
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పథకాల అమలును కూటమి సర్కార్ గాలికొదిలేసింది. నాలుగు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. గత ఐదేళ్లలో అందిన పథకాల్లో కోతలు విధిస్తోందని వైఎస్సార్సీపీ తెలిపింది. అలాగే, ఉచిత ఇసుక అంటూ చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టాడని చెప్పుకొచ్చింది.
కూటమి సర్కార్ను ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. నాలుగు నెలల్లోనే ఇసుకని సాంతం దోచేసిన తెలుగు తమ్ముళ్లు. వైఎస్సార్సీపీ హయాంలో నిండుగా కనిపించిన ఇసుక యార్డులన్నీ ఇప్పుడు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఉచిత ఇసుక అంటూ.. చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టాడు. ఇప్పుడు ఇసుక లేదంటే జనం ఉమ్మేస్తారని భయపడి.. ఆన్లైన్ బుకింగ్ పేరుతో కూటమి ప్రభుత్వం నాటకాలాడుతోంది.
నాలుగు నెలల్లోనే ఇసుకని సాంతం దోచేసిన తెలుగు తమ్ముళ్లు
వైయస్ఆర్సీపీ హయాంలో నిండుగా కనిపించిన ఇసుక యార్డులన్నీ ఇప్పుడు కాళీగా దర్శనం
ఫ్రీ ఇసుక అంటూ.. కుచ్చుటోపీ పెట్టిన @ncbn
ఇప్పుడు ఇసుక లేదంటే జనం ఉమ్మేస్తారని భయపడి.. ఆన్లైన్ బుకింగ్ పేరుతో నాటకాలాడుతున్న @JaiTDP… pic.twitter.com/c3ia5cOyOE— YSR Congress Party (@YSRCParty) October 3, 2024
👉అలాగే, పథకాల అమలు గాలికొదిలేసి.. కోతలతో సరిపెట్టిన చంద్రబాబు. నాలుగు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. గత ఐదేళ్లుగా అందిన పథకాలకి వరుసగా కోతలు పెడుతున్నాడు. వైఫల్యాలను ప్రశ్నిస్తారని భయపడి.. టాపిక్ డైవర్ట్ చేస్తూ బురద రాజకీయాలతో చంద్రబాబు సరిపెడుతున్నాడు.
పథకాల అమలు గాలికొదిలేసి.. కోతలతో సరిపెట్టిన చంద్రబాబు
నాలుగు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. గత ఐదేళ్లుగా అందిన పథకాలకి వరుసగా కోతలు
వైఫల్యాలను ప్రశ్నిస్తారని భయపడి.. టాపిక్ డైవర్ట్ చేస్తూ బురద రాజకీయాలతో సరిపెడుతున్న @ncbn #MosagaduBabu#100DaysOfCBNSadistRule pic.twitter.com/74wuVFoQYl— YSR Congress Party (@YSRCParty) October 3, 2024
👉పెన్షన్ల విషయంలో కూడా పండుటాకులపై కక్ష సాధిస్తున్న చంద్రబాబు. పెన్షన్ పెంపు ముసుగేసి.. 100 రోజుల్లోనే లక్షా 50వేల మందికి కూటమి సర్కార్లో పెన్షన్ల కోత విధించారు. ఇదేంటని అడిగితే.. చిత్ర, విచిత్రమైన కారణాలు చెప్తున్న కూటమి నేతలు. అవ్వాతాతలపై ఎందుకు నీకు ఇంత పగ చంద్రబాబు?.
పండుటాకులపై కక్ష సాధిస్తున్న చంద్రబాబు
పెన్షన్ పెంపు ముసుగేసి.. 100 రోజుల్లోనే లక్షా 50 వేల మందికి పింఛను కోత
అడిగితే.. చిత్ర, విచిత్రమైన కారణాలు చెప్తున్న కూటమి నేతలు
అవ్వాతాతలపై ఎందుకు @ncbn నీకు ఇంత పగ?#MosagaduBabu#100DaysOfCBNSadistRule pic.twitter.com/lglZ0zqJjI— YSR Congress Party (@YSRCParty) October 3, 2024
👉కూటమి చేతగానితనంతో బెజవాడ వరద బాధితులకి తప్పని తిప్పలు. టీడీపీకి అనుకూలమైన వారికే సాయం అందేలా పావులు కదిపిన తెలుగు తమ్ముళ్లు. అర్హత ఉండి కూడా.. సాయం కోసం కలెక్టరేట్ వద్ద పడిగాపులు కాస్తున్న వేలాది మంది బాధితులు. అస్తవ్యస్తంగా బాధితుల జాబితాతో చేతులెత్తేసిన అధికారులు.. ఇదేనా చంద్రబాబు నీ అనుభవం? అని ప్రశ్నించింది.
.@JaiTDP కూటమి చేతగానితనంతో బెజవాడ వరద బాధితులకి తప్పని తిప్పలు
టీడీపీకి అనుకూలమైన వారికే సాయం అందేలా పావులు కదిపిన తెలుగు తమ్ముళ్లు
అర్హత ఉండి కూడా.. సాయం కోసం కలెక్టరేట్ వద్ద పడిగాపులు కాస్తున్న వేలాది మంది బాధితులు
అస్వవ్యస్తంగా బాధితుల జాబితాతో చేతులెత్తేసిన… pic.twitter.com/nZghdgRDA9— YSR Congress Party (@YSRCParty) October 3, 2024
ఇది కూడా చదవండి: తిరుమల జోలికి వెళ్లొద్దు.. చంద్రబాబుకు విజయసాయి వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment