కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి | Vijayashanti Quits BJP And Joined In The Congress Party, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Vijayashanti: కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

Nov 17 2023 5:18 PM | Updated on Nov 17 2023 8:59 PM

Vijayashanti Joined The Congress - Sakshi

బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని, కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌ పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు.

కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పొలిటికల్‌ పార్టీల నుంచి అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల ప్రక్రియ, ఉప సంహరణ అన్నీ ముగిసిపోయినప్పటికీ జంపింగ్‌లు మాత్రం ఆగడం లేదు. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరుతూనే ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి కొందరు నేతలు క్యూ కట్టగా.. సీనియర్‌ నేత విజయశాంతి కూడా కాంగ్రెస్‌లోకి చేరారు.

గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో బీజేపీ హైకమాండ్‌ నిర్ణయాలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు.
చదవండి: కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు: ఖర్గే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement