మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Guntur Tour Updates | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన వైఎస్‌ జగన్‌

Published Wed, Sep 11 2024 8:35 AM | Last Updated on Wed, Sep 11 2024 12:06 PM

YS Jagan Guntur Tour Updates

⇒నందిగం సురేష్‌ను పరామర్శించిన వైఎస్‌ జగన్‌
⇒అక్రమ కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ సురేష్‌కు వైఎస్‌ జగన్‌ పరామర్శ
⇒గుంటూరు జైలులో సురేష్‌ను పరామర్శించిన వైఎస్‌ జగన్‌
⇒నందిగం సురేష్‌కు ధైర్యం చెప్పిన వైఎస్‌ జగన్‌
⇒అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసా
 

⇒గుంటూరు జైలుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌
⇒కాసేపట్లో నందిగం సురేష్‌ను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌
 

గుంటూరు బయల్దేరిన వైఎస్‌ జగన్‌
⇒అక్రమ కేసులో అరెస్టయిన నందిగం సురేష్‌కు పరామర్శ
⇒గుంటూరు జిల్లా జైలులో పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌
⇒అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఎస్‌వీఎన్‌ కాలనీలోని క్రోసూరు మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ ఈద సాంబిరెడ్డి నివాసానికి వైఎస్‌ జగన్‌
⇒ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబిరెడ్డిని పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌ 

సాక్షి, గుంటూరు: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు గుంటూరులో పర్యటించనున్నారు. బుధ­వారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు సబ్‌­జైలుకు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. అక్కడ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను  పరామర్శిస్తారు.

అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఎస్‌వీఎన్‌ కాలనీలోని క్రోసూరు మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళ్తారు. ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబిరెడ్డిని వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement