
పోర్టో (పోర్చుగల్): ప్రతిష్టాత్మక యూరోపియన్ చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో చెల్సీ క్లబ్ (ఇంగ్లండ్) జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో సెసర్ అప్లిక్వెటా కెప్టెన్సీలోని చెల్సీ క్లబ్ జట్టు 1–0తో మాంచెస్టర్ సిటీ (ఇంగ్లండ్) జట్టుపై గెలిచింది.
ఆట 42వ నిమిషంలో కాయ్ హావెర్ట్జ్ ఏకైక గోల్ చేసి చెల్సీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విజేత చెల్సీ జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు (రూ. 167 కోట్లు)... రన్నరప్ మాంచెస్టర్ సిటీ జట్టుకు కోటీ 50 లక్షల యూరోలు (రూ. 132 కోట్లు) ప్రైజ్మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment