచారణ ఎదుర్కో? ఇప్పటికైనా పద్దతిగా, సంస్కారవంతంగా మాట్లాడు.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్? నాకు విలువలున్నాయి. ఉద్యమ ప్రస్థానం నాది. వ్యక్తిగతంగా మాట్లాడితే నీ బండారం అంతా బయట పెడుతా. నీ చరిత్ర మొత్తం తెలుసు. చేసిన అక్రమాలు, అన్యాయాలను ఒప్పుకొని ప్రజలను క్షమాపణ అడుగు. ఐటీ, ఇతర సంస్థలు చేస్తున్న విచారణకు సహకరించు. దమ్ముంటే విచారణను ఎదుర్కో. అసెంబ్లీలో బాల్కసుమన్... లేక రేవంత్ రెడ్డి కూర్చుంటాడా చూద్దాం.. కొడంగల్ల నీవు గెలుస్తావా? చెన్నూర్ల నేను గెలుస్తనా? కాంగ్రెస్కు ఎన్నిసీట్లు వస్తయో రెండునెలల్లో ప్రజలే తేలుస్తారు. ఎందుకు ఎగిరిపడుతున్నావ్. పోలీస్ అధికారులను, ఇంటలిజెన్స్ అధికారులను కూడా తిడతా ఉన్నావ్. కులం పేరుతో తెలంగాణలో విద్వేశపూరితమైన వాతావరణం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావ్. ఆంధ్రలో ఉన్నట్లుగా కులగజ్జి తెలంగాణలో లేదు. మాది ఉద్యమ పార్టీ నిస్వార్ధంగా నిలబడ్డాం కాబట్టే తెలంగాణ వచ్చింద’ని బాల్కసుమన్ ఆగ్రహంగా మాట్లాడారు. -
‘రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తా
-
దుర్మార్గపు పనులకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి
-
‘రేవంత్ రెడ్డి దేశ ద్రోహి’
సాక్షి, హైదరాబాద్: హవాలా దందా చేసి వేల కోట్లు సంపాదించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దేశ ద్రోహి అంటూ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల గురించి ఆయన మాట్లాడారు. తెలంగాణ వనంలో రేవంత్ రెడ్డి కలుపు మొక్కని అభివర్ణించారు. ‘ఓటుకు కోట్లు కేసు’లో రేవంత్ అడ్డంగా దొరికాడని, అక్కడ దొరికిన 50 లక్షలపై ఆరా తీస్తే డొంకంత కదిలిందని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో నడిచి రేవంత్ వేల కోట్లు సంపాదించారన్నారు. దేశ భక్తుడినని చెప్పుకునే ఉత్తమ్.. హవాలా మార్గంలో డబ్బులు సంపాదించిన రేవంత్ను ఎందుకు సమర్థిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. (రేవంత్ ఇంట్లో సోదాలు) రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల విషయంలో కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. రేవంత్ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించి రాహుల్ గాంధీ తన సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ స్టువర్ట్ పురం దొంగల ముఠాగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలవి అని కుంభకోణాలమయమని దుయ్యబట్టారు. 40 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి, జైపాల్ రెడ్డి మీద సోదాలు జరగడం లేదని.. కేవలం అక్రమంగా సంపాదించిన రేవంత్ రెడ్డిపైనే ఐటీ దాడులు జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఐటీ దాడులకు టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీఆర్ఎస్ ఎంపీ స్పష్టం చేశారు. చదవండి: రేవంత్కు అరెస్ట్ భయం..! ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా? -
కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్దాంతం చేస్తోంది
-
మైనార్టీల అభివృద్ధికి కృషి
మంచిర్యాలటౌన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక, మొదటిసారి ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ, మైనార్టీ ప్రజల అభివృద్ధికి తీవ్ర కృషి చేస్తోందని రాష్ట్ర ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని క్వారీ రోడ్డులో 2 వేల గజాల స్థలంలో నిర్మించనున్న క్రిస్టియన్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి పునాది రాయి వేసి, జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీతో కలిసి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం పటేల్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన క్రిస్టియన్ మైనార్టీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు మైనార్టీలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. దేశం మొత్తమ్మీద మైనార్టీలకు రూ.4,700 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించిందని చెప్పారు. గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనార్టీ ప్రజలను అస్సలు పట్టించుకోలేదని, అందుకే పూర్తిగా వెనకబడి పోయారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మేరకు 206 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించామని, ఒక్కో విద్యార్థిపై గతంలో రూ.20 వేలను ఖర్చు చేయగా, ప్రస్తుతం తాము రూ.1.35 లక్షలు ఏడాదికి ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఫాదర్లకు వేతనాలు ఇవ్వాలని పలువురు క్రిస్టియన్లు కోరుతున్నారని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరవ వేతనం ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్ మాట్లాడుతూ క్రిస్టియన్ల కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, మంచిర్యాలలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.57.50 లక్షలు కేటాయించారని, తన నిధుల నుంచి రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ బాల్క సుమన్ తన నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తానని హామీనిచ్చారు. ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వివేకానంద మాట్లాడుతూ తన తండ్రి వెంకటస్వామి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్తు ద్వారా రూ.3 లక్షలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జి అరిగెల నాగేశ్వర్రావు, తాజా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, బెల్లంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ ఆర్గనైజర్ అత్తి సరోజ, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, ఐక్య క్రిస్టియన్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు చల్లగుల్ల విజయశ్రీ, జిల్లా అధ్యక్షుడు సామ్యేల్, ప్రదాన కార్యదర్శి రజిని కుమార్, కల్వరి వ్యవస్థాపకుడు ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. ముస్లింలకు ప్రత్యేక పాఠశాలలు ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని షాదీఖానా ముస్లిం మైనార్టీ ఫంక్షన్హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు జుల్ఫేకర్, మీనాజ్, షఫి, బద్రుద్దీన్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. -
ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతి
సాక్షి, హైదరాబాద్/జైపూర్: టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో మంచిర్యాల జిల్లా చెన్నూరు టికెట్ను నల్లాల ఓదెలుకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆత్మహత్యకు యత్నించిన రేగుంట గట్టయ్య (32) మలక్పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చెన్నూరు టికెట్ తనకు కాకుండా ఎంపీ బాల్క సుమన్కు ఇవ్వడంతో ఓదెలు ఈ నెల 11న మందమర్రిలోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలసి స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 12న జైపూర్ మండలం ఇందారంలో అభివృద్ధి పనులకు భూమిపూజతో పాటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఎంపీ బాల్క సుమన్ వచ్చారు. ఈ కార్యక్రమంలో ఓదెలు అనుచరుడు, ఇందారం గ్రామానికి చెందిన గట్టయ్య పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకున్న గట్టయ్యకు మహిళల మంగళహారతుల నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గట్టయ్య సహా 16 మందికి గాయాలయ్యాయి. 60 శాతానికిపైగా కాలిన గట్టయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ నెల 13న మలక్పేట యశోదకు మార్చారు. కాగా, చికిత్సపొందుతూ మంగళవారం గట్టయ్య మృతి చెందాడు. ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. గట్టయ్యకు భార్య విజయ, కుమార్తె సాయినివేదిత(5), కుమారుడు సాయివిజ్ఞేశ్(3) ఉన్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఉస్మానియా ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గట్టయ్య ఇద్దరు పిల్లల పేరిట రూ. 5 లక్షల చొప్పున బ్యాంక్లో డిపాజిట్ చేస్తానని తెలిపారు. ప్రభుత్వపరంగా వచ్చే ఎక్స్గ్రేషియా మంజూరయ్యేలా చూస్తానన్నారు. మృతుడి భార్యకు ప్రభుత్వ లేదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పించి అతని కుటుంబాన్ని అన్ని వి««ధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
టీఆర్ఎస్ కార్యకర్త రేగుంట గట్టయ్య మృతి
-
పాపం గట్టయ్య..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ కార్యకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య మృతి చెందారు. ఓదెలుకు చెన్నూరు టికెట్ ఇవ్వలేదని గట్టయ్య ఈ నెల 12న పెట్రోలు పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. గట్టయ్యకు ఉస్మానియాలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించనున్నారు. (నల్లాల ఓదేలు అనుచరుల ఆత్మహత్యాయత్నం) పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్కు చెన్నూర్ టీఆర్ఎస్ టికెట్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెట్రోలు పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఘటన ఇటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు..అటు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అనాలోచిత నిర్ణయం, ఆవేశంతో ఇందారం గ్రామానికి చెందిన తెలంగాణ ఎమ్మార్పీఎస్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు రేగుంట గట్టయ్య ఓదెలుపై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెటు ఇవ్వకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. చదవండి: మెత్తబడ్డ ఓదెలు -
చంద్రబాబుపై బాల్కసుమన్ సంచలన ఆరోపణలు
-
చంద్రబాబు దొంగల ముఠాను తెలంగాణకు పంపారు
-
చంద్రబాబుపై బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడంపై టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దొంగల ముఠాను ఏర్పాటు చేసి తెలంగాణకు పంపారని ఆరోపించారు. శనివారం ఆయన సీనియర్ నేత గట్టు రామచంద్రరావుతో కలిసి తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. అక్రమ సంపాదనను తెలంగాణలో ఖర్చుపెట్టి తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ నడుస్తోందని, దీనిపై గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. వారు స్పందించకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలే వెంటపడి తరిమేలా ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఇన్నాళ్లు చంద్రబాబుపై కేసులు వేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చంద్రబాబు చేతులు పట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఏజేంట్లు కొంత మంది కాంగ్రెస్లో ఉన్నారన్నారు. చంద్రబాబు కుట్రలకి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు చేసిన ఆక్రమాలకు నాలుగైదు సార్లు జీవిత ఖైదు శిక్ష వేసినా సరిపోదన్నారు. ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబును టీడీపీ నుంచి తరిమేయాలన్నారు. చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసుపెడితే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని ఎందుకు అడగాలని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలు ఆపకపోతే ఆయనను తరిమికొట్టే పరిస్థితి వస్తుందని బాల్కసుమన్ హెచ్చరించారు. చంద్రబాబును ఏపీ ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారని వారికి సేవ చేయాలని సూచించారు. అక్కడి ప్రజల సొమ్ముతోనే ఏపీ పోలీసులకు జీతాలు వస్తున్నాయని, వారిని రక్షించడానికే పనిచేయాలన్నారు. చదవండి: తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్! -
బాల్క సుమన్పై నల్లాల ఓదేలు ఫైర్
-
సుమన్ చరిత్ర బయటపెడతా: ఓదేలు
వరంగల్ అర్బన్: చెన్నూరు అసెంబ్లీ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కేటాయించకపోవడంతో ఆయన అనుచరుడు నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఆత్మహత్యాయత్నం చేసిన గట్టయ్యను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గట్టయ్యను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి బాల్క సుమన్పై మండిపడ్డారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారిపై హత్యాయత్నం కేసు పెట్టించడం దారుణమన్నారు. తన వర్గానికి సంబంధించిన వారు బాల్క సుమన్పై దాడి చేయలేదని స్పష్టం చేశారు. స్థానికేతరుడికి టికెట్ కేటాయించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. దాడి చేయించాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించారు. తాను ప్రజల మధ్య ఉండి రాజకీయం చేస్తానే తప్ప ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడనని చెప్పారు. బాల్క సుమన్ గురించి ఓయూ విద్యార్థులకు తెలుసునని విమర్శించారు. సుమన్ జీవిత చరిత్రను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు బయట పెడతానని తెలిపారు. తనను మానసిక క్షోభకు గురిచేసేందుకే తనపై కుట్రలు చేస్తున్నారని వాపోయారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గట్టయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
ఓదెలు ఆశలపై పెట్రోల్ మంట!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘అదృష్టం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది’ ఈ తెలుగు సామెత చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పరిస్థితికి చక్కగా సరిపోతుంది. చెన్నూర్లో మూడుసార్లు గెలిచి ప్రభుత్వ విప్గా నాలుగేళ్లు బాధ్యతలు నిర్వర్తించిన నల్లాల ఓదెలును దురదృష్టం వెంటాడి ఈసారి సీటు గల్లంతైన విషయం తెలిసిందే. తన సీటును తనకివ్వాలని ఆయనతో పాటు అనుచరులు కూడా గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆవేశపూరితంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ ఇందారంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్కు చెన్నూర్ టీఆర్ఎస్ టికెట్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందారానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు, మాజీ వార్డు మెంబర్ రేగుంట గట్టయ్య బుధవారం మధ్యాహ్నం ఇందారంలో పెట్రోల్ సీసాతో హల్చల్ చేశాడు. రాజీవ్ర హదారి నుంచి ఇందారం గ్రామానికి వెళ్లే దారిలో ఓ సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి సుమన్ భూమిపూజ చేసి, ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి రాగా, మహిళలు హారతి పడుతున్నారు. అదే సమయంలో లీటరు పెట్రోల్ సీసాతో వచ్చిన రేగుంట గట్టయ్య జై కేసీఆర్.. జై ఓదన్న అని నినాదాలు చేస్తూ పెట్రోల్ పోసుకునేయత్నంలో సీసాను గట్టిగా ఒత్తడంతో పెట్రోల్ తనపైనే కాకుండా అక్కడున్న పలువురు నాయకులు, మహిళలపై పడింది. అతడు ఉద్దేశపూర్వకంగా చేశాడో, భయపెట్టేందుకు చేస్తున్నాడో తెలియకపోయినా... పెట్రోల్ మహిళల చేతుల్లోని హారతులపై పడడంతో ఒక్కసారిగా మంటలు లేచాయి. పెట్రోల్ పట్టుకొచ్చిన గట్టయ్యకు మంటలు అంటుకోగా, శ్రీరాంపూర్ సీఐ నారాయణ్నాయక్, మహ్మద్ జైనుద్దీన్ పక్కన ఉండడంతో సుమన్కు ప్రమాదం తప్పింది. సుమన్ను అక్కడినుంచి నారాయణ్ నాయక్ తోసివేయడంతో ఎలాంటి గాయం కాలేదు. అదే సమయంలో జైనుద్దీన్కు తీవ్ర గాయాలు కాగా, సీఐ నారాయణ్ నాయక్ చేతికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు సానుభూతిని కాకుండా వ్యతిరేకతకు కారణం కావడం గమనించాల్సిన విషయం. అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్న సుమన్ ఈ సంఘటనను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఎంపీ సుమన్ సఫలమయ్యారు. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న సుమన్ తనను హత్య చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే గట్టయ్య పెట్రోల్ చిమ్మాడని ఆరోపించారు. అదే సమయంలో మరో వ్యక్తి అగ్గిపెట్టెతో సిద్ధంగా ఉన్నట్లు ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడుతూ చెప్పారు. తనను హతమార్చే ఉద్శేంతోనే పెట్రోల్తో ఒకరు, అగ్గిపెట్టెతో మరొకరు కార్యక్రమానికి హాజరైనట్లు ఆయన వివరించారు. పెట్రోల్ పోయగానే వేరే వ్యక్తి అగ్గిపెట్టె వెలిగించాల్సి ఉండగా, మంగళహారతి కారణంగా మంటలు లేసి కాలిపోవడం జరిగిందని వివరించారు. జైనుద్దీన్, సీఐ నారాయణ నాయక్ తనను కాపాడారని, వారు లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదురయ్యేవని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఆ తర్వాత జైపూర్లో మీడియాకు చెప్పిన సుమన్, చెన్నూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కూడా స్పష్టం చేశారు. తనకు టికెట్టు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక ఓదెలు వర్గం చేస్తున్న ఈ ప్రయత్నాలను ఎదుర్కొంటానన్నారు. కేసీఆర్ శిష్యుడిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తానని చెప్పుకొచ్చారు. కాగా తనపై హత్యాయత్నం జరిగినట్లు సుమన్ ప్రకటించగా, శివ్వారం గ్రామ మాజీ సర్పంచ్ విశ్వాంబర్రెడ్డి పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 307 కింద హత్యాయత్నం కేసు నమోదైంది. ఇదంతా చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు చిక్కులు తెచ్చేదిగా తయారవడం గమనార్హం. స్వీయ గృహ నిర్బంధంపై పార్టీ సీరియస్ చెన్నూర్ అభ్యర్థిగా సుమన్కు టికెట్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ మంగళవారం నల్లాల ఓదెలు మందమర్రిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వీయ గృహ నిర్బంధం విధించుకొని నిరసన వ్యక్తం చేశారు. తనకేమైనా సీఎం కేసీఆర్దే బాధ్యత అని మీడియాకు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం ఓదెలు ప్రయత్నాన్ని విరమింపజేయాల్సిందిగా రాజ్యసభ ఎంపీ సంతోష్కుమార్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిలను ఆదేశించారు. ఇంద్రకరణ్రెడ్డి మందమర్రికి వచ్చి ఓదెలును కలవాల్సి ఉన్నప్పటికీ, కొండగట్టులో బస్సు ప్రమాదం సంఘటన నేపథ్యంలో ఆయన రాలేదు. ఈ పరిస్థితుల్లో ఎంపీ సంతోష్కుమార్ ఓదెలుకు ఫోన్ చేసి బుధవారం ప్రగతిభవన్లో అందుబాటులో ఉండాలని చెప్పారు. దాంతో ఓదెలు నిరసన విరమించారు. అయితే ఓదెలు చర్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో సీఎం కేసీఆర్ సీరియస్గా ఉన్నట్లు సమాచారం. సీఎంను కలవని ఓదెలు.. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతిభవన్కు బుధవారం ఉదయమే వెళ్లిన ఓదెలుకు మధ్యాహ్నం 3గంటలకు సీఎం అపాయింట్మెంట్ లభించినట్లు సమాచారం. దీంతో ఆయన వేచిచూస్తున్న సమయంలోనే ఇందారం సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు కారణమైన రేగుంట గట్టయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు సమాచారం రావడంతో ఓదెలు సీఎంను కలవకుండానే వరంగల్ బయలుదేరి వెళ్లారు. ఈ సంఘటనల నేపథ్యంలో ఓదెలుపై చర్యలు తీసుకునేందుకు కూడా పార్టీ వెనుకాడకపోవచ్చని సమాచారం. -
సుమన్కు సెగ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ఎంజీఎం: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ప్రచారంలో అపశ్రుతి చోటు చేసుకుంది. సుమన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జైపూర్ మండలం ఇందారం నుంచి తొలిసారిగా ప్రచారం ప్రారంభించేందుకు బుధవారం నియోజకవర్గానికి వచ్చిన సుమన్కు స్వాగతం పలికే సందర్భంలో పెనుప్రమాదం తప్పింది. సుమన్కు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ గట్టయ్య ఒంటి మీద పెట్రోల్ పోసుకోవడంతో పాటు సుమన్పైకి చిమ్మేందుకు చేసిన ప్రయత్నంలో మంగళహారతులపై పడి మంటలు రేగాయి. దీంతో గట్టయ్యతో పాటు 16 మందికి గాయాలయ్యాయి. సుమన్పై పెట్రోలు పడకుండా శ్రీరాంపూర్ సీఐ నారాయణనాయక్, సుమన్ అనుచరుడు జైనుద్దీన్ అడ్డుగా నిలిచారు. తీవ్రంగా గాయపడ్డ గట్టయ్యను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సీఐ నారాయణనాయక్, ఫొటోగ్రాఫర్లు అనీష్, శ్రీకాంత్లను మంచిర్యాల లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పథకం ప్రకారమేనా..!: చెన్నూర్లో ప్రచారానికి సుమన్ బుధవారం ఉదయం 11.40కు ముహూర్తం నిర్ణయించుకున్నారు. డీఎంఎఫ్ నిధులతో ఇందారం గ్రామంలో రూ.1.20 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించేందుకు వెళ్లారు. మహిళలు సుమన్కు హారతి పట్టేందుకు రాగా, అక్కడికి చేరుకున్న ఇందారం గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నేత గట్టయ్య చేతిలో పెట్రోల్ సీసాతో ప్రత్యక్షమయ్యాడు. ఏం జరుగుతుందో తెలిసేలోగానే ‘జై కేసీఆర్.. జై ఓదెన్న’అని నినాదాలు చేస్తూ పెట్రోల్ను ఒంటిపై పోసుకున్నాడు. గట్టయ్య తన నోట్లో పడ్డ పెట్రోల్ను సుమన్పైకి ఉమ్మినట్లు సాక్షులు చెబుతున్నారు. మంగళహారతులపై పెట్రోల్ పడటంతో మంటలు రేగాయి. గట్టయ్య కాలిపోతూ పరిగెత్తుతుండగా పోలీసులు మంటలు ఆర్పే ప్ర యత్నం చేశారు. ఘటనను సుమన్పై జరిగిన హత్యాయత్నంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నాపై జరిగిన హత్యాయత్నం: బాల్క సుమన్ తనపై జరిగిన హత్యాయత్నంలో భాగంగానే ఓదెలు వర్గం పెట్రోల్తో దాడి చేసిందని బాల్క సుమన్ ఆరోపించారు. చెన్నూర్ టికెట్ను కేసీఆర్ తనకు కేటాయించారని.. ఎవరు అడ్డుపడినా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సుమన్వి నీచరాజకీయాలు: ఓదెలు బాల్కసుమన్ నీచ రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కోరారు. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గట్టయ్యను ఓదెలు పరామర్శించారు. -
నాపై హత్యాయత్నం : బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల : చెన్నూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ, విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి చేసి చంపాలనుకుంటున్నారని, తాను చస్తే చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే తాను చావడానికి కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. ‘నా పైన దాడి చేసి నన్ను చంపాలి అనుకున్నారు. నేను చస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే నేను చావడానికి సిద్ధం’ అని పేర్కొన్నారు. జైపూర్ మండలం ఇందారంలో బుధవారం బాల్క సుమన్ ఓ కార్యక్రమం శంకుస్థాపన చేసేందుకు రాగా.. ఆయనకు వ్యతిరేకంగా ఓదెలు అనుచరులు ఆత్మహత్యాయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బాల్క సమన్ మీడియాతో ఓదెలు వర్గం చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని, టికెట్ ఇచ్చాక మొదటిసారి నియోజకవర్గంలో కాలుపెడితే తనపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదేశం మేరకే తాను చెన్నూర్ నియోజకవర్గం నుండి పోటీలోకి దిగుతున్నానని తెలిపారు. సీనియర్ నేత వివేక్ పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి వీలుగా.. ఆ టికెట్ ఇచ్చేసి.. చెన్నూర్ నియోజకవర్గం నుండి పోటీకి దిగాలని అధిష్టానం ఆదేశించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తాను వివేక్ను, ఆయన సోదరుడు వినోద్ను కలిసి సహకరించాలని కోరానని, అందుకు వారు సానుకులంగా స్పందించారని తెలిపారు. నల్లాల ఓదెలును కూడా హైదరాబాద్లో కలిసి సహకరించాల్సిందిగా కోరానని చెప్పారు. నిజమబాద్ నుండి జగ్దల్పూర్ రహదారికి నిధులు వచ్చేలా చేసి చెన్నూర్ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. నల్లాల ఓదేలు అనుచరుల ఆత్మహత్యాయత్నం చెన్నూరు ఎమ్యెల్యే టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నల్లాల ఓదేలుకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆయన అనచరులు ఆత్మహత్యాయత్నం చేశారు. జైపూర్ మండలం ఇందారంలో బుధవారం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పాల్గొన్న ఓ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ రాకను తెలుసుకున్న ఓదేలు అనుచరులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ బాల్కసుమన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఘట్టయ్యా అనే కార్యకర్త తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్ను ఒంటిపై పోసుకోని నిప్పంటించుకున్నాడు. అతని పక్కనే ఉన్న మరో నలుగురికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అక్కడున్నవారు వారి మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొని భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు అక్కడున్న వారిని అరెస్ట్ చేసి శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. -
జైపూర్ మండలం ఇందారంలో ఉద్రిక్తత
-
అసెంబ్లీకి బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఊహాగానాలకు తెరదించుతూ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడంతో పాటు 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాదాపు అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఖరారు చేసిన గులాబీ అధినేత.. పార్టీలోకి కొత్తగా చేరిన వారి కోసం కొన్ని మార్పులు చేశారు. ముందుగా ఊహించినట్లుగానే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ను అసెంబ్లీకి పంపేందుకే నిర్ణయించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా సుమన్ను ప్రకటించారు. చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టికెట్ నిరాకరించి.. ఆ స్థానాన్ని సుమన్కు కట్టబెట్టారు. మాజీ ఎంపీ గడ్డం వివేక్ తిరిగి టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో.. వివేక్ లోక్సభకు పంపించేందుకే బాల్క సుమన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్లోకి వచ్చిన వివేక్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ఆయన స్థానంలో గత ఎన్నికల్లో విద్యార్థి నాయకుడైన సుమన్కు కేసీఆర్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వివేక్పై సుమన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వివేక్ మళ్లీ టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ను ఖరారు చేసినట్టు కథనాలు వచ్చాయి. ఈ సర్దుబాటులో భాగంగానే సుమన్ అసెంబ్లీకి పంపినట్టు వినిపిస్తోంది. ఇక, పెద్దపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మోహన్రెడ్డికి మరోసారి టికెట్ కన్ఫామ్ చేశారు. -
కాంగ్రెస్ నేతలకు కడుపుమంట
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ బహిరంగసభ పెడితే కాంగ్రెస్ నేతలకు భయంతో, బాధతో కడుపు మం డుతున్నట్టు ఉందని ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడిక్కడ విలేకరులతో వారు మాట్లాడుతూ, సభ విజయవం తం కావడంతో భవిష్యత్తు అంధకారమైన కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్లో కొత్త బిచ్చగాడు రేవంత్రెడ్డి, పాత బిచ్చగాడు మధుయాష్కీ, గడ్డం బాబా ఉత్తమ్, బొమ్మాళి డీకే అరుణ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సుమన్ విమర్శించారు. టీఆర్ఎస్ సభలలో పల్లీలు, వాటర్ పాకెట్లు అమ్ముకునే వారి సంఖ్యకన్నా ఇటీవల రాహుల్గాంధీతో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభలో తక్కువ జనం ఉన్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్పై తిట్లు, శాపనార్ధాలు ఆపకుంటే కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అవుతుందని, చాలామందికి డిపాజిట్లు రావని హెచ్చరించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్కు అధికారంలో లేకుంటే నిరుద్యోగులు గుర్తుకువస్తారా అని సుమన్ ప్రశ్నిం చారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ, సభ విజయవంతం కావడంతో వారికి భయం పట్టుకుందన్నారు. రాహుల్గాంధీ, సోనియాగాంధీతో ఇంత పెద్ద సభ పెట్టగలరా అని సవాల్ చేశారు. టీఆర్ఎస్ వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఐటీఐఆర్ విషయంలో కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని, వారి అసమర్థత వల్లనే ఐటీఐఆర్ రాకుండా పోయిందన్నారు. -
కాంగ్రెస్ పార్టీవి చిల్లర రాజకీయాలు: బాల్క
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. ఎమ్మెల్యే దివాకర్రావుతో కలసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో జేడీయూకు టీఆర్ఎస్ మద్దతివ్వడంపై కాంగ్రెస్ నేతలు పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నారని మండిపడ్డారు. బిహార్ సీఎం నితీశ్కుమార్ అభ్యర్థించడంతో టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్కు మద్దతివ్వాలని ఒక్క కాంగ్రెస్ నేత అయినా అడిగారా అని ప్రశ్నించారు. టీడీపీ ముందు, చంద్రబాబు ముందు కాంగ్రెస్ మోకరిల్లిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. బీజేపీతో టీఆర్ఎస్కు స్నేహం లేదని, టీఆర్ఎస్ లౌకిక పార్టీ అని చెప్పారు. ఉద్యమంలో విద్యార్థులను కొట్టించిన కాంగ్రెస్ నేతలు ఓయూకి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. రాహుల్గాంధీని ఓయూ కి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్కు లేదన్నారు. ఓయూ వీసీ అనుమతి ఇవ్వకుంటే టీఆర్ఎస్కు ఏం సంబంధమని ప్రశ్నిం చారు. కేసీఆర్ కుటుంబం ఆదానీ ఆస్తులను మించిపోయిందంటూ రేవంత్ మాట్లాడటం సరికాదని, ఆధారాలు లేకుండా మాట్లాడితే ఖబడ్దార్ అని రేవంత్ను ఆయన హెచ్చరించారు. -
హైదరాబాద్కి వస్తే ఏంటి.. ఎర్రగడ్డకు వస్తే మాకేంటీ?
సాక్షి, హైదరాబాద్ : దేశంలో చిన్న సైజు ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్ మారిందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. టీడీపీ ముందు కాంగ్రెస్ మోకరిల్లిందని విమర్శించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాహుల్ పర్యటనను అడ్డుకునే అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. రాహుల్ హైదరాబాద్కి వస్తే మాకేంటీ.. ఎర్రగడ్డకు వస్తే మాకేంటని ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఖబర్ధర్ అని హెచ్చరించారు. ఓయూ వీసీ రాజకీయ పార్టీల సభలకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో ఒక ఎమోషన్ను రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను కొట్టించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలు పాటించని సిగ్గుమాలిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. అందుకే ఎన్డీయేకు మద్దతు ఇచ్చాం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల విషయం లో జేడీయూకి సపోర్ట్ చేయమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పోన్ చేసి ఆడిగారని అందుకే మద్దతు ఇచ్చామన్నారు. కాంగ్రెస్కు మద్దతు ఇవ్వమని ఏ ఒక్క నాయకుడు అయినా అడిగారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులది అహంకార ధోరణి అని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పని చేస్తే.. వాటిని ఎలా అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. -
‘మోదీ రాజ్యంలోదళితుల స్థానం ఎక్కడ?’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యంలో దేశంలోని దళితులు, గిరిజనులు, మైనారిటీల స్థానం ఎక్కడుందో చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దళితులను ఎలా విస్మరించారో అలాగే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం వెళుతోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సవరణ బిల్లు–2018పై జరిగిన చర్చలో బాల్క సుమన్ ప్రసంగించారు. మోదీ రాజ్యంలో దళితులు, గిరిజనులు, మైనారిటీల స్థానం ఎక్కడో ఆయన మన్కీబాత్లో చెప్పాలని హితవు పలికారు. గత పదేళ్లలో దళితులపై దాడులు 66 శాతం పెరిగాయని, ప్రతి 15 నిమిషాలకో దాడి, రోజూ ఆరుగురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టులను, కేసుల నమోదు నిబంధనలను సుప్రీం కోర్టు సడలించడం తనను తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి దళితుల పక్షాన కేంద్రం నిలవాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. 27 ఏళ్ల కింద ఉమ్మడి ఏపీలోని చుండూరులో 13 మంది దళితులను ఊచకోత కోస్తే ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదని వాపోయారు. అలాంటిది ప్రస్తుతం సమాజంలో కొందరు రిజర్వేషన్లు దేనికి అని ప్రశ్నించడం బాధాకరమన్నారు. దేశంలోని దళితులు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం పొంది, సమానత్వంతో ఉన్నామన్న భావన కలిగే దాకా రిజర్వేషన్లు ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి వివాదాస్పద తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఒకరిని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్మన్గా నియమించడాన్ని తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వానికి దళితులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్జీటీ చైర్మన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయవ్యవస్థ ఉన్నత హోదాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని పేర్కొన్నారు. పార్లమెంట్కే పోటీ చేస్తా: బూర సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో భువనగిరి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ఎయిమ్స్ ఏర్పాటు అయిన తర్వాత మొదటి ఆపరేషన్ చేయాలని ఉందని వెల్లడించారు. రాహుల్గాంధీ ప్రధాని నరేంద్రమోదీని కాకుండా, బీసీలని ఆలింగనం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో తోక పార్టీగా మారిందని, బీసీలకు అన్యాయం చేస్తే అదికూడా మిగలదన్నారు. భారతదేశంలో బీసీలు 50 శాతంపైగా ఉన్నారని, బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
బాల్క సుమన్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా భీభత్సం సృష్టించిన ఘటనలో మరో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నందినగర్ ఉంటున్న బాల్క సుమన్ ప్లాట్లోకి గత నెల మంచిర్యాలకు చెందిన శంకర్, విజేత, గోపాల్, సంధ్య, అక్రమంగా ప్రవేశించి ఆయన వ్యక్తిగత సహాకుడు సునీల్పై దాడికి యత్నించారు. ఎంపీని దూషించడంతో సునీల్ గతనెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం శంకర్, విజేతలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, పరారీలో ఉన్న గోపాల్, సంధ్యలను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత కథనాలు: బాల్క సుమన్ భార్య ఫొటో మార్ఫింగ్ ఎంపీ సుమన్పై వైరల్ కథనాలు: పోలీసుల స్పందన -
ఎంపీ, ఎమ్మెల్యేను బహిష్కరించాలి
బెల్లంపల్లి: నీతిమాలిన పనికి పాల్పడిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కుటుంబ సభ్యులను బెదిరించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరువురు ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి హేయంగా ఉందన్నారు. ఇద్దరి నిర్వాకం వల్ల జిల్లా పరువు, ప్రతిష్ట రాష్ట్రంలో దిగజారిపోయిందని విమర్శించారు. మున్సిపల్ కౌన్సిలర్ కొప్పుల సత్యవతి కూతురితో ఎమ్మెల్యే చిన్నయ్య ఫోన్లో బెదిరింపులకు పాల్పడడం, అసమ్మతి కౌన్సిలర్లను ఇబ్బందులకు గురి చేస్తామని హెచ్చరించడం దారుణమన్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలి పూర్తిగా ఆక్షేపనీయమన్నారు.ఎమ్మెల్యే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంపీ బాల్క సుమన్ ఇద్దరు మహిళలతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేయడం సరైంది కాదన్నారు. బాధిత మహిళలపై జనవరిలో ఎంపీని బ్లాక్ మెయిల్ చేసినట్లు కేసు పెట్టామని మంచిర్యాల పోలీసులు ప్రకటించడం ఎంపీకి కొమ్ముకాయడమే అవుతుందన్నారు. అప్పట్లో సదరు మహిళలపై కేసులు పెట్టినట్లు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై జ్యూడీషియల్ విచారణ జరిపించాలన్నారు. కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు సైతం ఓ ఎన్ఎస్యూఐ నాయకుడిని పరుష పదజాలంతో దూషించడం, బెదిరించడం సరైంది కాదన్నారు. ప్రేమ్సాగర్ రావుపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు డి.ప్రకాష్, కుసుమ భాస్కర్, కె.గోవర్ధన్, గట్టురాజం, అరుణ్కుమార్, సత్యనారాయణ రెడ్డి, రాజేశం తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ సుమన్పై వైరల్ కథనాలు: పోలీసుల స్పందన
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్పై రెండు రోజులుగా వైరల్ అవుతున్న కథనాలపై శనివారం బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. పోలీసులు కథనం ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఇంటికి వచ్చి దుర్భాలాషలాడారని గత నెల 7న ఎంపీ సహాయకుడు సునీల్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎంపీ సుమన్ను కలవాలన్నారని, ఆయన లేకపోవడంపై తనపై దౌర్జన్యానికి దిగినట్టు సునీల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సునీల్ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఎంపీ లైంగికంగా వేధించారని ఆరోపిస్తున్న ఇద్దరు మహిళలు విజేత, సంధ్యలపై ఆరు నెలల క్రితం మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు వెల్లడించారు. రిమాండ్ కూడా విధించారని, మంచిర్యాలలో రిమాండ్ పూర్తైన తర్వాత.. బయటకు వచ్చిన ఇద్దరు మరో ఇద్దరు యువకులతో కలిసి ఎంపీ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేసినట్టు విచారణ వెల్లడైందన్నారు. దీంత్ సునీల్ పోలీసులును ఆశ్రయించారన్నారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పద్ధతి మార్చుకోని సంధ్య.. ఫేస్బుక్లో సుమన్ తన భార్యాపిల్లలతో దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసి, ఆయన భార్య స్థానంలో తన ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి వాట్సాప్, ఫేస్బుక్లలో ‘బాల్క సుమన్పై లైంగిక వేధింపుల ఆరోపణ, ప్రధానికి ఇద్దరు జర్నలిస్టుల ఫిర్యాదు, బాధితులపై తప్పుడు కేసు నమోదు’ అంటూ ప్రచారం జరిగింది. -
ఎంపీ బాల్కసుమన్పై లైంగిక ఆరోపణలు అవాస్తవం
-
‘బాల్క సుమన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ను టీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు గజ్జెల కాంతం, ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో గజ్జెల కాంతం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాకు చెందిన సంధ్య, విజేత అనే మహిళలను శారీరకంగా లోబర్చుకున్నారని బాల్క సుమన్పై కేసు నమోదైందన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. -
ఆరోపణలు నిరూపిస్తే.. ఉరేసుకుంటా: సుమన్
సాక్షి, హైదరాబాద్: తన రాజకీయ ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేక బురద జల్లుతున్నారని ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. ఆరోపణలను రుజువు చేస్తే అంబేడ్కర్ విగ్రహం దగ్గర ఉరేసుకుంటానని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంచిర్యాలకు చెందిన వారు తనను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేశానని.. వారు కేసులు కూడా పెట్టా రని వెల్లడించారు. మహిళలపై గౌరవ మర్యాదలతో ఆరోపణలు చేస్తున్న వారిని బజారుకు ఈడ్చవద్దనే ఇప్పటిదాకా ఎలాంటి కామెంట్లు చేయలేదని తెలిపారు. ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ఈ ప్రచారం తనపై మానసిక దాడిగా పరిగణిస్తున్నానని.. ఆరోపణలను నిరూపిస్తే అంబేడ్కర్ సాక్షిగా ప్రాణత్యాగానికి సిద్ధమని సుమన్ సవాల్ చేశారు. -
బాల్క సుమన్ భార్య ఫొటో మార్ఫింగ్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఫేస్బుక్లో ఉన్న ఎంపీ బాల్కసుమన్ భార్య ఫొటోను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన బోయిని సంధ్య, బోయిని విజేత అక్కాచెల్లెళ్లు. వీరు కొంతకాలంగా ఎంపీ సుమన్కు ఫోన్కాల్స్, మెసేజ్ల ద్వారా ఇబ్బంది పెడుతున్నారు. ఇవి కాస్త శృతిమించడంతో జనవరి 27న ఎంపీ మంచిర్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు.. ఫిబ్రవరి 6న అక్కాచెల్లెళ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై వచ్చిన తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు రాలేదు. పైగా సుమన్ తనను పెళ్లి చేసుకున్నారని సంధ్య అసత్య ప్రచారం ప్రారంభించింది. ఈ క్రమంలో మే 31న హైదరాబాద్ నందీనగర్ లోని ఎంపీ ఇంటికి తన ఇద్దరు సోదరులు, సోదరితో కలసి వెళ్లి దౌర్జన్యం చేశారు. ఎంపీ సహాయకుడు సునీల్ ఫిర్యాదు మేరకు జూన్ 7న బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో నలుగురిపై కేసు నమోదు చేశారు. అయినా పద్ధతి మార్చుకోని సంధ్య.. ఫేస్బుక్లో సుమన్ తన భార్యాపిల్లలతో దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసి, ఆయన భార్య స్థానంలో తన ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి వాట్సాప్, ఫేస్బుక్లలో ‘బాల్క సుమన్పై లైంగిక వేధింపుల ఆరోపణ, ప్రధానికి ఇద్దరు జర్నలిస్టుల ఫిర్యాదు, బాధితులపై తప్పుడు కేసు నమోదు’ అంటూ ప్రచారం జరిగింది. ఎంపీపై అసత్య ప్రచారం: సీఐ ఎంపీ సుమన్ మహిళలను లైంగికంగా వేధించారని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సీఐ మహేశ్ తెలిపారు. జనవరి 18న కేసు నమోదు చేసుకొని విచారించగా ఎంపీ సుమన్ తన ఫేస్బుక్లో పెట్టిన ఫొటోలను సంధ్య, విజేత కాపీ చేశారని, ఆయన భార్య స్థానంలో సంధ్య ఫొటోలతో మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని తెలిపారు. ఈ మేరకు వారిద్దరిపై 420, 292ఎ, 419, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్కాచెల్లెళ్లు మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, చంద్రాపూర్కు చెందిన పలువురు వ్యాపారులు, వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు తేలిందని సీఐ వివరించారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాల్లో పెట్టి ప్రచారం చేసే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ బాల్క సుమన్,సంతోష్
-
ఎంపీ బాల్క సుమన్పై ఆరోపణలు.. స్పష్టత
పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు కొన్ని మీడియా సంస్థలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు మహిళలపై ఎంపీ లైంగిక దోపిడీకి పాల్పడ్డారంటూ ప్రధానికి పాత్రికేయుల లేఖ రాశారంటూ ఓ కథనం చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించారు. సాక్షి, మంచిర్యాల: టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మంచిర్యాల సీఐ మహేష్ శుక్రవారం ఉదయం ప్రెస్మీట్ నిర్వహించారు. ‘ఎంపీ బాల్క సుమన్పై వైరల్ అవుతున్న లైంగిక వేధింపుల ఘటన అవాస్తవం. బాధితులుగా చెప్పుకుంటున్న బోయిని సంధ్య, విజేతలు గతంలోనూ పలువురిని బ్లాక్మెయిల్ చేసి వేధించినట్లు మా విచారణలో వెల్లడైంది. ఎంపీపై ఆరోపణలకుగానూ వారిద్దరిపై ఫిబ్రవరి 6న కేసు నమోదు చేశాం. ఇప్పుడు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లోనూ వారిపై కేసులు నమోదు అయ్యాయి. ఎంపీని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ ద్వారా డబ్బు గుంజాలని యత్నించారు. అందులో భాగంగానే ఎంపీ కుటుంబ సభ్యుల ఫోటోను నిందితులు మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో సర్క్యూలేట్ చేశారు’ అని సీఐ మహేష్ వెల్లడించారు. సంధ్య, విజేతలపై ఐపీసీ 420 , 292ఏ , 419 , 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
స్వయంపాలనతో స్వర్ణయుగం
2014, జూన్ 2 తెలంగాణ చరిత్రలో మైలురాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. రాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. తన పాలనా దక్షత, పట్టుదల, దూరదృష్టి, తన ప్రజానీకంపై ప్రేమతో తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్వన్గా మార్చేందుకు, ప్రజా సంక్షేమమే పరమావధిగా జనరంజక పాలన సాగిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తున్నారు. ఈ నాలుగేళ్లలో అందరి మన్ననలు అందుకున్నారు. అందుకే ఇప్పుడు యావత్ భారతదేశం తెలంగాణవైపు చూస్తోంది. స్వయం పాలనతో స్వర్ణయుగం / ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగెనో / ఎండిన చెలిమె నిండిన అనుభూతి కలిగెనో / శరవెట్టినట్టి 60 ఏళ్ల బలిమి ఓడెనో / కల నిజమాయెనని నేల తనను తడుముకున్నదో / వేరువడ్డ తెలంగాణ పేరు మోగగా / ఎగసిపారే గోదావరి మురిపెమంపెనో / తనువార నీళ్లనిస్తనని అభయమొసగెనో / అణువణువున తరుమడుల సిరులు దొర్లనున్నయో /పరుగూల రాణి కృష్ణవేణి దారి మళ్లగా / కరువన్నదింక నిఘంటువుల దాగనున్నదో / ఐదేండ్లలో అటుఇటై ఇడుములొచ్చినా / పదేండ్లలో జపానోలే ప్రగతి విరుయునో.... ఇదీ ప్రజాకవి గోరటి వెంకన్న స్వరాష్ట్రంలో స్వయం పాలనపై రాసిన పాట. ప్రపంచంలో ప్రతి ప్రాంతానికీ ఓ కథ ఉంటుంది. కానీ కొన్నింటికి మాత్రమే చరిత్రలో స్థానం దక్కుతుంది. దశాబ్దాల తరబడి పరాయిపాలనలో మగ్గి, శాంతియుత ఉద్యమంతో స్వరాష్ట్రాన్ని సాధించుకుని, అద్భుతరీతిలో అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ కథ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగినది. సవాళ్లను ఎదుర్కొంటూ, అవాంతరాలను అధిగమిస్తూ ప్రజాసేవే పరమావధిగా ముందుకెళ్తున్న ఆయన పాలనలో తమమార్కు చూపిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 2014 జూన్ 2. తెలంగాణ చరిత్రలో మైలు రాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోసపడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. స్వరాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి... నేటి రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తి కాబోతోంది. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ కష్టాలకు కొదవ లేదు. వాటి గురించి రాస్తే రామాయణం చెబితే భారతం. పాలకుల శీతకన్ను తెలంగాణకు శాపంగా మారింది. వ్యవసాయం కుంటుపడింది. రైతులు కూలీలయ్యారు. కూలీలు రోడ్డున పడ్డారు. కానీ స్వరాష్ట్రం సిద్ధించి కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టిన ఈ 4 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 6 దశాబ్దాల సమైక్య పాలనలో అభివృద్ధి అందనంత దూరంలో నిలిచిన తెలంగాణ నాలుగేళ్లలోనే ప్రగతి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్రం విడిపోతే తెలం గాణ అంధకారమవుతుంది. నీళ్లు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించిన వారి నోళ్లు మూయించింది. చిమ్మ చీకట్లు అలముకున్న దుస్థితి నుంచి నాలుగేళ్లలో వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరించడానికి సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. విద్యుత్ లోటుతో అల్లాడుతున్న రాష్ట్రం ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారింది. ఇప్పుడు కరెంటు కోతలు లేవు. పవర్ హాలిడేలను నిరసిస్తూ పారిశ్రామికవేత్తల ఆందోళనలు లేవు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. పరాయి పాలనలో బీడువారిన భూములకు కృష్ణా, గోదావరి నీళ్లు పారించేందుకు కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేశారు. ఆ నదుల్లో తెలంగాణ వాటా 1330 టీఎంసీల నీళ్లను తెలంగాణ బీడు భూములకు మళ్లించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, సీతారామ, తుపాకులగూడెం, ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్లో ఎస్సారెస్పీకి నీళ్లు తరలించే బృహత్తర కార్యక్రమంతో పాటు మిగతా ప్రాజెక్టులన్నీ శరవేగంగా పూర్తి చేస్తోంది. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలో నదీజలాల పంపిణీ విషయంలో వివిధ రాష్ట్రాల మధ్య వివాదాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జలాలు– కేరళ, తమిళనాడు మధ్య ముళ్ల పెరియార్ డ్యాం వివాదాలే ఇందుకు ఉదాహరణ. అయితే గోదావరి జలాల విషయంలో కేసీఆర్ చూపిన చొరవతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య చారిత్రక ఒప్పందం సాధ్యమైంది. ఈ మహా ఒప్పందం కేసీఆర్ రాజనీతిజ్ఞతకు నిదర్శనం. దేశంలో ఇతరులకు ఆదర్శం. నీటి పారుదల శాఖకు ప్రతి సంవత్సరం దాదాపు 25వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వ తపనను ప్రపంచం గమనిస్తోంది. మిషన్ కాకతీయ పేరుతో 46 వేల చెరువుల్లో పూడికతీసే బృహత్తర కార్యాన్ని నాలుగు దశల్లో అమలుచేస్తోంది. చెరువులకు జీవం పోసే ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయ పథకాన్ని నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థితో పాటు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ ప్రశంసించారు. వ్యవసాయం దండగ కాదు పండగలా మార్చాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ సర్కారు రైతు సంక్షేమమే థ్యేయంగా పనిచేస్తోంది. దాదాపు 17 వేల కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ చేసింది. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన కరెంటును అందిస్తోంది. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తోంది. దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించింది. మద్దతు ధర కోసం, రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసింది. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రం కూడా సాహసించని పథకానికి శ్రీకారం చుట్టింది. రైతు బంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. ఏటా 12 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఈ పథకం ద్వారా 58 లక్షల మందికిపైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం మరో బృహత్తర పథకాన్ని అమలుచేసేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 15 నుంచి ప్రతి రైతుకు 5 లక్షల రూ‘‘ల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పిం చారు. రైతుల కోసం కేసీఆర్ చేస్తున్న ఈ కార్యక్రమాలను చూసి దేశం అబ్బురపడుతోంది. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రమే కాదు కిసాన్ చంద్రశేఖర్ రావు అని యావత్ దేశం కీర్తిస్తోంది. 42,300 కోట్లతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారు. మంచినీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యంగా భావించిన సర్కారు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీరందించేందుకు సమాయత్తమైంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథను ప్రధానమంత్రి, నీతి ఆయోగ్, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల అధికారులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ సమాజంలో 91 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలు– కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఏర్పాటు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, భూపంపిణీ, ఆసరా పెన్షన్లు, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు, ఎస్సీ–ఎస్టీ ప్రత్యేక ప్రగతినిధి చట్టం, రిజర్వేషన్ల పెంపుకై అసెంబ్లీ తీర్మానం, హైదరాబాద్ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు (125 అడుగులు), గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, నవీన క్షౌరశాలలు, చేనేతలకు చేయూత లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అంటూ పాడుకున్న జనం ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల ఫలితంగా సర్కారు దవాఖానాల్లోనూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతోంది. కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ఆర్థిక సాయం అందిస్తుండటంతో భ్రూణహత్యలు తగ్గాయి. జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు, ఐసీయూలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగేళ్లలో కొత్తగా 577 రెసిడెన్షియల్ పాఠశాలు ప్రారంభించిన ఘనత కేసీఆర్ సొంతం. ఆనాడు ఒక విద్యార్థిపై సం‘‘నికి 20వేలు ఖర్చు చేస్తే ప్రస్తుతం ఒక్కో విద్యార్థిపై ఏటా లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున అధికార వికేంద్రీకరణ జరగాలని కొత్తగా 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలు ఏర్పాటు చేసి ప్రజల చెంతకు పాలన తీసుకుపోయింది. ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగుల సహకారంతో భూరికార్డుల ప్రక్షాళన సహా అనేక రకాల కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తోంది. విశ్వనగరంగా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా పలువురు పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తోంది. శాంతి భద్రతలు, సులభతరమైన అనుమతులు, వాతావరణ పరిస్థితులు, అవినీతిరహిత పారదర్శక పాలన కారణంగా సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా పరిశ్రమలకు అనుమతులు వేగంగా ఇస్తుండటంతో పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్, హార్డ్వేర్ రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోంది. బడా కంపెనీలు సైతం హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. హైదరాబాద్ ఇమేజ్ పెరగడంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంలో అనేక ప్రపంచస్థాయి సదస్సులకు హైదరాబాద్ వేదిక కావడంలో అద్భుతమైన విజన్, డెడికేషన్, కమిట్మెంట్ ఉన్న మంత్రి కేటీఆర్ పాత్ర ప్రశంసనీయం. నాలుగేళ్ల పాలనలో అందరి మన్ననలు అందుకునే రీతిలో పాలన సాగిస్తున్నారు సీఎం కేసీఆర్. అందుకే దేశంలో నంబర్వన్ సీఎం ఎవరంటే ఆయన పేరే వినిపిస్తోంది. ఉద్యమనేతగా.. రాజకీయవేత్తగా.. పలు అంశాలపై పట్టున్న మేధావిగా... సమస్యలకు పరిష్కారం చూపే దార్శనికుడిగా కేసీఆర్ సేవలు అనన్యసామాన్యం. కొత్తగా పురుడుపోసుకున్న రాష్ట్రానికి తొలి సీఎంగా ఎన్నికైన నాటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలతో బంగారు తెలంగాణ నిర్మాణంలో ఆయన చేస్తున్న ప్రయత్నం అమూల్యం. దీక్ష, పట్టుదల, చిత్తశుద్ధితో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తూ పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటున్న కేసీఆర్ అంతర్జాతీయ యువనికపై తెలంగాణ కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. స్వరాష్ట్రంలో స్వర్ణయుగానికి బాటలు పరుస్తున్నారు. నిజంగా ఇవాళ తెలంగాణలో కేసీఆర్ విప్లవం నడుస్తోంది. దేశవ్యాప్తంగా కేసీఆర్ విప్లవం అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తే భారతదేశ స్వరూపమే మారిపోతుంది. దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుంది. బాల్క సుమన్, వ్యాసకర్త పార్లమెంట్ సభ్యులు, పెద్దపల్లి, (జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా) -
బాల్క సుమన్ ఇంట్లో చోరీ
సాక్షి, మంచిర్యాల : పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ జరిగింది. మంచిర్యాల పట్టణంలోని గౌతమ్నగర్లోని ఎంపీ సుమన్ నివాసం ఉంది. ఎంపీ ఇంటితో పాటు మరో రెండు ఇళ్లల్లో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగినట్లు సమాచారం. ఎంపీ ఇంట్లో రూ. లక్ష నగదును దొంగలు అపహరించినట్లు తెలుస్తోంది. బాల్క సుమన్ సహా మిగతా ఇంటి యజమానులు అందుబాటులో లేకపోవడంతో ఎంత మొత్తంలో చోరీ జరిగిందో తెలియడం లేదు. చోరీ ఘటనను పోలీసులు గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో రెండో సారి దొంగతనం జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. -
ఇంత మొండితనమా?
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే అధికారం తెలంగాణకు ఇవ్వాలని ఇన్నిరోజులుగా అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. కేంద్రానికి అర్థమైతలేదా.. లేక మొండితనమా..? అని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల అంశంపై లోక్సభలో గురువారమూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. పార్టీ ఎంపీలు జితేందర్రెడ్డి, కల్వకుంట్ల కవిత, బి.వినోద్కుమార్, అజ్మీరా సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీబీ పాటిల్, నగేశ్, పసునూరి దయాకర్ సభ వెల్లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలు స్తంభించడంతో సభాపతి సభ పలుమార్లు వాయిదా వేశారు. అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ హాల్లోనూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టామని, వివిధ పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు. రాష్ట్రానికో తీరుండాలా?: కొండా విశ్వేశ్వర్రెడ్డి రిజర్వేషన్ల అంశంపై రెండు వారాలుగా సభలో నిరసన తెలుపుతున్నామని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. సెంట్రల్ హాల్లోనూ ఆందోళన చేపట్టామన్నారు. ‘తమిళనాడులో 69 శాతం, మహారాష్ట్రలో 52 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్రాలకు ఉండాలా? లేక కేంద్రానికా?.. దేశానికంతటికీ ఒకే విధానం ఉండాలా? లేక రాష్ట్రానికో తీరుండాలా?.. మేమడిగేది కేంద్రానికి అర్థమైతలేదా? లేదా మొండితనమా? కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలి’అని హితవు పలికారు. తొలిసారి సెంట్రల్ హాల్లో నిరసన: ప్రభాకర్ రెడ్డి రిజర్వేషన్లపై 2 వారాలుగా ఆందోళన చేస్తున్నా కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. తొలిసారిగా సెంట్రల్ హాల్లో గురువారం నిరసన తెలిపామన్నారు. ‘తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రం బిల్లు ఆమోదించింది. దానిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ బడ్జెట్ను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవచ్చు. బడుగు, బలహీన వర్గాలకు తగిన విధంగా కేటాయింపులు చేశారు’ అని అన్నారు. దున్నపోతుపై వానపడ్డట్లు..: బాల్క సుమన్ దున్నపోతుపై వాన పడ్డట్లు మొండివైఖరి ప్రదర్శిస్తోందంటూ కేంద్రంపై ఎంపీ బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మారిన జనాభా శాతాలకు అనుగుణంగా రిజర్వేషన్లు మారాల్సి ఉందన్నారు. ‘ఎస్టీ, బీసీ కోటా పెంపును కేంద్రం సహృదయంతో అర్థం చేసుకోవాలి. యూనివర్సిటీల్లో పోస్టుల రిక్రూట్మెంట్లకు రోస్టర్ పాయింట్లు పాటించడంలో ఇప్పటివరకు వర్సిటీని యూనిట్గా తీసుకునేవారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ను యూనిట్గా తీసుకుంటుండటం వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి గెహ్లాట్ను కలిశాం’ అని అన్నారు. -
రసకందాయంలో ఆ ఎంపీల భవిష్యత్..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పార్లమెంటులో ఐదేళ్ల పదవీకాలం పూర్తి కాకముందే మన ఎంపీలు శాసనసభ వైపు దృష్టి సారిస్తున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల నుంచి చివరి నిమిషంలో రంగ ప్రవేశం చేసి విజయం సాధించిన గోడం నగేశ్, బాల్క సుమన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమకు అనుకూలమైన శాసనసభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఎంపీగా ఉండడం కన్నా ఎమ్మెల్యేగా కొనసాగితేనే మంచిదనే ధోరణితో గోడం నగేశ్ తన పాత నియోజకవర్గంపై దృష్టి సారించారు. కాగా అని వార్య పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా అనువైన నియోజకవర్గం వేటలో సుమన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు లోక్సభ నియోజకవర్గాల్లో రాజకీయం రసకందాయంలో పడింది. టీఆర్ఎస్లోకి మాజీ ఎంపీ వివేక్ రాకతో మారిన సీన్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్ సిట్టింగ్ ఎంపీగా ఉండి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఆయనే పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో వివేక్ అనూహ్యంగా మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి చొప్పదండి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న బాల్క సుమన్ పెద్దపల్లి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బాల్క సుమన్ విజయం సాధించారు. కాగా గతేడాది మాజీ ఎంపీ జి.వివేక్ మళ్లీ టీఆర్ఎస్లో చేరడంతోపా టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. వివేక్ తిరిగి టీఆర్ఎస్లోకి రావడంతోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వివేక్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఎంపీ సుమన్కు పెద్దపల్లి లోక్సభ నుంచి మళ్లీ అసెంబ్లీ స్థానానికి వెళ్లడం ఇష్టం లేదు. అయితే వివేక్ ముందస్తు ఒప్పందంతోనే టీఆర్ఎస్లో చేరారనే ప్రచారంనేపథ్యం లో అనివార్య పరిస్థితి ఏర్పడితే ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలా అనే అంశంపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. గతంలో అనుకున్న చొప్పదం డి నియోజకర్గంతోపాటు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి స్థానంపై కూడా సుమన్ కన్నేసినట్లు సమాచారం. ఆదిలాబాద్పై ప్రభుత్వాధికారి చూపు గోడం నగేశ్ బోథ్ అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి అజ్మీరా శ్యాంనాయక్ ఆదిలాబాద్ లోక్సభపై దృష్టి పెట్టారు. ఆయన సతీమణి రేఖా నాయక్ ఇప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో గెజిటెడ్ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కీలకంగా వ్యవహరించిన ఆయనకు గత సార్వత్రిక ఎన్నికల్లోనే టిక్కెట్టు లభిస్తుందని భావించారు. అప్పుడు మిస్సయినా ఈ సారి నగే‹శ్ అసెంబ్లీకి వెళ్తే తాను పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ప్రభుత్వ అధికారిగా ఉమ్మడి జిల్లాతో ఉన్న అనుబంధం తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రేఖానాయక్ ఎమ్మెల్యేగా ఉండడం, ఆయన సోదరుడు రాంనాయక్ సిర్పూరు(టి) జెడ్పీటీసీగా కొనసాగుతుండడం కలిసివచ్చే అంశం. కాగా నగేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితి వస్తే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కూడా లైన్లో ఉన్నట్లు సమాచారం. బోథ్ ఎమ్మెల్యే స్థానానికే నగేశ్ మొగ్గు తెలుగుదేశం హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గోడం నగేశ్ 2014 ఎన్నికల సమయంలో అనూహ్యంగా ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి బాపూరావు రాథోడ్ పోటీ చేసి విజయం సాధించారు. ఆదిలాబాద్ ఎంపీగా అంత సంతృప్తిగా లేని నగే‹శ్ గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన బోథ్ నియోజకవర్గంపైనే కొంతకాలంగా దృష్టి పెట్టారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా బోథ్లో తన వర్గాన్ని అదుపులో ఉంచుకుంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానానికి కాకుండా బోథ్ నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేయనున్నట్లు అధిష్టానానికి కూడా సంకేతాలు పంపించారు. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా తన సీటును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
'బుద్ధి లేనోడా నేను చెప్పేది కూడా అదే'
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరుగుతున్న కుంభకోణాలు తాను ప్రశ్నిస్తే టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మాత్రం వివరణ ఇవ్వకుండా తిట్లదండకం మొదలుపెట్టారని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్రెడ్డి అన్నారు. మతితప్పినప్పుడు శృతితప్పిన మాటలు ఎలా ఉంటాయో బాల్క సుమన్ మాటలు చూస్తే తెలిసిపోతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుచేశారని, ఆ కారణంగానే ప్రభుత్వ అధికారులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని స్వయంగా బాల్క సుమనే చెప్పినందుకు తాను అభినందిస్తున్నానని అన్నారు. శనివారం రేవంత్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ''బాల్క సుమన్ నన్ను రవ్వంత అన్నాడు. టీఆర్ఎస్ పార్టీ అవినీతి కొంపను తగులబెట్టేందుకు ఆ రవ్వే చాలు. ఒక్క నిప్పురవ్వే టీఆర్ఎస్ పార్టీ కొంపను కాలుస్తుంది. తెలంగాణలో 24గంటల విద్యుత్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. 2008లో జీవో 53 ద్వారా 8, 9శాతం విద్యుత్ కేటాయింపులు మాత్రమే జరిగాయని బాల్క సుమన్ అంటున్నారు. మతి తప్పినప్పుడు శృతిలేని మాటలు ఇలాగే ఉంటాయి. 2008లో రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. 2008లో జంటనగరాల్లో 24గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఉద్దేశంతో నాడు ఆంధ్ర ప్రాంతానికి 53.89శాతం తెలంగాణకు 46.11శాతం విద్యుత్ వినియోగం కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత జనాభా ప్రాతిపదికన తెలంగాణకు 43శాతం వాటా మాత్రమే వస్తుందని అలా జరిగితే తెలంగాణ చీకటి మయం అవుతుందని 2008లో ఎలాంటి కేటాయింపులు చేశారో అదే కేటాయింపులు ఉండాలని సోనియాగాంధీ చెప్పారు. దాన్నే విభజన సమయంలో పేర్కొన్నారు. తెలంగాణకు పూర్తి స్థాయిలో విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఈ విషయం చెప్పకుండా మీరే ఇచ్చినట్లు ఎందుకు చెప్పుకుంటున్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు విషయంలో నిబంధనలు ఉల్లంఘించి కేసీఆర్ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో 23మంది అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు వారిని శిక్షించాలని చెప్పింది. ఇదే విషయం నేను చెప్పాను. దీనిపై బాల్క సుమన్ వచ్చి కొండను తవ్వి ఎలుకనన్నా పడతడేమంటే కనీసం తొండను కూడా పట్టలేదు. 23మందిని కాదు ఇద్దరినే శిక్షించాలని కోర్టు చెప్పిందని కోర్టు కాపీ కూడా మీడియాకు ఇచ్చారు. బుద్ధి లేనోడా నేను చెప్పేది కూడా అదే. మీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని మీరు ఒప్పుకున్నట్లే కదా. జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం క్రమంగా తగ్గించి ప్రైవేట్ విద్యుత్ కొంటున్నారు. ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు చెందిన ఇచ్చే లంచాలు, కమిషన్లకు కక్కుర్తిపడి ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో 84శాతం ఉన్న ప్రభుత్వ విద్యుత్ సంస్థల వాటా 60శాతానికి పడిపోయింది. దీనికి కారణం మీ ప్రభుత్వమే'' అని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. -
'మీ కొంప తగులబెట్టేందుకు రవ్వే చాలు'
-
రేవంత్ మాటలన్నీ అబద్ధాలే!
సాక్షి, హైదరాబాద్: రేవంత్రెడ్డి విద్యుత్ రంగంపై అమరవీరు ల స్థూపం సాక్షిగా అబద్ధాలు చెప్పి వారి త్యాగాలను కించ పరచారని, ఆయన కాంగ్రెస్లో ఉన్నా చంద్రబాబు పార్టీ భాషే మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం 2 కన్నా ఎక్కువ ఒప్పందాలు కుదుర్చుకుంటే రేవంత్ బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీలో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, బీహెచ్ఈఎల్ ఝార్ఖండ్లో నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు వ్యయం కంటే రాష్ట్ర ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో నిర్మిస్తోందన్నారు. ఏపీ కన్నా రాష్ట్రం ఎక్కువ ధరలకు కరెంట్ కొనుగోలు చేయలేదన్నారు. అది కాంగ్రెస్ గొప్పతనం కాదు! రేవంత్ చెబుతున్నట్టుగా ఏపీ ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ ఇస్తామని తెలంగాణకు లేఖ రాయలేదని చెప్పారు. విభజన చట్టంతో తెలంగాణకు 53 శాతం విద్యుత్ వాటా దక్కడం కాంగ్రెస్ గొప్పతనం కాదని, 2008లోనే విద్యుత్ కేటాయింపులు జరిగాయన్న సంగతి రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు. రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలని డాక్యుమెంట్లతో సహా నిరూపించామని, ఆయన తన వాదనను నిరూపించే ఒక్క డాక్యుమెంట్ కూడా చూపెట్టలేదన్నారు. ఛత్తీస్గడ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు బీజేపీ ఎంత కమీషన్ ఇచ్చిందో రేవంత్ చెప్పాలని, కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డికి చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఎంతిచ్చారో ఆయనతో చెప్పించాలని సవాలు చేశారు. 24గంటల కరెంట్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్రెడ్డి బఫూన్లా ముందుకొచ్చారని విమర్శించారు. -
నేను నీలా పార్టీ మారను ఎక్కడికీ పారిపోను'
-
నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి అంశంపై కాంగ్రెస్-టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ విషయమై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరిన టీఆర్ఎస్ నేతలు.. ఆ తర్వాత పారిపోయారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగతో మేం చర్చలు జరపబోమని ఆయన అన్నారు. పార్టీలు మారి ప్రజలను మోసం చేసిన సంస్కృతి రేవంత్రెడ్డిదని ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్లపై బహిరంగ చర్చకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు బాల్క సుమన్ అన్నారు. 'నేను నీలా పార్టీ మారను. ఎక్కడికీ పారిపోను. ఉద్యమంలో కేసులు ఎదుర్కొని దెబ్బలు తిని ఎంపీగా ఎన్నికయ్యాను. నువ్వు మాత్రం రాజీనామా చేయమంటే పారిపోయావు. తెలంగాణ ద్రోహుల పక్షాన నిలబడ్డావు. నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు' అని రేవంత్రెడ్డిపై బాల్క సుమన్ మండిపడ్డారు. -
‘తుంటరి ఎంపీ, చిలిపి ఎమ్మెల్సీలు’
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ విషయంలో టీఆర్ఎస్ ఓటమిని అంగీకరించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. విద్యుత్ ఒప్పందాలు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై టీఆర్ఎస్ నాయకులతో బహిరంగంగా చర్చించేందుకు శుక్రవారం రేవంత్రెడ్డితో కలిసి ఆయన గన్పార్కుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సవాల్ విసిరి చర్చకు రాకుండా తుంటరి ఎంపీ, ఇద్దరు చిలిపి ఎమ్మెల్సీలు అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు. వీరిని ప్రగతి భవన్కు పిలిచి ముఖ్యమంత్రి మొట్టికాయలు వేశారని వ్యంగ్యంగా అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్కు దొరల వెంట తిరిగి కళ్లు నెత్తికెక్కాయని ధ్వజమెత్తారు. ఆయన స్థాయికి ఉత్తమ్కుమార్, జానారెడ్డి, షబ్బీర్ అలీ రావాలా అని ప్రశ్నించారు. తాను పార్టీ మారతానని, పార్టీ ఫిరాయించిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని చెబుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ అంశంపై కాంగ్రెస్ పార్టీతో బహిరంగ చర్చకు సిద్ధమని ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, భానుప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నేను కేసీఆర్ టైపు కాదు తాను పార్టీ మారతానని, పార్టీ ఫిరాయించిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని చెబుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారడానికి తాను సీఎం కేసీఆర్ టైపు కాదన్నారు. ముక్కిపోయిన టీఆర్ఎస్ పార్టీలో ఎవరు చేరతారని సంపత్కుమార్ అన్నారు. -
‘ఓటుకు కోట్లు’ దొంగతో చర్చించం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అంశంపై చర్చించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాంగ్రెస్ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి వస్తే తాము చర్చకు సిద్ధమని ఎంపీ బాల్కసుమన్ పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ దొంగ రేవంత్రెడ్డితో ఎందుకు చర్చిస్తామని అన్నారు. మండలిలో ప్రభుత్వ విప్ పల్లారాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్లతో కలసి ఆయన గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలతో వార్తల్లో ఉండేందుకు తపించే విశ్వసనీయత లేనివ్యక్తి రేవంత్ అని, అలాంటి వారితో చర్చించడం వల్ల ఏం ఉపయోగం ఉండదని సుమన్ పేర్కొన్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా విద్యుత్పై అబద్ధా్దలు మాట్లాడి రేవంత్ అడ్డంగా దొరికిపోయాడని, తన వాదనకు సరైన డాక్యుమెంట్లు చూపలేక అసెంబ్లీకి మొహం చాటేశాడని గుర్తు చేశారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు ఏ ఒక్కటీ నిజంకాదని రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సీఎం చర్చకు రావాలంటే తాము 10, జనపథ్ నుంచి రావాలంటామని పల్లా అన్నారు. -
రేవంత్రెడ్డి సవాల్పై ఎంపీ బాల్క సుమన్ కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విదుత్ కొనుగోళ్లు అంశంపై బహిరంగ చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి చేసిన సవాల్పై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ గురువారం స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్రెడ్డి వస్తే బహిరంగ చర్చకు సిద్ధమని బాల్క సుమన్ తెలిపారు. రేవంత్రెడ్డి విలువల్లేని వ్యక్తి అని, ఆయనతో తాము ఎలా బహిరంగ చర్చ జరుపుతామని బాల్క సుమన్ అన్నారు. పట్టపగలు దొంగనోట్లతో దొరికిపోయిన వ్యక్తి రేవంత్రెడ్డి అని 'నోటుకు ఓటు' కేసును గుర్తుచేశారు. కరెంటే కాదు రాజీనామాపైనా రేవంత్రెడ్డి అబద్ధాలు చెప్పారని బాల్క సుమన్ మండిపడ్డారు. 24 గంటల కరెంటు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, దమ్ముంటే టీఆర్ఎస్ నేతలు ఈ విషయంపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. -
టీఆర్ఎస్ సవాల్కు సై: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ విద్యుత్ దుర్మార్గాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అన్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఎంపీ బాల్క సుమన్ కోరిన విధంగా బహిరంగ చర్చకు తాను, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు వస్తామని, చర్చా వేదిక సీఎం అధికార నివాసం ప్రగతి భవన్ అయినా లేదా మరెక్కడికైనా వస్తామని తెలిపారు. ఈ మేరకు రేవంత్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడినా విద్యుత్ కొరత ఏర్పడకుండా కాంగ్రెస్ హయాంలో చేపట్టిన కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలు, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు, కొత్త ప్లాంట్ల నిర్మాణాల పేరుతో జరుగుతున్న అక్రమాలు.. అన్నీ బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యుత్ వెలుగుల వెనక చీకటి కోణం ‘రోజంతా విద్యుత్’వెలుగుల వెనక చీకటి కోణం దాగి ఉందని ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి మీద రాతలు రాయడంలో దిట్ట అని, తన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పనిచేయడంలో కేసీఆర్ది అందెవేసిన చెయ్యి అని ఆయన విమర్శించారు. బుధవారం గాంధీ భవన్లో రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ, విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీని మార్చమని కేంద్రం ఆదేశించినా ఇక్కడ దానిని పాటించడంలేదని అన్నారు. ఈ టెక్నాలజీని అందించే ఇండియా బుల్స్ సంస్థ కేసీఆర్ను ప్రసన్నం చేసుకుందని, అందుకే కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినా.. కాలం చెల్లిన టెక్నాలజీని వాడుతున్నారని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ ద్వారా ప్రభుత్వం ఇండియా బుల్స్కి రూ.2 వేల కోట్లు చెల్లించిందని ఆరోపించారు. ఈ చెల్లింపులోనే కేసీఆర్ చీకటి ఒప్పందం దాగి ఉందని అన్నారు. 24 గంటల విద్యుత్ కాంగ్రెస్కు ఇష్టం లేదు రేవంత్వన్నీ తప్పుడు లెక్కలు: ఎంపీ బాల్క సుమన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను సరఫరా చేయడం కాంగ్రెస్కు ఇష్టం లేదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్తో కలసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ..కరెంటు కష్టాల నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టిందన్నారు. కరెంటుపై రేవంత్రెడ్డి చెప్పేవన్నీ తప్పుడు లెక్కలని నిరూపిస్తామని చెప్పారు. తాము చెప్పే లెక్కలు అబద్ధమైతే ప్రజలు వేసే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. సవాల్కు సిద్ధమేనా? ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విద్యుత్ సంస్థ కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డికి చెందినదని, ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆయనతో రేవంత్ చెప్పించగలరా అని బాల్క సుమన్ సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ కృషితోనే భూపాలపల్లిలో విద్యుత్ ఉత్పాదన ప్రారంభమైందన్నారు. రేవంత్ చెబుతున్న గుజరాత్ కంపెనీ ఎక్కడుందో ఆయనకే తెలియాలన్నారు. విద్యుత్పై బహిరంగ చర్చకు కాంగ్రెస్ నేతలు సిద్ధమేనా అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డితో కలసి వచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. రేవంత్ చెప్పేది అబద్ధమైతే అబిడ్స్ చౌరాస్తాలో ముక్కు నేలకు రాస్తారా అని సవాలు చేశారు. -
కాంగ్రెస్ కబంధ హస్తాల్లో కోదండరాం: సుమన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కబంధ హస్తాల్లో జేఏసీ చైర్మన్ కోదండరాం బందీ అయ్యారని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం, మల్లన్న సాగర్, పాలమూరు, డిండి, కొండపోచమ్మ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేసిన ముఠానే నిరుద్యోగుల సమస్యను వాడుకుంటూ విద్యార్థుల భవిష్యత్ను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. రాజకీయం చేస్తున్న కోదండరాం ముఠా: పల్లా సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు వస్తున్న ఖ్యాతిని తట్టుకోలేక విపక్షాలు కోదండరాంను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం, కేసీఆర్, ఆయన కుటుంబంపై విషం కక్కుతున్నాయని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కోదండరాంను, ఆయన ముఠాను నిరుద్యోగులు నమ్మడం లేదన్నారు. కోదండరాంకు దమ్ముంటే పార్టీ పెట్టాలన్నారు. విద్యార్థి మురళి డీఈడీ, బీఈడీ చేయలేదని తెలిసి కూడా ఆయన డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారని కోదండరాం అసత్యాలు చెప్పడం దురదృష్టకరమన్నారు.