Portugal
-
అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్లో..!
ఒక మహిళకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ మగపిల్లలే. అయితే ఎందువల్లో ఇద్దరు డీఎన్ఏలు వేర్వురుగా ఉన్నాయి. ఒక బిడ్డ డీఎన్ఏ ఆమె భర్తతో మ్యాచ్ అవ్వగా, మరో బిడ్డ డీఎన్ఏ మాత్రం అస్సలు మ్యాచ్ కాలేదు. ఇదేంటి ఇద్దరు కవలలు ఒకేలా ఉన్నారు. ఇదెలా సాధ్యం ఒకరిది మాత్రమే తండ్రితో మ్యాచ్ అయ్యి, మరొకరిది కాకపోవడంతో వైద్యులు సైతం కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే. ఈ విచిత్రమైన ఘటన పోర్చుగల్లోని గోయాస్ రాష్ట్రంలోని మినెరోస్ నగరంలో చోటు చేసుకుంది. 19 ఏళ్ల మహిళ కవల ప్లిలలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చిన ఆనందాన్ని తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఖుషీగా ఉంది. అయితే ప్రస్తతం వారికి ఎనిమిది నెలల వయసు. వారి బర్త్ సర్టిఫికేట్ల విషయమై డీఎన్ఏ టెస్ట్లు చేయగా అవాక్కయ్యే విషయం వెలుగులోకి చ్చింది. ఒక బిడ్డ డీఎన్ఏ మాత్రం ఆ మహిళ భర్తతో సరిపోయింది. మరో బిడ్డది అస్సలు మ్యాచ్ కాలేదు. దీంతో వైద్యులు సైతం ఇదేంటని తలలు పట్టుకున్నారు. అయితే ఆ మహిళలను వైద్యులు క్షణ్ణంగా ఆరా తీయగా తాను మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న విషయం బయటపెట్టింది. వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి డీఎన్ఏ టెస్ట్ చేయగా ఆ వ్యక్తితో ఆ బిడ్డ డీఎన్ఏ సరిగ్గా మ్యాచ్ అయ్యింది. అయితే ఇదెలా సాధ్యం అనే ప్రశ్న వైద్యలును కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది. అయితే పిల్లల తండ్రులు వేర్వేరు అయినా.. జనన ధృవీకరణ పత్రంలో ఒకటే రాయాల్సి ఉంది. దీంతో ఆ మహిళ భర్తనే ఆ ఇద్దరు పిల్లలకు తండిగ్రా పేరు నమోదు చేయించుకుని ఆ బిడ్డ బాధ్యత తనే చూసుకుంటానని అనడం విశేషం.ఇది అత్యంత అరుదైన కేసు..ఈ మేరకు డాక్టర్ టులియో జార్జ్ ఫ్రాంకో మాట్లాడుతూ..ఇప్పటివరకు మొత్తం ప్రపంచంలో ఇలాంటి కేసులు 20 మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాటిలో కవలల తండ్రులు వేర్వేరుగా ఉన్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తల భాషలో హెటెరోపెరెంటల్ సూపర్ఫెకండేషన్ అంటారని అన్నారు. ఒకే తల్లి రెండు అండాలు వేర్వేరు పురుషుల ద్వారా ఫలదీకరణం చెందినప్పుడు ఇది జరుగుతుందని వెల్లడించారు. అయితే ఇక్కడ ఆ స్త్రీ గర్భం సాధారణంగానే ఉందని అన్నారు. ఇప్పటి వరకు ఆ శిశువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని చెప్పారు. నిజంగా ఇది అత్యత విచిత్రమైన కేసు.(చదవండి: సందీప్ కిషన్: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..) -
ఆగాఖాన్ అస్తమయం
పారిస్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ‘ఇస్మాయిలీ’ వర్గం ముస్లింల ఆధ్యాత్మిక గురువు, వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి ఆగాఖాన్ కన్నుమూశారు. షియా ఇస్మాయిలీ ముస్లింల 48వ ఇమామ్ హోదాను యుక్తవయసులో వారసత్వంగా పొంది దశాబ్దాలపాటు వేల కోట్ల రూపాయల దాతృత్వ కార్యక్రమాలు చేసి గొప్ప వితరణశీలిగా పేరు తెచ్చుకున్నారు. ఆగాఖాన్ పోర్చుగల్లో మంగళవారం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబం బుధవారం ప్రకటించింది. ఆగా ఖాన్ అంత్యక్రియలు పోర్చుగల్ రాజధాని నగరం లిస్బన్లో జరుగుతాయని ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్, ఇస్మాయిలీ రిలీజియన్ కమ్యూనిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగాఖాన్కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొహమ్మద్ ప్రవక్త వారసులుగా షియా ముస్లింలలో ఉప వర్గమైన ఇస్మాయిలీ వర్గానికి ఆగాఖాన్ కుటుంబం ఆధ్యాత్మిక గురువులుగా శతాబ్దాలుగా కొనసాగుతోంది. 1936 డిసెంబర్ 13న స్విట్జర్లాండ్లోని జెనీవాలో జన్మించిన ఈయన అసలు పేరు ప్రిన్స్ కరీమ్ అల్ హుస్సేనీ. ఆగాఖాన్ తండ్రి ప్రిన్స్ అలీఖాన్ విలాస పురుషుడు. దీంతో అలీఖాన్ను కాదని తాత సర్ సుల్తాన్ మొహ మ్మద్ షా (ఆగాఖాన్– 3).. కరీమ్ అల్ హు స్సేనీను డిగ్రీ స్టూడెంట్గా ఉన్నప్పుడే ఆగా ఖాన్–4గా 1957 అక్టోబర్ 19వ తేదీన ప్రకటించారు. టాంజాని యాలోని దారెస్స లామ్లో ఈ కార్య క్రమం జరిగింది. గతంలో ఇదే దారెస్సలామ్ వేదికగా ఆగాఖాన్–3ను ఇస్మాయిలీ వర్గీయులు ఆయనంత బరువు వజ్రాలను కానుకగా సమర్పించిన వార్త అప్పట్లో సంచలనమైంది. ఆనాటి నుంచి ఆధ్యాత్మిక గురువుగా కొనసాగుతూనే వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్నారు. వీళ్ల ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పలు ప్రపంచ దేశాల్లో వందలాది ఆస్పత్రులు సేవలందిస్తున్నాయి. ఏటా ఒక బిలియన్ డాలర్ల మేర లాభాపేక్షలేని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆగా ఖాన్ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బ్రిటన్ రాజు ఛార్లెస్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు ప్రపంచదేశాల అధినేతలు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మరోవైపు ఇస్మాయిలీ ముస్లింల నూతన ఆధ్యాత్మిక గురువుగా ఆగాఖాన్4 కుమారుడు రహీమ్ అల్ హుస్సేనీ పేరును ప్రకటించారు. 50వ గురువుగా ఈయనను ఇకపై ఆగాఖాన్–5గా పిలవనున్నారు. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ హెడ్ కోచ్గా పోర్చుగల్ స్టార్
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఐ–లీగ్ టోర్నీలో గత రెండు సీజన్లలో రన్నరప్గా నిలిచిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. పోర్చుగల్కు చెందిన రుయ్ అమోరిమ్ తక్షణమే హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించి రాబోయే సీజన్ కోసం శ్రీనిధి జట్టును సిద్ధం చేయనున్నాడు. గత సీజన్లో హెడ్ కోచ్గా ఉన్న డొమింగొ ఒరామస్ ఇటీవల రాజీనామా చేయడంతో అతని స్థానంలో అమోరిమ్ వచ్చాడు.ఇక.. 2008 నుంచి అంతర్జాతీయ క్లబ్ ఫుట్బాల్లో కోచ్గా పని చేస్తున్న 47 ఏళ్ల అమోరిమ్ ఇప్పటి వరకు 10 క్లబ్కు కోచ్గా వ్యవహరించాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన ఎస్సీ నోజ్మో క్లబ్ జట్టుకు ఈనెల 14 వరకు అమోరిమ్ కోచ్గా పని చేసి అక్కడి నుంచి శ్రీనిధి డెక్కన్ క్లబ్కు రానున్నారు. ‘శ్రీనిధి డెక్కన్ జట్టులో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నాను. నా అనుభవాన్ని పంచుకొని జట్టు మరింత ఉన్నతస్థితికి ఎదిగేందుకు కృషి చేస్తా’ అని అమోరిమ్ వ్యాఖ్యానించాడు. మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ బోణీ చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టు మొదటి విజయాన్ని అందుకుంది. భారత్లోని అతి పురాతన ఫుట్బాల్ క్లబ్లలో ఒకటైన మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్... గురువారం జరిగిన తమ మూడో లీగ్ మ్యాచ్లో 1–0 గోల్ తేడాతో చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ను ఓడించింది. ఆట 39వ నిమిషంలో లాల్రెమ్సంగా ఫనాయ్ గోల్ సాధించి మొహమ్మదాన్ జట్టుకు విజయాన్ని అందించాడు.కోల్కతాలో 1889లో ఏర్పాటైన మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ గత ఏడాది భారత దేశవాళీ టోర్నీ ఐ–లీగ్లో విజేతగా నిలిచి ఐఎస్ఎల్లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. మొత్తం 13 జట్లు పోటీపడుతున్న ఐఎస్ఎల్లో ప్రస్తుతం మొహమ్మదాన్ జట్టు మూడు మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్లో గెలిచి, మరో మ్యాచ్లో ఓడి, ఇంకో మ్యాచ్ను ‘డ్రా’ చేసుకొని నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కోల్కతా వేదికగా నేడు జరిగే మ్యాచ్లో గోవా ఎఫ్సీ జట్టుతో ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీ జట్టు తలపడుతుంది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో స్నేహిత్ ఓటమి బీజింగ్: చైనా స్మాష్–2024 వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్లో భారత్ తరఫున నలుగురు ప్లేయర్లు బరిలోకి దిగారు. మనుశ్ ఉత్పల్భాయ్ షా మినహా మిగతా ముగ్గురు తొలి రౌండ్లోనే ఓడిపోయారు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ 11–6, 7–11, 3–11, 3–11తో మా జిన్బావో (అమెరికా) చేతిలో... హర్మీత్ దేశాయ్ 6–11, 11–9, 6–11, 11–8, 5–11తో కార్ల్సన్ (స్వీడన్) చేతిలో... సత్యన్ 9–11, 13–11, 6–11, 11–9, 4–11తో జు హైడాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. మనుశ్ షా 4–11, 11–5, 11–4, 3–11, 11–8తో చాన్ బాల్డ్విన్ (హాంకాంగ్)పై నెగ్గాడు. మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్లో తొలి రౌండ్ మ్యాచ్ల్లో అహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ తమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్కు చేరారు.సెమీఫైనల్లో రిత్విక్ చౌదరీ జోడీసాక్షి, హైదరాబాద్: బ్యాంకాక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ డబుల్స్లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. థాయ్లాండ్లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రిత్విక్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 7–6 (7/3), 7–6 (7/5)తో గాబ్రియెల్ డియాలో (కెనడా)–సీటా వతనాబె (జపాన్) జోడీని ఓడించింది.గంటా 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు జంటలు తమ సర్వీస్ను రెండుసార్లు చొప్పున కోల్పోయాయి. అయితే టైబ్రేక్లో రిత్విక్–అర్జున్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. ఇదే టోర్నీలో ఆడుతున్న రామ్కుమార్ రామనాథన్ (భారత్)–తొష్హిడె మత్సుయ్ (జపాన్) జోడీ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో రామ్–తొష్హిడె జంట 6–3, 6–4తో అలెజాంద్రో మొరో కనాస్ (స్పెయిన్)–మార్కో ట్రున్గెలిటి (అర్జెంటీనా) జోడీపై గెలిచింది. -
అత్యంత అరుదైన మైలురాయికి చేరువలో క్రిస్టియానో రొనాల్డో..!
పోర్చుగల్ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయికి చేరువయ్యాడు. ప్రస్తుతం రొనాల్డో సౌదీ సూపర్ కప్ టోరీ్నలో అల్ నాసర్ క్లబ్కు ఆడతున్నాడు. అల్ హిలాల్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో అల్ నాసర్ క్లబ్ 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అల్ నాసర్ జట్టు చేసిన ఏకైక గోల్ రొనాల్డో ద్వారా వచ్చింది. రొనాల్డో ప్రొఫెషనల్ కెరీర్లో ఇది 898వ గోల్. మరో రెండు గోల్స్ సాధిస్తే రొనాల్డో కెరీర్లో 900 గోల్స్ పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్గా గుర్తింపు పొందుతాడు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఎర్విన్ హెల్మ్చెన్ (జర్మనీ; 987 గోల్స్), జోసెఫ్ బికాన్ (ఆస్ట్రియా–చెక్ రిపబ్లిక్; 950 గోల్స్), రొనాల్డ్ లెస్లీ రూకీ (ఇంగ్లండ్; 934 గోల్స్) కెరీర్లో 900 గోల్స్ మైలురాయిని దాటారు. -
EURO 2024: పోర్చుగల్ అవుట్.. చివరి మ్యాచ్ ఆడేసిన రొనాల్డో!
యూరో కప్-2024 ఫుట్బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్కు చేదు అనుభవం ఎదురైంది. కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా రిక్తహస్తాలతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.ఈ క్రమంలో ప్రతిష్టాత్మక యూరో కప్ టోర్నీలో పోర్చుగల్ లెజెండరీ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో శకం ముగిసినట్లయింది. కాగా జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ 2024 ఎడిషన్లో స్లొవేనియాను ఓడించి క్వార్టర్స్లో అడుగుపెట్టిన పోర్చుగల్.. తాజాగా ఫ్రాన్స్తో తలపడింది.ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకనూట ఇరవై నిమిషాల పాటు సాగిన ఈ కీలక మ్యాచ్లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో పెనాల్టి షూటౌట్లో భాగంగా ఫ్రాన్స్ 5-3తో పోర్చుగల్పై పైచేయి సాధించింది. ఈ క్రమంలో కెలియన్ ఎంబాపే బృందం సెమీస్కు దూసుకెళ్లింది.మరోవైపు భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన పోర్చుగల్ ఇంటిబాట పట్టింది. కాగా 39 ఏళ్ల రొనాల్డోకు జాతీయ జట్టు తరఫున ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఇందుకు సంబంధించి ఈ పోర్చుగల్ ఆటగాడు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.ఇక ఆరోసారి యూరో కప్లో భాగమైన రొనాల్డో ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 14 గోల్స్ సాధించాడు. అయితే, ఈసారి మాత్రం షూటౌట్లో మినహా గోల్స్ స్కోర్ చేయలేకపోయాడు.పోర్చుగల్ వీరుడిగానే కాదు..అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. పోర్చుగల్ తరఫున అతడు 130 గోల్స్ కొట్టాడు.మరోవైపు.. అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ 108 గోల్స్తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, మెస్సీ ఖాతాలో వరల్డ్కప్ ఉండగా.. రొనాల్డోకు మాత్రం ఆ లోటు అలాగే ఉండిపోయింది. కాగా యూరో కప్-2024లో ఫ్రాన్స్ సెమీ ఫైనల్లో స్పెయిన్తో తలపడనుంది. -
క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్
ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ): యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే టాప్ టీమ్లలో ఒకటైన పోర్చుగల్కు విజయం అంత సులువుగా దక్కలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 57వ స్థానంలో ఉన్న స్లొవేనియా గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో స్లొవేనియా దూకుడు చూస్తే విజయం సాధించేలా అనిపించింది. కానీ చివరకు పెనాల్టీ షూటౌట్లో విజయం పోర్చుగల్ సొంతమైంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ లేకుండా 0–0తో సమంగా నిలవగా...షూటౌట్లో పోర్చుగల్ 3–0తో గెలుపొందింది. దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు నిర్ణీత సమయంలో మ్యాచ్ గెలిపించే అవకాశం వచ్చినా అది సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్లో అతను పలు అవకాశాలు వృథా చేశాడు. ఎట్టకేలకు 105వ నిమిషంలో పోర్చుగల్కు పెనాల్టీ కిక్ లభించింది. అయితే రొనాల్డో కొట్టిన ఈ కిక్ను స్లొవేనియా గోల్ కీపర్ జాన్ ఆబ్లక్ సమర్థంగా అడ్డుకున్నాడు. దాంతో రొనాల్డో కన్నీళ్లపర్యంతం కావడంతో సహచరులు సముదాయించాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు షూటౌట్లో గెలిచి పోర్చుగల్ ఊపిరి పీల్చుకుంది. పోర్చుగల్ తరఫున రొనాల్డో, బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వ గోల్స్ సాధించగా... స్లొవేనియా ఆటగాళ్లు ఎల్లిసిక్, బల్కోవెక్, వెర్బిక్ కొట్టిన షాట్లను పోర్చుగల్ కీపర్ డియాగో కోస్టా నిలువరించగలిగాడు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్తో పోర్చుగల్ తలపడుతుంది. 2016లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో పోర్చుగల్ గెలిచి చాంపియన్గా నిలిచింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నెదర్లాండ్స్ 3–0తో రొమేనియాను ఓడించి క్వార్టర్స్ చేరింది. -
Euro Cup 2024: క్వార్టర్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న ఎంబపే, రొనాల్డో జట్లు
యూరో కప్ 2024లో ఆరు క్వార్టర్ ఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. స్పెయిన్, జర్మనీ, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, ఫ్రాన్స్ జట్లు ఫైనల్-8కు చేరాయి. మరో రెండు బెర్త్లు ఖరారు కావల్సి ఉంది.ఇవాళ (జులై 2) జరిగిన మ్యాచ్లో క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్.. స్లొవేనియాపై 3-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. నిర్ణీత సమయంతో పాటు (90 నిమిషాలు) అదనపు సమయంలోనూ (30 నిమిషాలు) గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ల వరకు వెళ్లింది. పెనాల్టీ షూటౌట్స్లో పోర్చుగల్ మూడు అవకాశాలను గోల్స్గా మలచగా.. స్లొవేనియా మూడు అవకాశాలను వృధా చేసుకుంది. పోర్చుగల్ గోల్ కీపర్ డియోగో కోస్టా అద్భుతమైన ప్రదర్శన కనబర్చి స్లోవేనియా మూడు ప్రయత్నాలను అడ్డుకున్నాడు. నిర్ణీత సమయంలో లభించిన పెనాల్టీని గోల్గా మలచడంలో విఫలమైన క్రిస్టియానో రొనాల్డో.. షూటౌట్స్లో ఓ గోల్ చేశాడు. పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్లో కైలియన్ ఎంబపే జట్టు ఫ్రాన్స్తో తలపడనుంది.క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్..స్పెయిన్ వర్సెస్ జర్మనీ (జులై 5)పోర్చుగల్ వర్సెస్ ఫ్రాన్స్ (జులై 6)ఇంగ్లండ్ వర్సెస్ స్విట్జర్లాండ్ (జులై 6)నాలుగో క్వార్టర్ ఫైనల్ (జులై 7) -
జయహో జార్జియా
గెల్సెన్కిర్చెన్ (జర్మనీ): యూరో కప్ ఫుట్బాల్ టోరీ్నలో పాల్గొంటున్న తొలిసారే జార్జియా జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో జార్జియా 2–0 గోల్స్ తేడాతో 2016 చాంపియన్ పోర్చుగల్ జట్టుపై సంచలన విజయం నమోదు చేసింది. రెండో నిమిషంలోనే క్వరాత్స్కెలియా గోల్తో జార్జియా 1–0తో ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్ను మికాట్జె లక్ష్యాన్ని చేర్చడంతో జార్జియా ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న జార్జియా విజయాన్ని ఖాయం చేసుకుంది. పోర్చుగల్ దిగ్గజ ప్లేయర్, కెపె్టన్ క్రిస్టియానో రొనాల్డో 66 నిమిషాలపాటు ఆడి ఆ తర్వాత మైదానం వీడాడు. రొనాల్డోను పక్కా ప్రణాళికతో కట్టడి చేయడంలో జార్జియా డిఫెండర్లు సఫలమయ్యారు. జార్జియా చేతిలో ఓడినప్పటికీ ఇదే గ్రూప్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో నెగ్గిన పోర్చుగల్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘ఎఫ్’లోని మరో మ్యాచ్లో టర్కీ 2–1తో చెక్ రిపబ్లిక్ను ఓడించి నాకౌట్ బెర్త్ను ఖరారు చేసుకుంది. గురువారంతో యూరో టోర్నీ లీగ్ దశ మ్యాచ్లన్నీ పూర్తయ్యాయి. ఈనెల 29 నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో స్విట్జర్లాండ్తో ఇటలీ; ఇంగ్లండ్తో స్లొవేకియా; డెన్మార్క్తో జర్మనీ; స్పెయిన్తో జార్జియా; బెల్జియంతో ఫ్రాన్స్; స్లొవేనియాతో పోర్చుగల్; రొమేనియాతో నెదర్లాండ్స్; ఆ్రస్టియాతో టర్కీ తలపడతాయి. -
Euro Cup 2024: బోణీ కొట్టిన రొనాల్డో టీమ్
యూరో కప్ 2024లో దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్ బోణీ కొట్టింది. గ్రూప్-ఎఫ్లో భాగంగా ఇవాళ (జూన్ 19) జరిగిన మ్యాచ్లో పోర్చుగల్.. చెక్ రిపబ్లిక్పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో తొలి అర్ద భాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేదు. ద్వితియార్ధంలో తొలుత (62వ నిమిషంలో, లుకాస్ ప్రొవోద్) చెక్ రిపబ్లిక్, ఆతర్వాత పోర్చుగల్ (69వ నిమిషంలో, రాబిన్ హ్రనాక్) గోల్స్ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. అయితే నిర్ణీత సమయం ముగిశాక 92వ నిమిషంలో ఫ్రాన్సిస్కో అద్భుతమైన గోల్ చేయడంతో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది.చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డోచెక్ రిపబ్లిక్తో మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. రొనాల్డో ఆరు యూరో కప్లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రొనాల్డో 2004, 2008, 2012, 206, 2020, 2024 ఎడిషన్లలో పాల్గొన్నాడు. రొనాల్డో తర్వాత క్రొయేషియా ఆటగాడు లూకా మోడ్రిక్, పోర్చుగల్ ఆటగాడు పెపె అత్యధికంగా ఐదు యూరో కప్లు ఆడాడు.జార్జియాను చిత్తు చేసిన తుర్కియేగ్రూప్-ఎఫ్లో భాగంగా నిన్న జరిగిన మరో మ్యాచ్లో జార్జియాపై తుర్కియే 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తుర్కియే తరఫున మెర్ట్ ముల్దర్ (25వ నిమిషం), ఆర్దా గులెర్ (65వ నిమిషం), ముహమ్మెద్ కెరెమ్ (97వ నిమిషం) గోల్స్ చేయగా.. జార్జియా తరఫున జార్జెస్ 32వ నిమిషంలో గోల్ చేశాడు.ఇవాల్టి మ్యాచ్లు..క్రొయేషియా వర్సెస్ అల్బేనియా (గ్రూప్-బి)జర్మనీ వర్సెస్ హంగేరీ (గ్రూప్-ఏ) -
వీడియో: గాల్లో రెండు విమానాలు ఢీ.. పైలట్ మృతి
లిస్బన్: పోర్చుగల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ పోర్చుగల్లో జరుగుతున్న ఎయిర్షో కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. గాల్లోనే రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొన్న కారణంగా పైలట్ మృతిచెందాడు.వివరాల ప్రకారం.. దక్షిణ పోర్చుగల్లోని బెజాలో ఎయిర్షో జరుగుతోంది. ఈ ఎయిర్ షో కార్యక్రమంలో మొత్తం ఆరు విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. కాగా, ఆదివారం ఎయిర్షో సందర్భంగా ఒక విమానం వేగంగా పైకి దూసుకెళ్లి మరోదాన్ని ఢీకొట్టింది. దీంతో రెండూ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకటి ఎయిర్బేస్కు అవతల పడిపోగా మరొకటి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్పెయిన్కు చెందిన పైలట్ మృతిచెందాడు. మరో పైలట్(పోర్చుగల్)కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక, పోర్చుగల్, స్పెయిన్కు చెందిన పైలట్లతో కూడిన ‘యాక్ స్టార్స్’ అనే ఏరోబాటిక్ గ్రూప్ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్ యాక్-52 రకానికి చెందినవి. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో గుర్తిస్తామని పోర్చుగల్ రక్షణమంత్రి నునో మెలో తెలిపారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #Breaking : Planes collide at Portugal air show, killing at least one. pic.twitter.com/NFY2fxWtZ3— The Spot (@Spotnewsth) June 2, 2024 -
Viral Video: కన్నీటి పర్యంతమైన క్రిస్టియానో రొనాల్డో
దిగ్గజ ఫుట్బాలర్, పోర్చుగల్ స్టార్, అల్ నసర్ క్లబ్ తురుపు ముక్క క్రిస్టియానో రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. కింగ్ కప్ ఫైనల్లో తన జట్టు ఓటమిని జీర్ణించుకోలేని రొనాల్డో భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు. సహచరులు ఎంత ఓదార్చే ప్రయత్నం చేసినా రొనాల్డో కన్నీళ్లు ఆగలేదు. మైదానంలో చాలా సేపు కూర్చుని బాధతో కృంగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. రొనాల్డో బాధను చూసి నెటిజన్లు సైతం భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఆట పట్ల స్టార్ ఫుట్బాలర్కు ఉన్న కమిట్మెంట్కు జేజేలు పలుకుతున్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించినా.. క్లబ్ తరఫున ఆడినా రొనాల్డో ప్యాషన్ ఒకే తీరులో ఉంటుందని కితాబునిస్తున్నారు.Nothing hurts a football fan more than seeing Ronaldo cry pic.twitter.com/YSMsZKBE9z— Trey (@UTDTrey) May 31, 2024కాగా, సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నిన్న (మే 31) జరిగిన కింగ్ ఆఫ్ ఛాంపియన్ కప్ ఫైనల్లో రొనాల్డో ప్రాతినిథ్యం వహించిన అల్ నసర్ జట్టు.. చిరకాల ప్రత్యర్ది అల్ హిలాల్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత ఈ మ్యాచ్ (ఎక్స్ట్రా సమయం తర్వాత) 1-1తో టై కాగా.. పెనాల్టీ షూటౌట్లో అల్ హిలాల్.. 5-4 తేడాతో అల్ నసర్పై పైచేయి సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. నిర్ణీత సమయంలో అల్ హిలాల్ తరఫున అలెగ్జాండర్ మిత్రోవిచ్ (7వ నిమిషం).. ఆల్ నసర్ తరఫున అయ్మాన్ యాహ్యా (88వ నిమిషం) గోల్స్ చేశారు.ఇదిలా ఉంటే, అల్ హిలాల్ జట్టు ఇటీవల ముగిసిన సౌదీ ప్రో లీగ్లో కనీవినీ ఎరుగని ప్రదర్శనలు చేసి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ ఎడిషన్లో అల్ హిలాల్ రికార్డు స్థాయిలో 34 మ్యాచ్ల్లో 31 విజయాలు సాధించి టైటిల్ను ఎగరేసుకుపోయింది. క్లబ్ ఫుట్బాల్ చరిత్రలో ఏ జట్టు ఈ స్థాయి విజయాలు సాధించలేదు. ఈ లీగ్లో కూడా రొనాల్డో జట్టు అల్ నసర్ రన్నరప్తో సరిపెట్టకుంది. రొనాల్డో తదుపరి UEFA యూరో ఛాంపియన్షిప్ 2024లో పాల్గొననున్నాడు. ఈ టోర్నీలో క్రిస్ తన జాతీయ జట్టైన పోర్చుగల్కు ప్రాతినిథ్యం వహిస్తాడు. -
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
ఉల్కాపాతం.. ఈ పేరు చాలామందికి తెలియంది కాదు. ఆకాశం నుంచి ప్రకాశవంతంగా దూసుకొస్తూ.. భూమ్మీద మీద పడే సమయంలో అవి మెరుస్తూ అద్భుతాన్ని తలపిస్తుంటాయి. అయితే.. తాజాగా శనివారం రాత్రి అలాంటి అనుభూతిని పొందారు స్పెయిన్, పోర్చుగల్ ప్రజలు. స్పెయిన్, పొరుగు దేశం పొర్చుగల్ ప్రజలు శనివారం రాత్రి ఆకాశంలో అరుదైన కాంతిని వీక్షించారు. నీలి రంగులో మెరుస్తూ ఉల్క ఒకటి భూమ్మీదకు రయ్మని దూసుకొచ్చింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాహనాల్లో వెళ్లే వాళ్లు, పార్టీలు చేసుకునేవాళ్లు.. అనుకోకుండా ఆ దృశ్యాలను బంధించారు. Tires, Cascais, Portugal. ☄️#Tires #Cascais#Portugal #Fireball #Meteor #meteoro #meteorito #España#Spainpic.twitter.com/HDtnhQEYG7— Mr. Shaz (@Wh_So_Serious) May 19, 2024అవి చూసి భూమ్మీదకు సూపర్ పవర్ ఏదైనా దూసుకొచ్చిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు పలువురు. తోక చుక్కలు, ఉల్కాపాతంను కనివినీ ఎరుగని ఒక జనరేషన్ అయితే.. ఈ దృశ్యాల్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఇది ఏలియన్ల పనేనా?.. సూపర్ పవర్ ఏదైనా భూమ్మీదకు వచ్చిందా? అంటూ తమదైన ఎగ్జయిట్మెంట్ను ప్రదర్శిస్తోంది. A meteor lit up the sky with bright light during the night in Portugal and Spain.Source: X#Meteor #Spain #Portugal #Fireball #Sky #DTNext #DTnextNews pic.twitter.com/09Ma6GO0sg— DT Next (@dt_next) May 19, 2024అయితే ఆ ఉల్క ఎక్కడ పడిందనేదానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కొందరు మాత్రం కాస్ట్రో డెయిర్లో పడిందని, మరికొందరేమో పిన్హెయిరోలో పడిందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. JUST IN: Meteor spotted in the skies over Spain and Portugal.This is insane.Early reports claim that the blue flash could be seen darting through the night sky for hundreds of kilometers.At the moment, it has not been confirmed if it hit the Earth’s surface however some… pic.twitter.com/PNMs2CDkW9— Collin Rugg (@CollinRugg) May 19, 2024 రెండు వారాల కిందటే.. అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్క పడొచ్చని అంచనా వేశారు. హెలీ తోకచుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా రాబోయే రోజుల్లో ఉల్కాపాతం ఎక్కువే ఉండొచ్చని వాళ్లు అంచనా వేస్తున్నారు. -
పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. ఆ ఆరోపణలే కారణం
లిస్బన్: అవినీతి ఆరోపణలపై పోర్చుగల్ ప్రధానమంత్రి కోస్టా రాజీనామా చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, లిథియం గనుల కుంభకోణాలకు సంబంధించి ఆయన ఇంటిపై ఇటీవల పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో భాగంగా కోస్టా ముఖ్య సలహాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అవినీతి కేసులో కోస్టాపై దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కోస్టా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని కోస్టా స్పష్టం చేశారు. దర్యాప్తులో ఏం తేలినప్పటికీ తాను మళ్లీ ప్రధాని పదవి చేపట్టనని ఆయన తేల్చి చెప్పారు. కోస్టా రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంట్ను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో తెలిపారు. దేశంలో మళ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదన్నారు. అయితే సోషలిస్టులు మరో నేత ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోస్టా ఆధ్వర్యంలో పోర్చుగల్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించింది. పర్యాటక రంగం పరుగులు పెట్టింది. పెట్టుబడిదారులకు పోర్చుగల్ గమ్యస్థానంగా మారింది. ఇదీ చదవండి.. థాయ్ మాజీ ప్రధానికి పెరోల్ -
ఆ దీవి భూతల స్వరం! సకల ప్రకృతి..
ప్రకృతి వైవిధ్యమంతా ఆ దీవిలో ఒకేచోట కనువిందు చేస్తుంది. అందుకే పర్యాటక నిపుణులు ఆ దీవిని ‘ప్యారడైజ్ ఆన్ ఎర్త్’ అని అభివర్ణిస్తున్నారు. ‘ఇలా దాస్ ఫ్లోరిస్’ అనే ఈ దీవి పోర్చుగల్లో ఉంది. ఈ దీవిలో అందమైన బీచ్లు మాత్రమే కాదు, సహజమైన సరోవరాలు, జలపాతాలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు చుట్టూ పచ్చగా కనిపించే దట్టమైన వనాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. గుత్తులు గుత్తులుగా రంగు రంగుల పూలతో అలరారే అపురూపమైన ‘హైడ్రేంజ’ మొక్కలు ఈ దీవిలో విరివిగా ఉండటంతో ఈ దీవికి ‘ఇలా దాస్ ఫ్లోరిస్’– అంటే పూలదీవి అనే పేరువచ్చింది. ఈ దీవి తీరంలో డాల్ఫిన్లు విరివిగా కనిపిస్తాయి. ఈతకొడుతూ సేదదీరాలనుకునే వారికి, కొండలపై ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఈ దీవి అనువుగా ఉంటుంది. ఈ దీవిలో జనాల సందడి చాలా తక్కువ. చాలా చోట్ల ఖాళీగా మిగిలిన ఊళ్లు, ఆ ఊళ్లలోని పాతకాలం ఇళ్లు కనిపిస్తాయి. ఈ దీవికి వెళ్లే పర్యాటకులు కొందరు ఖాళీ ఊళ్లలో ఖాళీగా మిగిలిన పాత ఇళ్లనే శుభ్రం చేసుకుని తాత్కాలికంగా బస చేస్తుంటారు. పర్యాటకుల రాక ఇటీవలి కాలంలో పెరుగుతుండటంతో పోర్చుగల్ ప్రభుత్వం ఇక్కడ ఖాళీగా మిగిలిన ఊళ్లలోని ఇళ్లకు మరమ్మతులు జరిపి, వాటిని కాటేజీలుగా మార్చి పర్యాటకులకు అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది. ‘ఫోర్బ్స్’ పత్రిక ఈ దీవిని యూరోప్లో వెలుగుచూడని రత్నాలలో ఒకటిగా అభివర్ణించడం విశేషం. (చదవండి: దశకుంచెల చిత్రకారుడు! ఏకకాలంలో రెండు చేతులతో..) -
Web Summit Lisbon: కలలను వదులుకోవద్దు...
ప్రపంచంలోనే అతిపెద్దదైన టెక్ కాన్ఫరెన్స్ వెబ్ సమ్మిట్ ఇటీవల పోర్చుగల్ రాజధాని లిస్బన్లో జరిగింది. ఈ వెబ్ సమ్మిట్కు 153 దేశాల నుండి 70 వేల మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. వారిలో 43 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో మహిళలు పాల్గొన్న ఈవెంట్గా ఈ సదస్సు వార్తల్లో నిలిచింది. గ్లోబల్ టెక్ ఇండస్ట్రీని రీ డిజైన్ చేయడానికి ఒక ఈవెంట్గా వెబ్ సమ్మిట్ను పేర్కొంటారు. ఇందులో 2,608 స్టార్టప్లు పాల్గొన్నాయి. వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి, వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త టెక్నాలజీని అందుకోవడానికి, సార్టప్లను ప్రదర్శించడానికి ఈ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఇందులో స్టార్టప్ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు, క్రియేటివ్ బృందాలు, ఇన్వెస్టర్లు.. పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏమంటే ప్రతి మూడవ స్టార్టప్... మహిళ సృష్టించినదే అయి ఉండటం. వెబ్సమ్మిట్ సీఈవో కేథరీన్ మహర్ ఈవెంట్ ప్రారంభంలో ‘స్టార్టప్స్ని మరింత శక్తిమంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం’గా పేర్కొన్నారు. స్టార్టప్స్.. నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది తమ స్టార్టప్ల ద్వారా వెబ్ సమ్మిట్కు అప్లై చేసుకున్నారు. వాటిలో ఎంపిక చేసిన స్టార్టప్లను సమ్మిట్ ఆహ్వానించింది. కమ్యూనిటీ, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థలపై సానుకూల ప్రభావం చూపే విధంగా పనిచేసే స్టార్టప్ల విభాగంలో 250 కంటే ఎక్కువ ఉన్నాయి. వంద మెంటార్ అవర్స్ సెషన్స్ ద్వారా 800 కంటే ఎక్కువ స్టార్టప్లు ఎక్స్పర్ట్స్ నుండి నైపుణ్యాలను నేర్చుకుంటారు. స్టార్టప్లలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమలలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, హెల్త్టెక్, వెల్నెస్, ఫిన్టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సస్టైనబిలిటీ, క్లీన్టెక్ .. వంటివి ఉన్నాయి. కార్యాలయాలలో వేధింపులు ఈవెంట్కు హాజరైన వారిలో మొత్తం 43 శాతం మంది మహిళలు ఉంటే, అత్యధికంగా 38 శాతం కంటే ఎక్కువ మంది మహిళా స్పీకర్లు ఉండటం విశేషం. అన్ని ఎగ్జిబిట్ స్టార్టప్ ఫౌండర్లలో దాదాపు మూడింట ఒక వంతు మహిళలే ఉన్నారు. ఈ సందర్భంగా వెబ్ సమ్మిట్ తన వార్షిక స్టేట్ ఆఫ్ జెండర్ ఈక్విటీ ఇన్ టెక్ నివేదికనూ విడుదల చేసింది. దాదాపు సగం మంది మహిళలు కార్యాలయంలో జెండర్ వివక్షను ఎదుర్కోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. 53.6 శాతం మంది గడిచిన ఏడాదిలో తమ తమ ఆఫీసులలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. 63.1 శాతం మంది పెట్టుబడిదారులు కృత్రిమ మేధస్సు, యంత్రాలని నమ్మి తమ స్టారప్లలో వృద్ధిని సాధించినట్టు తెలియజేస్తే 43.2 శాతం మంది మాత్రం తమ కంపెనీలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచినట్టు పేర్కొన్నారు. అయినా, సీనియర్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య గత ఏడాది కంటే 75 శాతం నుంచి 66.7 శాతానికి తగ్గినట్టు గుర్తించారు. ఈ సమ్మిట్... ప్రపంచంలో మహిళ స్థానం ఎలా ఉందో మరోసారి తెలియజేసింది. ప్రపంచానికి మహిళ పోర్చుగీస్ ఆర్థికమంత్రి ఆంటోనియా కోస్టా ఇ సిల్వా మాట్లాడుతూ ‘టెక్ ప్రపంచంలో ఎక్కువమంది మహిళలు అగ్రస్థానంలో ఉండాలి. వారి అవసరం ఈ ప్రపంచానికి ఎంతో ఉంది. మీ కలలను వదులుకోవద్దు. మహిళలకు అసాధారణమైన సామర్థ్యం ఉంది. సంక్షిష్టంగా ఉన్న ఈ ప్రపంచంలో మహిళల మల్టీ టాస్కింVŠ మైండ్ చాలా అవసరం’ అని పేర్కొన్నారు. ఆశలకు, స్నేహానికి, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడానికి, మన కాలపు సమస్యలను సవాల్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఒక చోట చేర్చడానికి వెబ్ సమ్మిట్ గొప్ప వేదిక’ అన్నారు. ఇలాంటి అత్యున్నత వేదికలు ప్రపంచ మహిళ స్థానాన్ని, నైపుణ్యాలను, ఇబ్బందులను అందరి ముందుకు తీసుకువస్తూనే ఉంటాయి. మహిళలు తమ ఉన్నతి కోసం అన్నింటా పోరాటం చేయక తప్పదనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉంటాయి. -
అక్కడ వరదలా.. వీధుల గుండా "వైన్ ప్రవాహం"..షాక్లో ప్రజలు
మందుబాబులకు వైన్లాంటి బాటిల్ కనపడితే పండగే. ఎవ్వరైన ఫ్రీగా ఇచ్చినా వారి ఆనందానికి అంతుపొత్తు ఉండదు. అలా కాకుండా వైన్ ఓ నదిలా ఉప్పోంగి వరదాల విరుచుకుపడితే ఎలా ఉంటుంది. ఇళ్లన్నింటిని వైన్ వరద ముంచెత్తింది.ఈ హఠాత్పరిణమానికి ప్రజలంతా షాక్కి గురయ్యారు. అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఈ షాకింగ్ ఘటన పోర్చుగల్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోర్చుగల్లోని సావో లోరెంకో డిబైరోలో ఆదివారం ఈ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఆ చిన్న పట్టణంలోని వీధులన్నీ వైన్తో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు ఆ వైన్ప్రవాహానికి నేలమట్టమయ్యాయి. ఏంటి ప్రకృతి విపత్తు అన్నంతగా ఓ నది పొంగి వరదాల బీభత్సం సృష్టించినట్లు వైన్ వరదాల కొట్టుకొచ్చింది. ఈ రహస్యమైన వైన్ నది ఎక్కడది. ఇదెలా సాధ్యం అని సందేహాలు ప్రజల్లో తలెత్తాయి. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళానికి గురయ్యారు ప్రజలు. ఒలింపిక్లో ఉండే స్మిమ్మింగ్ పూల్ని నింపేంత వైన్ కొట్టుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ రహస్యమైన వైన నది టౌన్ డిస్టిలరీ నుంచి ఉద్భవించిందని పేర్కొన్నారు. ఇక్కడ రెండు మిలియన్ లీటర్లకు పైగా రెడ్ వైన్ బారెల్స్ను మోసుకెళ్లే ట్యాంకులు ఉన్నాయని, అవి అనుకోకుండా పగిలిపోవడంతో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు అధికారులు. ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక విభాగాన్ని రంగంలోకి దింపారు. అగ్నిమాపక సిబ్బంది వైన్నదిలా ఉగ్రరూపం దాల్చిన ఈ స్టెరిమా నది ప్రవాహాన్ని దారిమళ్లించి సమీపంలోని పోలాల్లోకి వెళ్లేలా చేశారు. అధికారులు ఈ అనుహ్య ఘటనకు ప్రజలకు క్షమాపణలు తెలిపారు. వైన్ నీటితో బురదమయంగా మారిన భూమిని డ్రైగా చేసి యథాస్థితికి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చింది. ఈ వైన్ వరద కారణంగా జరిగిన నష్టాన్ని, ఏర్పరిచిన బురదను క్లీన్ చేసి మరమత్తులు నిర్వహించడమే గాక ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. The citizens of Levira, Portugal were in for a shock when 2.2 million liters of red wine came roaring down their streets on Sunday. The liquid originated from the Levira Distillery, also located in the Anadia region, where it had been resting in wine tanks awaiting bottling. pic.twitter.com/lTUNUOPh9B — Boyz Bot (@Boyzbot1) September 12, 2023 (చదవండి: సాఫ్ట్వేర్ చిన్నారి! ఏకంగా వీడియో గేమ్లనే రూపొందిస్తోంది!) -
రొనాల్డో ఖాతాలో మరో ట్రోఫీ
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రెండేళ్ల తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్లో మరో ట్రోఫీని అందుకున్నాడు. తొలిసారి ఆసియాకు చెందిన అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా) తరఫున బరిలోకి దిగిన రొనాల్డో తన జట్టును అరబ్ క్లబ్ చాంపియన్స్ కప్లో విజేతగా నిలిపాడు. అల్ హిలాల్ క్లబ్తో జరిగిన ఫైనల్లో రొనాల్డో కెప్టెన్సీ లోని అల్ నాసర్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. రొనాల్డో రెండు గోల్స్ (74వ, 98వ ని.లో) చేశాడు. -
రొనాల్డో అరుదైన ఘనత.. గిన్నిస్ రికార్డుతో చరిత్ర! అతడి తర్వాత..
Cristiano Ronaldo World Record- రెక్జావిక్ (ఐస్లాండ్): పోర్చుగల్ ఫుట్బాల్ జట్టు దిగ్గజం, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయి అందుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలో జాతీయ జట్టు తరఫున 200 మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూరో–2024 చాంపియన్షిప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గ్రూప్ ‘జె’లో ఐస్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రొనాల్డో బరిలోకి దిగడంద్వారా 200 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. 38 ఏళ్ల రొనాల్డో ఆట 89వ నిమిషంలో చేసిన గోల్తో ఈ మ్యాచ్లో పోర్చుగల్ 1–0తో ఐస్లాండ్ను ఓడించింది. గ్రూప్ ‘జె’లో పోర్చుగల్కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు కూడా రొనాల్డో (123 గోల్స్) పేరిటే ఉంది. మ్యాచ్కు ముందు రొనాల్డో ఘనతకు గుర్తింపుగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ సర్టిఫికెట్ను అందజేసింది. 2003 నుంచి పోర్చుగల్ జాతీయ సీనియర్ జట్టుకు ఆడుతున్న రొనాల్డో వరుసగా ఐదు ప్రపంచకప్లలో గోల్స్ చేసిన ఏకైక ప్లేయర్గా నిలిచాడు. రొనాల్డో కెప్టెన్సీలో పోర్చుగల్ 2016 తొలిసారి యూరో చాంపియన్గా అవతరించింది. ప్రొఫెషనల్ ఫుట్బాల్లో స్పోర్టింగ్ సీపీ, మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, యువెంటస్ జట్లకు ఆడిన రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రొ లీగ్లో అల్ నాసర్ క్లబ్ జట్టుకు ఆడుతున్నాడు. జాతీయ జట్టుకు అత్యధిక మ్యాచ్లు ఆడిన టాప్–10 ఆటగాళ్లు ప్లేయర్ - దేశం - మ్యాచ్లు రొనాల్డో - పోర్చుగల్ - 200 బదర్ అల్ ముతవా - కువైట్ - 196 సో చిన్ అన్ - మలేసియా - 195 అహ్మద్ హసన్ - ఈజిప్ట్ - 184 అహ్మద్ ముబారక్- ఒమన్ - 183 సెర్జియో రామోస్- స్పెయిన్ - 180 ఆండ్రెస్ గ్వార్డాడో - మెక్సికో - 179 అల్దెయా - సౌదీ అరేబియా - 178 క్లాడియో స్వారెజ్- మెక్సికో - 177 గియాన్లుగి బఫన్ - ఇటలీ - 176 . చదవండి: కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా? -
పోర్చుగల్లో ఈ ఇళ్లు చాలా ఫేమస్.. అంతలా ఏముందంటే..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది శిలాగృహం. అలాగని ఇదేదో రాతియుగం నాటిది కాదు. అచ్చంగా ఆధునిక కాలంలో నిర్మించినదే! ఇది పోర్చుగల్లోని గిమెరెస్లో ఉంది. కొండ ప్రాంతంలో ఒకదానినొకటి అతుక్కుని ఉన్న నాలుగు భారీ శిలలను తొలిచి దీనిని నిర్మించారు. ఒక స్థానిక ఇంజినీర్ ఫామ్హౌస్లా ఉపయోగించుకునేందుకు దీనిని 1972లో నిర్మించుకున్నాడు. విచిత్రమైన ఈ నిర్మాణాన్ని చూడటానికి జనాల తాకిడి నానాటికీ ఎక్కువ కావడంతో, దీని యజమాని వేరేచోట ఫామ్హౌస్ను నిర్మించుకుని తరలిపోయాడు. ఇందులోని ఫర్నిచర్ని, ఇతర వస్తువులను అలాగే ఉంచేసి, దీనిని మ్యూజియంలా మార్చడంతో, ఈ కట్టడం పోర్చుగల్లో పర్యాటక ఆకర్షణగా మారింది. -
దుమ్మురేపిన రొనాల్డో.. పోర్చుగల్ ఖాతాలో రెండో విజయం
యూరో–2024 క్వాలిఫయింగ్ టోర్నీలో మాజీ విజేత పోర్చుగల్ వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ ‘జె’లో భాగంగా సోమవారం తెల్లవారుజామున లక్సెంబర్గ్తో మ్యాచ్లో పోర్చుగల్ 6–0తో గెలిచింది. కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తన సూపర్ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ గోల్స్తో మెరిశాడు. ఆట 6వ, 31వ నిమిషంలో రొనాల్డో జట్టు తరపున గోల్స్ కొట్టాడు. మిగతావారిలో జావో ఫెలిక్స్(ఆట 15వ నిమిషం), బెనార్డో సిల్వా(ఆట 18వ నిమిషం), ఒటావియో(ఆట 77వ నిమిషం), రాఫెల్ లావో(ఆట 88వ నిమిషం)లో గోల్స్ సాధించారు. కాగా అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో ప్రస్తుతం రొనాల్డో 122వ గోల్స్తో అగ్రస్థానంలో ఉన్నాడు. లిష్టెన్స్టయిన్తో జరిగిన తొలి మ్యాచ్లోనూ రొనాల్డో రెండు గోల్స్ చేశాడు. -
చరిత్ర సృష్టించిన రొనాల్డో..
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరొక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిఫా వరల్డ్కప్లో జట్టును గెలిపించడంలో విఫలమైన రొనాల్డో జర్మనీ వేదికగా జరుగుతున్న యూరోకప్ 2024 క్వాలిఫయర్లో మాత్రం దుమ్మురేపాడు. గ్రూప్-జెలో భాగంగా గురువారం లిచెన్స్టెయిన్, పోర్చుగల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రొనాల్డోకు 197వది కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక దేశం తరపున(పోర్చుగల్) తరపున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా రొనాల్డో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు 196 మ్యాచ్లతో కువైట్కు చెందిన బాదర్ అల్-ముతావాతో సమంగా ఉన్నాడు. ఫిఫా వరల్డ్కప్లో భాగంగా మొరాకోతో జరిగిన క్వార్టర్స్ ఫైనల్ రొనాల్డోకు 196వ మ్యాచ్. ఇక మ్యాచ్లోనూ రొనాల్డో రెండు గోల్స్తో అదరగొట్టాడు. ఆట 51వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్ను గోల్గా మలిచిన రొనాల్డో ఆట 63వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో పోర్చుగల్ 4-0 తేడాతో లిచెన్స్టెయిన్ను చిత్తుగా ఓడించింది. ఇక ఓవరాల్గా పోర్చుగల్ తరపున 197 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రొనాల్డో 120 గోల్స్ కొట్టి ఆల్టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. 💚❤️1⃣9⃣7⃣ Take a bow, @Cristiano 👏👏👏#EURO2024 pic.twitter.com/ArgPz0MEYD — UEFA EURO 2024 (@EURO2024) March 23, 2023 -
బాబీ.. ఓ కురు వృద్ధ శునకం!
లిస్బన్: పోర్చుగల్ వాసికి చెందిన బాబీ అనే కుక్క ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. రఫీరో డో అలెంటెజో జాతికి చెందిన ఈ కుక్క వయసు ఫిబ్రవరి 1 నాటికి 30 ఏళ్ల 226 రోజులు. ఆస్ట్రేలియాకు చెందిన బ్లూవై అనే కుక్క 29 ఏళ్ల 5 నెలలు జీవించి 1939లో చనిపోయింది. ఈ రికార్డును బాబీ తుడిచిపెట్టింది. పోర్చుగల్ ప్రభుత్వ పెట్ డేటాబేస్ ప్రకారం దాని వయస్సును నిర్ధారించారు. ఈ జాతి కుక్కల సరాసరి ఆయుర్దాయం 12–14 ఏళ్లు. బాబీ యజమానులు పోర్చుగల్లోని కాంకెయిరోస్ గ్రామానికి చెందిన కోస్టా కుటుంబం. ఈ కుటుంబంలోని లియోనెల్ కోస్టా అనే కుర్రాడికి 8 ఏళ్లుండగా బాబీ పుట్టింది. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలుండటంతో కొన్నింటిని వదిలి పెట్టినా ఇది మాత్రం తప్పించుకుంది. ‘‘ఇంట్లో వాళ్లు తినేది ఏం పెట్టినా బాబీ తినేది. అనారోగ్య సమస్యల్లేకుండా హుషారుగా ప్రశాంతంగా ఉండేది. అదే దాని ఆయుష్షును పెంచి ఉంటుంది’ అంటారు కోస్టా. వయో భారంతో బాబీ ఇప్పుడు చురుగ్గా నడవలేకపోతోందట! చూపు కూడా తగ్గిందని కోస్టా చెప్పారు. -
ఫుట్బాల్ చరిత్రలోనే తొలిసారి..
ఫుట్బాల్ ఆటలో రెడ్,యెల్లో కార్డ్లు జారీ చేయడం సాధారణంగా చూస్తుంటాం. గ్రౌండ్లో గొడవకు దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించడం లాంటివి చేస్తే రెడ్కార్డ్ జారీ చేస్తారు. రెడ్కార్డ్ జారీ చేస్తే మ్యాచ్ ముగిసేవరకు మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టే అవకాశం ఉండదు. ఇక వార్నింగ్ ఇచ్చి వదిలేయడానికి యెల్లోకార్డ్ జారీ చేయడం చూస్తుంటాం. ఈ రెండుకార్డులు కాకుండా మరొక కార్డు ఉంటుంది. అదే వైట్కార్డ్. ఫుట్బాల్ చరిత్రలో ఈ కార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి వైట్కార్డ్ చూపించింది లేదు. తాజాగా మాత్రం మహిళల ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా రిఫరీ వైట్కార్డ్ చూపించడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. శనివారం పోర్చుగల్లో బెన్ఫికా, స్పోర్టింగ్ లిస్బన్ మధ్య మహిళల ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో కాసేపట్లో తొలి హాఫ్ ముగుస్తుందన్న దశలో స్టాండ్స్లో ఒక అభిమాని అనారోగ్యానికి గురయ్యాడు. ఇది గమనించిన రిఫరీ వైట్కార్డ్ చూపించాడు. క్రీడలో వైట్కార్డ్ అనేది క్రీడాస్పూర్తికి చిహ్నంగా పరిగణిస్తారు. రిఫరీ వైట్కార్డ్ చూపెట్టగానే మెడికల్ సిబ్బంది సదరు అభిమానికి మెడికల్ ట్రీట్మెంట్ అందించారు. జరుగుతున్నది ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి ఇరుజట్ల మేనేజ్మెంట్కు క్రీడాస్పూర్తి చూపించాలనే ఇలా చేసినట్లు రిఫరీ మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఇక పోర్చుగల్ సహా ఫుట్బాల్ అంతర దేశాలలో వైట్కార్డ్ జారీని ప్రవేశపెట్టారు. ఇటీవలే ఫుట్బాల్ అంతర్జాతీయ గవర్నింగ్ బాడీ ఆటగాడు గాయపడితే కంకషన్ ప్లేయర్(సబ్స్టిట్యూట్) వచ్చేందుకు వైట్కార్డ్ ఉపయోగించడం మొదలుపెట్టింది. అలాగే ఖతర్ 2022 వరల్డ్కప్లో గ్రూప్ స్టేజీ మ్యాచ్ల్లోనూ వైట్కార్డ్ను ప్రవేశపెట్టినప్పటికి రిఫరీలు వాటిని ఉపయోగించలేదు. తాజాగా ఒక ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్లో తొలిసారిగా వైట్కార్డ్ ఉపయోగించి రిఫరీ చరిత్ర సృష్టించాడు. As equipas médicas de Benfica e Sporting receberam cartão branco após assistirem uma pessoa que se sentiu mal na bancada 👏 pic.twitter.com/ihin0FAlJF — B24 (@B24PT) January 21, 2023 చదవండి: 'అలా అయితేనే టీమిండియాను కొట్టగలం'.. ఆసీస్కు సూచనలు 'పంత్ త్వరగా కోలుకోవాలి'.. టీమిండియా క్రికెటర్ల పూజలు -
Cristiano Ronaldo: కళ్లు చెదిరే రీతిలో.. కాసుల పంట
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు బంపరాఫర్ తగిలింది. ఫిఫా వరల్డ్కప్కు ముందే మాంచెస్టర్ యునైటెడ్తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో అప్పటినుంచి ఏ క్లబ్కు సంతకం చేయలేదు. తాజాగా ఆ ఎదురుచూపులకు రొనాల్డో తెరదించాడు. ఇకనుంచి రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు అల్ నజర్ ఫుట్బాల్ క్లబ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2023 సీజన్ నుంచి 2025 జూన్ వరకూ (రెండేండ్లు) రొనాల్డో.. అల్ నజర్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్ విలువ 200 మిలియన్ యూరోలకు పైగా ఉందని సమాచారం. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1770 కోట్లు. ఫిఫా ప్రపంచకప్ సందర్భంలో ఇదే డీల్ పై పలు రకాల కథనాలు వినిపించాయి. అప్పుడు రొనాల్డో వీటిని కొట్టిపారేసాడు. తాను ఎవరితో ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పాడు. కానీ ఇప్పుడు భారీ డీల్తో ప్రేక్షకుల ముందు రావడం గమనార్హం. ఇక ఫిఫా ప్రపంచకప్లోనూ రొనాల్డో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్గా పోర్చుగల్ను ఫైనల్ చేరుస్తాడనుకుంటే క్వార్టర్స్కే పరిమితమయ్యాడు. అంతేగాక ఈ ఫిఫా వరల్డ్కప్లో ఐదు మ్యాచ్లాడిన రొనాల్డో కేవలం ఒకే ఒక్క గోల్ చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.అంతకముందు ఫిఫా ప్రారంభానికి ముందు పియర్స్ మోర్గాన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాంచెస్టర్ యునైటెడ్తో తెగదెంపులు చేసుకున్నాడు. అదీగాక మాంచెస్టర్ యునైటెడ్ హెడ్ కోచ్ తో గొడవ ఈ వివాదం మరింత ముదిరేలా చేసింది. History in the making. This is a signing that will not only inspire our club to achieve even greater success but inspire our league, our nation and future generations, boys and girls to be the best version of themselves. Welcome @Cristiano to your new home @AlNassrFC pic.twitter.com/oan7nu8NWC — AlNassr FC (@AlNassrFC_EN) December 30, 2022 చదవండి: Pele: భారత్తో అనుబంధం... నాడు సాకర్ మేనియాలో తడిసిముద్దయిన నగరం పీలే క్రేజ్కు ఉదాహరణ.. షూ లేస్ కట్టుకున్నందుకు రూ.కోటి -
పోర్చుగల్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న అడల్ట్ స్టార్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో పోర్చుగల్ కథ క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ఈసారి కచ్చితంగా కప్ కొడుతుందనుకున్న రొనాల్డో సేన అనూహ్యంగా మొరాకో చేతిలో ఓటమి పాలవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక రొనాల్డో అయితే తనకిదే చివరి మ్యాచ్ అన్నట్లుగా వెక్కివెక్కి ఏడ్చాడు. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో ఫిఫా వరల్డ్కప్లో తొలిసారి సెమీస్లో అడుగుపెట్టింది. పోర్చుగల్ ఓటమితో అభిమానులు నిరాశలో ఉంటే.. మాజీ పోర్న్ స్టార్, మోడల్ మియా ఖలీఫా మాత్రం సంబరాల్లో మునిగిపోయింది. రొనాల్డో సేన క్వార్టర్స్లో ఇంటిబాట పట్టిన సందర్భంగా మొరాకోకు కంగ్రాట్స్ చెబుతూ ఆసక్తికర ట్వీట్ చేసింది. మొరాకో జెండాను పెట్టిన పక్కన ఆశ్చర్యార్థకం గుర్తులను పెట్టింది. ఆమె చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రపంచ 9వ ర్యాంకర్ పోర్చుగల్ జట్టుతో శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మొరాకో 1–0 గోల్ తేడాతో గెలిచింది.ఆట 42వ నిమిషంలో ఎడమ వైపు నుంచి అతియత్ అలా అందించిన పాస్ను ‘డి’ ఏరియాలో యూసుఫ్ ఎన్ నెసిరి అమాంతం గాల్లోకి ఎగురుతూ ‘హెడర్’ షాట్తో బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. దాంతో మొరాకో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది. రెండో అర్థభాగం చివరి 10 నిమిషాల్లో పోర్చుగల్కు గోల్ చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా మొరాకో గోల్కీపర్ యాసిన్ బోనో వాటిని అడ్డుకున్నాడు. 90+1వ నిమిషంలో రొనాల్డో కొట్టిన షాట్ను యాసిన్ అద్భుతంగా నిలువరించాడు. ఇంజ్యూరీ టైమ్గా మ్యాచ్ను ఎనిమిది నిమిషాలు పొడిగించినా మొరాకో పట్టుదలతో ఆడి పోర్చుగల్కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్ను ఈసారైనా అందుకోవాలని ఆశించిన రొనాల్డో చివరకు కన్నీళ్లపర్యంతమవుతూ భారంగా మైదానాన్ని వీడాడు. 🇲🇦!!!!! — Mia K. (@miakhalifa) December 10, 2022 చదవండి: FIFA: ఏ టైటిళ్లు, ట్రోఫీలు అక్కర్లేదు.. దేవుడు మాకిచ్చిన వరం.. కోహ్లి భావోద్వేగం FIFA WC 2022: 'ఆ ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా.. పిల్లలు జడుసుకుంటారు' -
FIFA: ఏ టైటిళ్లు, ట్రోఫీలు అక్కర్లేదు.. దేవుడు మాకిచ్చిన వరం.. కోహ్లి భావోద్వేగం
FIFA World Cup 2022- Virat Kohli- Cristiano Ronaldo: ‘‘క్రీడా రంగానికి నువ్వు చేసిన సేవ ఎనలేనిది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులను అలరించిన తీరు మరువలేనిది.. నువ్వు ఆడుతుంటే అలా చూస్తూ ఉండిపోవడం.. కేవలం నాకే కాదు.. నాలాంటి ఎంతో మంది అభిమానులకు దేవుడిచ్చిన వరం అది. ప్రతి మ్యాచ్లోనూ నీ కఠోర శ్రమ, నీ అంకితభావం మాకు కనిపిస్తూనే ఉంటుంది. వందకు వంద శాతం ఆటకు న్యాయం చేయడమే పరమావధిగా భావించగలగడం ఆటగాడికి దక్కిన ఆశీర్వాదం లాంటిది. ప్రపంచంలోని ప్రతి ఆటగాడికి అతడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అవుతాడు. నా దృష్టిలో అత్యుత్తమ ఆటగాడి(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్- GOAT)వి నువ్వే! మా అందరిని ఇంతగా అలరించిన నువ్వు ట్రోఫీ గెలవకపోతేనేం..? టైటిల్ సాధించకపోతేనేం? అదేమీ పెద్ద విషయం కానేకాబోదు. నీ ఆట తీరుతో మా మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న నీ గురించి వర్ణించడానికి ఎలాంటి ట్రోఫీలు, టైటిళ్లు అక్కర్లేదు’’ అంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి భావోద్వేగ ట్వీట్ చేశాడు. పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను ఉద్దేశించి ఈ మేరకు ఉద్వేగపూరిత నోట్ రాశాడు. కల చెదిరింది! ఫిఫా ప్రపంచకప్-2022లో భాగంగా మొరాకో చేతిలో ఓటమితో.. టైటిల్ దిశగా సాగాలనుకున్న పోర్చుగల్ ఆశలకు గండిపడిన విషయం తెలిసిందే. దీంతో ఖతర్ వేదికగా సాగుతున్న ఈ మెగా ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లోనే పోర్చుగల్ కథ ముగిసింది. కాగా ఇంతవరకు ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కన్నీరే మిగిలింది! అదే విధంగా.. ఆ జట్టు కెప్టెన్, మేటి ఫుట్బాల్ ఆటగాడు రొనాల్డోకు ఇదే ఆఖరి వరల్డ్కప్ టోర్నీ కానుందన్న అభిప్రాయాల నేపథ్యంలో అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రపంచకప్ ట్రోఫీ సాధించాలనుకున్న 37 ఏళ్ల రొనాల్డో కల కలగానే మిగిలిపోయినట్లయింది. ఈ పరాజయాన్ని తట్టుకోలేక అతడు కన్నీటిపర్యంతమైన తీరు అభిమానుల చేత కంటతడి పెట్టించింది. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) రొనాల్డోపై కోహ్లి అభిమానం ఈ క్రమంలో రొనాల్డోపై అభిమానం చాటుకుంటూ కోహ్లి సోషల్ మీడియా వేదికగా అతడికి అండగా నిలబడ్డాడు. ఇన్స్టాలోనూ ఈ మేరకు రొనాల్డో ఫొటో పంచుకోగా.. గంటల్లోనే వైరల్గా మారింది. నాలుగు గంటల్లోనే 30 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇక 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన కోహ్లి.. కెప్టెన్గా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. అయితే, టెస్టుల్లో టీమిండియాను నంబర్ 1గా నిలపడం సహా 72 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన క్రికెటర్గా ఎన్నో ఘనతలు తన ఖాతాలో ఉన్నాయి. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! సంజూ శాంసన్కు బంపర్ ఆఫర్ ఇచ్చిన పరాయి దేశం The moment ❤️ Peter Drury's commentary of the moment ❤️🔥 You cannot not replay this special narration of the special night for #Morocco by a special commentator 🎙️#MARPOR #Qatar2022 #FIFAWorldCup #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Lh03wXs792 — JioCinema (@JioCinema) December 11, 2022 -
FIFA: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! మరీ ఇలాంటి ముగింపా?!
FIFA World Cup 2022- Cristiano Ronaldo: ఇద్దరక్కలు.. ఓ అన్న.. ఇంట్లో నాలుగో సంతానం. నిజానికి అప్పటికే పేదరికంలో మగ్గుతున్న కారణంగా ఆ తల్లి నాలుగో బిడ్డను కనకూడదు అనుకుంది. అబార్షన్ చేయించుకోవాలనుకుంది. కానీ, దేవుడు అలా జరుగనివ్వలేదు. ఆ బిడ్డ భూమ్మీద పడ్డాడు. ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించాడు. స్టార్ ఫుట్బాలర్గా ఎదిగి.. తల్లిని గర్వపడేలా చేశాడు. లెక్కకు మిక్కిలి అభిమానులు, లెక్కలేనంత డబ్బు! తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో రికార్డులు సాధించిన రారాజు.. మరీ ఇలా, ఇంత ఘోరంగా తన ప్రయాణం ముగిసిపోతుందని ఊహించి ఉండడు! ఇంతటి అవమానకర పరిస్థితుల్లో ‘ఆఖరి మ్యాచ్’ను ఆడాల్సి వస్తుందనే ఊహ కూడా కనీసం అతడి దరికి చేరి ఉండదు! కెరీర్లో ఒక్క ప్రపంచకప్ టైటిల్ అయినా ఉండాలని అతడు ఆశపడ్డాడు. అందుకు తను వందకు వందశాతం అర్హుడు కూడా! కానీ విధిరాత మరోలా ఉంది! నువ్వు ఎన్ని అంతర్జాతీయ గోల్స్ చేస్తేనేం? ఐదు ప్రతిష్టాత్మక బాలన్ డీఓర్ అవార్డులు గెలిస్తేనేం? ఎన్నెన్ని చాంపియన్స్ లీగ్ మెడల్స్ సాధిస్తేనేం? మూడు దేశాల్లో క్లబ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడివి అయితేనేం? ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఫుట్బాలర్గా నీరాజనాలు అందుకుంటేనేం? ఈ ఒక్క లోటు నిన్ను, నీ అభిమానులను జీవితాంతం వేదనకు గురిచేయడం ఖాయమన్నట్లుగా.. గుండెకోతను మిగిల్చింది. చిన్నపిల్లాడిలా అతడు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు చూసి అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. ‘‘మరేం పర్లేదు రొనాల్డో.. నువ్వు ఎప్పటికీ మా దృష్టిలో చాంపియన్వే’’ అని పైకి చెబుతున్నా.. హృదయాంతరాల్లో గూడుకట్టుకుని ఉన్న బాధ వాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు!- సాక్షి, వెబ్డెస్క్ తల్లితో రొనాల్డో వీళ్లకు ఉన్నంత పాపులారిటీ ఎవరికీ లేదు! నిజానికి ఆధునిక ఫుట్బాల్లో స్టార్లు ఎవరంటే ఠక్కున గుర్తుకువచ్చే పేర్లు.. లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. సాకర్ గురించి పెద్దగా తెలియనివాళ్లకు కూడా వీరి పేర్లు సుపరిచితమే అనడంలో సందేహం లేదు. కోట్లాది మంది అభిమానం చూరగొన్న.. చూరగొంటున్న మెస్సీ, రొనాల్డో ఆటలో తమకు తామే సాటి. తమకు తామే పోటీ. ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది మేటి ఫుట్బాలర్లు ఉన్నా వీరిద్దరికి దక్కినంత పాపులారిటీ మరెవరికి దక్కలేదనడం అతిశయోక్తి కాదు. గర్ల్ఫ్రెండ్, తమ పిల్లలతో ఇలా అదొక్కటే లోటు! చాంపియన్స్ లీగ్ సహా ఇతర క్లబ్ టోర్నీలలో తమదైన ఆట తీరుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అర్జెంటీనా స్టార్ మెస్సీ, పోర్చుగల్ మేటి ఆటగాడు రొనాల్డో.. తమ కెరీర్లో ఎన్నెన్నో రికార్డులు సాధించారు. అరుదైన ఘనతలు తమ ఖాతాలో వేసుకున్నారు. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. ఎందులోనూ వీరికి లోటు లేదు. అయితే, విచిత్రంగా ఈ ఇద్దరు ఫుట్బాల్ స్టార్లు తమ కెరీర్లో జాతీయ జట్టు తరపున ఇప్పటి వరకు ఒక్క వరల్డ్కప్ టైటిల్ కూడా గెలవకపోవడం గమనార్హం. మెస్సీ, రొనాల్డో మెస్సీ ముందడుగు.. పాపం రొనాల్డో అర్జెంటీనా ఇప్పటి వరకు రెండు సార్లు(1978, 1986) ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడగా.. పోర్చుగల్ ఖాతాలో ఒక్క టైటిల్ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్కప్-2022లో ఈ ఇద్దరు కెప్టెన్లు తమ జట్లను ముందుకు నడిపి ఫైనల్లో తలపడితే చూడాలని, ఏ ఒక్కరు గెలిచినా చరిత్ర సృష్టించడం ఖాయమంటూ ఫుట్బాల్ అభిమానులు అంచనాలు వేశారు. అంతేగాక 37 ఏళ్ల రొనాల్డో, 35 ఏళ్ల మెస్సీ తమ కెరీర్లో ఇదే ఆఖరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరో ఒకరికి ఈ ఏడాది టోర్నీ చిరస్మరణీయం కావాలని కోరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్పై అర్జెంటీనా గెలుపుతో మెస్సీ చిరకాల కల నెరవేరేందుకు ముందుడుగు పడగా.. మొరాకో చేతిలో పోర్చుగల్ ఓటమితో రొనాల్డో వరల్డ్కప్ ప్రయాణానికి తెరపడింది. అరుదైన రికార్డు ఫిఫా ప్రపంచకప్-2022లో ఘనాతో ఆరంభ మ్యాచ్లో పెనాల్టీ కిక్ను గోల్గా మలచడం ద్వారా రొనాల్డో తన ఖాతా తెరిచాడు. తద్వారా ఐదు ప్రపంచకప్లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడు రొనాల్డో. ఈ సాకర్ స్టార్ 2006 మొదలు 2010, 2014, 2018, 2022 ప్రపంచకప్లలో గోల్ చేశాడు. ఓవరాల్గా 8 గోల్స్ సాధించాడు. ఇక గ్రూప్- హెచ్లో ఉన్న పోర్చుగల్ ఈ మ్యాచ్లో 3-2తో విజయం సాధించింది. ఆ తర్వాత మాజీ చాంపియన్ ఉరుగ్వేను 2-0తో ఓడించింది. అనంతరం దక్షిణా కొరియా చేతిలో 2-1 ఓటమి పాలైనప్పటికీ గ్రూప్ టాపఱ్గా ఉన్న పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అవమానకర రీతిలో.. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా దక్షిణా కొరియా ఆటగాడితో రొనాల్డో వాగ్వాదం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ప్రిక్వార్టర్స్లో భాగంగా స్విట్జర్లాండ్తో కీలక మ్యాచ్లో కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ అయిన రొనాల్డోను పక్కనపెట్టడం ఫ్యాన్స్ అవమానకరంగా భావించారు. ఈ మ్యాచ్లో అతడి స్థానంలో వచ్చిన యువ ప్లేయర్ గొంకాలో రామోస్ హ్యాట్రిక్ గోల్స్తో మెరవగా.. స్విస్పై పోర్చుగల్ 6-1తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో స్విస్తో మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా మైదానంలోకి వచ్చిన రొనాల్డో క్వార్టర్స్ మ్యాచ్కు ముందు ప్రాక్టీసుకు డుమ్మా కొట్టినట్లుగా వార్తలు వచ్చాయి. అవమానం తట్టుకోలేకే ఇలా చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కీలక మ్యాచ్కు రొనాల్డోను పక్కనపెట్టడం పట్ల అతడి గర్ల్ఫ్రెండ్ జార్జినా కూడా అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయగా.. 50 లక్షలకు పైగా మంది ఆ పోస్టును లైక్ చేసి రొనాల్డోకు మద్దతుగా నిలిచారు. అయినా, మేనేజ్మెంట్ తీరు మారలేదు. మొరాకోతో క్వార్టర్ మ్యాచ్ ఆరంభంలోనూ రొనాల్డోను ఆడించలేదు. 51 నిమిషంలో అతడిని సబ్స్టిట్యూట్ ప్లేయర్గా బరిలోకి దించింది. ఈ క్రమంలో తనకు గోల్ కొట్టే అవకాశం రాగా.. మొరాకో గోల్ కీపర్ అడ్డుపడటంతో రొనాల్డోకు నిరాశే మిగిలింది. సెమీస్, ఆపై ఫైనల్ చేరి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలన్న పోర్చుగల్ సారథి కల ఇలా ముగిసిపోయింది. నిజానికి 2014లో ఫైనల్ వరకు వచ్చిన మెస్సీ జట్టుకు ఆఖరి మెట్టుపై అదృష్టం కలసి రాలేదు. అయితే, రొనాల్డో అంత చేరువగా కూడా ఎప్పుడూ రాలేకపోయాడు. ఇప్పుడు కూడా అంతే! ఎంతటి మొనగాడు అయితేనేం?! 18 ఏళ్ల వయసులో ఫిఫా వరల్డ్కప్-2003లో తొలిసారిగా మెగా ఈవెంట్లో ఆడిన రొనాల్డోకు టైటిల్ లేకుండానే కెరీర్ ముగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఓ ప్రెస్మీట్లో కూల్డ్రింక్ బాటిల్ను పక్కకు జరిపి.. వాటర్ గ్లాస్ అందుకున్నందుకే సదరు కంపెనీ బ్రాండ్ వాల్యూ అమాంతం పడిపోయేంత ప్రభావం చూపగల.. పాపులర్ ఆటగాడు ఇలా ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని చిన్నపిల్లాలడిగా కన్నీటిపర్యంతం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు సగటు అభిమాని. ఎంతటి మొనగాడికైనా గడ్డుకాలం అంటే ఇలాగే ఉంటుందేమోననంటూ కామెంట్లు చేస్తున్నారు. -సుష్మారెడ్డి, యాళ్ల చదవండి: Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా.. Ishan Kishan: ఇషాన్ కిషన్ గర్ల్ఫ్రెండ్ పోస్ట్ వైరల్! ఇంతకీ ఆమె ఎవరంటే! -
పోర్చుగల్కు షాకిచ్చిన మొరాకో.. సెమీఫైనల్కు చేరిన ఆఫ్రికా జట్టు
ఇప్పటి వరకు 92 ఏళ్ల ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీలో ఆఫ్రికా ఖండానికి చెందిన 13 దేశాలు 48 సార్లు బరిలోకి దిగాయి. మూడు దేశాలు కామెరూన్, ఘనా, సెనెగల్ ఒక్కోసారి క్వార్టర్ ఫైనల్ చేరి అక్కడి నుంచే ఇంటిదారి పట్టాయి. ఎట్టకేలకు 49వ ప్రయత్నంలో మొరాకో రూపంలో ఓ ఆఫ్రికా జట్టు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటి ఈ మెగా ఈవెంట్లో తొలిసారి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఖతర్కు వచ్చిన మొరాకో జట్టు క్వార్టర్ ఫైనల్లో పటిష్టమైన పోర్చుగల్ జట్టును ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో మొరాకో తలపడుతుంది. దోహా: లీగ్ దశలో ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం జట్టుపై తాము సాధించిన విజయం... గత రన్నరప్ క్రొయేషియాను 0–0తో నిలువరించడం... గాలివాటమేమీ కాదని ప్రపంచ 22వ ర్యాంకర్ మొరాకో నిరూపించింది. ఫుట్బాల్ ప్రపంచకప్లో ఆరోసారి పోటీపడిన మొరాకో ఈసారి సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రపంచ 9వ ర్యాంకర్ పోర్చుగల్ జట్టుతో శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మొరాకో 1–0 గోల్ తేడాతో గెలిచింది. తద్వారా ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా, తొలి అరబ్ దేశంగా రికార్డు నెలకొల్పింది. ఆట 42వ నిమిషంలో ఎడమ వైపు నుంచి అతియత్ అలా అందించిన పాస్ను ‘డి’ ఏరియాలో యూసుఫ్ ఎన్ నెసిరి అమాంతం గాల్లోకి ఎగురుతూ ‘హెడర్’ షాట్తో బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. దాంతో మొరాకో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది. విఖ్యాత ప్లేయర్, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్లోనూ ఆరంభంలో ఆడించలేదు. 37 ఏళ్ల రొనాల్డోను 51వ నిమిషంలో సబ్స్టిట్యూట్ ప్లేయర్గా బరిలోకి దించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్పై హ్యాట్రిక్ చేసిన గొన్సాలో రామోస్ ఈ మ్యాచ్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. మొరాకో డిఫెన్స్ కూడా పటిష్టంగా ఉండటంతో పోర్చుగల్ జట్టు ఆటగాళ్లు గోల్పోస్ట్పై గురి చూసి కొట్టలేకపోయారు. చివరి 10 నిమిషాల్లో పోర్చుగల్కు గోల్ చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా మొరాకో గోల్కీపర్ యాసిన్ బోనో వాటిని అడ్డుకున్నాడు. 90+1వ నిమిషంలో రొనాల్డో కొట్టిన షాట్ను యాసిన్ అద్భుతంగా నిలువరించాడు. ఇంజ్యూరీ టైమ్గా మ్యాచ్ను ఎనిమిది నిమిషాలు పొడిగించినా మొరాకో పట్టుదలతో ఆడి పోర్చుగల్కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్ను ఈసారైనా అందుకోవాలని ఆశించిన రొనాల్డో చివరకు కన్నీళ్లపర్యంతమవుతూ భారంగా మైదానాన్ని వీడాడు. -
ప్రాక్టీస్ సెషన్కు డుమ్మా.. అవమానం తట్టుకోలేకనేనా?
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో మంగళవారం పోర్చుగల్, స్విట్జర్లాండ్ మధ్య ప్రీక్వార్టర్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు పోర్చుగల్ కెప్టెన్.. ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను పక్కనబెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. కీలక నాకౌట్ దశలో రొనాల్డో డగౌట్లో కూర్చోవడం చాలా మందిని బాధించింది. అయితే రొనాల్డోస స్థానంలో జట్టులోకి వచ్చిన రామోస్ హ్యాట్రిక్ గోల్స్తో మెరవడం.. ఆపై మరో ముగ్గురు పోర్చుగల్ ఆటగాళ్లు గోల్స్తో దుమ్మురేపారు. దీంతో పోర్చుగల్ 6-1 తేడాతో స్విట్జర్లాండ్పై ఏకపక్ష విజయం సాధించి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే తనను జట్టు నుంచి తప్పించారన్న అవమానం తట్టుకోలేక రొనాల్డో ప్రాక్టీస్ సెషన్కు డుమ్మా కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తన జూనియర్లతో కలిసి ప్రాక్టీస్ చేయడానికి రొనాల్డో ఇష్టపడలేదని.. రోజు మొత్తం జిమ్లో గడపడానికే ప్రాధాన్యం ఇచ్చాడంటూ స్పెయిన్కు చెందిన ఒక వార్తపత్రిక తన కథనంలో వెల్లడించింది. ఇక రొనాల్డోను ఆడించకపోవడంపై జట్టు మేనేజర్ ఫెర్నాండో సాంటోస్ స్పందించాడు. ''రొనాల్డోతో విబేధాలున్నాయన్న మాట నిజం కాదు.అతను ఒక స్టార్ ఆటగాడు. రొనాల్డో లేకుండా జట్టు బలాలు, బలహీనతలు తెలుసుకోవాలని ప్రయత్నించాం. రొనాల్డో స్థానంలో జట్టులోకి వచ్చిన గొంకాలో రమోస్ సూపర్గా రాణించాడు. అలా అని రొనాల్డోను పక్కనబెట్టలేం. కానీ మొరాకోతో జరగనున్న క్వార్టర్స్లోనూ రొనాల్డో ఆడకపోవచ్చు. కొత్త వాళ్లకు అవకాశాలు రావాలి. మేం కరెక్ట్ స్ట్రాటజీతోనే వెళ్తున్నాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక స్విట్జర్లాండ్తో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్కు హాజరైన అభిమానులు రొనాల్డో.. రొనాల్డో అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఆట 73వ నిమిషంలో రొనాల్డో గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జావో ఫెలిక్స్ స్థానంలో వచ్చిన రొనాల్డో గోల్ కొట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. ఫిఫా ప్రపంచకప్ లో పోర్చుగల్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న కొద్దిరోజుల క్రితమే మాంచెస్టర్ యునైటెడ్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో మాంచెస్టర్ యూనైటెడ్ నుంచి బయటకు వచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పటినుంచి రొనాల్డో ఏ ఫ్రాంచైజీకి సంతకం చేయలేదు. అయితే సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ కు ఆడనున్నాడనే వార్తలు వస్తున్నాయి. మూడేండ్ల పాటు అల్ నజర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడని.. ప్రతీ యేటా సుమారు రూ. 600 కోట్లకు పైగా రొనాల్డోకు ముట్టజెప్పేందుకు డీల్ ఓకే అయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రొనాల్డో ఖండించాడు. చదవండి: FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా? -
పోర్చు‘గోల్స్’ మోత
దోహా: ఆరంభం నుంచి సూపర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను ఆడించకపోయినా... తమ జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదని నిరూపిస్తూ పోర్చుగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో కళ్లు చెదిరే ప్రదర్శనతో మెరిసింది. ఆద్యంతం దూకుడుగా ఆడుతూ, పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ రొనాల్డో లేకున్నా పోర్చుగల్ జట్టు భవిష్యత్కు ఢోకా లేదని నిరూపించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన చివరి ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ 6–1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్ను చిత్తుగా ఓడించి 16 ఏళ్ల తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోర్చుగల్ తరఫున తొలి ప్రపంచకప్లో ఆడుతున్న 21 ఏళ్ల గొన్సాలో రామోస్ (17వ, 51వ, 67వ ని.లో) మూడు గోల్స్తో ‘హ్యాట్రిక్’ నమోదు చేయగా... పెపె (33వ ని.లో), రాఫెల్ గెరెరో (55వ ని.లో), రాఫెల్ లియా (90+2వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. స్విట్జర్లాండ్ జట్టుకు మాన్యుయెల్ అకాంజీ (58వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. చివరిసారి 1954లో ప్రపంచకప్లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్విట్జర్లాండ్ ఆ తర్వాత ఐదుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరోవైపు ఎనిమిదోసారి ప్రపంచకప్లో ఆడుతున్న పోర్చుగల్ మూడోసారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 1966లో మూడో స్థానంలో నిలిచిన పోర్చుగల్, 2006లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 10న జరిగే క్వార్టర్ ఫైనల్లో మొరాకోతో పోర్చుగల్ తలపడుతుంది. తొలిసారి సబ్స్టిట్యూట్గా రొనాల్డో... వరుసగా ఐదో ప్రపంచకప్లో ఆడుతున్న పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తొలిసారి తుది 11 మంది జట్టులో చోటు కోల్పోయాడు. రొనాల్డో స్థానంలో గొన్సాలో రామోస్ను తొలి నిమిషం నుంచి ఆడించాలని కోచ్ ఫెర్నాండో సాంటోస్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. జాతీయ జట్టుకు ఒక్క మ్యాచ్ ఆడకుండానే నేరుగా ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించిన రామోస్ ఘనా, ఉరుగ్వేలతో మ్యాచ్ల్లో సబ్స్టిట్యూట్గా చివరి నిమిషాల్లో బరిలోకి దిగాడు. అయితే కీలకమైన మ్యాచ్లో అత్యంత అనుభవజ్ఞుడు, 37 ఏళ్ల రొనాల్డోను కాదని రామోస్ను ఆరంభం నుంచే ఆడించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే తన ఎంపిక సరైనదేనని రామోస్ నిరూపించుకున్నాడు. మూడు గోల్స్ చేయడమే కాకుండా గెరెరో గోల్ చేయడానికి రామోస్ సహాయపడ్డాడు. పోర్చుగల్ ఖాతాలో ఐదు గోల్స్ జమయ్యాక.. 74వ నిమిషంలో రొనాల్డోను జావో ఫెలిక్స్ స్థానంలో సబ్స్టిట్యూట్గా మైదానంలోకి పంపించారు. ప్రపంచకప్ మ్యాచ్ల్లో రొనాల్డో రిజర్వ్ బెంచ్కు పరిమితమై మ్యాచ్ మధ్యలో సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
FIFA WC: రొనాల్డోకు ఘోర అవమానం? బెంచ్ మీద కూర్చుని.. సిగ్గు పడండి అంటూ
FIFA World Cup 2022 Portugal Vs Switzerland- Cristiano Ronaldo: ‘‘శుభాభినందనలు పోర్చుగల్! 11 మంది ఆటగాళ్లు జాతీయ గీతం పాడుతున్న సమయంలో అభిమానుల కళ్లన్నీ నీమీదే ఉన్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగడం, ఆ 90 నిమిషాలు నీ ఆటను ఆస్వాదించకుండానే ముగిసిపోవడం నిజంగా సిగ్గుచేటు. అభిమానులు నీకోసం వెదుకుతూనే ఉన్నారు. నీ పేరును కలవరిస్తూనే ఉన్నారు. ఆ దేవుడి దయ వల్ల నీ ప్రియమైన స్నేహితుడు ఫెర్నాండో నీతో కలిసి నడవాలి. మరో మ్యాచ్లోనైనా నిన్ను చూసే అవకాశం ఇవ్వాలి’’ అంటూ పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గర్ల్ఫ్రెండ్ జార్జినా రోడ్రిగేజ్ ఆ జట్టు కోచ్ ఫెర్నాండో సాంటోస్ తీరుపై విరుచుకుపడింది. ఫిఫా వరల్డ్కప్-2022లో భాగంగా స్విట్జర్లాండ్తో కీలక మ్యాచ్లో రొనాల్డోను బెంచ్కే పరిమితం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డ జార్జినా.. ఆ తర్వాత తన పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది? ఇంతటి అవమానమా? కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో లేకుండా స్విట్జర్లాండ్తో మ్యాచ్ ఆడింది పోర్చుగల్. అతడి స్థానంలో పీప్ సారథిగా వ్యవహరించగా.. రొనాల్డో ప్లేస్ను 21 ఏళ్ల రామోస్తో భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో రొనాల్డో అభిమానులు కోచ్ ఫెర్నాండో తీరుపై విరుచుకుపడుతున్నారు. కాగా గ్రూప్ దశ చివరి మ్యాచ్లో భాగంగా దక్షిణ కొరియాతో తలపడిన సమయంలో రొనాల్డో ఆ జట్టు ప్లేయర్తో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘‘నా స్థానంలో సబ్స్టిట్యూట్ వస్తున్న సమయంలో.. సదరు కొరియా వ్యక్తి నన్ను తొందరగా వెళ్లిపోవాలంటూ చెప్పాడు. అదే వివాదానికి దారి తీసింది దీంతో అతడిని సైలెంట్గా ఉండాలని చెప్పాను. నన్ను అలా అనడానికి అతడికి అధికారం లేదు కదా. నేను ఎప్పుడు వెళ్లాలో రిఫరీ చూసుకుంటారు. అదే విషయం అతడికి చెప్పాను అంతే’’ అని పేర్కొన్నాడు. అయితే, ఆ సమయంలో మూతి మీద వేలు వేసుకంటూ ష్ అంటూ రొనాల్డో సైగ చేయడం వివాదానికి దారి తీసింది. అయితే, రొనాల్డో మాత్రం ఆ క్షణంలో అలా జరిగిపోయిందని.. ఇందులో వివాదమేమీ లేదని కొట్టిపడేశాడు. కోచ్.. ఫెర్నాండో సైతం.. ‘‘కొరియా ప్లేయర్ అలా అనడంతో రొనాల్డోకు కోపం వచ్చింది. అక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కరు చూశారు. అతడు రొనాల్డోను అవహేళన చేశాడు. మైదానాన్ని వీడాలని చెప్పాడు’’ అని పేర్కొన్నాడు. అయితే, స్విస్తో మ్యాచ్ ఆరంభానికి ముందు ఫెర్నాండో మాట్లాడుతూ.. ఆ వివాదం ముగిసింది.. కానీ నాకైతే అదంతా నచ్చలేదని పేర్కొన్నాడు. ఎందుకు పక్కనపెట్టారు? ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్తో మ్యాచ్కు రొనాల్డోను పక్కనపెట్టడం చర్చకు తావిచ్చింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రొనాల్డో గర్ల్ఫ్రెండ్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. కాగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎల్లో జెర్సీ వేసుకుని సబ్స్టిట్యూట్ బెంచ్ మీద నిర్లిప్తతో రొనాల్డో కూర్చుని ఉన్న దృశ్యాలు చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక మ్యాచ్ 74వ నిమిషంలో రొనాల్డో.. జొయావో ఫెలిక్స్కు సబ్స్టిట్యూట్గా మైదానంలోకి వచ్చాడు. ఆ సమయంలో స్టేడియం పీప్.. రొనాల్డో చేతికి కెప్టెన్ ఆర్మ్బ్యాండ్ను చుట్టాడు. ఇదిలా ఉంటే.. జట్టు వ్యూహాల్లో భాగంగానే రొనాల్డోను బెంచ్కు పరిమితం చేసినట్లు కోచ్ ఫెర్నాండో చెప్పడం కొసమెరుపు. చదవండి: FIFA WC 2022: యువ సంచలనం.. రొనాల్డోను తప్పించి జట్టులోకి తీసుకువస్తే! ఏకంగా 3 గోల్స్తో.. IND vs BAN: వారెవ్వా ఉమ్రాన్.. 151 కిమీ వేగంతో బౌలింగ్! బంగ్లా బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్ -
FIFA WC: యువ సంచలనం.. రొనాల్డోను తప్పించి జట్టులోకి తీసుకువస్తే! ఏకంగా 3 గోల్స్
FIFA World Cup 2022 Portugal Vs Switzerland: స్విట్జర్లాండ్తో కీలక మ్యాచ్లో పోర్చుగల్ ఫుట్బాలర్ గొంకాలో రామోస్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. హ్యాట్రిక్ గోల్స్తో మెరిసి ఫిఫా వరల్డ్కప్-2022 టోర్నీలో ఇప్పటి వరకు ఈ ఫీట్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. తద్వారా బుధవారం నాటి మ్యాచ్లో స్విట్జర్లాండ్ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రొనాల్డోను తప్పించి.. 21 ఏళ్ల రామోస్ మూడు గోల్స్(17, 51, 67వ నిమిషంలో) సాధించి జట్టును గెలిపించాడు. తద్వారా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను బెంచ్కు పరిమితం చేసి.. అతడి స్థానంలో తనను తీసుకువచ్చిన కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక రామోస్కు తోడు.. కెప్టెన్ పీప్, రాఫేల్ గెరీరో, రాఫేల్ లియో రామోస్ గోల్స్ చేయడంతో పోర్చుగల్ స్విస్ను 6-1తో చిత్తుగా ఓడించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ముచ్చటగా మూడోసారి స్విస్ ఆటగాళ్లలో మాన్యూల్ అకంజీ ఒక గోల్ సాధించాడు. కాగా ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో పోర్చుగల్ క్వార్టర్స్కు చేరడం ఇది మూడో సారి. గతంలో 1966, 2006లో ఈ ఫీట్ సాధించింది. ఇక క్వార్టర్స్ ఫైనల్లో పోర్చుగల్.. మొరాకోతో తలపడనుంది. రొనాల్డో ఫ్యాన్స్ ఆగ్రహం ఈ మ్యాచ్ సెకండాఫ్లో (74వ నిమిషంలో) రొనాల్డో మైదానంలోకి వచ్చాడు. జొయావో ఫెలిక్స్కు సబ్స్టిట్యూట్గా రొనాల్డోను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రొనాల్డో అభిమానులు కోచ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Steps into Ronaldo's shoes & raises the roof 📈 Watch how #Portugal's hat-trick hero Goncalo Ramos 🔥 up the Lusail Stadium in #PORSUI 🙌 Stay tuned to #JioCinema & #Sports18 for all the LIVE action from #FIFAWorldCup 📊#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/H9TaLmy7gh — JioCinema (@JioCinema) December 6, 2022 -
మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన?
సూపర్స్టార్ క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు ఫిఫా వరల్డ్కప్లో రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్ దశలో పోర్చుగల్ తమ ఆఖరి మ్యాచ్ సౌత్ కొరియా చేతిలో ఓటమి పాలైంది. అయితే అప్పటికే రెండు విజయాలు సాధించిన పోర్చుగల్ తమతో పాటు దక్షిణ కొరియాను రౌండ్ ఆఫ్ 16కు తీసుకెళ్లింది. అయితే రొనాల్డో లాంగ్టైమ్ గర్ల్ఫ్రెండ్ జార్జినా రోడ్రిగేజ్ ఖతర్లో సందడి చేసింది. వీరిద్దరు 2016 నుంచి రిలేషిన్షిప్లో ఉన్నారు. ఫిఫా వరల్డ్కప్లో పోర్చుగల్ ఆడిన తొలి రెండు మ్యాచ్లకు జార్జినా హాజరు కాలేదు. సౌత్ కొరియాతో మ్యాచ్కు మాత్రం హాజరైన జార్జినా.. తన లవర్ రొనాల్డోకు మద్దతినిస్తూ పోర్చుగల్ గెలవాలని కోరుకుంది. కానీ మ్యాచ్లో పోర్చుగల్ ఓటమి పాలయింది. అయితే మ్యాచ్ ముగిశాకా ఖతర్ బీచ్కు వచ్చిన జార్జినా రోడ్రిగేజ్ టూ పీస్ బికినీలో అందాల ప్రదర్శన చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను జార్జినా స్వయంగా ట్విటర్లో పంచుకుంది. ఇది చూసిన కొంతమంది రొనాల్డో వీరాభిమానులు.. మ్యాచ్ ఓడిపోయామని రొనాల్డో బాధపడుతుంటే.. బికినీలో అందాల ప్రదర్శన ఏంటి అంటూ కామెంట్ చేశారు. అయితే పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించడంతో జార్జినాపై విమర్శలు రాలేదు. లేదంటే ఆమె చర్యకు అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసేవారు. పోర్చుగల్ను విశ్వవిజేతగా నిలపాలని రొనాల్డో కష్టపడుతుంటే.. అతనికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఈమె మాత్రం ఖతర్ వీధుల్లో బికినీలు వేసుకొని ఎంజాయ్ చేయడమేంటని కొంతమంది పేర్కొన్నారు. ఇక పోర్చుగల్ డిసెంబర్ 7న జరగనున్న ప్రీక్వార్టర్స్లో స్విట్జర్లాండ్తో తలపడనుంది. 🌊💚 #georginarodriguez pic.twitter.com/Hc2EvRkbxL — Georgina Rodríguez (@__georginagio) December 3, 2022 -
FIFA World Cup Qatar 2022: నాకౌట్కు దక్షిణ కొరియా
దోహా: గత రెండు ప్రపంచకప్లలో గ్రూప్ దశకే పరిమితమైన దక్షిణ కొరియా ఈసారి సత్తా చాటింది. కీలకమైన చివరి లీగ్ మ్యాచ్లో చెలరేగి ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. పోర్చుగల్తో జరిగిన గ్రూప్ ‘హెచ్’ పోరులో కొరియా 2–1తో గెలిచింది. మ్యాచ్ 5వ నిమిషంలోనే హోర్టా గోల్ సాధించి పోర్చుగల్ను ఆధిక్యంలో నిలిపాడు. అయితే కొరియా తరఫున 27వ నిమిషంలో కిమ్ యంగ్ గ్వాన్ గోల్ చేసి స్కోరును సమం చేయగా...మ్యాచ్ చివర్లో వాంగ్ హీ చాన్ చేసిన అద్భుతమైన కౌంటర్ అటాక్ గోల్ (90+1వ నిమిషంలో)తో కొరియా దూసుకుపోయింది. గ్రూప్లో ఈ మ్యాచ్కు ముందే 2 విజయాలు సాధించి నాకౌట్ చేరిన పోర్చుగల్తో పాటు రెండో జట్టుగా కొరియా ముందంజ వేసింది. ఘనాతో మ్యాచ్ ముగిశాక రిఫరీతో వాగ్వాదం చేసినందుకు ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటుకు గురైన కొరియా కోచ్ పౌలో బెంటో ఈ మ్యాచ్ను ప్రేక్షకుల గ్యాలరీల్లో కూర్చోని చూశారు. చదవండి: Football: కుప్పకూలి.. యువ ఆటగాడు కన్నుమూత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: పోర్చుగల్ ముందుకు...
దోహా: అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్ టైటిల్ను సాధించాలనే లక్ష్యంతో ఖతర్కు వచ్చిన క్రిస్టియానో రొనాల్డో బృందం తొలి అడ్డంకిని దాటింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘హెచ్’ మ్యాచ్లో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 2–0 గోల్స్ తేడాతో గతంలో రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఉరుగ్వే జట్టుపై గెలిచింది. పోర్చుగల్ తరఫున నమోదైన రెండు గోల్స్ను బ్రూనో ఫెర్నాండెజ్ (54వ ని.లో, 90+3వ ని.లో) సాధించాడు. వరుసగా రెండో విజయం సాధించిన పోర్చుగల్ జట్టు ఆరు పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. గత ప్రపంచకప్లో ఉరుగ్వే చేతిలో 1–2తో ఓడిపోయిన రొనాల్డో జట్టు ఈసారి ఈ మాజీ విజేత జట్టును తేలిగ్గా తీసుకోలేదు. ముఖ్యంగా రొనాల్డో ముందుండి జట్టును నడిపించాడు. పలుమార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్ దిశగా వెళ్లి లక్ష్యంపై గురి పెట్టాడు. మరోవైపు ఉరుగ్వే కూడా దూకుడుగానే ఆడింది. కానీ ఆ జట్టును కూడా ఫినిషింగ్ లోపం వేధించింది. విరామ సమయం వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. ఎట్టకేలకు 54వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెజ్ సంధించిన క్రాస్ షాట్ నేరుగా ఉరుగ్వే గోల్పోస్ట్లోనికి వెళ్లడంతో పోర్చుగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బ్రూనో కిక్ను గాల్లోకి ఎగిరి రొనాల్డో హెడర్ ద్వారా అందుకునే ప్రయత్నం చేసినా బంతి రొనాల్డో తలకు తగలకుండానే గోల్పోస్ట్లోకి వెళ్లింది. ఉరుగ్వే తరఫున బెంటాన్కర్, గోమెజ్ కొట్టిన షాట్లు గోల్పోస్ట్కు తగిలి బయటకు వెళ్లాయి. స్టాపేజ్ సమయంలో ‘డి’ ఏరియాలో ఉరుగ్వే ప్లేయర్ జిమినెజ్ చేతికి బంతి తగలడంతో రిఫరీ పోర్చుగల్కు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. బ్రూనో ఈ పెనాల్టీని గోల్గా మలిచాడు. చివరి సెకన్లలో బ్రూనో కొట్టిన షాట్ గోల్పోస్ట్కు తగిలి బయటకు వెళ్లింది. లేదంటే అతని ఖాతాలో హ్యాట్రిక్ చేరేది. ప్రపంచకప్లో నేడు డెన్మార్క్ X ఆస్ట్రేలియా రాత్రి గం. 8:30 నుంచి ఫ్రాన్స్ X ట్యునీషియా రాత్రి గం. 8:30 నుంచి అర్జెంటీనా X పోలాండ్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి మెక్సికో X సౌదీ అరేబియా అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్లో ప్రత్యక్ష ప్రసారం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Cristiano Ronaldo: 'ఇదంతా తొండి.. ఆ గోల్ నాది'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గ్రూప్-హెచ్లో భాగంగా క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఉరుగ్వేతో తలపడింది. ఈ మ్యాచ్లో పోర్చుగల్ 2-0తో గెలిచి ప్రిక్వార్టర్స్కు చేరుకుంది. ఇక పోర్చుగల్ మిడ్ ఫీల్డర్ బ్రూనో ఫెర్నాండేజ్ రెండు గోల్స్ చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫెర్నాండేజ్ ఆటతీరకు ముగ్దుడైన రొనాల్డో స్వయంగా అభినందించాడు. కానీ మ్యాచ్లో ఫెర్నాండేజ్ కొట్టిన ఒక గోల్ విషయమై ఆరోపణలు చేశాడు. ఆట తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఎలాంటి గోల్ నమోదు చేయలేకపోయాయి. ఇక రెండో అర్థభాగంలో ఆట 54వ నిమిషంలో రొనాల్డో హెడర్తో బంతిని గోల్పోస్ట్లోకి కొట్టినట్లు భ్రమపడి సంబరాల్లో మునిగిపోయాడు. అయితే ఆ గోల్ చేసింది రొనాల్డో కాదని.. బ్రూనో ఫెర్నాండేజ్ అని తర్వాత తెలిసింది. అసలేం జరిగేందంటే.. వాస్తవానికి రొనాల్డో హెడర్ గోల్ చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. అంతకముందే రొనాల్డోకు క్రాస్గా వచ్చిన బ్రూనో ఫెర్నాండేజ్ షాట్తో బంతిని గోల్ పోస్ట్లోకి పంపించాడు. ఇక బంతి గోల్ పోస్ట్లోకి వెళ్లడానికి ముందు రొనాల్డోకు ఎక్కడా తగల్లేదని రిప్లేలో తేలింది. దీంతో బ్రూన్ ఫెర్నాండేజ్ ఖాతాలోకి ఆ గోల్ వెళ్లిపోయింది. అయితే రిఫరీ నిర్ణయంతో షాక్ తిన్న రొనాల్డో.. అంతా తొండి.. ఆ గోల్ నాది.. అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత బ్రూనో ఆట 90+ మూడో నిమిషంలో మరో గోల్ చేయడంతో పోర్చుగల్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లడం.. ఆపై విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ రొనాల్డో ఖాతాలోకి ఆ గోల్ వెళ్లి ఉంటే మాత్రం చరిత్ర సృష్టించేవాడే.. కానీ కొద్దిలో మిస్ అయింది. ఇక ఉరుగ్వేపై విజయంతో ఫిఫా వరల్డ్కప్లో ప్రి క్వార్టర్స్కు చేరిన మూడో జట్టుగా పోర్చుగల్ నిలిచింది. కాగా 2018 చాంపియన్స్ ఫ్రాన్స్తో పాటు ఐదుసార్లు చాంపియన్ అయిన బ్రెజిల్ కూడా ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాయి. ఇక పోర్చుగల్ తన తర్వాతి మ్యాచ్ డిసెంబర్ 3న దక్షిణ కొరియాతో ఆడనుంది. #Ronaldo fans, do answer this 👇 Did the ⚽ hit #Ronaldo before it went inside the 🥅 or not? 🤔#PORURU #BrunoFernandes #ManUtd #Qatar2022 #WorldsGreatestShow #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/58AxS2Bb11 — JioCinema (@JioCinema) November 28, 2022 The goal has officially been ruled as scored by Bruno Fernandes #POR #URU https://t.co/3NN2pbupe0 — FIFA World Cup (@FIFAWorldCup) November 28, 2022 చదవండి: FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్ చేసి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ -
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
FIFA World Cup 2022: పోర్చ్గల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. వరుసగా ఐదు వరల్డ్ కప్ టోర్నీల్లో గోల్ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఫిఫా వరల్డ్కప్-2022 మెగా ఈవెంట్లో భాగంగా గురువారం ఘనాతో జరిగిన మ్యాచ్లో పెనాల్టీ కిక్ ద్వారా గోల్ సాధించిన రొనాల్డో ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. రొనాల్డో 2006 ఫిఫా వరల్డ్ కప్ నుంచి వరుసగా, 2010, 2014, 2018, 2022లో గోల్స్ సాధించాడు. కాగా ప్రపంచకప్ టోర్నీల్లో ఇది అతడికి ఎనిమిదో గోల్ కావడం గమనార్హం. అదే విధంగా మరో రికార్డును కూడా రొనాల్డో తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక అంతర్జాతీయ గోల్లను సాధించిన ఆటగాడిగా రొనాల్డో(118) నిలిచాడు. అదే విధంగా ఏ క్లబ్తోనూ సంబంధం లేకుండా కెప్టెన్గా ఫిపా వరల్డ్ కప్లో పాల్గొన్న రెండవ ప్లేయర్గా నిలిచాడు. ఇక మ్యాచ్లో ఘనాపై 3-2 తేడాతో పోర్చుగల్ ఘన విజయం సాధించింది. చదవండి: FIFA WC 2022: పాపం.. గోల్ కొట్టినా సెలబ్రేట్ చేసుకోలేక var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: పోర్చు‘గోల్’ కొట్టింది..!
దోహా: ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో పోర్చుగల్ ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా బోణీ కొట్టింది. గోల్ లేకుండా తొలి అర్ధ భాగం చప్పగా సాగగా... ద్వితియార్ధంలో పెనాల్టీ కిక్ మ్యాచ్ను ఉన్నపళంగా మార్చేసింది. చకాచకా గోల్స్తో నమోదవడంతో మ్యాచ్లో ఆసక్తి అంతకంతకూ పెరిగింది. చివరకు పోర్చుగల్ 3–2తో ఘనాపై గెలిచింది. ఆట 64వ నిమిషంలో స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డోను మొరటుగా కిందపడేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్ ఇచ్చాడు. దీన్ని సులువుగానే రొనాల్డో గోల్గా మలిచాడు. కానీ 8 నిమిషాల వ్యవధిలో ఘన ఆటగాడు అండ్రూ అవియు (73వ ని.) ఫీల్డ్ గోల్తో స్కోరును 1–1గా సమం చేశాడు. మళ్లీ ఐదు నిమిషాల్లో ఆధిక్యం మారింది. జొవో ఫెలిక్స్ (78వ ని.), రాఫెల్ లియో (80వ ని.) ఫీల్డ్ గోల్స్ చేయడంతో పోర్చుగల్ 3–1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెగ్యులర్ టైమ్ ముగిసే దశలో ఘనా ఆటగాడు ఉస్మాన్ బుకారి (89వ ని.) హెడర్తో అద్భుతమైన గోల్ సాధించాడు. ఇంజ్యూరి టైమ్లో స్కోరును సమం చేసేందుకు ఘనా ఆటగాళ్లు శక్తికి మించి శ్రమించారు. ఆఖరి క్షణందాకా వారు గోల్పోస్ట్పై చేసిన దాడుల్ని పోర్చుగల్ డిఫెండర్లు అడ్డుకున్నారు. ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పదే పదే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రిఫరీ ఆరు సార్లు ఎల్లో కార్డు ప్రయోగించాడు. పోర్చుగల్ జట్టులో ఇద్దరు, ఘనా బృందంలో నలుగురు ఎల్లో కార్డుకు గురయ్యారు. 5: ఐదు ప్రపంచకప్లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడు రొనాల్డో. ఈ సాకర్ స్టార్ 2006 మొదలు 2010, 2014, 2018, 2022 ప్రపంచకప్లలో గోల్ చేశాడు. ఓవరాల్గా 8 గోల్స్ సాధించాడు. -
ఘనాతో పోరు.. రొనాల్డోపై రెండు మ్యాచ్ల నిషేధం
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఏదీ కలిసి రావడం లేదు. ఇటీవలే మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్పై సంచలన ఆరోపణలు చేయడంతో అతన్ని బయటకు సాగనంపడం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది. తాజాగా రొనాల్డోకు మరో షాక్ తగిలింది. ఇంగ్లండ్ ఫుట్బాల్ అసోసియేషన్ రొనాల్డోకు 50 వేల పౌండ్ల (సుమారు రూ.49.4 లక్షలు) జరిమానా, రెండు మ్యాచ్లపై నిషేధం విధించడం షాక్కు గురి చేసింది. ఫిఫా వరల్డ్కప్లో భాగంగా ఇవాళ ఘనాతో పోర్చుగల్ తలపడనుంది. ఈ నేపథ్యంలో రొనాల్డోపై నిషేధం అభిమానులను ఉలిక్కి పడేలా చేసింది. అయితే ఫిఫా వరల్డ్కప్కు ఈ నిషేధం వర్తించదు. ఒక రకంగా ఇది పోర్చుగల్తో పాటు రొనాల్డోకు పెద్ద ఊరట. మాంచెస్టర్ యునైటెడ్ తనను వదిలేసిన తర్వాత ప్రస్తుతం రొనాల్డో ఫ్రీ ఏజెంట్గా ఉన్నాడు. రొనాల్డో మళ్లీ ఏదైనా క్లబ్కు ఆడితే ఈ నిబంధన వర్తిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రొనాల్డో ఈ మ్యాచ్లో ఎలా ఆడబోతోన్నాడన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అర్జెంటీనా, జర్మనీలాంటి టీమ్స్కు తొలి మ్యాచ్లలోనే షాక్లు తగిలిన పరిస్థితుల్లో ఈ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. ఇక గత ఏప్రిల్ 9న గూడిసన్ పార్క్ వేదికగా ఎవర్టన్ ఎఫ్సీ, మాంచెస్టర్ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రొనాల్డో గాయపడ్డాడు. మ్యాచ్ను కూడా 1-0తో ఎవర్టన్ ఎఫ్సీ కైవసం చేసుకుంది. దీంతో మ్యాచ్ ఓడిపోయామన్న బాధలో పెవిలియన్ వెళ్తున్న రొనాల్డోను కొంత మంది తన ఫోన్ కెమెరాల్లో బందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవర్టన్ ఎఫ్సీ అభిమాని ఒకరు రొనాల్డోను ఫోటో తీయడానికి ప్రయత్నించగా.. చిర్రెత్తికొచ్చిన రొనాల్డో ఆవేశంతో అతని ఫోన్ను నేలకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత సదరు వ్యక్తికి క్షమాపణ చెప్పాడు. అతని చర్యను తప్పిదంగా భావించిన బ్రిటీష్ పోలీసులు రొనాల్డో సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టారు. అయితే అప్పట్లోనే పోలీసులు రొనాల్డోను హెచ్చరికతో వదిలేశారు. తాజాగా ఇంగ్లండ్ ఫుట్బాల్ అసోసియేషన్ దీనిపై విచారణ జరిపి.. రొనాల్డోకు జరిమానాతో పాటు రెండు మ్యాచ్ల నిషేధం విధించింది.రొనాల్డో ప్రవర్తన సరి కాదని, దురుసుగా ఉన్నదని ఓ స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ తేల్చినట్లు ఇంగ్లండ్ ఫుట్బాల్ అసోసియేషన్ వెల్లడించింది. తాను తన భద్రత కోసమే ఇలా చేయాల్సి వచ్చిందని నవంబర్ 8 న ఈ కమిషన్ ముందు హాజరై రొనాల్డో చెప్పాడు. కానీ భయంతో కాకుండా ఓడిన ఫ్రస్ట్రేషన్లో అతడు ఇలా చేసినట్లు కమిషన్ గుర్తించింది. చదవండి: అంతర్యుద్ధంతో కుటుంబం విచ్చిన్నం; అన్న ఘనాకు.. తమ్ముడు స్పెయిన్కు దిగ్గజం పీలే సరసన స్పెయిన్ మిడ్ ఫీల్డర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు
మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్తో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో బంధం ముగిసింది. ఇటీవలే పియర్స్ మోర్గాన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఓనర్స్తో పాటు కోచ్ ఎరిక్ టెన్ హగ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు క్లబ్ ద్రోహం చేసిందనీ.. కొత్త మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్ పట్ల తనకు ఏమాత్రం గౌరవం లేదని రొనాల్డో పేర్కొన్నాడు. ఈ ఇంటర్య్వూ వివాదాస్పదంగా మారింది. దీనిని సీరియస్గా తీసుకున్న మాంచెస్టర్ యునైటెడ్.. రొనాల్డోను వెంటనే క్లబ్ నుంచి బయటకు పంపుతున్నట్లు ట్విటర్లో తెలిపింది. "పరస్పర అంగీకారం ప్రకారం క్రిస్టియానో రొనాల్డోనూ వెంటనే క్లబ్ నుంచి తొలగిస్తున్నాం. ఓల్డ్ ట్రాఫోర్డ్లో రొనాల్డో ఇచ్చిన రెండు స్పెల్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.'' అంటూ మాంచెస్టర్ వెల్లడించింది. ఇక రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున 346 మ్యాచ్ల్లో 145 గోల్స్ కొట్టాడు. కాగా తొలిసారి రొనాల్డో 2003 నుంచి 2009 వరకు మాంచెస్టర్ యునైటెడ్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత మళ్లీ 2021లో మాంచెస్టర్ యునైటెడ్కు తిరిగి వచ్చిన రొనాల్డో ఏడాది వ్యవధిలోనే క్లబ్ను వీడాల్సి వస్తోంది. మాంచెస్టర్ యునైటెడ్ తనను తొలగించడంపై రొనాల్డో స్పందించాడు. "ఇది ముందే ఊహించాను. అయితే ఇంతకముందే జరిగిన పరస్పర అంగీకారం మేరకే నేను జట్టును వీడుతున్నా. అయినా నాకు మాంచెస్టర్ యునైటెడ్ అంటే ప్రేమ.. వాళ్లు చూపించే అభిమానం ఎప్పటికి మరిచిపోలేను. నేను వేరే క్లబ్కు ఆడినా అవి ఎప్పటికీ మారవు. అయితే కొత్త సవాలును స్వీకరించేందుకు నాకు ఇదే సరైన సమయం . ఈ సీజన్తో పాటూ భవిష్యత్తులో కూడా మాంచెస్టర్ యునైటెడ్ విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా" అంటూ తెలిపాడు. ఇక రొనాల్డో ప్రస్తుతం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో పాల్గొనేందుకు వచ్చాడు. పోర్చుగల్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో ఎలాగైనా జట్టుకు కప్ అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక గ్రూప్-హెచ్లో ఉన్న పోర్చుగల్ ఘనా, ఉరుగ్వే, సౌత్ కొరియాలతో ఆడనుంది. గురువారం ఘనాతో పోర్చుగల్ అమితుమీ తేల్చుకోనుంది. రొనాల్డోపై రెండు క్లబ్ మ్యాచ్ల నిషేధం అభిమానితో గొడవ పడి అతని ఫోన్ను విసిరేసినందుకు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ మాజీ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోపై ఇంగ్లండ్ ఫుట్బాల్ అసోసియేషన్ రెండు క్లబ్ మ్యాచ్ల నిషేధంతోపాటు 50 వేల పౌండ్ల జరిమానా విధించింది. గత ఏడాది ఏప్రిల్ 9న ఎవర్టన్తో జరిగిన ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో మాంచెస్టర్ 0–1తో ఓడిపోయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్తో రొనాల్డో తెగదెంపులు చేసుకోవడంతో తదుపరి సీజన్లో అతను ఆడే కొత్త క్లబ్ జట్టుకు ఈ నిషేధం వర్తిస్తుంది. Cristiano Ronaldo is to leave Manchester United by mutual agreement, with immediate effect. The club thanks him for his immense contribution across two spells at Old Trafford.#MUFC — Manchester United (@ManUtd) November 22, 2022 "That moment was probably the most difficult moment that I have in my life." Cristiano Ronaldo opens up about the devastating death of his baby son, telling Piers Morgan: "We don't understand why it happened to us."@cristiano | @piersmorgan | @TalkTV | #PMU pic.twitter.com/tOba0WJpBf — Piers Morgan Uncensored (@PiersUncensored) November 15, 2022 చదవండి: 'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు' FIFA WC: అర్జెంటీనాకు షాకిచ్చిన సౌదీ అరేబియా -
రొనాల్డో... ఆఖరి అవకాశం
క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు క్రిస్టియానో రొనాల్డో. 2003 నుంచి పోర్చుగల్ జాతీయ సీనియర్ జట్టుకు ఆడుతున్న రొనాల్డో తన కెరీర్లో ప్రొఫెషనల్ లీగ్స్లో (ప్రీమియర్ లీగ్, లా లిగా, చాంపియన్స్ లీగ్, సెరియా లీగ్) అందుబాటులో ఉన్న అన్ని గొప్ప టైటిల్స్ సాధించాడు. కానీ ప్రపంచకప్ ఒక్కటే అతడిని అందని ద్రాక్షగా ఊరిస్తోంది. వరుసగా ఐదో ప్రపంచకప్లో ఆడుతున్న రొనాల్డో ఆఖరి ప్రయత్నంగా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తన నాయకత్వంలో పోర్చుగల్ను 2016లో యూరో చాంపియన్గా నిలబెట్టిన రొనాల్డో 2019లో నేషన్స్ లీగ్ టైటిల్ కూడా అందించాడు. ఈసారి పోర్చుగల్ విశ్వవిజేతగా నిలిస్తే క్రిస్టియానో రొనాల్డో దిగ్గజాల సరసన చేరడంతోపాటు తన కెరీర్ను పరిపూర్ణం చేసుకుంటాడు. పోర్చుగల్ ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1966). ‘ఫిఫా’ ర్యాంక్: 9. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ ప్లే ఆఫ్ విజేత. ఎనిమిదోసారి ప్రపంచకప్లో ఆడుతున్న పోర్చుగల్ యువ, సీనియర్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. రికార్డుస్థాయిలో ఐదోసారి ప్రపంచకప్లో ఆడుతున్న కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో జట్టుకు వెన్నెముకలాంటి వాడు. పోర్చుగల్ తరఫున ఇప్పటి వరకు 191 మ్యాచ్లు ఆడిన రొనాల్డో 117 గోల్స్ సాధించి అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా టాప్ ర్యాంక్లో ఉన్నాడు. రొనాల్డోతోపాటు రాఫెల్ లియావో, బెర్నార్డో సిల్వా, రూబెన్ డయాస్ కీలక ఆటగాళ్లు. ఘనా ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (2010). ‘ఫిఫా’ ర్యాంక్: 61. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ విజేత. ‘బ్లాక్ స్టార్స్’గా పేరున్న ఘనా నాలుగోసారి ప్రపంచకప్లో ఆడుతోంది. 2018 ప్రపంచకప్నకు అర్హత పొందలేకపోయిన ఘనా అంతకుముందు రెండు ప్రపంచకప్లలో గ్రూప్ దశను దాటి ముందుకెళ్లింది. ఈసారి తమ గ్రూప్లోని మూడు జట్లు పటిష్టమైనవి కావడంతో ఘనా సంచలన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. డెనిస్ ఒడోయ్, లాంప్టె, కుడుస్, అబ్దుల్ రహమాన్ కీలక ఆటగాళ్లు. ఉరుగ్వే ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: చాంపియన్ (1930, 1950). ‘ఫిఫా’ ర్యాంక్: 14. అర్హత ఎలా: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్లో మూడో స్థానం. నిలకడలేని ప్రదర్శనకు మారుపేరైన ఉరుగ్వే 14వసారి ప్రపంచకప్లో పోటీపడుతోంది. రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన మూడు జట్లలో ఒకటైన ఉరుగ్వే ఈసారి ఎంత దూరం వెళ్తుందనేది అంచనా వేయలేము. గోల్కీపర్ ఫెర్నాండో ముస్లెరా, కెప్టెన్ డీగో గోడిన్, మార్టిన్ సెసెరెస్, లూయిస్ స్వారెజ్, ఎడిన్సన్ కవానిలకు 100 కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. సీనియర్లు సత్తా చాటుకుంటే ఉరుగ్వే జట్టుకు గ్రూప్ దశ దాటడం ఏమంత కష్టం కాబోదు. దక్షిణ కొరియా ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: నాలుగో స్థానం (2002). ‘ఫిఫా’ ర్యాంక్: 28. అర్హత ఎలా: ఆసియా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ రన్నరప్. ప్రపంచకప్లో ఆసియా నుంచి అత్యధికసార్లు బరిలోకి దిగిన జట్టు దక్షిణ కొరియా. ఇప్పటి వరకు 11 సార్లు పోటీపడిన కొరియా తాము ఆతిథ్యమిచ్చిన 2002 టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచింది. ఏ ఆసియా జట్టుకైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 1986 నుంచి ప్రతి ప్రపంచకప్నకు అర్హత పొందిన కొరియా 2002లో మినహా మిగతా అన్నిసార్లు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. స్టార్ ప్లేయర్ సన్ హెయుంగ్ మిన్ ఫామ్ కొరియా విజయావకాశాలను నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు. –సాక్షి క్రీడా విభాగం -
FIFA: 'మెస్సీ నా స్నేహితుడే కాదు'
లియోనల్ మెస్సీ.. క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేర్లు. ఆటలో ఎంత పేరు సంపాదించారో అభిమానంలోనూ అంతే. వీరిద్దరి గురించి ఫుట్బాల్ తెలియనివాళ్లకు కూడా ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఒకరు అర్జెంటీనా తరపున స్టార్గా వెలుగుతుంటే.. మరొకరు పోర్చుగల్ తరపున తన హవా కొనసాగిస్తున్నాడు. గోల్స్ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆటలో శత్రువులుగా ఉన్న వీళ్లకి బయట మాత్రం మంచి స్నేహం ఉంది. అయితే ఇద్దరికి తీరని కల ఒకటి ఉంది. అదే ఫిఫా వరల్డ్కప్. ఫుట్బాల్లో స్టార్లుగా వెలుగొందుతున్న వీళ్ల ఖాతాలో ఒక్క ఫిఫా టైటిల్ కూడా లేదు. అందుకే నవంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్కప్ ట్రోఫీని ఎలాగైనా తమ జట్టుకే అందించాలని ఈ ఇద్దరు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక అభిమానులు కూడా అర్జెంటీనా, పోర్చుగల్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగితే బాగుంటుందని.. మెస్సీ, రొనాల్డో ఎదురుపడితే ఆ మజానే వేరుగా ఉంటుందని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే క్రిస్టియానో రొనాల్డో తన చిరకాల మిత్రుడు మెస్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెస్సీ నాకు ఎప్పటికి మంచి మిత్రుడే.. వేరే దేశాలకు ఆడుతున్నా మా స్నేహం మాత్రం ఎప్పటిలాగే ఉంటుందని శుక్రవారం పియర్స్ మోర్గాన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. "మెస్సీ ఒక అద్భుతమైన ప్లేయర్. అతన్ని చూస్తుంటే ఓ మ్యాజిక్లా అనిపిస్తుంది. ఓ వ్యక్తిగా మేము ఇద్దరం 16 ఏళ్లుగా ఫుట్బాల్ ఫీల్డ్ను పంచుకుంటున్నాం. ఒక్కసారి ఊహించుకోండి 16 ఏళ్లు. అందుకే అతనితో మంచి రిలేషన్షిప్ ఉంది. అతడు నా ఫ్రెండ్ అని చెప్పను. ఫ్రెండ్ అంటే ఇంటికి వస్తాడు. ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అతడు ఫ్రెండ్ కాదు కానీ టీమ్ మేట్లాంటి వాడు. మెస్సీ నా గురించి మాట్లాడే తీరు చూస్తే ఎప్పుడూ అతన్ని గౌరవిస్తాను. అంతెందుకు అతని భార్య లేదా నా భార్య అయినా కూడా వాళ్లు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటారు. వాళ్లు అర్జెంటీనాకు చెందిన వాళ్లు. నా గర్ల్ఫ్రెండ్ది కూడా అర్జెంటీనాయే. మెస్సీ గురించి ఏం చెబుతాం? గొప్ప వ్యక్తి. ఫుట్బాల్ను నాకంటే గొప్పగా ఆడతాడు" అంటూ తెలిపాడు. ఇక ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా.. సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్లతో కలిసి గ్రూప్-సిలో ఉంది. మరోవైపు పోర్చుగల్ మాత్రం ఉరుగ్వే, ఘనా, సౌత్ కొరియాలతో కలిసి గ్రూప్ హెచ్లో ఉంది. గ్రూప్ దశలో ఈ రెండుజట్లు తలపడే అవకాశం లేదు. నాకౌట్ దశలో మాత్రం ఎదురపడే చాన్స్ ఉంది. అయితే ఈ రెండు టీమ్స్ ఫైనల్ చేరి.. అక్కడ మెస్సీ, రొనాల్డో ముఖాముఖి తలపడితే చూడాలనుకుంటున్నట్లు ఫుట్బాల్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. చదవండి: FIFA: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే 'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు' -
గర్భిణి మృతి... దెబ్బకు రాజీనామా చేసిన ఆరోగ్యమంత్రి
పోర్చుగల్లోని లిస్బన్లో ప్రధాన ఆస్పత్రి శాంటా మారియాలో నియోనాటాలజీ సేవలు లేవు. దీంతో మరొక ఆస్పత్రికి అంబులెన్స్లో గర్భిణిని తరలిస్తున్నారు. ఆ సమయంలో గర్భిణి గుండెపోటుకు గురై మృతి చెందింది. ఈ ఘటన పోర్చుగల్ ఆరోగ్యమంత్రి మార్టా టెమిడో రాజీనామ చేసే పరిస్థితికి దారితీసింది. అత్యవసర ప్రసూతి ఆస్పత్రులను తాత్కలికంగా మూసివేయాలని ఆమె తీసుకున్న నిర్ణయమే రాజీనామ చేసేవరకు తీసుకువచ్చింది. వాస్తవానికి గత వేసవి సెలవుల్లో పలు ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు లేకపోవడంతో వారంతాల్లో ఉండే అ్యతవసర ప్రసూతి సేవలను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే ప్రతిపక్షాలు, మున్సిపాలిటీలు గర్భిణులు ఎమర్జెన్సీ సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లలేరని, ఇది అతి పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ దుమ్మెత్తిపోశాయి. సిబ్బంది కొరత కారణంగా గత్యంతరం లేని స్థితిలో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. టెమిడో 2018లో ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. అంతేకాదు కోవిడ్-19కి వ్యతిరేకంగా విజయవంతమైన వ్యాక్సిన్ ప్రచారాన్ని నిర్వహించింది కూడా. అత్యంత ప్రజాదరణ పొందిన మంత్రుల్లో ఆమె ఒకరు. ఐతే ఆమె ప్రసూతి వైద్యానికి సంబంధించిన విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం తోపాటు తాజాగా సదరు గర్భిణి మహిళ కూడా చనిపోవడం ప్రతిపక్షాల విమర్శలకు ఆజ్యం పోసినట్లయింది. ఈ మేరకు టెమిడో ఆరోగ్య మంత్రిత్వ శాఖ్య ప్రకటనలో తాను ఇక పదవిలో కొనసాగే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదని, అందువల్ల తాను పదవి నుంచి వైదొలగాలని నిర్ణియించుకున్నట్లు వెల్లడించింది. ఐతే దీన్ని పోర్చుగల్ ప్రధాని ఆంటోనియాఓ కోస్టా.. టెమిడో రాజీనామను ఆమోదించడమే కాకుండా ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల ధన్యావాదాలు కూడా తెలిపారు. (చదవండి: వాషింగ్టన్లో కాల్పులు కలకలం...ఇద్దరికి గాయాలు) -
మెస్సీ ‘వన్మ్యాన్ షో’.. అర్జెంటీనా ఘనవిజయం
పాంప్లొనా (స్పెయిన్): అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయెనల్ మెస్సీ ‘వన్మ్యాన్ షో’తో ప్రత్యర్థి జట్టును ఠారెత్తించాడు. ఎస్తోనియాతో జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా 5–0తో ఘనవిజయం సాధించగా... ఈ ఐదు గోల్స్ను మెస్సీ (8వ, 45వ, 47వ, 71వ, 76వ నిమిషాల్లో) ఒక్కడే చేయడం విశేషం. గతంలో దేశం తరఫున ఆడుతూ మెస్సీ ఒకే మ్యాచ్లో 5 గోల్స్ చేయలేదు. ఈ క్రమంలో జాతీయ జట్ల తరఫున అత్యధిక గోల్స్ (86) చేసిన క్రీడాకారుల జాబితాలో మెస్సీ నాలుగో స్థానానికి ఎగబాకాడు. తొలి మూడు స్థానాల్లో వరుసగా క్రిస్టియానో రొనాల్డో (117 గోల్స్–పోర్చుగల్), అలీ దాయ్ (109 గోల్స్–ఇరాన్), ముఖ్తార్ దహరి (89 గోల్స్–మలేసియా) ఉన్నారు. చదవండి: Kho Kho -League: ఖో–ఖో లీగ్లో జీఎంఆర్, అదానీ ఫ్రాంచైజీలు -
పుట్బాల్ ప్రపంచకప్కు పోర్చుగల్
లిస్బన్: తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్ టైటిల్ను సాధించేందుకు పోర్చుగల్ కెప్టెన్, విఖ్యాత ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు మరో అవకాశం లభించింది. ఈ ఏడాది నవంబర్–డిసెంబర్లలో ఖతర్ వేదికగా జరగనున్న ప్రపంచకప్కు పోర్చుగల్ జట్టు అర్హత పొందింది. బుధవారం జరిగిన యూరోపియన్ జోన్ ప్లే ఆఫ్ ఫైనల్లో పోర్చుగల్ 2–0 గోల్స్ తేడాతో నార్త్ మెసెడోనియా జట్టును ఓడించి ప్రపంచకప్ బెర్త్ సొంతం చేసుకుంది. పోర్చుగల్ తరఫున బ్రూనో ఫెర్నాండెజ్ (32వ, 65వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. రొనాల్డోకిది వరుసగా ఐదో ప్రపంచకప్ కానుంది. మరో ప్లే ఆఫ్ ఫైనల్లో పోలాండ్ 2–0తో స్వీడన్ను ఓడించి ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఆఫ్రికా జోన్ నుంచి ఘనా, సెనెగల్, ట్యూనిషియా, మొరాకో, కామెరూన్ జట్లు కూడా ప్రపంచకప్ బెర్త్లు సంపాదించాయి. మొత్తం 32 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు 27 జట్లు అర్హత పొందాయి. జూన్ 14న జరిగే ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్ల అనంతరం మిగిలిన ఐదు బెర్త్లు ఖరారవుతాయి. మిగిలిన ఐదు బెర్త్ల కోసం రేసులో ఉన్న జట్లతో కలిపి శుక్రవారం ప్రపంచకప్ ‘డ్రా’ను విడుదల చేయనున్నారు. -
గర్ల్ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్ అందుకున్న స్టార్ ఫుట్బాలర్
పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన గర్ల్ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్ను బహుమతిగా అందుకున్నాడు. ఫిబ్రవరి 5న రొనాల్డో పుట్టినరోజు పురస్కరించుకొని రొనాల్డో గర్ల్ఫ్రెండ్ జార్జినా రోడ్రిగేజ్ రూ.1.2 కోట్ల విలువైన బ్లాక్ కాడిల్లాక్ ఎస్యూవీ మోడల్ కారును గిఫ్ట్గా అందించింది. గర్ల్ఫ్రెండ్ కారు ఇచ్చిన మరుక్షణమే రొనాల్డో అదే కారులో మాంచెస్టర్ యునైటెడ్ గ్రౌండ్కు వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోనూ జార్జినా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. కార్లంటే పిచ్చి ఉన్న వ్యక్తికి ఒక మంచి గిఫ్ట్ను ఇవ్వడం సంతోషం కలిగించింది. నాకు ఒక మంచి భర్తను.. పిల్లలకు మంచి తండ్రిని రొనాల్డో రూపంలో అందించినందుకు దేవుడికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. రొనాల్డోను మించిన పర్ఫెక్షనిస్ట్ మరొకరు లేరు. తనే నాకు ఆదర్శం అంటూ ఎమెషనల్గా రాసుకొచ్చింది. కాగా సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 400 మిలియన్ల మార్క్ను టచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డులెక్కాడు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు View this post on Instagram A post shared by Georgina Rodríguez (@georginagio) -
పోర్చుగల్లో సోషలిస్టుల గెలుపు
లిస్బన్: పోర్చుగల్లోని లెఫ్టిస్టు ఆలోచనాధోరణితో కూడిన సోషలిస్ట్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయం సాధించింది. కోవిడ్తో కునారిల్లిన పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయదుందుభి మోగించింది. కరోనా వైరస్ కేసుల పెరుగుదల సమయంలో జరిగిన ఈ ఎన్నికలలో 230 సీట్ల పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు. ఆదివారానికి ఎన్నికల్లో 98.5 శాతం ఓట్లను లెక్కించగా ఇందులో సోషలిస్టులు 41 శాతం ఓట్లను పొందారు. సోషలిస్టుల ప్రధాన ప్రత్యర్థి సెంటర్–రైట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి 28 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 65 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. దేశంలోని 1.08 కోట్ల అర్హులైన ఓటర్లలో ఈ దఫా విదేశాల్లో నివసిస్తూ మెయిల్ ద్వారా ఓటు వేసే 15 లక్షల మంది ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదు. మరోదఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ప్రధాని ఆంటినో కోస్టాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోర్చుగల్తో బలమైన బంధాన్ని కోరుకుంటున్నామన్నారు. 116 సీట్ల మెజార్టీ.. పార్లమెంట్లో మెజార్టీకి అవసరమైన 116 సీట్లను సోషలిస్టులు గెలుచుకుంటారా? లేక చిన్న పార్టీల మద్దతు అవసరంపడుతుందా అనే విషయమై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. పోర్చుగీస్ టెలివిజన్ చానెళ్ల ప్రత్యేక ఎగ్జిట్ పోల్స్ మాత్రం సోషలిస్టులకు పూర్తి మెజార్టీ రావచ్చని అంచనా వేశాయి. పోర్చుగల్లో కొత్త ప్రభుత్వంపై అంచనాలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ యూరప్లో పేదదైన ఈ దేశానికి ఈయూ 5000 కోట్ల డాలర్ల సాయం అందించనుంది. ఈ మొత్తంలో మూడింట రెండు వంతులు ప్రధాన మౌలిక సదుపాయాలు కోసం ఉద్దేశించారు. మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీలకు అందిస్తారు. పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఏర్పడితే ఈ నిధుల కేటాయింపు, వ్యయం సజావుగా సాగుతాయని నిపుణులు భావిస్తున్నారు. 2022 కోసం అప్పటి మైనారిటీ సోషలిస్ట్ ప్రభుత్వం రూపొందించిన వ్యయ ప్రణాళికను పార్లమెంటు గత నవంబర్లో తిరస్కరించింది. దీంతో నూతన వ్యయప్రణాళిక అమలుకు స్థిర ప్రభుత్వ అవసరం ఉంది. 2015లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వార్షిక బడ్జెట్ను ఆమోదానికి ప్రతిసారీ మిత్రపక్షాలైన లెఫ్ట్ బ్లాక్, పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుపై సోషలిస్టు పార్టీ ఆధారపడుతోంది. కానీ రెండు నెలల క్రితం ఈపార్టీల మధ్య విభేదాలు ముదిరాయి. దీంతో పార్లమెంట్లో సోషలిస్ట్ ప్రధాన మంత్రి ఆంటినో కోస్టాకు మెజార్టీ మద్దతు గగనమైంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సోషలిస్టులకు తగినంత బలాన్ని ఇవ్వనుంది. చేగా.. గెలుపు పోర్చుగల్లో వరుసగా రెండుమార్లు సోషలిస్టు పార్టీనే అధికారంలో ఉంది. దీని ప్రధాన ప్రత్యర్థి సోషల్ డెమొక్రాటిక్ పార్టీ. ఈ రెండు పార్టీలే దేశంలో దశాబ్దాలుగా అధికారం అనుభవిస్తున్నాయి. కానీ ఈసారి చేగా అనే పార్టీ సత్తా చూపింది. మూడు సంవత్సరాల క్రితం దేశంలో ఆవిర్భవించిన ప్రజాకర్షక మరియు జాతీయవాద పార్టీ చేగా (చాలు అని అర్థం) ఈ ఎన్నికల్లో 5– 8 శాతం ఓట్లను కొల్లగొట్టినట్లు ఆర్టీపీ పోల్స్ అంచనా వేసింది. దీంతో ఈ పార్టీకి పార్లమెంట్లో 13 సీట్లు దక్కవచ్చని అంచనా. గత ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీకి 3– 5 శాతం ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో 46– 51 శాతం మధ్య పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 48.6 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా కారణంగా అర్హులైన ఓటర్లలో దాదాపు 10 లక్షలమంది ఇంకా ఐసోలేషన్లోనే ఉన్నారు. దేశాధ్యక్షుడు మార్సెలో రెబోలో డీసౌజా సైతం ఓటు వేయమని ప్రజలకు పిలుపునిచ్చారు. -
ఈ విషయం తెలిస్తే చైనా ఆగుతుందా
సాక్షి, నూఢిల్లీ: సోషల్ మీడియా వినియోగం పెరిగాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన, అబ్బురపరిచే విషయాల గురించి అందరికి తెలుస్తున్నాయి. ట్విటర్ను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తెలిసే ఉంటారు. అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు సుశాంత నంద. ఈ క్రమంలో తాజాగా ఆయన ట్వీట్ చేసిన ఓ ఫోటో తెగ వైరలవుతోంది. ఇక దీనిపై నెటిజనులు చేసే కామెంట్స్ చూస్తే.. విరగబడి నవ్వుతారు. ఇంతకు ఆయన షేర్ చేసిన ఫోటో.. ఆ వివరాలు.. (చదవండి: వైరల్ వీడియో: సృష్టికర్తకు జోహార్లు) సుశాంత నంద తన ట్విటర్లో శనివారం ఓ ఫోటోని షేర్ చేశారు. సడెన్గా చూస్తే.. అది డ్రాగన్ ఫోటోనో, పెయింటింగో అనిపిస్తుంది. కానీ కాదు. అది పోర్చుగల్లో ప్రవహిస్తున్న ఓ నది. ఆకాశం నుంచి చూస్తే.. అది అచ్చాం డ్రాగన్ మాదిరే ఉంది. ఇక ఈ ఫోటోపై నెటిజనులు చేసే కామెంట్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. (చదవండి: ‘ఒకే ఫ్రేమ్లో 3 లెజెండ్స్.. కేటీఆర్ చాలా యంగ్గా ఉన్నారు’) ‘‘ఈ ఫోటోని చైనా వాడు చూస్తే.. మా డ్రాగన్లకు పోర్చుగల్ సంతోనోత్పత్తి కేంద్రంగా ఉంది. కనుక ఆ దేశం కూడా మాకు చెందినదే అంటుంది’’.. ‘‘ఇప్పటి నుంచి పోర్చుగల్ కూడా మా దేశంలో భాగమే. వారిని మాలో కలుపుకుంటాం అంటుంది’’ అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: అదృష్టం.. భూమ్మిద ఇంకా నూకలున్నాయ్!) When river look like a dragon... From Portugal. 🎬Faces in Things pic.twitter.com/0NWYPsXLQZ — Susanta Nanda (@susantananda3) November 27, 2021 -
FIFA World Cup 2022: రొనాల్డో జట్టుకు షాకిచ్చిన సెర్బియా..
FIFA World Cup 2022: Serbia Qualified After Beat Portugal Shock To Ronaldo Team: మరో ఐదు నిమిషాలు సెర్బియాను గోల్ చేయకుండా నిలువరించి ఉంటే... విఖ్యాత ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు... వచ్చే ఏడాది ఖతర్లో జరిగే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించేది. కానీ మ్యాచ్ 90వ నిమిషంలో సెర్బియా ప్లేయర్ మిత్రోవిచ్ గోల్ చేసి తమ జట్టును 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. ఇంజ్యూరీ టైమ్గా అదనంగా ఐదు నిమిషాలు జతచేయడంతో పోర్చుగల్కు స్కోరును సమం చేసేందుకు అవకాశం లభించినా ఫలితం లేకపోయింది. దాంతో సెర్బియా విజయం ఖాయ మైంది. యూరోప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా సెర్బియా 20 పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్గా నిలిచి ప్రపంచకప్ బెర్త్ను దక్కించుకుంది. 17 పాయిం ట్లతో గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచిన పోర్చుగల్ జట్టు... వచ్చే ఏడాది మార్చిలో ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో గెలిస్తే ప్రపంచకప్ బెర్త్ లభిస్తుంది. చదవండి: IND vs NZ T20I Series 2021: భారత్తో టీ20 సిరీస్ ముందు కివీస్కు షాక్.. తప్పుకొన్న విలియమ్సన్.. ఎందుకంటే.. FIFA World Cup 2022: ఫ్రాన్స్ అర్హత.. బెల్జియం, క్రొయేషియా కూడా -
రొనాల్డో గోల్ కొట్టలేదని ఏడ్చేసింది.. హత్తుకొని జెర్సీ గిఫ్ట్గా
Ronaldo Given Jersey As Gift To Irish Girl.. పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో క్రేజ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేంగా చెప్పనవసరం లేదు. తాజాగా రొనాల్డో గోల్ కొట్టలేదని ఏడ్చిన చిన్నారిని హత్తుకొని జెర్సీని గిఫ్ట్గా ఇచ్చి అభిమానుల మనసు కొల్లగొట్టాడు. విషయంలోకి వెళితే.. ఫిపా వరల్డ్కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా శుక్రవారం పోర్చుగల్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ఆధ్యంతం పోటాపోటీగా సాగడంతో నిర్ణీత సమయంలో ఇరుజట్లు ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాయి. చదవండి: FIFA 2022: ప్రపంచకప్కు బ్రెజిల్ అర్హత.. తొలి దక్షిణ అమెరికా జట్టుగా కాగా ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన ఐర్లాండ్ అమ్మాయి రొనాల్డోకు వీరాభిమాని. అయితే మ్యాచ్లో పోర్చుగల్ కెప్టెన్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చిన ఆమె రొనాల్డొను పట్టుకొని ఏడ్చింది. రొనాల్డో ఆమెను హత్తుకొని ఓదార్చి తన జెర్సీని గిఫ్ట్గా ఇచ్చి సంతోషపరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక పోర్చుగల్ తన తర్వాతి మ్యాచ్ను సెర్బియాతో ఆడనుంది. చదవండి: Wrestrler Nisha Dahiya: 'నేను చనిపోలేదు.. అది ఫేక్ న్యూస్' @Cristiano con un niño después del partido. Cristiano le dio su camiseta a la chica fan de Irlanda después de tiempo completo. pic.twitter.com/w8ArtK6AyR — Elia M. V. (@emariahn) November 11, 2021 -
ఇక ఎక్కువ సేపు పని చేయాలంటే.. జరిమానా కట్టాల్సిందే!
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సంస్థలు ఉద్యోగుల పని సమయం దాటిన తర్వాత కూడా ఎక్కువ సేపు పని చేయాలని ఒత్తిడి చేస్తుంటాయి. మరోకోన్ని సంస్థలు ఆఫీసు సమయం ముగిసిన తర్వాత కాల్ చేసి మరి పని చేయాలని ఉద్యోగులకు చిరాకు తెప్పిస్తాయి. ఇలాంటి, కష్టాలు మీకు కలిగితే పోర్చుగల్ దేశానికి వెళ్ళండి. ఎందుకంటే, ఉద్యోగులకు ఇటువంటి వాటి నుంచి ఉపశమనం పొందేలా పోర్చుగీస్ పార్లమెంట్ కొత్త కార్మిక చట్టాన్ని ఆమోదించింది. పోర్చుగల్ సోషలిస్ట్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆఫీసు పని అయిపోయిన తర్వాత ఉద్యోగులను పనిచేయాలనే కోరితే ఆ యజమానులకు జరిమానా విధించవచ్చు. వర్క్ ఫ్రమ్ హెం చేసిన సమయంలో కూడా సమయం దాటిన తర్వాత పని చేయించుకోకూడదు. ఇంటి నుంచి పనిచేసేటప్పుడు అయ్యే గ్యాస్, ఇంటర్నెట్, విద్యుత్ బిల్లులు వంటి పెరిగిన ఖర్చులను తమ సిబ్బందికి యజమానులు చెల్లించాల్సి ఉంటుంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఇంటి నుంచి పనిచేసే కొత్త సంస్కృతి కారణంగా అనేక ఇళ్లు తాత్కాలిక కార్యాలయాలుగా మారాయి. ఇంకా పిల్లలతో ఉన్న ఉద్యోగులకు వారి పిల్లలు 8 ఏళ్లు వచ్చే వరకు ఇంటి నుంచి పని చేయడానికి చట్టపరమైన రక్షణలు ఇచ్చింది. మెరుగైన పని-జీవిత సమతుల్యతను నెలకొల్పడానికి ఈ చట్టం తీసుకొచ్చామని కార్మిక, సామాజిక భద్రత మంత్రి అనా మెండెస్ గోడిన్హో పేర్కొన్నారు. పది మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. (చదవండి: మార్క్ జుకర్బర్గ్పై తీవ్ర విమర్శలు.. ఇన్స్టాగ్రామ్.. టేక్ ఏ బ్రేక్!) -
వర్క్ ఫ్రం హోం: ఎక్స్ ట్రా వర్క్కి చెక్ పెట్టేలా కొత్త చట్టం
పోర్చుగల్: ఈ కరోనా మహమ్మారి కారణంగా అందరూ వర్క్ ఫ్రం హోంకి పరిమితమయ్యారు. దీంతో కాన్ఫరెన్స్లు వంటివి వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత పెట్టేవారు. అందువల్ల చాలామంది ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యేవారు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్కి దూరంగా పనిచేయడంతో వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో పనిచేశారు. కానీ ఇప్పుడూ అలాంటి పనులు చేస్తే జరిమాను విధిస్తాను అంటోంది పోర్చుగల్ ప్రభుత్వం. (చదవండి: టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!) అసుల విషయంలోకెళ్లితే...కోవిడ్ -19 దృష్ట్యా 18 నెలలుగా ప్రజలు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించారు. దీంతో ఆఫీస్ కాల్లు, గ్రూప్ కాల్లు, జూమ్ మీటింగ్లు, కాన్ఫరెన్స్ కాల్లు వంటివి ఇటీవలకాలంలో ఎక్కువయ్యాయి. సహోద్యోగులతో మాట్లాడాలంటే ఆఫీస్కి రాలేరు కాబట్టి డిజిటల్ కమ్యూనికేషన్ ఒక్కటే పరిష్కారం. దీంతో తాము మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామంటూ పోర్చుగల్ ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో కొత్త కార్మిక చట్టాలను ఆమోదించింది. దీంతో బాస్లు, టీమ్ లీడర్లు పని గంటలు అయిపోయిన తర్వాత సిబ్బందికి కాల్ చేసి ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఒకరకరంగా చెప్పాలంటే పనిగంటలు అయిపోయిన తర్వాత బాస్లు ఎటువంటి సందేశాలు గానీ, పోన్లుగానీ చేయకూడదు, అలాగే ఎక్స్ట్రా వర్క్ చేయమని బలవంతం చేయకూడదు అంటూ పోర్చుగల్ ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాలను తీసుకువచ్చింది. ఒక వేళ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించింది. (చదవండి: పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!) -
Cristiano Ronaldo: ప్రత్యర్ధి ఆటగాడి చెంప చెల్లుమనిపించాడు, ఆ తర్వాత..?
పోర్చుగల్: దిగ్గజ ఫుట్బాలర్, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ చివరి నిమిషంలో రెండు గోల్స్ సాధించి తన జట్టును గెలిపించాడు. ఈ రెండు గోల్స్తో రొనాల్డో అంతర్జాతీయ గోల్స్ సంఖ్య 111కు చేరింది. దీంతో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇరాన్ దిగ్గజ ఆటగాడు అలీ దాయ్ (109)ను దాటి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. How is this not a red card for Mr Influencer Ronaldo?pic.twitter.com/jZcvvUME2g — Edmund 💉 (@EdmundOris) September 1, 2021 ఇదిలా ఉంటే, ఇదే మ్యాచ్లో రొనాల్డో చేసిన ఓ పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఆట ప్రారంభమైన 15వ నిమిషంలో పోర్చుగల్కు పెనాల్టీ లభించింది. ఈ పెనాల్టీ కిక్ను రొనాల్డో తీసుకున్నాడు. అయితే, బంతిని కిక్ చేయడానికి పొజిషన్లో పెట్టుకున్న సమయంలో ఐర్లాండ్ డిఫెండర్ ఓషియా దాన్ని కాలితో తన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన రొనాల్డో అతడి భుజంపై బలంగా కొట్టాడు. రొనాల్డో కొట్టిన దెబ్బకు ఓషియా కాసేపు ఓవరాక్షన్ చేశాడు. రొనాల్డోకు అంపైర్ రెడ్ కార్డ్ వస్తుందని నానా డ్రామా చేశాడు. అయితే ఈ తతంగాన్ని రిఫరి గమనించకపోవడంతో రొనాల్డో రెడ్ కార్డ్ బారి నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ రొనాల్డోకి రెడ్ కార్డు చూపించి ఉంటే.. అతను మైదానం వీడాల్సి వచ్చేది. అప్పుడు చివర్లో రెండు గోల్స్ కొట్టే అవకాశాం ఉండేది కాదు. కాగా, మైదానంలో ప్రత్యర్ధులపై ఇలా దురుసుగా ప్రవర్తించడం సీఆర్7కు కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగా అతను దాడులకు పాల్పడి మైదానం వీడాడు. రొనాల్డో దాడులు ఆటగాళ్ల వరకే పరిమితం అనుకుంటే పొరబడ్డట్టే. ఈ మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ రిఫరీలను కూడా వదిలిపెట్టలేదు. వారిపై కూడా దాడులకు దిగి అప్రతిష్టపాలయ్యాడు. చదవండి: అన్నీ మాకు సానుకూలాంశాలే, టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాం..పాక్ కెప్టెన్ ధీమా -
రొనాల్డో సంచలనం.. ఫుట్బాల్లో కొత్త చరిత్ర
Cristiano Ronaldo.. పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కొత్త చరిత్ర సృష్టించాడు. ఫుట్బాల్ చరిత్రలో దేశం తరపున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసి రొనాల్డో తొలిస్థానానికి దూసుకెళ్లాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో భాగంగా బుధవారం రాత్రి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో రొనాల్డో రెండు గోల్స్ చేయడం ద్వారా ఈ రికార్డును అందుకున్నాడు. ప్రస్తుతం ఫిపా లెక్కల ప్రకారం రొనాల్డో 180 మ్యాచ్లలో 111 గోల్స్తో టాపర్గా ఉన్నాడు. ఇరాన్కు చెందిన అలీ దాయ్ 149 మ్యాచ్లలోనే 109 గోల్స్ సాధించి రెండో స్థానంలో, మలేషియాకు చెందిన మొక్తర్ దహరి 142 మ్యాచ్లలో 89 గోల్స్తో మూడోస్థానంలో ఉన్నాడు. ఇదే మ్యాచ్ ద్వారా పోర్చుగల్ తరపున అత్యధిక మ్యాచ్లు (180) ఆడిన సెర్జియో రామోస్ రికార్డును రొనాల్డో సమం చేశాడు. చదవండి: మాంచెస్టర్ యునైటెడ్కు రొనాల్డో.. 12 ఏళ్ల తర్వాత ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మ్యాచ్ 15వ నిమిషంలో వచ్చిన పెనాల్టీని రొనాల్డో గోల్గా మలచలేకపోయాడు. అయితే 45వ నిమిషంలో ఐర్లాండ్ ఆటగాడు ఇగాన్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యత తీసుకొని వచ్చాడు. రెండో అర్ద భాగంలో ఐర్లాండ్ గట్టి పోటీని ఇచ్చింది. పోర్చుగల్ జట్టు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా రొనాల్డో తన మ్యాజిక్ను చూపించాడు. ఆట 89వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డో హెడర్తో గోల్ కొట్టి పోర్చుగల్కు తొలి గోల్ను అందించాడు. అదననపు సమయం ఆట(90+6) నిమిషంలో రొనాల్డో మరో గోల్ కొట్టడంతో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో ఆఖరి నిమిషాల్లో రెండు గోల్స్ చేసి 2-1తో పోర్చుగల్ విజయం సాధించింది. ఇక తన కెరీర్లో ఆఖరి 15 నిమిషాల్లో రొనాల్డో 33 గోల్స్ చేయడం విశేషం. ఇక రొనాల్డో ఇటీవలే 12 ఏళ్ల విరామం తర్వాత జూవెంటస్ క్లబ్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్కు మారిన సంగతి తెలిసిందే. చదవండి: రొనాల్డో రికార్డ్ను బద్దలు కొట్టిన మెస్సీ.. Ronaldo has now scored the most international goals in history pic.twitter.com/sAnkKOB2pX — RedAlvin (@RedAlvin4) September 1, 2021 -
మాంచెస్టర్ యునైటెడ్కు రొనాల్డో.. 12 ఏళ్ల తర్వాత
Cristiano Ronaldo.. పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డొ 12 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ యునైటెడ్కు తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు మాంచెస్టర్ యునైటెడ్ రెండేళ్ల కాలానికి గానూ 25 మిలియన్ యూరోస్కు(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 216 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. 2018 నుంచి జూవెంటెస్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డొ బాలన్ డీఓర్ అండ్ చాంపియన్స్ లీగ్ టైటిల్లో జూవెంటస్ తరపున తన చివరి మ్యాచ్ను ఆడేశాడు. ఇక 18 ఏళ్ల వయసులో 2003లో మాంచెస్టర్ యునైటెడ్కు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన రొనాల్డొ 2009 వరకు ఆ క్లబ్కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2009 నుంచి 2018 వరకు రియల్ మాడ్రిడ్కు ఆడాడు. 2018 నుంచి జూవెంటస్కు ఆడుతున్నాడు. ఇక రొనాల్డొ పోర్చుగల్ జట్టు తరపున 134 మ్యాచ్ల్లో 90 గోల్స్ సాధించాడు. ఫుట్బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ప్లేయర్లలో స్థానం సంపాదించిన రొనాల్డొ తన కెరీర్లో 32 టైటిల్స్ అందుకున్నాడు. దాదాపు పదకొండు వందలకు పైగా మ్యాచ్ల్లో ఆడిన రొనాల్డొ 780 గోల్స్ సాధించాడు. చదవండి: ENG Vs IND: మళ్లీ వచ్చేశాడు.. ప్యాడ్స్ కట్టుకొని కోహ్లి స్థానంలో -
సవతి సోదరితో 11 ఏళ్ల ప్రేమ, పెళ్లి.. త్వరలోనే..
లిస్బేన్: మోటోజీపీ స్టార్ రేసర్ మైగెల్ ఒలీవిరా త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. తమ జీవితాల్లోకి మరికొన్ని నెలల్లో చిన్నారి రానుందనే శుభవార్తను పంచుకున్నాడు. భార్య ఆండ్రియా పిమెంటాతో దిగిన ఫొటోను ఇన్స్టాలో షేర్ చేసిన ఒలీవిరా అభిమానులకు ఈ గుడ్న్యూస్ చెప్పాడు. ‘‘ఒక ప్రత్యేక వ్యక్తి మా జీవితాల్లోకి రాబోతున్నారు. మా ప్రయాణంలో అతి మధుర క్షణం. నిన్ను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను మై లవ్’’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కాగా 2015లో ఇటాలియన్ మోటార్ గ్రాండ్ ప్రిక్స్లో విజేతగా నిలిచిన ఈ పోర్చుగీస్ రేసర్.. తద్వారా తొలి ప్రపంచషిప్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్ రేసర్గా గుర్తింపు పొందాడు. ఇక తన తండ్రి రెండో భార్య కూతురు(స్టెప్ సిస్టర్) ఆండ్రియాతో ప్రేమలో పడ్డ 26 ఏళ్ల ఒలీవిరా.. 11 ఏళ్ల పాటు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. ఈ క్రమంలో ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లవ్ సీక్రెట్ను రివీల్ చేసిన ఒలీవీరా గత నెలలో ప్రేయసిని వివాహమాడాడు. ఇక పెళ్లైన.. సుమారు నెల రోజుల తర్వాత తల్లిదండ్రులం కాబోతున్నామంటూ అభిమానులకు స్వీట్ షాకిచ్చాడు. చదవండి: IND Vs ENG: ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. గాయంతో స్టార్ బౌలర్ ఔట్ -
UEFA EURO 2020: పోర్చు‘గల్లంతు’
సెవిల్లె (స్పెయిన్): యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్ జట్టు కథ ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బెల్జియం 1–0 గోల్ తేడాతో క్రిస్టి యానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టును ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. ఆట 42వ నిమిషంలో ఎడెన్ హజార్డ్ గోల్తో బెల్జియం ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇటలీతో బెల్జియం ఆడుతుంది. సోమవారం జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 5–3తో క్రొయేషియాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
Euro Cup: పోర్చుగల్ ఔట్.. రొనాల్డో భావోద్వేగం
సెవిలా: యూరో కప్ 2020 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్ అనూహ్యంగా వైదొలిగింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో బెల్జియం చేతిలో 0-1 తేడాతో ఓటమిపాలై తమ అభిమానులను షాక్కు గురి చేసింది. 42వ నిమిషంలో థోర్గాన్ హజార్డ్ చేసిన గోల్తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బెల్జియం.. తర్వాత ప్రత్యర్థికి సమం చేసే అవకాశం ఇవ్వకుండా ఆటను ముగించింది. తమ జట్టు అనూహ్య రీతిలో టోర్నీ నుంచి వైదొలగడంతో స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అసహనంతో తన ఆర్మ్ బ్యాండ్ను నేలకేసి కొట్టాడు. కెరీర్లో తన చివరి యూరో కప్లో ఆడిన రొనాల్డోకు ప్రిక్వార్టర్స్లోనే తన జట్టు ఇంటి దారి పట్టడం అస్సలు మింగుడు పడలేదు. Nahhh mannn, Possibly the last every time we see Ronaldo at the EUROS😢😢😢 pic.twitter.com/1aPQVOLr0F — Dhruvzzz (@dhruvzz8) June 27, 2021 కాగా, ఈ టోర్నీలో సూపర్ ఫామ్లో ఉన్న రొనాల్డో.. నాలుగు మ్యాచ్ల్లో ఐదు గోల్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతే కాదు, టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. యూరో కప్లో అతను మొత్తం 14 గోల్స్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇదే టోర్నీలో ఫ్రాన్స్తో జరిగిన మ్యాచ్లో రెండు గోల్స్ సాధించడం ద్వారా అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్(109 గోల్స్) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇరాన్కు చెందిన అలీ డేయీ(109 గోల్స్)తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ప్రిక్వార్టర్స్లో అతను ఒక్క గోల్ చేసుంటే తన జట్టును గట్టెక్కించడంతో పాటు అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేవాడు. చదవండి: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. -
ప్రి క్వార్టర్స్లో పోర్చుగల్, జర్మనీ
బుడాపెస్ట్: యూరో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. జర్మనీ, ఫ్రాన్స్ జట్లు కూడా నాకౌట్ దశకు చేరాయి. గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా బుధవారం అర్ధరాత్రి పోర్చుగల్, ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. 31వ, 60వ నిమిషాల్లో అతను రెండు గోల్స్ సాధించాడు. ఫ్రాన్స్ జట్టులో కరిమ్ బెన్జిమా ఇంజూరి టైమ్ (45+2వ ని.)లో, 47వ నిమిషంలో రెండు గోల్స్ చేశాడు. ఇదే గ్రూప్లో ఉన్న జర్మనీ... హంగేరితో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ను కూడా 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఐదు పాయింట్లతో ఫ్రాన్స్ ఈ గ్రూప్లో అగ్రస్థానంలో నిలవగా... నాలుగు పాయింట్లు సాధించిన జర్మనీ రెండో స్థానంలో నిలిచింది. పోర్చుగల్ కూడా 4 పాయింట్లు సాధించినప్పటికీ... జర్మనీ చేతిలో ఓడటంతో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. టోర్నీ నిబంధనల ప్రకారం గ్రూప్లో టాప్–2లో నిలిచిన జట్లు నేరుగా... మూడో స్థానంలో నిలిచిన 6 జట్ల నుంచి మెరుగైన నాలుగు టీమ్లు ప్రిక్వార్టర్స్కు చేరుకునే అవకాశం ఉంది. దాంతో పోర్చుగల్ కూడా నాకౌట్ దశకు అర్హత సాధించింది. శనివారం నుంచి ప్రిక్వార్టర్ఫైనల్ మ్యాచ్లు ఆరంభమవుతాయి. చరిత్రకు గోల్ దూరంలో రొనాల్డో ఫుట్బాల్ చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించుకోవడానికి పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గోల్ దూరంలో నిలిచాడు. యూరో కప్లో భాగంగా ఫ్రాన్స్తో జరిగిన మ్యాచ్లో రెండు గోల్స్ చేసిన రొనాల్డో... అంతర్జాతీయ ఫుట్బాల్ (దేశం తరఫున)లో ఇరాన్ ప్లేయర్ అలీ డయీ పేరిట ఉన్న అత్యధిక గోల్స్ (109) రికార్డును సమం చేశాడు. రొనాల్డో మరొక్క గోల్ సాధిస్తే అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా చరిత్రకెక్కుతాడు. -
'ప్లీజ్ ఇలాంటివి వద్దు.. మంచినీరు మాత్రమే తాగండి'
అమ్స్టర్డామ్: పోర్చుగల్ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో 36 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యమిస్తాడు. డైట్ను కచ్చితంగా ఫాలో అయ్యే రొనాల్డో తన ఆహారంలో కేలరీస్ ఎక్కువగా లభించే జంక్ఫుడ్ లేకుండా జాగ్రత్త పడతాడు. తాజాగా ఒక మీడియా సమవేశంలో తన ముందున్న కోకకోలా బాటిల్ను పక్కన పెట్టేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దంటూ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. యూఈఎఫ్ఏ యూరోకప్ 2020లో భాగంగా రొనాల్డో జట్టు కెప్టెన్ హోదాలో కోచ్ ఫెర్నాండో సాంటోస్తో కలిసి మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. అయితే తాను కుర్చీలో కూర్చునేటప్పుడు టేబుల్పై కోకకోలా బాటిల్స్ కనిపించాయి. వెంటనే వాటిని చేతిలోకి తీసుకొని పక్కన పెట్టేసి.. '' ఇలాంటివి వద్దు.. మంచినీరు మాత్రమే తాగండి'' అంటూ వాటర్బాటిల్ను తన చేతిలో తీసుకొని చెప్పాడు. కోచ్ ఫెర్నాండోస్ రొనాల్డో ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు.. కానీ తర్వాత తన మాటలతో అర్థం చేసుకున్న అతను రొనాల్డొను అభినందించాడు. యూరోకప్ 2020లో భాగంగా పోర్చుగల్ గ్రూఫ్ ఎఫ్లో ఉంది. పోర్చుగల్తో పాటు జర్మనీ, ప్రాన్స్, హంగేరీ కూడా ఉండడంతో అంతా ఈ గ్రూఫ్ను ''గ్రూఫ్ ఆఫ్ డెత్''గా అభివర్ణిస్తున్నారు. కాగా 2016లో జరిగిన యూరోకప్లో రొనాల్డో ఆధ్వర్యంలోనే పోర్చుగల్ ఫ్రాన్స్ను ఫైనల్లో ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న పోర్చుగల్ మరోసారి చాంపియన్గా నిలవాలని చూస్తుంది. 36 ఏళ్ల రొనాల్డోకిది వరుసగా ఆరో ‘యూరో’ చాంపియన్షిప్ కావడం విశేషం. కాగా రొనాల్డో అంతర్జాతీయ మ్యాచ్ల్లో పోర్చుగల్ తరపున ఇప్పటివరకు 104 గోల్స్ చేశాడు. మరో ఏడు గోల్స్ చేస్తే అంతర్జాతీయ ఫుట్బాల్లో ఒక దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇరాన్ మాజీ ప్లేయర్ అలీ దాయి (109 గోల్స్) పేరిట ఉంది. చదవండి: UEFA EURO 2020: నెదర్లాండ్స్ బోణీ 7 సెకన్లు.. 60 మీటర్ల దూరం.. ఏమా వేగం Cristiano Ronaldo was angry because they put Coca Cola in front of him at the Portugal press conference, instead of water! 😂 He moved them and said "Drink water" 😆pic.twitter.com/U1aJg9PcXq — FutbolBible (@FutbolBible) June 14, 2021 -
7 సెకన్లు.. 60 మీటర్ల దూరం.. ఏమా వేగం
ఫుట్బాల్కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో తమ ఫేవరెట్ ఆటగాడు బరిలో ఉన్నాడంటే ఇక ఫ్యాన్స్కు పండగే. ఫీల్డ్లో ఎందరు ఉన్నా.. అందరి కళ్లు తమ అభిమాన ఆటగానిపైనే ఉంటాయి. అలాంటి వారిలో పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్లొ ఒకడు. అంతర్జాతీయ ఫుట్బాలర్గా ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా 36 ఏళ్ల వయసులోనూ తన రన్నింగ్ పవర్ను చూపించి ఎంత ఫిట్గా ఉన్నాడో చెప్పకనే చెప్పాడు. విషయంలోకి వెళితే.. శుక్రవారం స్పెయిన్, పోర్చుగల్ మధ్య అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రొనాల్డొ ఒక్క గోల్ కూడా కొట్టలేదు.. కానీ అభిమానులను మాత్రం ఎంటర్టైన్ చేశాడు. మ్యాచ్ డ్రాగా ముగుస్తుందన్న దశలో 87.29 నుంచి 87.36 టైమ్లైన్ మధ్యలో 7 సెకన్లలో రొనాల్డొ చిరుత మించిన వేగంతో ఒక గోల్పోస్ట్ బాక్స్ నుంచి మరో గోల్పోస్ట్ బాక్స్కు పరిగెత్తాడు. దీనిని చూసిన అభిమానులు రొనాల్డొను వహ్వా అనకుండా ఉండలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు ట్రెండింగ్గా మారింది. అయితే రొనాల్డొకు మ్యాచ్ మధ్యలో చాలాసార్లు బంతిని గోల్పోస్టులోకి పంపించే అవకాశం వచ్చినా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. ప్రస్తుతం జువెంటస్ క్లబ్తో పాటు పోర్చుగల్ జాతీయ జట్టుకు ఆడుతున్న రొనాల్డొ తన కెరీర్లో ఇప్పటివరకు అన్ని క్లబ్లు, అంతర్జాతీయ మ్యాచ్లు కలిపి దాదాపు 770కి పైగా గోల్స్ నమోదు చేశాడు. చదవండి: ఇటాలియన్ గ్రాండ్ ప్రిలో విషాదం.. మోటో3 రైడర్ మృతి 'రషీద్ పెళ్లెప్పుడు'.. ఎందుకు మీరు వస్తారా? 🇵🇹 Cristiano Ronaldo covered over 60 meters in 7 seconds. 36 years old 🤯pic.twitter.com/bRmRize8dF — Yellow Football (@YellowFootbal) June 4, 2021 -
చాంపియన్స్ లీగ్ విజేత జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు
పోర్టో (పోర్చుగల్): ప్రతిష్టాత్మక యూరోపియన్ చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో చెల్సీ క్లబ్ (ఇంగ్లండ్) జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో సెసర్ అప్లిక్వెటా కెప్టెన్సీలోని చెల్సీ క్లబ్ జట్టు 1–0తో మాంచెస్టర్ సిటీ (ఇంగ్లండ్) జట్టుపై గెలిచింది. ఆట 42వ నిమిషంలో కాయ్ హావెర్ట్జ్ ఏకైక గోల్ చేసి చెల్సీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విజేత చెల్సీ జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు (రూ. 167 కోట్లు)... రన్నరప్ మాంచెస్టర్ సిటీ జట్టుకు కోటీ 50 లక్షల యూరోలు (రూ. 132 కోట్లు) ప్రైజ్మనీగా లభించాయి. -
ప్రపంచ అతి పొడవైన వేలాడే బ్రిడ్జి ఎక్కడుందో తెలుసా?
మీకు భయమంటే ఎంటో తెలియదా? సాహసాలు చేయడమంటే ఇష్టమా? అయితే ఈ రెండింటినీ పరిచయం చేస్తానంటోంది పోర్చుగల్లోని అరౌకా బ్రిడ్జి. ప్రపంచంలోనే అతి పొడవైన వేలాడే బ్రిడ్జిని ఇటీవల పోర్చుగల్ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ‘బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్’ లేదా ‘అరౌకా 516’గా దీన్ని పిలుస్తారు. ఉత్తర పోర్చుగల్లోని పావియ నదిపై 175 మీటర్ల ఎత్తు (574 అడుగులు) లో నిర్మించిన అరౌకా బ్రిడ్జి పొడవు 516 మీటర్లు (1693 అడుగులు). అరకిలోమీటరు పొడువు ఉన్న అరౌకా.. వేళాడుతూ అగ్యిరాస్ జలపాతం నుంచి పావియా జార్జ్ను కలుపుతూ.. ‘అరౌకా జియోపార్క్’లో మంచి అడ్వెంచర్ స్పాట్గా మారింది. 2017లో స్విట్జర్లాండ్లో ప్రారంభించిన ‘చార్లెస్ కుయోనెన్ సస్పెన్షన్’ బ్రిడ్జిను అరౌకా వెనక్కు నెట్టేసింది. ఇది పరుచుకోనంత వరకు 494 మీటర్ల(1621 అడుగుల) పొడవుతో ‘చార్లెస్ కుయోనెన్ సస్పెన్షన్’ బ్రిడ్జే ప్రపంచలోని అతి పొడవైన వేలాడే వంతెనగా నడకసాగించింది. ప్రస్తుతం ఆ ప్రస్థానాన్ని 516 మీటర్ల పొడవుతో అరౌకా కొనసాగిస్తోంది. VIDEO: Portugal opens the longest suspended pedestrian bridge in the world in Arouca. The bridge hangs on heavy steel cables strung between V-shaped concrete towers and runs 516 metres (1700 feet) across a canyon, at a height of 175 metres pic.twitter.com/bOL5CrNCJZ — AFP News Agency (@AFP) April 30, 2021 అందుకే అరౌకా.. యునెస్కో గుర్తింపు పొందిన అరౌకా జియోపార్క్ సమీపంలో ఈ బ్రిడ్జిను నిర్మించడంతో దీనికి అరౌకా అని పేరు పెట్టారు. 2018లో నిర్మాణం ప్రారంభించి 2020లో పూర్తి చేశారు. ఇది ప్రపంచంలోనే పొడవైన బ్రిడ్జి అయినప్పటికీ కాస్త ఇరుకుగా ఉంటుంది. పోర్చుగీస్ స్టూడియో ఇటెకాన్స్ టిబేటన్ శైలీలో ఈ బ్రిడ్జి డిజైన్ను రూపొందించింది. ఈ వారధికి ఇరువైపులా ‘వి’ ఆకారంలో ఉన్న మూల స్థంబాల్లాంటి రెండు టవర్లు ఉన్నాయి. వాటి మధ్య స్టీల్ కేబుల్స్తో ఉంటుంది వంతెన వేళాడుతూ. నాలుగు మీటర్ల పొడవున్న 127 మాడ్యూల్స్ను ఉపయోగించి బ్రిడ్జి డెక్ను నిర్మించారు. డెక్కు రెండువైపులా నెట్తో రెయిలింగ్ను పటిష్ఠంగా అమర్చారు. అరౌకా నిర్మాణానికి మొత్తం 2.8 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. అంటే మన రూపాయాల్లో అక్షరాల 20.68 కోట్లు. గుండె గుబేలే.. ఈ వారధి నిర్మించక ముందు పర్యాటకులు అరౌకా జియోపార్క్ చూట్టు ఉన్న ప్రకృతి అందాలను చూసేందుకు వాహానాల మీద వెళ్లేవారు. ట్రెకింగ్ చేసేవారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జి ప్రారంభించడంతో పెద్దగా శ్రమపడకుండా హాయిగా నడకసాగించొచ్చు. అయితే నడిచేటప్పుడు కిందకు చూస్తే మాత్రం గుండె గుబేలుమంటోందని స్థానికులు చెబుతున్నారు. అరౌకా బ్రిడ్జి మొదలైన తరువాత నడిచిన తొలి వ్యక్తి హ్యూగో జేవియర్. వంతెన ఇవతలి నుంచి అవతలికి దాటిన తరువాత జేవియర్ మాట్లాడుతూ..‘‘ బ్రిడ్జిపై ఈ చివరి నుంచి ఆ చివరకు నడవడానికి కనీసం పదినిముషాలు పట్టింది. బ్రిడ్జి మీద నడిచేటప్పుడు చాలా భయమేసింది.అయినా జీవితంలో మర్చిపోలేని అసాధారణమైన, ప్రత్యేకమైన అనుభూతి అది’’ అని చెప్పాడు. ఏంటీ మీరూ అక్కడకు వెళ్లాలనుకుంటు న్నారా! అయితే కరోనా తగ్గిన తరువాతే కుదురుతుంది! అప్పుడు కూడా ఆరేళ్ల లోపు పిల్లలను బ్రిడ్జిమీదకు అనుమతించరు. పెద్దవాళ్లైనా సరే గైడ్ను వెంటబెట్టుకుని వెళ్లాల్సిందే. సందర్శనకు 12 – 14 డాలర్ల రుసుము చెల్లించాల్సిందే!! – పి. విజయా దిలీప్ -
ఈ తీగల బ్రిడ్జ్.. ఎంతపొడుగో!
ఈ తీగల బ్రిడ్జి చూశారా ఎంత పెద్దగా ఉందో..! ప్రపంచంలోనే అతి పొడవైన పెడెస్ట్రెయిన్ సస్పెన్షన్ బ్రిడ్జి ఇది. పోర్చుగల్లో నిర్మించిన దీనిని ఇటీవల ప్రారంభించారు. 1700 అడుగుల పొడవు ఉండే ఈ బ్రిడ్జిని కేవలం నడవడానికి మాత్రమే నిర్మించారు. పూర్తిగా ఇనుప తీగలనే బ్రిడ్జి నిర్మాణానికి వినియోగించారు. దీని నిర్మాణానికి రెండు సంవత్సరాలు పట్టింది. 2.8 మిలియన్ల డాలర్లు ఖర్చయింది. అరౌకా జియో పార్క్ ప్రాంతంలో నిర్మించినందువల్ల దీనిని 516 అరౌకా అని పిలుస్తున్నారు. రెండు కొండల మధ్య వేగంగా ప్రవహించే పైవా నది ఉపరితలానికి 575 అడుగుల ఎత్తులో బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జిపై ఈ చివరినుంచి ఆ చివరకు నడవడానికి కనీసం పది నిమిషాలు పడుతోందని స్థానికులు చెబుతున్నారు. నడిచేటప్పుడు కిందకి చూస్తే భయం వేస్తోందని, దీనిపై నడవడానికి గుండె ధైర్యం ఉండాలని వారు అంటున్నారు. -
క్వాలిఫయింగ్లో హామిల్టన్కు నిరాశ
పోర్టిమావో (పోర్చుగల్): కెరీర్లో 100వ పోల్ పొజిషన్ సాధించేందుకు డిఫెండింగ్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో వారం రోజులు వేచి చూడాలి. తాజా ఫార్ములావన్ సీజన్లో భాగంగా శనివారం జరిగిన పోర్చుగల్ గ్రాండ్ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. గత రెండు రేసుల్లో నిరాశ పరిచిన మెర్సిడెస్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ వాల్తెరి బొటాస్ మాత్రం ఈ క్వాలిఫయింగ్ సెషన్లో అదరగొట్టాడు. అందరికంటే వేగంగా ల్యాప్ను నిమిషం 18.348 సెకన్లలో పూర్తి చేసి పోల్ పొజిషన్ను సొంతం చేసుకున్నాడు. అతడి కెరీర్లో ఇది 17వ పోల్. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. రెడ్బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. సీజన్లో ఇప్పటి వరకు మూడు క్వాలిఫయింగ్ సెషన్లు జరగ్గా... ఈ మూడు సార్లు వేర్వేరు డ్రైవర్లు పోల్ పొజిషన్ను దక్కించుకున్నారు. బహ్రెయిన్లో వెర్స్టాపెన్, ఇమోలా గ్రాండ్ప్రిలో హామిల్టన్లు పోల్ పొజిషన్తో మెరిశారు. గ్రిడ్ పొజిషన్స్ 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్బుల్), 4. పెరెజ్ (రెడ్బుల్), 5. సెయింజ్ (ఫెరారీ), 6. ఒకాన్ (ఆల్పైన్), 7. నోరిస్ (మెక్లారెన్), 8. లెక్లెర్క్ (ఫెరారీ), 9, గ్యాస్లీ (ఆల్ఫా టారీ), 10. వెటెల్ (ఆస్టన్ మార్టిన్), 11. రసెల్ (విలియమ్స్), 12. జియోవినాజి (ఆల్ఫా రోమియో), 13. అలోన్సో (ఆల్పైన్), 14, సునోడా (ఆల్ఫా టారీ), 15. రైకొనెన్ (ఆల్ఫా రోమియో), 16. రికియార్డో (మెక్లారెన్) 17. స్ట్రోల్ (ఆస్టన్ మార్టిన్), 18. లతీఫ్ (విలియమ్స్), 19. మిక్ షుమాకర్ (హాస్), 20. మేజ్పిన్ (హాస్) -
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నర్స్ మృతి
లిస్బన్/పోర్టో/పోర్చుగీసు : సాధారణంగా 100 శాతం సామార్థ్యం గల వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే రెండుమూడేళ్ల సమయం పడుతుంది. అయితే కరోనావైరస్ వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వాలు కొన్ని నిబంధనలను పక్కకు పెట్టి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మూడు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతిచ్చారు. మన దేశంలో డీసీజీఐ భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటి సామార్థ్యం పట్ల ఇప్పటికే జనాల్లో పలు అనుమానాలు తలెత్తుతుండగా.. వీటిని మరింత పెంచే సంఘటన ఒకటి పోర్చుగల్లో చోటు చేసుకుంది. ఓ నర్స్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల తర్వాత చనిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడమే కాక వ్యాక్సిన్ పనితీరు పట్ల మరిన్ని అనుమానాలను, భయాలను పెంచుతుంది. వివరాలు.. సోనియా అసేవెడో(41) అనే మహిళ పోర్టోలోని పోర్చుగీసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీలో పిడియాట్రిక్ అసిస్టెంట్ నర్స్గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైజర్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగంలో భాగంగా సోనియా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మృత్యువాత పడ్డారు. (చదవండి: వివాదంలో ‘అనుమతులు’) ఈ సందర్భంగా సోనియా తండ్రి అబిలియో అసేవెడో మాట్లాడుతూ.. ‘నా కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. రెండు రోజుల క్రితం తను కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకుంది. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. కానీ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా తను మరణించింది. నా కుమార్తె ఎందువల్ల మరణించిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. అంతేకాక సోనియాకు మద్యం అలవాటు లేదని.. ఈ మధ్య కాలంలో ఎలాంటి కొత్త ఆహార పదార్థాలను తీసుకోలేదని.. అంతా సాధారణంగానే ఉందని ఆమె తండ్రి తెలిపారు. ఇక పోర్చుగీసు ఆరోగ్య శాఖ అధికారులు సోనియా మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోర్చుగీసులో 538 ఆరోగ్య కార్యకర్తలు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక పది మిలియన్ల జనాభా గల పోర్చుగీసులో 4,27,000 కరోనా కేసులు నమోదు కాగా.. 7,118 మంది మరణించారు. -
పీలేను దాటిన క్రిస్టియానో రొనాల్డో...
ఫుట్బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ జట్టు కెప్టెన్, యువెంటస్ క్లబ్ (ఇటలీ) స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రెండో స్థానానికి చేరుకున్నాడు. 757 గోల్స్తో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ దిగ్గజం పీలేను మూడో స్థానానికి నెట్టిన రొనాల్డో 758 గోల్స్తో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇటలీ ప్రొఫెషనల్ లీగ్ సెరియె ‘ఎ’లో భాగంగా ట్యూరిన్లో యుడినెస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో యువెంటస్ 4–1తో గెలిచింది. ఈ మ్యాచ్కు ముందు 756 గోల్స్తో మూడో స్థానంలో ఉన్న రొనాల్డో రెండు గోల్స్ చేసి పీలేను దాటి ముందుకెళ్లాడు. రొనాల్డో ప్రొఫెషనల్ లీగ్స్లో 656 గోల్స్... దేశం తరఫున ఆడుతూ 102 గోల్స్ చేశాడు. అందుబాటులో ఉన్న అధికారిక లెక్కల ప్రకారం అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో 759 గోల్స్తో జోసెఫ్ బికాన్ (చెక్ రిపబ్లిక్) టాప్ ర్యాంక్లో ఉన్నాడు. మరో రెండు గోల్స్ చేస్తే రొనాల్డో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా కొత్త రికార్డు లిఖిస్తాడు. -
ఒకే ఒక్కడు...
పోర్టిమావో (పోర్చుగల్): ఫార్ములావన్ (ఎఫ్1)లో అద్భుతం చోటు చేసుకుంది. 14 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డు తెరమరుగైంది. గత ఏడేళ్లుగా నిలకడగా రాణిస్తున్న బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ ఘనత సాధించాడు. ఆదివారం జరిగిన పోర్చుగల్ గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. తద్వారా తన కెరీర్లో 92వ విజయం నమోదు చేశాడు. ఈ క్రమంలో 91 విజయాలతో జర్మనీ దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును 35 ఏళ్ల హామిల్టన్ బద్దలు కొట్టాడు. 2007లో తొలి ఎఫ్1 విజయం సాధించిన హామిల్టన్ 2013లో మెర్సిడెస్ జట్టులో చేరాడు. మెర్సిడెస్ జట్టులో షుమాకర్ స్థానాన్ని భర్తీ చేసిన హామిల్టన్ అటు నుంచి వెనుదిరిగి చూడలేదు. షుమాకర్ ఏడు ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్స్ (సీజన్ ఓవరాల్ విన్నర్) ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉండగా... ఈ ఏడాదీ హామిల్టన్కే ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ దక్కడం దాదాపు ఖాయమైంది. ఫలితంగా ఈ సీజన్లో మరో ఐదు రేసులు ముగిశాక షుమాకర్ పేరిట ఉన్న ఈ రికార్డునూ హామిల్టన్ సమం చేసే చాన్స్ ఉంది. 2006లో చైనా గ్రాండ్ప్రిలో విజేతగా నిలిచిన తర్వాత షుమాకర్ అదే ఏడాది ఎఫ్1కు వీడ్కోలు పలికాడు. నాలుగేళ్ల తర్వాత రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని ఎఫ్1లో పునరాగమనం చేసిన షుమాకర్ 2012 వరకు మెర్సిడెస్ జట్టుతో కొనసాగినా మరో రేసులో గెలుపొందలేకపోయాడు. ఆరంభంలో వెనుకబడ్డా... 24 ఏళ్ల తర్వాత మళ్లీ జరిగిన పోర్చుగల్ గ్రాండ్ప్రిలో హామిల్టన్ ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించాడు. అయితే రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ మొదట్లోనే హామిల్టన్ను ఓవర్టేక్ చేశాడు. అయితే 20వ ల్యాప్లో హామిల్టన్ ఆధిక్యంలోకి వచ్చి ఆ తర్వాత అదే జోరును చివరిదైన 66వ ల్యాప్ వరకు కొనసాగించాడు. చివరకు గంటా 29 నిమిషాల 56.828 సెకన్లలో రేసును ముగించిన హామిల్టన్ కెరీర్లో 92వ విజయాన్ని దక్కించుకున్నాడు. బొటాస్కు రెండో స్థానం లభించగా... వెర్స్టాపెన్ (రెడ్బుల్) మూడో స్థానాన్ని పొం దాడు. ప్రస్తుత సీజన్లోని 17 రేసుల్లో 12 పూర్తయ్యాయి. తదుపరి రేసు ఎమీలియా రొమాగ్నా గ్రాండ్ప్రి ఇటలీలో నవంబర్ 1న జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్ షిప్ రేసులో హామిల్టన్ 256 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బొటాస్ (179 పాయింట్లు), వెర్స్టాపెన్ (162 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్షిప్లో మెర్సిడెస్ 435 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉంది. -
వైరల్ : రొనాల్డో నైటీ వేసుకున్నాడా?
లిస్బన్ : క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన దిగ్గజ ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. తాజాగా వెల్లడించిన ఫోర్బ్స్ జాబితాలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 11 కోట్ల 70 లక్షల డాలర్ల (దాదాపు రూ. 860 కోట్లు) ఆర్జనతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటలీలో యువెంటస్ క్లబ్కు ఆడుతున్న రొనాల్డో వేతనం ద్వారా 70 కోట్ల డాలర్లు... ఎండార్స్మెంట్ల ద్వారా 47 కోట్ల డాలర్లు పొందుతున్నాడు.రొనాల్డో.. పోర్చుగల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఫుట్బాల్ క్లబ్ లీగ్స్కు ఆడుతూ ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించాడు. (చదవండి : 'రోహిత్ ఇది నాది.. వెళ్లి సొంత బ్యాట్ తెచ్చుకో') తాజాగా రొనాల్డో తన ట్విటర్లో ఒక ఫోటోను షేర్ చేశాడు. 2వేల పౌండ్ల( రూ. కోటి 80 లక్షలు) ధర కలిగిన లూయిస్ సిల్క్ డ్రెస్ సెట్ వేసుకొని.. దాదాపు 5.5 మిలియన్ పౌండ్ల(రూ. 40 కోట్లు) ధర పెట్టి కొనుగోలు చేసిన తన క్రూసింగ్ షిప్లో దిగిన ఫోటోను ట్విటర్లో పెట్టాడు. షిప్ బాల్కనీలో కూర్చొని సన్సెట్ను ఆస్వాధిస్తూ 'వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు రొనాల్డో పెట్టిన ఫోటోలపై నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నా అని క్యాప్షన్ పెట్టిన రొనాల్డో ముఖంలో మాత్రం ఆ సంతోషం కనబడటం లేదని నెటిజన్లు వాపోయారు. తన ముఖం చూస్తే ఏదో బాధతో కుమిలిపోతున్నట్లు కనిపిస్తుంది. ఫోటోకు ఫోజిచ్చినప్పుడు కనీసం నవ్వాలన్న సోయి కూడా రొనాల్డోకు లేదు.. ఇదేం ఎంజాయ్మెంటో మాకు అర్థం కావడం లేదు అంటూ కామెంట్లు పెట్టారు. రొనాల్డో ట్వీట్ చూసి కొంతమంది మరింత ముందుకెళ్లి.. 'ఇదేంటీ మమ్మీ.. రొనాల్డో నీ నైటీ ఎందుకు ఎందుకు వేసుకున్నాడు.. అచ్చం జైలు నుంచి పారిపోయిన ఖైదీలా కనిపిస్తున్నావు.. రొనాల్డో మా హార్ట్ బ్రేక్ చేశావు.. రొనాల్డో.. నీ డ్రెస్ సెన్స్ అస్సలు బాగాలేదు..' అంటూ వరుస ట్వీట్లతో ట్రోల్ చేశారు. What a beautiful 🌅🙏 pic.twitter.com/GvOCmoBKjt — Cristiano Ronaldo (@Cristiano) September 14, 2020 -
‘సెంచరీ’ కొట్టేశాడు..
సోల్నా (స్వీడన్): దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయస్థాయిలో (దేశం తరఫున ఆడే మ్యాచ్లు) 100 గోల్స్ పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి యూరప్ ప్లేయర్గా, ఓవరాల్గా రెండో ప్లేయర్గా గుర్తింపు పొందాడు. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ) నేషన్స్ లీగ్ టోర్నమెంట్లో భాగంగా గ్రూప్ ‘3’ లీగ్ మ్యాచ్లో పోర్చుగల్ 2–0 గోల్స్ తేడాతో స్వీడన్ను ఓడించింది. 35 ఏళ్ల రొనాల్డో ఆట 45వ నిమిషంలో గోల్ చేయడంతో తన అంతర్జాతీయ కెరీర్లో 100వ గోల్ మైలురాయి చేరుకున్నాడు. ఆ తర్వాత 73వ నిమిషంలో రొనాల్డో రెండో గోల్ కూడా చేసి తమ జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ గోల్తో రొనాల్డో అంతర్జాతీయ గోల్స్ సంఖ్య 101కు చేరింది. అంతర్జాతీయస్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు అలీ దాయి (ఇరాన్) పేరిట ఉంది. 2006లో రిటైరైన 51 ఏళ్ల అలీ దాయి ఇరాన్ తరఫున మొత్తం 109 గోల్స్ సాధించాడు. ∙2003లో జాతీయ సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన రొనాల్డో ఇప్పటి వరకు పోర్చుగల్ తరఫున 165 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. మొత్తం 41 దేశాలపై కనీసం ఒక గోల్ అయినా చేశాడు. లిథువేనియా, స్వీడన్ దేశాలపై రొనాల్డో అత్యధికంగా ఏడు గోల్స్ చొప్పున చేశాడు. ∙రొనాల్డో తాను చేసిన మొత్తం 101 గోల్స్లో 41 గోల్స్ మ్యాచ్ తొలి అర్ధభాగంలో... 60 గోల్స్ రెండో అర్ధ భాగంలో సాధించాడు. ఓవరాల్గా రొనాల్డో అంతర్జాతీయ కెరీర్లో 9 సార్లు ‘హ్యాట్రిక్’ సాధించాడు. ∙రొనాల్డో గోల్ చేసిన మ్యాచ్ల్లో పోర్చుగల్ 55 మ్యాచ్ల్లో గెలిచింది. ఆరు మ్యాచ్ల్లో ఓడింది. ఐదు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. ∙ప్రొఫెషనల్ కెరీర్లో (స్పోర్టింగ్ క్లబ్, మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్, రియల్ మాడ్రిడ్ క్లబ్, యువెం టస్ క్లబ్) రొనాల్డో మొత్తం 447 గోల్స్ చేశాడు. -
కరోనా బారిన పడి 14 ఏళ్ల బాలుడి మృతి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ యువతీ యువకులను ఏమీ చేయలేదని, 50 ఏళ్లు దాటిన మధ్య వయస్కులకు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే ప్రాణాంతకమని, అది కూడా ఊపిరితిత్తులు, క్యాన్సర్, మధుమేహం లాంటి జబ్బులతో బాధ పడుతున్న వారికేనంటూ ప్రపంచవ్యాప్తంగా వైద్యులు ఇంతకాలం చెబుతూ వచ్చారు. అది ఒట్టి అపోహ మాత్రమేనని, కరోనా వైరస్ అన్ని వయస్కుల వారికి ప్రాణాంతకమని ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటోన్న మృతుల వివరాలను విశ్లేషిస్తే సులభంగానే అవగమవుతోంది. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం) పోర్చుగల్ దేశంలోని దక్షిణ పోర్టో ప్రాంతానికి చెందిన విటార్ గోడిన్హో అనే 14 ఏళ్ల బాలుడు కరోనా బారిన పడి ఆదివారం ఉదయం శాంటా మారియా డా ఫియెరా ఆస్పత్రిలో మరణించారు. ఆయన ఇంతకుముందే సొరియాసిస్తో బాధ పడుతున్నప్పటికీ అనారోగ్య సమస్యలేమీ లేవని డాక్టర్లు ధ్రువీకరించారు. ప్రపంచంలో కరోనా బారిన పడి మరణించిన అత్యంత పిన్న వయస్కుడే ఆ బాలుడే కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. వారం రోజుల క్రితమే జూలి ఆలియట్ అనే 16 ఏళ్ల బాలిక కరోనా వైరస్ బారిన పడి మరణించారు. ఆమెకు గతంలో ఎలాంటి జబ్బులు లేవని, స్వల్ప దగ్గుతో బాధ పడుతున్న స్కూల్ గర్ల్ జూలి ఆలియట్ బుధవారం పారిస్ ఆస్పత్రులో మరణించారు. కరోనా వైరస్తో ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. లండన్లో చెఫ్గా పని చేస్తోన్న 19 ఏళ్ల ఇటాలియన్ లుకా డీ నికోలా వైరస్ బారిన పడి మంగళవారం సాయంత్రం మరణించారు. అంతకుముందు ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. పైగా యువకుడని, ఆయనేం కాదంటూ డాక్టర్ బరోసా ఇచ్చినప్పటికీ ఆ యువకుడిని మృత్యువు కబళించింది. ఆయన లండన్లోని ఎన్ఫీల్డ్లో తల్లి క్లారిస్సా, పార్ట్నర్ విన్సెంజోతో కలిసి ఓ రెస్టారెంట్ను నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం లుకా డీ నికోలా అంతకుముందు వారం రోజులుగా దగ్గూ జ్వరంతో బాధ పడుతున్నారు. స్థానిక డాక్టర్ వద్దకు వెళ్లగా ‘పారసిటమాల్’ ట్యాబెట్లు ఇచ్చి పంపించారు. దగ్గు తగ్గక పోవడంతో కరోనా వైరస్గా భావించిన కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి మళ్లీ చూపించారు. యవ్వనంలో ఉండడం వల్ల, ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేదనందున కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ భరోసా ఇచ్చిన రోజు సాయంత్రమే ఆయన మరణించారు. ఆ తర్వాత కరోనాతోనే ఆయన మరణించినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. (చదవండి: కరోనా చికిత్సకు కొత్త పరికరం) -
‘అత్యుత్తమ గోల్ కంటే ఆమెతో సెక్స్ ఎంతో గొప్పది’
లిస్బన్: పోర్చుగల్ ఫుట్బాల్ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఘనత క్రిస్టియోనో రొనాల్డోది. పోర్చుగల్కు అత్యధిక మ్యాచ్లు ఆడిన ఘనతతో పాటు ఆ జట్టు తరఫున అత్యధిక గోల్స్ సాధించిన రికార్డును కూడా తన పేరిటే లిఖించుకున్న రొనాల్డో. తన వ్యక్తిగత జీవితాన్ని పెద్దగా షేర్ చేసుకున్న దాఖలాలు లేవు. అయితే రొనాల్లో ఖాతాలో ఎఫైర్లు కూడా బాగానే ఉన్నాయి. గతంలో రష్యన్ మోడల్ ఇరినా షయక్తో ఐదేళ్లపాటు రిలేషన్లో ఉన్న రొనాల్డో ఇప్పటివరకూ ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. కాకపోతే ఆరుగురికి మాత్రం తండ్రి అయ్యాడు. 2010లో పుట్టిన కుమారునికి క్రిస్టియానో రొనాల్డో జూనియర్ అని నామకరణం చేశాడు. రొనాల్డో జూనియర్ తల్లి ఎవరు అనే విషయాన్ని గోప్యంగా ఉంచాడు రొనాల్డో. తనతో సహ జీవనం చేసిన ఆమెతో అగ్రిమెంట్లో భాగంగనే రొనాల్డో అలా చేశాడు. ఆ తర్వాత కవల కూతుళ్లకు, కవల కుమారులకు జన్మనిచ్చాడు. అయితే చాలాకాలంగా స్పెయిన్ మోడల్ జార్జినా రోడ్రిగ్యూజ్తో సహ జీవనం చేస్తున్న రొనాల్డోకు కూతురు జన్మించింది. ఆ రెండేళ్ల చిన్నారి పేరు అలానా మార్టినా. కాగా, రోడ్రిగ్యూజ్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు రొనాల్డో తాజా వెల్లడించాడు. ‘ఆమె నాకు ఎంతో సాయం చేసింది. ఆమెతో నేను ప్రేమలో ఉన్నా. ఏదో ఒకరోజు ఆమెను వివాహం చేసుకుంటా. మా తల్లి యొక్క డ్రీమ్ కూడా అదే. కాబట్టి ఏదో ఒకరోజు ఆమెను ఎందుకు వివాహం చేసుకోకూడదు?, కెరీర్లో చేసిన ఉత్తమ గోల్ కన్నా తన ప్రేయసి రోడ్రిగ్యూజ్తో చేసిన శృంగారమే ఎంతో గొప్పది’ అని ఇంగ్లిష్ జర్నలిస్టు పీయర్స్ మోర్గాన్ చేసిన ఇంటర్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఇక తన కెరీర్లో చేసిన అత్యుత్తమ గోల్స్ గురించి కూడా రొనాల్డో చెప్పుకొచ్చాడు. 2017-18 చాంపియన్ లీగ్లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో డానీ కార్వెంజల్ పాస్ చేసిన బంతిని రొనాల్డో గోల్గా మలిచాడు. ‘ఓవర్హెడ్ గోల్ చేసేందుకు చాలా ఏళ్లు ప్రయత్నించాను. మాములుగా 700 గోల్స్ చేసుంటాను. కానీ ఎప్పుడూ దానిని చేయలేదు. జువెంటస్పై ఎట్టకేలకు గోల్ చేశానని అనుకున్నాను. ఆ తర్వాత గియానలుగిపై చేసిన ఆ గోల్ అత్యుత్తమైనదిగా గుర్తించాను’ అని రొనాల్డో పేర్కొన్నాడు. కాగా, ఈ గోల్ కంటే కూడా రోడ్రిగ్యూజ్తో సహ జీవనం చేయడం ఎంతో గొప్పదని పేర్కొన్నాడు. -
తండ్రిని తలచుకుని ఏడ్చేసిన రొనాల్డో
లిస్బన్: పోర్చుగల్ ఫుట్బాల్ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఘనత క్రిస్టియోనో రొనాల్డోది. పోర్చుగల్కు అత్యధిక మ్యాచ్లు ఆడిన ఘనతతో పాటు ఆ జట్టు తరఫున అత్యధిక గోల్స్ సాధించిన రికార్డును కూడా తన పేరిటే లిఖించుకున్న రొనాల్డో ఒక ఇంటర్యూలో వెక్కి వెక్కి ఏడ్చేశాడు. తాను సాధించిన ఘనతలను కుటుంబంలో అంతా చూసినా, తన తండ్రి మాత్రం చూడలేకపోయాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇటీవల ఇంగ్లిష్ జర్నలిస్టు పీయర్స్ మోర్గాన్కు ఇచ్చిన ఇంటర్యూలో తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు రొనాల్డో. తన తండ్రి ఎంతో భావోద్వేగానికి గురై నటించిన వీడియోను కొన్ని రోజుల క్రితమే చూశానని, అందులో కొడుకు గురించి ఎంతో గొప్పగా చెబుతున్న విషయం తనను ఎంతో ఉద్వేగానికి గురి చేసిందన్నాడు. ‘నేను అంతకుముందు ఎప్పుడూ ఆ వీడియోను చూడలేదు. అది నమ్మశక్యంగా లేదు’ అని రొనాల్డ్ అంటూ తన దుఃఖాన్ని ఆపుకోలేపోయాడు. అందులో అంతగా ఏడిపించే సన్నివేశం ఏముందని మోర్గాన్ అడగ్గా.. ‘నేను నంబర్ వన్ కావడం దగ్గర్నుంచి, నేను తీసుకున్న అవార్డులు ఏవీ నాన్న జోస్ డినిస్ చూడలేదు. ఏ ఒక్క ఘనతను చూడలేకపోయాడు. నేను ఫుట్బాల్ రంగంలో ఎలా ఎదిగానో అస్సలు మా నాన్నకు తెలీదు. మా కుటుంబం అంతా నా ఘనతల్ని చూశారు. మా అమ్మ, సోదరులు, ఆఖరికి నా కొడుకు కూడా నేను అవార్డులు తీసుకోవడం చూశాడు. కానీ నాన్న మాత్రం అందుకు నోచుకోలేదు. బాగా యుక్త వయసులోనే నాన్న చనిపోయారు’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రొనాల్డో. ప్రపంచ అత్యుత్తమ ఫుట్బాలర్కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బ్యాలన్ డి ఓర్’ అవార్డును రొనాల్డో ఐదు సార్లు అందుకున్నాడు. 2008, 2013, 2014, 2016, 2017ల్లో ఈ అవార్డును రొనాల్డో అందుకున్నాడు. Cristiano Ronaldo breaks down in tears during interview with Piers Morgan 😔 He’s upset that his father never got to see how great he became.pic.twitter.com/513G5Ooaz8 — GiveMeSport Football (@GMS__Football) September 16, 2019 -
డీఎన్ఏ నమూనా ఇవ్వండి... రొనాల్డోకు పోలీసుల వారెంట్
లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపేందుకు డీఎన్ఏ నమూనాలు ఇవ్వాలని లాస్వెగాస్ పోలీసులు ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు, పోర్చుగల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను కోరారు. 2009 జూన్ 13న హోటల్ సూట్లో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడంటూ అమెరికాకు చెందిన మాజీ మోడల్ క్యాథరిన్ మోర్గా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సమగ్ర విచారణ చేయాలని భావిస్తున్న పోలీసులు... హోటల్లో దొరికిన క్యాథరిన్ దుస్తులను ప్రధాన ఆధారంగా భావిస్తున్నారు. అందుకే, డీఎన్ఏ నమూనాలు కోరుతూ ఇటలీలో లీగ్ ఆడుతున్న రొనాల్డోకు వారెంట్ పంపారు. మరోవైపు ఘటనను బయటకు చెప్పకుండా ఉండేందుకు క్యాథరిన్కు 3.75 లక్షల అమెరికన్ డాలర్లు చెల్లించేందుకు అప్పట్లోనే అంగీకారం కుదిరింది. అయితే, ‘మీ టూ’ ఉద్యమ ప్రభావంతో ఆమె మళ్లీ నోరు విప్పింది. రొనాల్డో, అతడి న్యాయవాదులు ఈ అభియోగాలను మొదటి నుంచి ఖండిస్తున్నారు. -
ముగిసిన సత్యన్ పోరు
న్యూఢిల్లీ: ఆస్ట్రియా ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో భారత నంబర్వన్ సత్యన్ జ్ఞానశేఖరన్ పోరాటం ముగిసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ జు జిన్ (చైనా)తో శుక్రవారం లింజ్ నగరంలో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 35వ ర్యాంకర్ సత్యన్ 1–11, 7–11, 11–7, 2–11, 4–11తో ఓడిపోయాడు. అంతకుముందు తొలి రౌండ్లో సత్యన్ 4–11, 11–9, 11–9, 8–11, 6–11, 11–9, 11–7తో ప్రపంచ 16వ ర్యాంకర్ మార్కోస్ ఫ్రెటాస్ (పోర్చుగల్)పై సంచలన విజయం సాధించాడు. -
వ్యవసాయానికి రోబో వచ్చేసింది...
మూడేళ్ల క్రితం పోర్చుగల్లో ఓ రోబోను ప్రపంచానికి పరిచయం చేశారు. ద్రాక్షతోటల్లో పనిచేసేందుకు ఉద్దేశించిన ఈ వైన్రోబో దానికి మరిన్ని మెరుగులు దిద్దింది. తాజాగా వైన్స్కౌట్ పేరుతో మళ్లీ విడుదల చేసింది. అత్యాధునిక లిడార్ టెక్నాలజీని ఉపయోగించుకుని వైన్స్కౌట్ ద్రాక్షపండ్లు ఎంతమేరకు మగ్గాయి? పంటకు ఏమైనా చీడపీడలు ఆశించాయా? అన్న విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూంటుంది.ద్రాక్షతోటల వరుసల్లో తనంతట తాను ప్రయాణించేందుకు, మొక్కలకు ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఒక వరుస నుంచి ఇంకోదాంట్లోకి వెళ్లేందుకు ఇందులో కృత్రిమ మేధను ఉపయోగించారు. అంతేకాకుండా రాత్రివేళల్లోనూ పనిచేయగలగడం దీనికి ఉన్న మరో ప్రత్యేకత. మొక్కల ఆకుల ఉష్ణోగ్రత, అందులోని నీటి తేమ మోతాదును గుర్తించేందుకు ఇందులో పరారుణ కాంతితో పనిచేసే కెమెరా, మల్టీస్పెక్ట్రల్ కెమెరాలు రెండూ ఉంటాయి. ఒక్కో వైన్ స్కౌట్ గంటకు దాదాపు మూడువేల సమాచారాలను సేకరించగలదు. ఈ సమాచారం మొత్తాన్ని ఒక మ్యాప్ రూపంలో అందిస్తుంది కూడా. వైన్స్కౌట్ బాడీపైనే ఉండే సోలార్ప్యానెల్స్ ఎప్పటికప్పుడు విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ లిథియం అయాన్ బ్యాటరీల్లో నిల్వ చేస్తూంటాయి. -
టిప్ 16 లక్షలు!
ఏథెన్స్: రెస్టారెంట్లలో బిల్తో పాటు టిప్ ఇవ్వడం సర్వసాధారణం. మనకు హోటల్ సిబ్బంది సర్వీస్ ఎంత నచ్చితే అంత ఎక్కువ టిప్ ఇవ్వాలనిపిస్తుంది. కానీ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఓ హోటల్ సిబ్బందికి ఏకంగా 16 లక్షల భారీ టిప్ ఇచ్చాడు. ఈ ఊహకందని భారీ మొత్తం చూడటంతో సిబ్బందే ఆశ్చర్యానికి గురయ్యారు. రొనాల్డో మాత్రం వారి సేవకు మెచ్చే ఇచ్చానని పేర్కొన్నారు. ప్రస్తుతం రొనాల్డో ఇచ్చిన టిప్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. పోర్చుగల్ జట్టు రౌండ్-16లో ఉరుగ్వేపై ఓటమి చెందడంతో ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దీంతో దొరికిన ఖాళీ సమయంలో ఆటగాళ్లు సేదతీరుతున్నారు. పోర్చుగల్ కెప్టెన్ మాత్రం తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గ్రీస్లో సందడి చేస్తున్నాడు. సన్నిహితులతో కలిసి రెస్టారెంట్కు వెళ్లిన రోనాల్డో అక్కడి సిబ్బంది మర్యాదలు నచ్చి భారీ మొత్తంలో టిప్ ఇచ్చాడు. ఇటీవలే స్పెయిన్కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ నుంచి ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్బాల్ క్లబ్ యువెంటస్కు రొనాల్డో బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఒప్పదం ప్రకారం నాలుగేళ్ల పాటు యువెంటస్కు ఆడతాడు. చదవండి: ఆ మాజీ క్రికెటర్ రెస్టారెంట్ బిల్లు ఏడు లక్షలు -
పోర్చు‘గల్లంతు’
ఇటు అర్జెంటీనా... అటు పోర్చుగల్... ఒకే రోజు ఒకే తీరు ఫలితాలు... ఇద్దరు దిగ్గజాల కలలు కల్లలయ్యాయి. మొదట మెస్సీ చిరకాల స్వప్నాన్ని ఎంబాపె (ఫ్రాన్స్) తుడిచిపెడితే... తర్వాత రొనాల్డో ‘ఫిఫా’ వేటను కవాని (ఉరుగ్వే) ముగించాడు. దీంతో ప్రిక్వార్టర్స్లోనే మేటి జట్లు నాక్ ‘ఔట్’ అయ్యాయి. ఉరుగ్వే సుడి బాగుంది. రొనాల్డో జట్టును నాకౌట్ దెబ్బకొట్టింది. స్ట్రయికర్ కవాని ‘డబుల్’ ధమాకా పోర్చుగల్ను ఇంటిదారి పట్టించింది. మ్యాచ్లో ఉరుగ్వే ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. బంతి ఎక్కువగా ప్రత్యర్థి ఆధీనంలో ఉన్నప్పటికీ ఆధిపత్యం మాత్రం ఉరుగ్వేదే! ఒక దశలో ఉరుగ్వే ఆటగాళ్లు అలసిపోయినా... గెలిచేదాకా చెమట చిందించారు. ఈ పోరాటానికి, వీరి దుర్బేధ్యమైన డిఫెన్స్ను చూసి రొనాల్డోకు చిర్రెత్తిందేమో సహనం కోల్పోయి ‘ఎల్లో’కార్డు చూపించిన రిఫరీ మీదే ఒంటికాలిపై లేచాడు. స్ఫూర్తి మరిచాడు. సొచీ: పాపం... రొనాల్డోదీ మెస్సీ వ్యథే! పోర్చుగల్ జట్టుదీ అర్జెంటీనా బాటే! ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ అందించాలనుకున్న వీరిద్దరి ఆశలు ప్రిక్వార్టర్స్లోనే ఆవిరయ్యాయి. ప్రత్యర్థి పోరాటానికి సమకాలీన దిగ్గజాలు తలవంచక తప్పలేదు. నాకౌట్ దశ మొదలైన తొలి రోజే... ఫ్రాన్స్ దూకుడుకు అర్జెంటీనా, ఉరుగ్వే జోరులో పోర్చుగల్ గల్లంతయ్యాయి. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి మొదలైన రెండో నాకౌట్ మ్యాచ్లో ఉరుగ్వే 2–1తో ‘యూరో’ చాంపియన్ పోర్చుగల్ను కంగుతినిపించింది. అనుభవజ్ఞుడైన ఫార్వర్డ్ ఆటగాడు కవాని ఆరంభం నుంచి అంతా తానై నడిపించాడు. తొలి, రెండో అర్ధభాగాల్లో ఒక్కో గోల్ చేసి ఉరుగ్వేకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఆట ఆరంభమైన ఏడు నిమిషాలకే సురెజ్ ఇచ్చిన పాస్ విజయవంతమైంది. పెనాల్టీ బాక్స్ వెలుపలి నుంచి సురెజ్ కొట్టిన షాట్ను స్ట్రయికర్ కవాని గోల్పోస్ట్ ముందే కాచుకున్నాడు. మెరుపు వేగంతో హెడర్ గోల్గా మలిచాడు. దీంతో ఉరుగ్వే శిబిరం సంబరాల్లో మునిగింది. స్కోరు సమం చేసేందుకు తొలి అర్ధభాగంలో పోర్చుగల్ స్ట్రయికర్లు పడ్డ కష్టమంతా వృథా అయింది. చురుగ్గా, తెలివిగా పాస్లిస్తున్నప్పటికీ ఏ ఒక్కటీ గోల్పోస్ట్ను ఛేదించలేకపోయింది. చివరకు రెండో అర్ధభాగం మొదలైన 10 నిమిషాలకు గురెరో ఇచ్చిన కార్నర్ పాస్ను పెపె (55వ ని.) గోల్పోస్ట్లోకి తరలించాడు. అయితే స్కోరు సమమైన పోర్చుగల్ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే మళ్లీ కవాని కదంతొక్కాడు. ఆట 62వ నిమిషంలో ఈ సారి బెటంకుర్ ఇచ్చిన పాస్ను కవాని ప్రత్యర్థి గోల్కీపర్ను బోల్తాకొట్టిస్తూ రెండో గోల్ సాధించాడు. ఆ తర్వాత పోర్చుగల్ ఎంత ప్రయత్నించినప్పటికీ గోల్ దిశగా సఫలం కాలేకపోయింది. ఆట 74వ నిమిషంలో కవాని కుడికాలికి గాయమవడంతో మైదానం వీడాడు. నొప్పితో విలవిలలాడుతున్న కవానికి రొనాల్డో సాయమందించాడు. ఈ మ్యాచ్ మొత్తం మీద పోర్చుగల్ షాట్లే ఎక్కువగా దూసుకొచ్చాయి. మ్యాచ్లో సింహభాగం వీరి స్ట్రయికర్ల ఆధీనంలోనే బంతి ఆడింది. దీంతో ఉరుగ్వే (273) కంటే పోర్చుగల్ (544) రెట్టింపు పాస్లను ప్లేస్ చేసింది. కానీ సరైన దిశ, ఫినిషింగ్ లేక మూల్యం చెల్లించుకుంది. పోర్చుగల్ 20 షాట్లు ప్రత్యర్థి పెనాల్టీ బాక్స్ దిశగా ఆడారు. ఇందులో ఐదుసార్లు లక్ష్యంపై గురిపెడితే ఒక్కసారి మాత్రమే గోల్ అయింది. మరోవైపు ప్రత్యర్థి షాట్లను ఎక్కడికక్కడ నిలువరించిన ఉరుగ్వే మాత్రం కొట్టింది ఐదు షాట్లే. లక్ష్యంపై మూడు సార్లు గురిపెట్టిన ఆ జట్టు రెండు సార్లు గోల్ చేయడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ ఫ్రాన్స్తో ఉరుగ్వే తలపడనుంది. ► ‘ఫిఫా’ ప్రపంచకప్ చరిత్రలో ఉరుగ్వే వరుసగా 4 మ్యాచ్లు గెలవడం ఇది రెండోసారి. 1930లో ఉరుగ్వే విజేతగా నిలిచిన టోర్నీలో ఇలాగే జరిగింది. రిఫరీపై రొనాల్డో ఆగ్రహం పోర్చుగల్ అభిమాని కంట కన్నీరు ప్రపంచకప్లో నేడు ప్రిక్వార్టర్ ఫైనల్స్ బ్రెజిల్ x మెక్సికో రా.గం. 7.30 నుంచి బెల్జియం x జపాన్ రా.గం. 11.30 నుంచి సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2,3లలో ప్రత్యక్ష ప్రసారం -
ఫిఫా ప్రపంచకప్లో మరో పెను సంచలనం
ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశలు.. ఈసారైనా ఈ దిగ్గజ ఆటగాడు కప్ గెలుస్తాడనుకున్నారు.. కానీ అతని పయనం మెస్సీ దారిలోనే నడిచింది. ప్రపంచకప్ తీరని కలగానే మిగిలింది క్రిస్టియానో రొనాల్డోకు.. ఎక్కువ సేపు బంతి ఆధీనంలో ఉన్నా గోల్ చేయలేని నివ్వెర పరిస్థితి రొనాల్డో సేనది.. లీగ్ దశలో ఓటమెరుగని ఉరుగ్వే.. అదే పోరాటం, కసితో ఆడి పోర్చుగల్పై పోరాడి గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ను ఢీ కొట్టడానకి సై అంటోంది. సోచి : ఫిఫా ప్రపంచకప్లో మరో దిగ్గజ జట్టు పోరాటం ముగిసింది. ఎన్నో అంచనాల నడుమ సాకర్ సమరంలో అడుగుపెట్టిన పోర్చుగల్ కథ ప్రిక్వార్టర్స్లోనే ముగిసింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో నాకౌట్ పోరులొ ఉరుగ్వే 2-1తో పోర్చుగల్పై ఘన విజయం సాధించింది. తొలి క్వార్టర్ ఫైనల్లో జులై 6న ఫ్రాన్స్తో తలపడనుంది. మ్యాచ్ ప్రారంభమైన ఏడు నిమిషాలకే రోనాల్డో సేనకు దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు ఉరుగ్వే ఫార్వర్డ్ ప్లేయర్ ఎడిన్సన్ కావనీ. సువారెజ్ ఇచ్చిన పాస్ను ఈ స్టార్ స్ట్రైకర్ హెడర్ గోల్ చేసి ఉరుగ్వేకు తొలి గోల్ అందించాడు. అనంతంరం ఫ్రికిక్ రూపంలో వచ్చిన అవకాశాన్ని రొనాల్డో మిస్ చేశాడు. మరో గోల్ నమోదు కాకుండానే తొలి భాగం ముగిసింది. ద్వితీయార్థం ముగియగానే దాడిని మరింత పెంచిన రొనాల్డో సేనకు ఫలితం లభించింది. 55వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డో ఇచ్చిన పాస్తో డిఫెండర్ పెపె గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోర్ సమం అయ్యాయి. పోర్చుగల్ శిభిరంలో ఆనంద ఎంతో సేపు నిలువలేదు. రొనాల్డో సేన డిఫెండింగ్ వైఫల్యంతో ఎడిన్సన్ కావనీ మరో అద్భుతమైన గోల్ చేయడంతో ఉరుగ్వే 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్లు మరో గోల్ కోసం పోటీపడినా ఇరు జట్ల రక్షణశ్రేణి సమర్ధవంతంగా అడ్డుకున్నాయి. ఇక ఎక్సట్రా ఇంజ్యూరీ టైమ్లో కూడా మరో గోల్ నమోదు చేయలేకపోయిన పోర్చుగల్ ఓటమితో నిష్క్రమించింది. మ్యాచ్లో 63 శాతం బంతి పోర్చుగల్ ఆధీనంలో ఉన్నా గోల్ చేయటంలో స్ట్రైకర్లు విఫలమ్యారు. రొనాల్డో సేన ఎనిమిది సార్లు గోల్ కోసం ప్రయత్నించి విఫలమయింది. ఈ మ్యాచ్లో ఏకైక ఎల్లో కార్డు రిఫరీలు రొనాల్డోకు చూపించారు. పోర్చుగల్ 12 అనవసర తప్పిదాలు చేయగా ఉరగ్వే 13 తప్పిదాలు చేసింది. -
ఎవరిదో నాకౌట్ ‘కిక్’!
ఇదికాకుంటే... మరోటి అనుకునేందుకు లేదు. వెనుకబడితే... వెన్నులో వణుకు పుట్టినట్లే. గెలిస్తే ముందుకు... లేదంటే ఇంటికే. ‘కిక్’ ఎవరిదో... వారే నాకౌట్ విజేత! నేటి నుంచే ఫుట్బాల్ ప్రపంచకప్ ప్రి క్వార్టర్స్ సమరం...! మాస్కో: అభిమానులను ఉర్రూతలూగిస్తూ... ఫుట్బాల్ ప్రపంచకప్ రెండో అంకానికి చేరింది. 32 జట్లు సగమై 16 మిగిలాయి. ఈ సగంలో మరింత ముందుకెళ్లే సగమేవో తేల్చేందుకు శనివారం నుంచే పోరు. కజన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచే దిగ్గజాలైన అర్జెంటీనా–ఫ్రాన్స్ మధ్య. ప్రిక్వార్టర్స్ దశలోనే తలపడుతున్న మాజీ విజేతలు ఈ రెండే కావడం గమనార్హం. మరో మ్యాచ్లో పోర్చుగల్ను ఉరుగ్వే ‘ఢీ’ కొట్టనుంది. చిత్రమేమంటే ఇప్పటివరకు కప్ గెలుచుకున్న 8 దేశాల్లో ఇటలీ ఈసారి అర్హత సాధించలేదు. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. నేటి ఫ్రాన్స్, అర్జెంటీనా మ్యాచ్తో ఓ మాజీ విజేత ఇంటిముఖం పట్టడం ఖాయం. మిగతా ఐదు మాజీ చాంపియన్లలో ఎన్నింటికి షాక్ తగులుతుందో చూడాలి. దృష్టంతా వారిపైనే... జట్లుగా తలపడుతున్నా అందరి కళ్లూ అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ, ఫ్రాన్స్ మెరిక ఆంటోన్ గ్రీజ్మన్ పైనే. వీరిద్దరూ టోర్నీలో చెరో గోలే చేసినా... ఆటతీరులో మొత్తం జట్టుపై వారి ప్రభావం తీసిపారేయలేనిది. బలాబలాల్లోకి వస్తే అర్జెంటీనాపై ఫ్రాన్స్కే కొంత మొగ్గు కనిపిస్తోంది. ఆ జట్టులోని పోగ్బా, ఎంబాపె ఫామ్లో ఉన్నారు. ఇదే సమయంలో అర్జెంటీనాకు మెస్సీనే అన్నీ అవుతున్నాడు. లీగ్ దశలో ప్రత్యర్థులు అతడినే లక్ష్యం చేసుకోవడంతో జట్టుకు కష్టాలు ఎదురయ్యాయి. చివరి మ్యాచ్లో మార్కస్ రొజొ మెరిసినా... స్వతహాగా అతడు డిఫెండర్. మెస్సీకి హిగుయెన్, అగ్యురో తోడైతేనే ప్రత్యర్థిపై అర్జెంటీనా పైచేయి సాధించగలదు. ఫ్రాన్స్ లీగ్ దశలో ఓటమి లేకుండా ప్రిక్వార్టర్స్ చేరగా, అర్జెంటీనా మిశ్రమ ఫలితాలతో గట్టెక్కింది. ప్రపంచ కప్ చరిత్రలో ఫ్రాన్స్పై రెండుసార్లూ అర్జెంటీనాదే విజయం. 1930లో 1–0తో, 1978లో 2–1తో గెలుపొందింది. రొనాల్డో వర్సెస్ సురెజ్ సోచిలో శనివారం అర్ధరాత్రి 11.30కు జరుగనున్న మరో ప్రిక్వార్టర్ మ్యాచ్లో పోర్చుగల్ తో ఉరుగ్వే తలపడనుంది. 1972 తర్వాత ఈ రెండు జట్లు మరోసారి అంతర్జాతీయ మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఉరుగ్వేతో ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒకసారి నెగ్గిన పోర్చుగల్, మరోసారి ‘డ్రా’తో సరిపెట్టుకుంది. పోర్చుగల్ ఆశలన్నీ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోపైనే. ఈ టోర్నీలో అతను ఇప్పటికి నాలుగు గోల్స్ చేశాడు. మరోవైపు ఉరుగ్వే స్టార్ ఆటగాడు సురెజ్ ఆటతీరుపైనే ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రిక్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ జూన్ 30 అర్జెంటీనా x ఫ్రాన్స్ రాత్రి గం. 7.30 నుంచి పోర్చుగల్ x ఉరుగ్వే రాత్రి గం. 11.30 నుంచి జూలై 1 స్పెయిన్ x రష్యా రాత్రి గం. 7.30 నుంచి క్రొయేషియా x డెన్మార్క్ రాత్రి గం. 11.30 నుంచి జూలై 2 బ్రెజిల్ x మెక్సికో రాత్రి గం. 7.30 నుంచి బెల్జియం x జపాన్ రాత్రి గం. 11.30 నుంచి జూలై 3 స్వీడన్ x స్విట్జర్లాండ్ రాత్రి గం. 7.30 నుంచి కొలంబియా x ఇంగ్లండ్ రాత్రి గం. 11.30 నుంచి సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2,3లలో ప్రత్యక్ష ప్రసారం -
ఇరాన్ రాజసం...
ఒక పెద్ద జట్టు... ఒక చిన్న జట్టు. మరో పెద్ద జట్టు... మరో చిన్న జట్టు! అన్నీ గ్రూప్ ‘బి’ లోనివే! వేర్వేరు వేదికలపై ఒకే రోజు ఒకే సమయానికి పరస్పరం తలపడ్డాయి...! ఓ రకంగా పెద్ద జట్లకిది పరువు పరీక్ష. ఓడిపోకుండా ఉంటేనే తదుపరి రౌండ్ చేరే పరిస్థితి వాటిది. కానీ, చిన్న జట్లు ఉడుంపట్టు పట్టాయి. ప్రత్యర్థి ఎంతదైనా లెక్కలేదంటూ చుక్కలు చూపాయి...! వాటి ధాటికి దిగ్గజాలకు దిమ్మతిరిగింది...! గెలుపు మాట దేవుడెరుగు..? బతుకుజీవుడా అంటూ ‘డ్రా’ చేసుకుని... స్పెయిన్, పోర్చుగల్ నాకౌట్ మెట్లెక్కాయి. విజయం దక్కకున్నా పోరాటంతో చిన్న జట్లు ఇరాన్, మొరాకో ఆకట్టుకున్నాయి. స్వదేశానికి తలెత్తుకుని వెళ్తున్నాయి. సరాన్స్క్: క్రిస్టియానో రొనాల్డో స్థాయి ఆటగాడు కొట్టిన పెనాల్టీ కిక్కు గోల్ రాకుండా ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా? కానీ, అలా ఊహించవచ్చని నిరూపించాడు ఇరాన్ కీపర్ అలీ బిరాన్వాండ్. ఈ అద్భుతం పోర్చుగల్తో మ్యాచ్లో చోటుచేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య సోమవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. పోర్చుగల్ తరఫున క్వారెస్మా (45వ నిమిషం) స్కోరు చేశాడు. ఇంజ్యూరీ సమయంలో లభించిన పెనాల్టీ కార్నర్ను ఇరాన్ ఆటగాడు కరీం అన్సారీఫర్ద్ (90+3 ని.) గోల్గా మలిచి ప్రత్యర్థికి విజయాన్ని దూరం చేశాడు. ఇరాన్... తేలిగ్గా లొంగలేదు మ్యాచ్ను దూకుడుగా ఆరంభించిన పోర్చుగల్ మొదట్లోనే ఆధిపత్యంలోకి వచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో ఇరాన్ కీపర్, రక్షణ శ్రేణి తడబడింది. అయితే కొద్దిసేపటికే తేరుకుని ప్రతిఘటించింది. రొనాల్డోను ప్రత్యర్థులు నిలువరించినప్పటికీ క్వారెస్మో ప్రతిభ పోర్చుగల్కు గోల్ అందించింది. 45వ నిమిషంలో డి బాక్స్ వద్ద అందిన పాస్ను అతడు నేరుగా నెట్లోకి కొట్టాడు. ఆ వెంటనే మొదటి భాగం ముగిసింది. ఇందులో 71 శాతం బంతి పోర్చుగల్ ఆధీనంలోనే ఉండటం గమనార్హం. రెండోభాగం మొదలైన కాసేపటికే రొనాల్డోను ఎజతొలాహి అడ్డగించడంతో పోర్చుగల్కు పెనాల్టీ దక్కింది. వీఏఆర్ను ఆశ్రయించి ఫౌల్గా నిర్ధరించారు. 53వ నిమిషంలో దీనిని రొనాల్డోనే కిక్ కొట్టాడు. అయితే, బిరాన్వాండ్ ఎడమవైపు డైవ్ చేస్తూ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఇక్కడినుంచి ఇరాన్ ఆట మారిపోయింది. పోర్చుగీస్ డిఫెన్స్ను ఛేదించేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే, గోల్ మాత్రం రాలేదు. 83వ నిమిషంలో రొనాల్డో ఎల్లోకార్డ్కు గురయ్యాడు. మ్యాచ్ ఇంజ్యూరీ సమయంలో తొలి రెండు నిమిషాలు ఇరాన్కు వీఏఆర్ పెనాల్టీ ఇవ్వడంపైనే గడిచాయి. 90+3వ నిమిషంలో కరీం ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్ కొట్టి జట్ల స్కోరు సమం చేశాడు. -
ఫిఫా ప్రపంచకప్: మరో రెండు జట్లు ఔట్
మాస్కో: ఫిఫా ప్రపంచకప్లో గ్రూప్ బి నుంచి స్పెయిన్, పోర్చుగల్ నాకౌట్ దశకు చేరుకున్నాయి. సోమవారం గ్రూప్ బిలో భాగంగా జరిగిన రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఎక్సట్రా ఇంజ్యూరీ సమయంలో గోల్ చేసి పోర్చుగల్తో మ్యాచ్ను ఇరాన్ డ్రాగా ముగించింది. మరో మ్యాచ్లో మొరాకాతో జరిగిన మ్యాచ్ను స్పెయిన్ 2-2తో డ్రా చేసింది. దీంతో గ్రూప్ దశలో ఒక్క విజయం సాధించని మొరాకోతో పాటు పోర్చుగల్తో మ్యాచ్ను డ్రా చేసుకున్న ఇరాన్ జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమించాయి. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి సౌదీ ఆరేబియా, ఈజిప్ట్ జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో గోల్.. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుంది.. పోర్చుగల్ గెలుస్తుందనుకున్న తరుణంలో ఇరాన్ జట్టు మాయ చేసింది. పెనాల్డీ రూపంలో వచ్చిన అదృష్టాన్ని ఉపయోగించుకుంది. ఇరాన్ ఆటగాడు కరీమ్ (90+3 నిమిషంలో)గోల్ చేసి మ్యాచ్ను 1-1తో డ్రాగా ముగించాడు. అంతకముందు తొలి అర్ధ భాగంలోనే పోర్చుగల్ స్టార్ మిడ్ఫీల్డర్ రికార్డో క్వారెస్మా తొలి గోల్(44వ నిమిషంలో) నమోదు చేశాడు. పోర్చుగల్ అటాకింగ్ గేమ్ ఆడతూ గోల్ పోస్ట్పై దాడి చేయగా ఇరాన్ రక్షణశ్రేణి సమర్ధవంతంగా అడ్డుకుంది. మ్యాచ్లో పోర్చుగల్ 14సార్లు గోల్ కోసం ప్రయత్నించగా, ఇరాన్ ఎనిమిది సార్లు ప్రయత్నించింది. దీంతో గ్రూప్ బిలో రన్నరప్గా ఉన్న పోర్చుగల్ నాకౌట్ పోరులో బలమైన ఉరుగ్వేతో తలపడనుంది. గ్రూప్-బి టాపర్ స్పెయిన్ గ్రూప్ బిలో మరో సమరం కూడా డ్రాగానే ముగిసింది. రసవత్తరంగా సాగిన స్పెయిన్, మొరాకో మ్యాచ్ 2-2తో డ్రా అయింది. రెండో అర్థభాగం ముగిసే సరికి 2-1తో ఆధిక్యంలో ఉన్న మొరాకోకు.. ఎక్సట్రా ఇంజ్యూరీ టైమ్లో స్పెయిన్ ఆటగాడు ఇయాగో ఆస్పస్ (90+1 నిమిషంలో) గోల్ చేసి మొరాకోకు షాక్ ఇచ్చాడు. అంతకముందు మొరాకో తరుపున ఖలీద్(13వ నిమిషంలో), ఎన్-నెస్రీ(80వ నిమిషంలో) గోల్స్ చేశారు. స్పెయిన్కు ఇస్కో(19వ నిమిషంలో)గోల్ అందించాడు. దీంతో ఒక్క విజయం, రెండు డ్రాలతో గ్రూప్ బి టాపర్గా స్పెయిన్ నాకౌట్లోకి ఆడుగుపెట్టనుంది. -
మళ్లీ మెరిసిన రొనాల్డో
సాకర్ సూపర్ స్టార్గా ప్రపంచమంతటా నీరాజనాలందుకుంటున్న క్రిస్టియానో రొనాల్డో మరోసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. స్పెయిన్తో ‘డ్రా’గా ముగిసిన తొలి మ్యాచ్లో హ్యాట్రిక్తో చెలరేగిన ‘సీఆర్7’ ఇప్పుడు జట్టు తరఫున ఏకైక గోల్ నమోదు చేసి మొరాకో ఆట ముగించాడు. మ్యాచ్లో అనేక సందర్భాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినా, ఫినిషింగ్ లోపాలతో వెనకబడిన మొరాకో 2018 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. తాజా గోల్తో యూరప్ తరఫున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాడిగా రొనాల్డో రికార్డులెక్కాడు. మాస్కో: ‘ఫిఫా’ వరల్డ్ కప్లో పోర్చుగల్ జోరు కొనసాగింది. తొలి మ్యాచ్లో మాజీ చాంపియన్ స్పెయిన్ను 3–3తో నిలువరించిన ఆ జట్టు గ్రూప్ ‘బి’లో బుధవారం మొరాకోను 1–0తో ఓడించింది. పోర్చుగల్ తరఫున ఏకైక గోల్ను 4వ నిమిషంలో హెడర్ ద్వారా కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో సాధించాడు. ఈ గెలుపుతో పోర్చుగల్ నాలుగు పాయింట్లతో నాకౌట్ దశకు చేరువ కాగా... వరుసగా రెండో పరాజయంతో మొరాకో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 1998లో వరల్డ్ కప్ ఆడిన తర్వాత వరుసగా నాలుగు సార్లు అర్హత సాధించలేకపోయిన ఆఫ్రికా దేశం మొరాకో... 20 ఏళ్ల తర్వాత క్వాలిఫై అయినప్పటికీ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఒకటే సరిపోయింది... ఇరు జట్ల మధ్య పోరు ఆద్యంతం హోరాహోరీగా సాగింది. సరిగ్గా చెప్పాలంటే పటిష్ట పోర్చుగల్ను మొరాకో చాలా వరకు నిలువరించగలిగింది. అయితే ఆరంభంలో రొనాల్డో అందించిన ఆధిపత్యం పోర్చుగల్ విజయానికి సరిపోయింది. మ్యాచ్ నాలుగో నిమిషంలో కార్నర్ నుంచి బెర్నార్డో సిల్వా పాస్ అందించగా... వేగంగా ముందుకు దూసుకొస్తూ రొనాల్డో తలతో బంతిని గోల్పోస్ట్లోకి పంపించడంలో సఫలమయ్యాడు. ఏకాగ్రత లోపించిన మొరాకో ఆటగాళ్లు గందరగోళంలో పడిపోగా, అప్పటికే ముందుకొచ్చిన గోల్ కీపర్ ఏమీ చేయలేకపోయాడు. టోర్నీలో ఇది రొనాల్డోకు నాలుగో గోల్ కావడం విశేషం. ఈ దశలో మైదానంలో మొరాకో అభిమానులు తమ జట్టుకు గట్టిగా మద్దతు పలుకుతూ వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. మొరాకో పదే పదే పోర్చుగల్ డిఫెన్స్ను దాటగలిగినా చెప్పుకోదగిన స్ట్రయికర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ దశలో ఒత్తిడికి లోను కాకుండా పోర్చుగల్ మాత్రం ప్రశాంతంగా ఆటను కొనసాగించింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు దాదాపుగా సమాన సమయం పాటు బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. రెండో అర్ధ భాగంలో కూడా మొరాకో దాడులు తీవ్రం చేసింది. అయితే గోల్ మాత్రం దక్కలేదు. యూనిస్ బెల్హందకు అద్భుత అవకాశం వచ్చినా... అతను కొట్టిన హెడర్ను సరిగ్గా పోస్ట్ ముందు పోర్చుగల్ కీపర్ రుయి పాట్రిషియో అడ్డుకోగలిగాడు. చివరి నిమిషాల్లో పోర్చుగల్ డిఫెన్స్ సమర్థంగా పని చేయడంతో మొరాకో ఆటగాళ్లు బాధగా మైదానం వీడారు. రొనాల్డో... పోర్ట్ (పోర్చుగల్) వైన్లాంటివాడు. తన వయసు గురించి, తన సామర్థ్యాన్ని ఎంత బాగా వాడుకోవాలనే విషయం గురించి అతనికి చాలా బాగా తెలుసు. ఇతర ఆటగాళ్లకంటే తాను ఎందుకు గొప్పవాడు అతను చూపించాడు. మూడు, నాలుగేళ్ల క్రితం అతను చేయలేనిది ఇప్పుడు చేస్తున్నాడు. – పోర్చుగల్ కోచ్ ఫెర్నాండో సాంటోస్ 85 అంతర్జాతీయ మ్యాచ్లలో రొనాల్డో సాధించిన గోల్స్ సంఖ్య. అత్యధిక గోల్స్ సాధించిన యూరోపియన్ ఆటగాడిగా ఫెరెంక్ పుస్కాస్ (హంగేరీ–84)ను దాటిన అతను ఆల్టైమ్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అలీ దాయ్ (ఇరాన్–109) అగ్రస్థానంలో ఉన్నాడు. -
రొనాల్డో మాయ...
సమకాలీన ఫుట్బాల్లో తనను గొప్ప క్రీడాకారుడిగా ఎందుకు పరిగణిస్తారో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో నిరూపించాడు. మాజీ విశ్వవిజేత స్పెయిన్తో జరిగిన ప్రపంచకప్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో రొనాల్డో అంతా తానై తన జట్టును ముందుండి నడిపించాడు. ఓటమి తప్పదనుకున్న స్థితిలో 25 గజాల దూరం నుంచి ఫ్రీ కిక్ను కళ్లు చెదిరే రీతిలో గోల్గా మలిచి చివరకు పోర్చుగల్కు ‘డ్రా’నందం కలిగించాడు. సోచి (రష్యా): ప్రొఫెషనల్ లీగ్లలో క్లబ్ జట్ల తరఫున ఎన్నో అద్భుత గోల్స్ చేసిన పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో అసలు సమరంలోనూ సత్తా చాటుకున్నాడు. వరుసగా నాలుగో ప్రపంచకప్ ఆడుతోన్న ఈ మేటి ఫార్వర్డ్ ప్లేయర్ స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో విశ్వరూపమే ప్రదర్శించాడు. ఒకవైపు స్పెయిన్ జట్టంతా ఆడుతున్నట్లు అనిపించగా... మరోవైపు రొనాల్డో ఒక్కడే పోర్చుగల్ను నడిపించాడు. ఈ క్రమంలో రొనాల్డో ‘హ్యాట్రిక్’ గోల్స్తో విజృంభించడంతో స్పెయిన్తో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్ను పోర్చుగల్ 3–3తో ‘డ్రా’గా ముగించింది. ఫలితం తేలకపోవడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. పోర్చుగల్ తరఫున రొనాల్డో 4వ, 44వ, 88వ నిమిషాల్లో గోల్స్ చేశాడు. స్పెయిన్ జట్టుకు డిగో కోస్టా 24వ, 55వ నిమిషాల్లో రెండు గోల్స్ అందించగా... 58వ నిమిషంలో నాచో మరో గోల్ను సాధించాడు. తమ తదుపరి మ్యాచ్ల్లో ఈనెల 20న మొరాకోతో పోర్చుగల్.... ఇరాన్తో స్పెయిన్ తలపడతాయి. తాను ఆడిన గత మూడు ప్రపంచకప్లలో (2006, 2010, 2014) కేవలం ఒక్కో గోల్ మాత్రమే చేసిన రొనాల్డో ఈసారి మాత్రం తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు. 33 ఏళ్ల ఈ రియల్ మాడ్రిడ్ క్లబ్ ప్లేయర్ నాలుగో నిమిషంలోనే బోణీ చేశాడు. ‘డి’ బాక్స్లో రొనాల్డోను స్పెయిన్ ప్లేయర్ నాచో మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ పోర్చుగల్కు పెనాల్టీ కిక్ను ప్రకటించారు. రొనాల్డో ఎలాంటి తప్పిదం చేయకుండా బంతిని గోల్ పోస్ట్లోకి పంపించడంతో పోర్చుగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 20 నిమిషాల తర్వాత స్పెయిన్ స్కోరును సమం చేసింది. తొలి అర్ధభాగం ముగిసేందుకు మరో నిమిషం ఉందనగా గోల్ పోస్ట్ దిశగా రొనాల్డో బలంగా కొట్టిన కిక్ను స్పెయిన్ గోల్కీపర్ అడ్డుకోకపోవడంతో పోర్చుగల్ ఖాతాలో రెండో గోల్ చేరింది. రెండో అర్ధ భాగంలో స్పెయిన్ జోరు పెంచింది. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పోర్చుగల్ దాడులను నిలువరిస్తూ విజయం దిశగా సాగిపోయింది. ఇక స్పెయిన్ ఖాతాలో విజయం చేరుతుందనగా అద్భుతం చోటు చేసుకుంది. 88వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్ను రొనాల్డో గోల్గా మలిచాడు. ►1 ప్రపంచకప్ చరిత్రలో ‘హ్యాట్రిక్’ సాధించిన పెద్ద వయస్కుడిగా రొనాల్డో (33 ఏళ్ల 130 రోజులు) రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు నెదర్లాండ్స్ ప్లేయర్ రాబ్ రెన్సెన్బ్రింక్ (30 ఏళ్ల 335 రోజులు) పేరిట ఉండేది. 1978 ప్రపంచకప్లో ఇరాన్పై రెన్సెన్బ్రింక్ ఈ ఘనత సాధించాడు. ►4 నాలుగు వేర్వేరు ప్రపంచకప్లలో కనీసం ఒక గోల్ చేసిన నాలుగో ప్లేయర్గా రొనాల్డో గుర్తింపు పొందాడు. గతంలో మిరోస్లావ్ క్లోజ్, ఉవీ సీలార్ (జర్మనీ), పీలే (బ్రెజిల్) మాత్రమే ఈ ఘనత సాధించారు. ►51 ప్రపంచకప్ చరిత్రలో ఇది 51వ హ్యాట్రిక్. వ్యక్తిగతంగా రొనాల్డో కెరీర్లోనూ ఇది 51వ హ్యాట్రిక్ కావడం విశేషం. ►1 పోర్చుగల్ తరఫున ఆడుతూ డైరెక్ట్ ఫ్రీ కిక్ను గోల్గా మలచడం రొనాల్డో కెరీర్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 45వ ప్రయత్నంలో రొనాల్డో ఇలా చేశాడు. ►1 వరుసగా ఎనిమిది పెద్ద టోర్నీల్లో గోల్ చేసిన ఏకైక ప్లేయర్గా రొనాల్డో నిలిచాడు. 2004 యూరో టోర్నీ మొదలుకొని ప్రస్తుత ప్రపంచ కప్ వరకు అతని ఖాతాలో గోల్స్ చేరాయి. -
క్రిస్టియానో రొనాల్డో అదరగొట్టాడు.
-
ఫిఫా వరల్డ్కప్ : రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్
సోచి : సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అదరగొట్టాడు. ఉత్కంఠ పోరులో జీనియస్ గేమ్తో కేక పుట్టించాడు. ఫుట్బాల్ వరల్డ్కప్లో భాగంగా స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో ఈ పోర్చుగల్ కెప్టెన్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. దీంతో హురాహోరీగా సాగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్పెయిన్, పోర్చుగల్ జట్లు ఆది నుంచి నువ్వా-నేనా అన్నట్లు మేటి ఆటను ప్రదర్శించాయి. హ్యాట్రిక్తో దుమ్మరేపిన రొనాల్డో .. ఓ రకంగా స్పెయిన్ విజయాన్ని అడ్డుకున్నాడు. రియల్ మాడ్రిడ్ స్ట్రయికర్ రొనాల్డో.. ఆట నాలుగో నిమిషంలోనే తొలి గోల్ చేశాడు. మొదటి హాఫ్లో పోర్చుగల్ దూకుడుగా కనిపించింది.. కానీ ఆ తర్వాత స్పెయిన్ తన జోరును పెంచింది. స్పెయిన్ ఆటగాడు డీగో కోస్టా 24వ నిమిషంలో గోల్ చేయగా స్కోర్స్ సమం అయ్యాయి. అనంతరం 44వ నిమిషంలో రొనాల్డో మరో గోల్ సాధించాడు. ఆ వెంటనే కోస్టా 55వ నిమిషంలో మరో గోల్స్ సాధించాడు. ఆ టీమ్కు చెందిన నాచో కూడా 58వ నిమిషంలో గోల్ చేసి స్పెయిన్కు ఆధిక్యాన్ని అందించాడు. కీలకమైన సెకండ్ హాఫ్లోనూ రోనాల్డో తన సత్తా చాటాడు. ఇక మరికొన్ని క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో.. రొనాల్డో చెలరేగిపోయాడు. వన్ మ్యాన్ షోతో థ్రిల్ పుట్టించాడు. 88వ నిమిషంలో ఫ్రీ కిక్తో రొనాల్డో గోల్ చేసి స్పెయిన్ ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
పోర్చుగల్ అమ్మాయి.. పాలమూరు అబ్బాయి..
సాక్షి, జడ్చర్ల: ప్రేమకు కులం, మతం, భాషతో పాటు ప్రాంతం అడ్డుకాదని నిరూపించారు ఓ ప్రేమ జంట. పోర్చుగల్ దేశానికి చెందిన అమ్మాయి, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన అబ్బాయి శుక్రవారం వివాహం చేసుకోగా.. జడ్చర్లలో రిజిస్ట్రార్ కార్యాలయం ఇందుకు వేదికైంది. జడ్చర్ల స్థానిక పద్మావతి కాలనీకి చెందిన మట్ట శ్రీపాల్(32) లండన్లో ఆడిటింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ మేరకు అక్కడకు నాలుగేళ్ల క్రితం విహార యాత్రకు వచ్చి న పోర్చుగల్ రాజధాని లిస్బన్కు చెందిన వేర వెగాస్ లుకా వెలోజా(34)తో ఆయనకు పరిచ యం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మా రగా ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లికి సి ద్ధమయ్యారు. ఇందులో భాగంగా జడ్చర్ల వచ్చిన వారు నెల క్రితమే రిజిస్టర్ పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీపాల్ – వేర వెగాస్ లుకా వెలోజా జంటకు శుక్రవారం స్థానిక ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆంజనేయులు మ్యారేజ్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ మేరకు వేర వెగాస్ లుకా వెలోజా మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సం ప్రదాయాలు నచ్చడంతో తాను కుటుంబ సభ్యులను ఒప్పించి శ్రీపాల్ను వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన జంటను శ్రీపాల్ తల్లిదండ్రులు వెంకట్రెడ్డి – రమాదేవితో పాటు కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు. -
అతడి ఆటకు ఫిదా అయిన రొనాల్డో
పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పుట్బాల్ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. బంతి తమ అదపులోంచి ప్రత్యర్థి చేతిలోకి వెళ్లబోతుందంటే రోనాల్డోకి బాల్ పాస్ చేయ్ అని సహచర ఆటగాళ్లకు, సీనియర్ ఆటగాళ్లు, కోచ్లు సూచన ఇస్తారంటే అతని ఆట మీద ఎంత నమ్మకమో అర్థమవుతోంది. మరికొద్ది రోజుల్లో రష్యా వేదికగా జరగనున్న ఫుట్బాల్ మహాసంగ్రామం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫీఫా సమరానికి ముందే రోనాల్డో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజాగా లిస్బన్లో అల్జీరీయాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో 3-0తో పోర్చుగల్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మైదానంలో రొనాల్డో ఏడేళ్ల ముద్దుల కొడుకు క్రిస్టియానో రొనాల్డో జూనియర్ ఆడిన ఆట అటు అభిమానులను, ఇటు తండ్రిని అశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్ అనంతరం తండ్రితో కలిసి మైదానంలో ఫుట్బాల్ ఆడిన రొనాల్డో జూనియర్ టాప్ లెఫ్ట్లో కళ్లు చెదిరే రీతిలో గోల్ చేశాడు. దీంతో అభిమానులతో పాటు రొనాల్డో ఆశ్చర్యానికి గురయ్యారు. కొడుకు ఆట చూసి ఫిదా అయిన సీనియర్ రొనాల్డో పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. ప్రస్తుతం ఆ బుడతడు కొట్టిన గోల్కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తండ్రి అడుగుజాడల్లోనే కొడుకు కూడా అద్భుతంగా రాణిస్తాడని అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. రొనాల్డోకు ఈ ప్రపంచ కప్పే చివరిదని నిరాశపడుతున్న అభిమానులకు ఈ వీడియో ఊరటనిస్తుంది. తమ అభిమాన తనయుడు భవిష్యత్తులో రాణిస్తాడని సంబరపడిపోతున్నారు. జూన్ 14న ప్రారంభం కానున్న ఈ మహాసంగ్రామంలోని తొలి మ్యాచ్లో సౌదీఆరేబియాతో ఆతిథ్య రష్యా తలపడనుంది. ఇక 15న స్పెయిన్తో పోర్చుగల్ సమరానికి సిద్దమైంది. -
రొనాల్డో జూనియర్ కళ్లు చెదిరే రీతిలో గోల్ చేశాడు
-
రెండు మేటి... రెండు పోటీ!
అటువైపు మాజీ చాంపియన్ స్పెయిన్... ఇటువైపు రొనాల్డో సైన్యం పోర్చుగల్... ఈ రెండు గట్టి జట్ల కారణంగా ఫిఫా ప్రపంచకప్–2018 గ్రూప్ ‘బి’ ఆసక్తికరంగా మారింది. మిగతా గ్రూప్లలో ప్రమాదకర ప్రత్యర్థులు తర్వాతి దశలో ఎదురయ్యే అవకాశం ఉంది. ‘బి’లో మాత్రం స్పెయిన్, పోర్చుగల్ మధ్య లీగ్ దశలోనే హోరాహోరీ సమరం తప్పదు. దీంతో మొత్తం ఎనిమిది గ్రూప్ల్లో ఇందులోనే పోటీ ఒకింత ఎక్కువగా కనిపిస్తున్నది. ఇరాన్, మొరాకోలు సంచలనాలు సృష్టిస్తేనే తప్ప... 1, 2 స్థానాలు యూరప్ జట్లవేనని చెప్పొచ్చు. రొనాల్డోపైనే భారం! జట్టంతా ఒక ఎత్తు. రొనాల్డో ఒక్కడే ఒక ఎత్తు. దీన్నిబట్టే ప్రపంచ కప్లో పోర్చుగల్ ప్రయాణం అతడిపై ఎంతగా ఆధారపడి ఉందో చెప్పొచ్చు. కెరీర్ చరమాంకానికి చేరుకున్న ఈ సూపర్ స్టార్ చిరకాల కోరిక నెరవేరేందుకు ఇదే చివరి అవకాశం. భిన్న దేశాల ఆటగాళ్లుండే లీగ్లలో అద్భుతంగా రాణించే రొనాల్డోకు... జాతీయ జట్టులో మాత్రం ఇంతకాలం సరిజోడైన ఆటగాళ్లు లేరు. దీంతో పోర్చుగల్ అతడే ఒక సైన్యంగా బరిలో దిగాల్సి వచ్చేది. అయితే, దృఢమైన డిఫెండర్ పెపె, బంతిని చక్కగా అందించే జావో మౌంటిన్హో, కొత్త కెరటం ఆండ్రె సిల్వలతో ఈసారి కొంత మార్పు కనిపిస్తోంది. రొనాల్డోకు దాడులకు వీరి ఆట తోడైతే తిరుగుండదు. అనుభవజ్ఞులుండటంతో కొంత ఆశలు రేపుతోంది. రొనాల్డో లేకుండా కూడా తాము టైటిల్స్ గెలవగలమని 2016 యూరోపియన్ చాంపియన్ షిప్లో పోర్చుగల్ నిరూపించింది. నాడు స్టార్ ఫార్వర్డ్ గాయంతో దూరమైనప్పటికీ ఈ జట్టు... ఫైనల్లో ఆతిథ్య ఫ్రాన్స్ను ఓడించడం గమనార్హం. కీలకం: రొనాల్డో, పెపె. 33 ఏళ్ల వయసులో రొనాల్డో తన అనుభవాన్నంతా రంగరించి ఆడాల్సిన అవసరముంది. కప్ అందిస్తే మాత్రం ఆల్టైమ్ గ్రేట్లలో ఒకడిగా నిలిచిపోతాడు. కోచ్: శాంటోస్. 2014లో బాధ్యతలు స్వీకరించాడు. జట్టుకు దుర్బేధ్యమైన డిఫెన్స్ను సృష్టించాడు. ఇది రొనాల్డో పనిని సులువు చేయనుంది. ప్రపంచ ర్యాంక్: 4 చరిత్ర: ఏడు సార్లు క్వాలిఫై అయింది. 1966లో మూడో స్థానంలో, 2006లో నాలుగో స్థానంలో నిలిచింది. 2014లో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. ఇరాన్ రాణించేనా? ఆసియా నుంచి ఈసారి తొలి బెర్త్ దక్కించుకున్న జట్టు ఇరాన్. వరుసగా రెండోసారి క్వాలిఫై అయింది. మొదటి అర్హత రౌండ్లో 18 మ్యాచ్ల్లో అజేయంగా నిలిచింది. రెండో రౌండ్లో ఓ దశలో తొమ్మిది మ్యాచ్ల్లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. 2014లో ఒక్క విజయం కూడా లేకుండానే కప్ నుంచి నిష్క్రమించింది. కీలకం: సర్దార్ అజ్మన్. 22 ఏళ్ల ఈ ఫార్వర్డ్ 2015 ఆసియా కప్లో మెరుపులతో వెలుగులోకి వచ్చాడు. కోచ్: కార్లోస్ క్విరెజ్. పోర్చుగల్ దేశస్తుడు. 2014కు ముందునుంచి కొనసాగుతున్నాడు. తాము రష్యా వెళ్తున్నది విహార యాత్రకు కాదంటూ ప్రకటించాడు. ప్రపంచ ర్యాంక్: 36 చరిత్ర: ఐదోసారి బరిలో నిలిచింది. ఎన్నడూ గ్రూప్ దశ దాటలేదు. 1978లో 14వ స్థానంలో నిలవడమే మెరుగైన రికార్డు. ముందడుగేస్తే గొప్పే... ఆఫ్రికా ఉత్తర ప్రాంత దేశమైన మొరాకో 20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్నకు అర్హత సాధించింది. హకీమ్ జియెచ్, యూనెస్ బెల్హాండా వంటి ప్రతిభావంతులైన యువకులతో ఆసక్తి రేపుతోంది. అయినా దిగ్గజ జట్లను దాటుకుని ముందుకెళ్లాలంటే శక్తికి మించిన ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. కోచ్ హెర్వ్ రెనార్డ్. జియెచ్ మధ్య తలెత్తిన విభేదాలు సద్దుమణిగినా, ఆ ప్రభావం జట్టుపై పడకుండా చూసుకోవాలి. కీలకం: నబిల్ దిరార్. గత సీజన్లో ఫ్రెంచ్ లీగ్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. కోచ్: హెర్వ్ రెనార్డ్. ఫ్రాన్స్ దేశస్తుడు. జట్టులో క్రమశిక్షణ, విజయ కాంక్ష పెంచాడు. మెరుపు దాడులతో పాటు, చక్కటి డిఫెండింగ్ వ్యవస్థను రూపొందించాడు. గతంలో జాంబియా, ఐవరీకోస్ట్ జట్లను తీర్చిదిద్దాడు. ప్రపంచ ర్యాంక్: 42 చరిత్ర: ఇప్పటివరకు ఆరుసార్లు క్వాలిఫై అయింది. 1986లో 11వ స్థానంలో నిలవడమే గొప్ప ప్రదర్శన. టికి టకా ఎందాకనో! టికి టకా...ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది స్పెయినే. తక్కువ దూరం పాస్లతో ఆకట్టుకునే ఈ తరహా ఆటతో 2010లో జట్టు తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపర్చింది. కానీ, తర్వాత నుంచి అనూహ్యంగా వెనుకబడింది. 2014లో డిఫెండింగ్ చాంపియన్గా దిగి... 23వ స్థానంతో దారుణ పరాభవం పాలైంది. 2016లో యూరో కప్నూ నిలబెట్టుకోలేకపోయింది. అయితే, సెర్గియో రామోస్, గెరార్డ్ పికె వంటి డిఫెండర్లు, స్ట్రయికర్ అల్వారో మొరాటా, డిగో కోస్టా, గోల్ కీపర్ డేవిడ్ డె గీతో పాటు నాణ్యమైన మిడ్ ఫీల్డర్లు, ఫార్వర్డ్లున్నందున ఈసారి ముందడుగు వేసే అవకాశాలు బాగానే ఉన్నాయి. కీలకం: 34 ఏళ్ల ఆండ్రెస్ ఇనెస్టా. 2010 ప్రపంచకప్లో గోల్తో కప్ సాధించి పెట్టాడు. ఈసారి ఏమేరకు రాణిస్తాడో చూడాలి. కోచ్: జులెన్ లొప్టెగ్యు. మాజీ గోల్ కీపర్ అయిన ఇతడు జట్టులో పునరుత్తేజం నింపాడు. తన ఆధ్వర్యంలోనే స్పెయిన్... 10 క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో తొమ్మిది గెలిచి, ఒకటి డ్రా చేసుకుని అజేయంగా నిలిచింది. ఇటలీని ఏకంగా 3–0తో ఓడించింది. ప్రపంచ ర్యాంక్: 8 చరిత్ర: 14 సార్లు క్వాలిఫై అయింది. 2010 చాంపియన్. 1950లో 4వ, 2002లో 5వ స్థానంలో నిలిచింది. 2014లో 23వ స్థానంలో నిలవడం జట్టు చరిత్రలోనే అతిపెద్ద వైఫల్యం. -
పోరుగల్లు నుంచి పోర్చుగల్
స్టార్టప్ వీసా మీద పోర్చుగల్ దేశంలో తొలిసారిగా వ్యాపారం చేసే అవకాశాన్ని వరంగల్ యువకుడు దక్కించుకున్నాడు. భారత్ నుంచి అనేక కంపెనీలు పోటీ పడగా వరంగల్కు చెందిన ఎల్ల్లబోయిన తరుణ్ రూపొందించిన డైన్ స్మార్ట్ అనే స్టార్టప్ కంపెనీ చివరి వరకు పోటీలో నిలిచి విజేతగా నిలిచింది. - సాక్షి ప్రతినిధి, వరంగల్ మూడేళ్లలో... హన్మకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన సుధాకర్, అనురాధ దంపతుల రెండో కుమారుడు ఎల్లబోయిన తరుణ్. కంప్యూటర్స్లో బీటెక్ పూర్తి చేసిన వెంటనే 2015లో ఇండియాలో డైన్స్మార్ట్ పేరుతో స్టార్టప్ కంపెనీని స్థాపించారు. సినిమా థియేటర్స్, మాల్స్, మల్టీప్లెక్స్, హోటళ్లలో ఉండే ప్రేక్షకులకు ఫుడ్, బేవరేజెస్ డెలివరీ చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. ప్లేస్టోర్ ద్వారా డైన్ స్మార్ట్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని.. తద్వారా కస్టమర్లు ఆర్డర్లు ఇవ్వవచ్చు. వరంగల్ నగరంలో ఏషియన్ శ్రీదేవీ మాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి డైన్ స్మార్ట్ను విస్తరించారు. ఇక్కడ తరుణ్కు మౌనిక, ప్రణవ్, ఉమాశంకర్, వేణు జతయ్యారు. వీరు డైన్ స్మార్ట్ను మరింతగా విస్తరించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఇనార్బిట్ మాల్, ఫోరమ్ సుజనా మాల్, మినర్వాగ్రాండ్, అలంకృత రిసార్ట్స్, లాస్ వెగాస్ డ్రైవ్ ఇన్ వంటి పేరెన్నికగల సంస్థల్లో డైన్స్మార్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలో సినీ పోలీస్లో సేవలు ప్రారంభించేందుకు సంప్రదింపులు చేస్తున్నారు. అంతర్జాతీయ దిశగా... 2017 నవంబర్లో పోర్చుగల్ రాజధాని లిస్బన్లో వెబ్ సమ్మిట్ పేరుతో జరిగిన టెక్ కాన్ఫరెన్స్కి రావాల్సిందిగా డైన్ స్మార్ట్ బృందానికి ఆహ్వానం అందింది. ఇండియా పేరుతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 15 మంది సభ్యుల బృందాన్ని స్టార్టప్ ఇండియా పేరుతో భారత ప్రభుత్వం పంపింది. డైన్స్మార్ట్ పనితీరు భారత అధికారులను ఆకట్టుకుంది. దీంతో భారత ప్రభుత్వ అధికారులు దగ్గరుండి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. పోర్చుగల్లో ఉన్న భారత రాయబారి నందిని సింగ్లా డైన్స్మార్ట్ పనితీరు గురించి పోర్చుగల్ అధికారులకు వివరించారు. భవిష్యత్లో డైన్స్మార్ట్ స్టార్టప్కు ఉన్న మార్కెట్ను గుర్తించిన పోర్చుగల్ ప్రభుత్వం తమ ఇంక్యుబేషన్ సెంటర్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోర్చుగల్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు డైన్స్మార్ట్ బృంద సభ్యులు ఫిబ్రవరి 20న వెళ్లనున్నారు. ఆనందంగా ఉంది డైన్ స్మార్ట్ స్థాపించినప్పుడు ఇండియాలో మంచి మార్కెట్ను ఏర్పరుచుకోగలం అని అనుకున్నాం. కానీ.. గ్లోబల్ మార్కెట్లో విస్తరిస్తామని అనుకోలేదు. ఇంత త్వరగా ఈ అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. – ఎల్లబోయిన తరుణ్, డైన్ స్మార్ట్ ఎండీ -
పోర్చుగల్లో కార్చిచ్చు.. 27 మంది ఆహుతి
-
పోర్చుగల్లో కార్చిచ్చు.. 27 మంది ఆహుతి
లిస్బన్: ఐరోపా కూటమిలోని దేశాలైన పోర్చుగల్, స్పెయిన్ల్లోని అడవుల్లో ఆదివారం మంటలు చెలరేగి మొత్తం 30 మంది సజీవ దహనమయ్యారు. పోర్చుగల్లోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 27 మంది మరణించారు. 20 చోట్ల కార్చిచ్చు ఇంకా విజృంభిస్తుండటంతో అత్యవసర స్థితిని విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టా సోమవారం ప్రకటించారు. 4 వేల మందికి పైగా అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, కరువు పరిస్థితులే పోర్చుగల్లో మంటలు ఇంతలా ఎగసిపడటానికి కారణమనీ, ఆదివారం మొత్తంగా 520 చోట్ల అడవుల్లో నిప్పు రాజుకుందని అధికారులు తెలిపారు. ‘మాకు నరకం చాలా దగ్గరగా కనిపించింది. ఎక్కడ చూసినా భయంకరంగా మంటలు ఎగసిపడుతున్నాయి’ అని పెనకోవ పట్టణానికి చెందిన ఓ మహిళ వాపోయారు. ఆమె ఇద్దరు సోదరులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూ మృత్యువాతపడ్డారు. -
పర్యటన 95 గంటలు విమానంలో 33 గంటలు
భారత్ చేరుకున్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ: పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్ దేశాల పర్యటనను ముగించుకుని ప్రధాని మోదీ బుధవారం భారత్కు తిరిగివచ్చారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. నాలుగు రోజుల పర్యటనలో మోదీ పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోలేదు. మరుసటి రోజు ఏదైనా కార్యక్రమం ఉంటే తప్ప ఆయన బస చేయలేదు. పోర్చుగల్, నెదర్లాండ్స్లలో ఒక్కోరోజులోనే పర్యటన పూర్తి చేసిన మోదీ అమెరికాలో మాత్రం రెండ్రోజులు పర్యటించారు. మొత్తం 95గంటలపాటు సాగిన ఆయన టూర్లో 33గంటలు ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో ప్రయాణించారు. పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్లో కలిపి వరుసగా 33 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూన్ 24న ఉదయం 7గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి లిస్బన్కు పదిగంటల్లో వెళ్లిన మోదీ అక్కడ కనీసం హోటల్ కూడా తీసుకోకుండా ఎయిర్పోర్ట్ లాంజ్లోనే విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత పోర్చుగల్ విదేశాంగ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి భారతీయులతోమాట్లాడాక, లిస్బన్ ఎయిర్పోర్ట్కు వచ్చారు. 8 గంటలు ప్రయాణించి వాషింగ్టన్ చేరుకున్నారు. మోదీ రెండ్రోజుల్లో అమెరికాలో 17 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం రాత్రి 9గంటలకు అమెరికా పర్యటన పూర్తికావడంతో రాత్రి అక్కడే బసచేయకుండా వెంటనే నెదర్లాండ్స్కు వెళ్లారు. నెదర్లాండ్స్లో 7 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత పర్యటన ముగించుకుని వెంటనే రాత్రి బయల్దేరి బుధవారం ఉదయం ఆరుకల్లా ఢిల్లీ చేరుకున్నారు. -
పోర్చుగల్ చేరుకున్న ప్రధాని మోదీ
లిస్బన్: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుగా పోర్చుగల్ చేరుకున్నారు. మోదీ శనివారం పోర్చుగల్ ప్రధానమంత్రి ఆంటోనియా కోస్టాతో భేటీ కానున్నారు. ఈ పర్యటన అనంతరం ఆయన 25, 26 తేదీల్లో అమెరికా, 27న నెదర్లాండ్స్లో పర్యటిస్తారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు మంత్రులు, వివిధ సంస్థల సీఈవోలతో మోదీ భేటీ కానున్నారు. ఆ తర్వాత వాషింగ్టన్లో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం అవుతారు. ఈ మూడు దేశాలతోనూ సంబంధాలు బలోపేతం చేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు మోదీ నిన్న ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
నాదల్ సునాయాసంగా...
మూడో రౌండ్లోకి ప్రవేశం పారిస్: రికార్డుస్థాయిలో పదో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్పై గురి పెట్టిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ రెండో రౌండ్ను కూడా సాఫీగా దాటాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ నాదల్ 6–1, 6–4, 6–3తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. గంటా 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో నాదల్ నాలుగు ఏస్లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేయడంతోపాటు 33 విన్నర్స్ కొట్టాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–1, 6–4, 6–3తో సుసా (పోర్చుగల్)పై గెలిచి మూడో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో పదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6–2, 6–4, 3–6, 6–3తో స్టకోవ్స్కీ (ఉక్రెయిన్)పై, ఆరో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 7–5, 6–1, 6–3తో బొలెలీ (ఇటలీ)పై, 11వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–4, 7–5తో రొబ్రెడో (స్పెయిన్)పై నెగ్గారు. అయితే 12వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 5–7, 4–6, 7–6 (8/6), 4–6తో ప్రపంచ 91వ ర్యాంకర్ రెంజో ఒలివో (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు. 2007లో ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత సోంగా ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి. శ్రమించిన ముగురుజా: మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్) రెండో రౌండ్లో 6–7 (4/7), 6–4, 6–2తో కొంటావీట్ (ఎస్తోనియా)పై కష్టపడి గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–3, 6–1తో కురుమి నారా (జపాన్)పై, 11వ సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–0, 6–0తో అబాండా (కెనడా)పై గెలిచారు. 15వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–7 (5/7), 6–7 (5/7)తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) చేతిలో ఓడింది. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ని ఓడించిన ఎకతెరీనా మకరోవా రెండో రౌండ్లో 2–6, 2–6తో సురెంకో (ఉక్రెయిన్) చేతిలో పరాజయం పాలైంది. -
అరబిందో చేతికి జనరిస్ ఫార్మా
రూ.969 కోట్లతో కొనుగోలుకు ఒప్పందం న్యూఢిల్లీ: పోర్చుగల్ కేంద్రంగా పనిచేస్తున్న జనరిక్ ఔషధ కంపెనీ ‘జనరిస్ ఫార్మాస్యూటికా’ను అరబిందో ఫార్మా సొంతం చేసుకుంది. 135 మిలియన్ యూరోలు చెల్లించి దీన్ని సొంతం చేసుకోవటానికి ఒప్పందం చేసుకుంది. ఇది మన కరెన్సీలో దాదాపు రూ.969 కోట్లు. ప్రస్తుతం ఈ సంస్థ మాగ్నమ్ క్యాపిటల్ పార్ట్నర్స్ చేతిలో ఉంది. తన అనుబంధ సంస్థ ఏజైల్ ఫార్మా నెదర్లాండ్స్ ద్వారా ఈ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు అరబిందో యూరోపియన్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి.మురళీధరన్ చెప్పారు. ఈ రెండు సంస్థలకూ సంబంధించి పలు ఔషధాల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో వచ్చే అయిదేళ్లలో మరిన్ని పేటెంట్లు వస్తాయని ఆయన తెలియజేశారు. యూరోపియన్ మార్కెట్లో తమ స్థానాన్ని పటిష్ఠం చేసుకోవటానికి కట్టుబడి ఉన్నామని, తాజా కొనుగోలు కూడా దీన్నే సూచిస్తుందని చెప్పారాయన. ఈ ఒప్పందానికి పోర్చుగీసు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఒప్పందంతో పోర్చుగల్లోని అమడొరాలో ఉన్న 1.2 బిలియన్ ట్యాబ్లెట్స్ను ఉత్పత్తి చేసే ప్లాంటు అరబిందో సొంతమవుతుంది. -
ఐరోపా వారి రాక
1453కి పూర్వం ఐరోపా వారు ఎర్ర సముద్రం, గల్ఫ్ మార్గాల ద్వారా ఆసియా రాజ్యాల (భారత్, ఇండోనేసియా)తో వ్యాపార, వాణిజ్యాలు నిర్వహించేవారు. బైజాంటిన్ రాజ్యంలో ఎనిమిది క్రూసేడ్స యుద్ధాలు (క్రైస్తవం, ఇస్లాం మధ్య) 200 ఏళ్ల పాటు జరిగాయి. చివరికి టర్కీ సుల్తాన్ మహ్మద్-2 బైజాంటిన్ రాజ్యాన్ని (కాన్స్టాంట్నోపుల్/ఇస్తాంబుల్ను) ఆక్రమించాడు. ఐరోపా వారు ఆసియా దేశాల నుంచి వస్త్ర, సుగంధ ద్రవ్యాల వాణిజ్యాలు జరిపేవారు. 1453లో ఇస్తాంబుల్ నగరాన్ని దిగ్బంధం చేయడంతో ఐరోపా వాణిజ్య రంగం, భూస్వామ్య విధానం పతనమయ్యాయి. ఐరోపావారు భారత్, ఇండోనేసియా కోసం నూతన సముద్ర మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో పోర్చుగల్, స్పెయిన్ దేశాలు తొలుత నౌకా రంగంలోకి ప్రవేశించాయి. మొదట పోర్చుగల్ రాజైన హెన్రీ-2 (గొప్ప నావికుడు) తన రాజధానిలోని లిస్బన్ పట్టణంలో తొలి నౌకా పాఠశాలను ప్రారంభించాడు. ఔత్సాహిక నావికులను ప్రోత్సహించేందుకు దీన్ని ఉచిత సౌకర్యాలతో నెలకొల్పాడు. వెనిస్ (ఇటలీ) యాత్రికుడు మార్కోపోలో రాసిన నా యాత్రలు అనే గ్రంథం ఆధారంగా ఇందులో పాఠాలు బోధించేవారు. మార్కోపోలో క్రీ.శ.1292లో దక్షిణ భారతదేశంలో పర్యటించాడు. మొదట మదురై (పాండ్యుల రాజధాని) తమిళనాడును (ఇక్కడ జటావర్మ కులశేఖర రాజు ఆస్థానాన్ని) సందర్శించాడు. వారి రాజ్య విశేషాలు, సంపదల గురించి వర్ణించాడు. తర్వాత కాకతీయ రాజ్యానికి (ఓరుగల్లుకు) వెళ్లాడు (ఆ సమయంలో కాకతీయుల రాజ్యాన్ని రుద్రాంబ పాలిస్తోంది). కాకతీయుల ముఖ్య ఓడరేవు మోటుపల్లిని సందర్శించి, అటు నుంచి ఐరోపాకు వెళ్లిపోయాడు. తర్వాత తన గ్రంథంలో నావికులు పాటించాల్సిన విధానాలు, వారి ఆహార నియమాలు మొదలైన అంశాలను వివరించాడు. ఇతని గ్రంథం ఆధారంగా నికోలో-డి- కాంటీ అనే వెనిస్ (ఇటలీ) యాత్రికుడు (1395-1469) విజయనగర రాజ్యాన్ని సందర్శించి లీ వోఏజ్ ఆక్స్ ఇండెస్ (1414-1439) అనే గ్రంథం రాశాడు. ఇతని మరో ప్రసిద్ధ గ్రంథం (వియాగి ఇన్ పర్షియా-ఇండియా, ఇ-జియావ)లో కూడా అనేక అంశాలతోపాటు భారత్లోని సుగంధ ద్రవ్యాల గురించి ప్రత్యేకంగా వర్ణించాడు. ఈ రెండు గ్రంథాల ఆధారంగా హెన్రీ-2 నౌకా పాఠశాలలో నావికులను ప్రోత్సహించాడు. వీరిలో మొదటి నావికుడు బార్తలో డోమ్యోజ్. ఇతడు ఆఫ్రికా తీరం వెంట ప్రయాణించి, 1487లో గుడ్హోప్ వరకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్లాడు. దీనికి కేప్ ఆఫ్ స్టార్మ్స (తుపానుల అగ్రం) అని, కేప్ ఆఫ్ గుడ్హోప్ అని నామకరణం చేశాడు. తర్వాత స్పెయిన్ రాజు ఫెర్డినాండ్, అతని భార్య ఇసబెల్లా కలిసి ఇటాలియన్ నావికుడైన క్రిస్టోఫర్ కొలంబస్కు ఆర్థిక సహాయం చేసి, నౌకా యాత్రలకు పంపించారు. ఇతను పశ్చిమం వైపు పయనించి 1492లో పశ్చిమ దీవుల సముదా యాలకు చేరాడు. వీటి గురించి కొలంబస్ తన గ్రంథం(ట్రాన్స అట్లాంటిక్ థియరీ)లో వివరిం చాడు. 1492లో అమెరికాను కనుగొన్నాడు. అక్కడ నివసిస్తున్న జాతిని రెడ్ ఇండియన్స అని పిలిచాడు. తాను చేరుకుంది భారతదేశమని భావించాడు. కానీ, తాను కనుగొన్నది ప్రపంచానికి తెలియని గొప్ప ఖండమని ఆయనకు తెలియదు. తర్వాత 1508లో అమెరిగో వెస్ఫూఛి అనే ఇటలీ యాత్రికుడు దీన్ని ‘నూతన ఖండం’గా పిలిచాడు. ఇదే ప్రస్తుతం అమెరికాగా ప్రసిద్ధి చెందింది. అలాగే హడ్సెన్.. కెనడాను (హడ్సెన్ బే కెనడాలో ఉంది), బఫెన్.. బఫెన్ దీవులు మొదలైనవాటిని కనుగొన్నారు. వాస్కో డ గామా భారత్కు నూతన సముద్ర మార్గాన్ని పోర్చుగీసు దేశస్తుడైన వాస్కో డ గామా కనుగొన్నాడు. ఇతడు బార్తలో- డోమ్యోజ్ మార్గంలోనే పయనించి గుడ్హోప్ (దక్షిణ ఆఫ్రికాలోని చివరి భాగం) చేరుకొని, తూర్పుతీరం వైపు మొజాంబిక్ వెళ్లాడు. అక్కడి నుంచి మడగాస్కర్కు వెళ్లి, అక్కడ గుజరాత్ ప్రాంతాని (భారత్)కి చెందిన నౌకా వ్యాపారి అబ్దుల్ మాజిద్ సాయంతో 1498, మే 17న కేరళలోని కాలికట్ తీరానికి చేరుకున్నాడు. వాస్కో డగామా కాలికట్కు చేరినప్పుడు స్థానిక రాజు రాజామనువిక్రమ వర్మ (జామెరిన్) సాదరంగా ఆహ్వానించి, విలువైన సుగంధ ద్రవ్యాల పెట్టెలను అందించాడు. వాస్కో డ గామా వాటిని తీసుకొని ఐరోపాకు వెళ్లి 27 రెట్లు అధిక ధరకు విక్రయించాడు. పోర్చుగీసువారు (1498-1961) భారత్కు వచ్చిన తొలి ఐరోపావారు. 1498లో వచ్చి, దేశం (గోవా) నుంచి చివరిగా (1961లో) వెళ్లినవారు కూడా వీరే కావడం గమనార్హం. వాస్కో డ గామా రెండోసారి 1502లో భారత్కు వచ్చాడు. ఇక్కడి సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసి, వాటికి పోర్చుగీసులో 60 రెట్ల లాభాలు పొందాడు. ఫెడ్రో ఆల్ఫారెజ్ కాబ్రాల్ 1500 సంవత్సరంలో మరో పోర్చుగీసు నావికుడు కూడా కేరళ చేరాడు. పోర్చుగీసువారు భారత్లో ఎస్టాడో ద ఇండియా అనే కంపెనీని స్థాపించారు. మన దేశంలో వీరి తొలి ఫ్యాక్టరీని కొచ్చిన్ (కేరళ)లో నెలకొల్పారు. తొలి కోట కూడా ఇక్కడే నిర్మించారు. దీన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారు. పోర్చుగీసు వారి ఇతర స్థావరాలు పశ్చిమం వైపు 1. కొచ్చిన్ (1500) 2. కాలికట్ (1502) 3. గోవా (1510) తూర్పు తీరంలో 1. శాంథోమ్ (తమిళనాడు) 2. హుగ్లీ (బెంగాల్) 3. చిట్టగాంగ్ (బంగ్లాదేశ్) మహారాష్ర్టలో 1. సాల్సెట్టి 2. బొంబాయి 3. బేసిన్ గుజరాత్లో డయ్యూ డామన్ పోర్చుగీసు వారి ప్రముఖ వ్యాపార కేంద్రాలు 1.గోవా: చివరగా ఇదే వీరి వ్యాపార కేంద్రం. 2.డయ్యూ, డామన్ 3. కాలికట్ 4. కొచ్చిన్ పోర్చుగీసువారి పాలనా విధానం అన్ని స్థావరాలకు కేంద్రం కొచ్చిన్ (తర్వాత గోవాకు మార్చారు). ఎస్టాడో ద ఇండియాను పరిపాలించడానికి మూడేళ్ల పదవీ కాలంతో గవర్నర్లను నియమించారు. మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డి ఆల్మీడా. ఫ్రాన్సిస్-డి-ఆల్మీడా భారత్లో పోర్చుగీసు వారి తొలి గవర్నర్. రెండు సార్లు గవర్నర్గా ఉన్నాడు. బ్లూ వాటర్ పాలసీని 1505లో ప్రవేశపెట్టాడు. దీని ఉద్దేశం భూ మార్గాల కంటే సముద్రాల మీదే ఎక్కువ ఆధిపత్యం సంపాదించడం. నౌకా యుద్ధాలు చేసి, తీరప్రాంతాలను అధీనంలోకి తెచ్చుకొని, సముద్ర వాణిజ్యం ద్వారా ప్రపంచాధిపత్యం సాగించడమే వీరి లక్ష్యం. ఇతను 1510, మార్చి 1న కేప్టౌన్లో మరణించాడు. ఇతని కుమారుడు లేరెంజో-డి-ఆల్మీడా. గవర్నర్లు (పోర్చుగీసు ముఖ్య అధికారులు) 1. ఆల్మీడా 2. అల్బూకర్క 3. జాకో-డి-కాస్ట్రో 4. పెడ్రో మసారెస్ 5. గార్సియా-డి-నోరోహా 6. అఫోసో-డి-నోరోహా 7. లొపో-సోరెస్-ఆల్బెగార్గియా బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమతీర రాజ్యాలైన గుజరాత్ రాజు బహదూర్షా, టర్కీ రాజు, ఈజిప్టు రాజులు ఒక కూటమిగా ఏర్పడి పోర్చుగీసు వారిపై యుద్ధం ప్రకటించారు. ఇందులో డి-ఆల్మీడా తన కుమారుణ్ని కోల్పోయాడు. అల్బూకర్క పోర్చుగీసు గవర్నర్లలో గొప్పవాడు. గోవాను (రేవతి ద్వీపాన్ని) బీజాపూర్ సుల్తాన్ల నుంచి శ్రీకృష్ణదేవరాయల ద్వారా స్వాధీనం చేసుకున్నాడు. దీనికి కృతజ్ఞతగా విజయనగర రాజుశ్రీకృష్ణ దేవరాయలకు మేలుజాతి గుర్రాలను బహూకరించాడు. భారతీయులతో పోర్చుగీసు వారి వివాహ సంబంధాలకు తెరతీశాడు. పోర్చుగీసు వారి ప్రభావం భారత్లో అచ్చుయంత్రాన్ని ప్రవేశపెట్టారు. నావికాదళ ఆధునికీకరణకు దోహదపడ్డారు. వాణిజ్యంలో బొప్పాయి, పొగాకు, మిరప, చిలగడదుంప (ఆలుగడ్డ), బఠాని, పైనాపిల్ మొదలైనవాటిని ప్రవేశపెట్టారు. 1565లో రాక్షస తంగడి యుద్ధంలో విజయనగర రాజ్యం పతనమవడం కూడా పోర్చుగీసు పతనానికి ఒక కారణం. తమకు అన్ని రకాలుగా రక్షణగా ఉన్న గొప్ప రాజ్యం నేలమట్టం కావడం పోర్చుగీసు వారికి పెద్ద దెబ్బ. 1611లో బ్రిటిష్ అధికారి మిడిల్టన్ చేతిలో, 1608లో కెప్టెన్ బెస్ట్ చేతిలో (సూరత్ వద్ద) పోర్చుగీసు వారు ఓడిపోయారు. గోవా, డామన్ డయ్యూలు 1961 వరకు వీరి అధీనంలోనే ఉన్నాయి. డచ్చివారు వీరు హాలెండ్/నెదర్లాండ్ (హాలెండ్, బెల్జియం) దేశస్తులు. 1596లో లిచెస్టన్ తూర్పు దేశాలన్నింటినీ సందర్శించి ఓ గ్రంథం రాశాడు. ఇతడు ఇండోనేసియా(తూర్పు దేశాల దీవుల సముదాయం) లేదా ఈస్టిండిస్ ప్రాధాన్యతను వివరించాడు. 1602లో డచ్చివారు తమ వ్యాపార కంపెనీని డచ్ యునెటైడ్ ఈస్టిండియా కంపెనీ పేరుతో స్థాపించారు. భారత్లో వీరి తొలి స్థావ రం 1605లో మచిలీపట్నంలో వాడంగెన్ స్థాపిం చాడు. రెండో స్థావరాన్ని 1608-10లో పులికాట్ వద్ద వాన్రీడ్ స్థాపించాడు. మూడో ఫ్యాక్టరీని 1616లో సూరత్ (గుజరాత్)లో నెలకొల్పారు. డచ్చివారి తూర్పు తీర స్థావరాలు 1. మచిలీపట్నం (ఏపీ) 2. పులికాట్ (ఏపీ) 3. కాశింబజార్ (బెంగాల్) 4. చిన్సూరా (బెంగాల్) 5. నాగపట్నం (తమిళనాడు) పశ్చిమ తీరంలోని స్థావరాలు 1. {బోచ్ కాంబే (గుజరాత్) 2. కన్ననూర్ (కేరళ) 3. కొచ్చిన్ (కేరళ) వీరి ప్రధాన వర్తక కేంద్రాలు 1. నాగపట్నం (వాణిజ్య కేంద్రం) తమిళనాడు (1690 నుంచి) 2. మచిలీపట్నం 3. కన్ననూర్ 4. చిన్సూరా 5. పులికాట్ (1690 వరకు ఇది కేంద్రం) డచ్చివారి కోటలు 1. ఫోర్ట గెల్ట్రియా - పులికాట్ (ఏపీ) 2. ఫోర్ట డేవిడ్ - దేవసంపట్టణం (తమిళనాడు) 3. ఫోర్ట గెస్టావాస్ - చిన్సూరా (బెంగాల్) డా. మురళి పగిడిమర్రి అసిస్టెంట్ ప్రొఫెసర్, నిజాం కాలేజ్, హైదరాబాద్. -
ఆ సంచలన గోల్ సీక్రెట్ ఇదే!
► హైపోక్సిక్ చాంబర్లో సాధన ► రొనాల్డో బాటలో యోగేశ్వర్ న్యూఢిల్లీ: యూరో కప్ లో వేల్స్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో పోర్చుగల్ స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో కొట్టిన హెడర్ (గోల్) గుర్తుందా! వాయు వేగంతో దూసుకొచ్చిన బంతిని 8 అడుగుల ఏడు అంగుళాలు పైకి ఎగిరి తలతో గోల్ పోస్ట్ లోకి పంపాడు. మామూలుగా ఇలాంటి సంఘటనల్లో బంతి తగలడమే గొప్ప. కానీ అంత ఎత్తుకు ఎగిరి... అంత బలంగా కొట్టాడంటే...! చూడటానికి ఇది సహజంగా కనిపించినా.. దీని వెనుక ఉన్న మంత్ర దండం మాత్రం ‘హైపోక్సిక్ చాంబర్’. మామూలుగా ఓ చిరుత పరుగు తీయడానికి కూడగట్టుకునే శక్తికి ఐదు రెట్లు ఎక్కువగా రొనాల్డో ఈ షాట్ కోసం ఉపయోగించాడు. అంతేకాదు ఆ షాట్ కొట్టడానికి అతను 0.8 సెకన్లు గాల్లో వేలాడాడు. అసలు ఇది ఎలా సాధ్యమంటే..! మాడ్రిడ్ లోని తన ఇంట్లో ఉండే ఈ హైపోక్సిక్ చాంబర్లో రొనాల్డో ప్రతి రోజూ చేసే కసరత్తులే కారణమట. దీనివల్ల ఫిట్నెస్, శరీరంలోని శక్తి, సహనం గణనీయంగా మెరుగుపడటం, గాయాల నుంచి తొందరగా కోలుకోవడం జరుగుతుంది. అలాగే రక్తంలోని ఆక్సిజన్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంటే గాల్లో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నా శరీరంలోని కార్డియో రెస్పిరేటరి వ్యవస్థ అత్యంత మెరుగ్గా కండరాలకు శక్తిని అందిస్తుంది. ఫలితంగా అథ్లెట్కు అలసట పెద్దగా తెలియదు. దీంతో ప్రదర్శన అమోఘంగా మెరుగుపడుతుంది. సీన్ కట్ చేస్తే రియో ఒలింపిక్స్ నేపథ్యంలో భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ కూడా ఇప్పుడు ఈ చాంబర్లోనే శిక్షణ మొదలుపెట్టాడు. సోనెపట్లోని సాయ్ సెంటర్లో జూన్ 28న ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేయించుకున్నాడు. సముద్ర మట్టానికి 3100 మీటర్ల ఎత్తులో వాతావరణం ఎలా ఉంటుందో ఈ చాంబర్లో అలా ఉంటుంది. ఇప్పుడు మన రెజ్లర్ రోజుకు ఓ గంట అందులో ఎక్సర్ సైజ్ చేస్తున్నాడు. హైపోక్సిక్ చాంబర్ ఇలా ఉంటుంది... మామూలుగా ఓ జిమ్ లోకి గాలి చొరబడకుండా చేస్తే ఎలా ఉంటుందో ఈ హైపోక్సిక్ చాంబర్ అలాగే ఉంటుంది. ఇందులో ఉత్పత్తి అయ్యే ఆవిరి వలన ఎత్తైన వాతావారణంలో ఉన్నట్లు ఉంటుంది. దీనివల్ల ఆక్సిజన్ స్థాయి క్రమంగా తగ్గుతుండటం అథ్లెట్ కార్డియో రెస్పిరేటరి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అప్పుడు ఈ వ్యవస్థ అందుబాటులో ఉండే ఆక్సిజన్ను చాలా సమర్థంగా వినియోగించుకుంటుంది. తక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల ఫిట్నెస్, శక్తి, ఓర్పు, దీనివల్ల అథ్లెట్ ఫిట్ నెస్, సామర్థ్యం గణనీయంగా పెరుగుతాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్లు గాట్లిన్, ఉసెన్ బోల్ట్, టైసన్ గే, బాక్సింగ్ ఛాంపియన్లు మేవెదర్, పకియానో ఈ చాంబర్లోనే తమ కసరత్తులు చేస్తారు. -
పోర్చుగల్ ఫెజ్ ఈసో
-
పోర్చుగల్ ఫెజ్ ఈసో
95 సంవత్సరాలు... పోర్చుగల్ అంతర్జాతీయ ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టి. ఈ ఆటంటే ఆ దేశానికి ‘పిచ్చి’. ఫుట్బాల్ ముందు ప్రాణాలు కూడా లెక్కలేవనేంత ‘ప్రేమ’. అంతర్జాతీయ యవనికపై అలుపెరగని పోరాటం చేసినా.. ఎంత కష్టపడినా... ఎంతమంది దిగ్గజాలు వచ్చినా ఏ ‘కప్’ కూడా అందలేదనే ఆవేదన. ఏ పెద్ద టోర్నీ జరిగినా దేశం ప్రతిసారీ ఊపిరిబిగబట్టి చూసింది. ఆ నిరీక్షణకు ఇంతకాలానికి తెరపడింది. ఆ ఆవేదన ఇన్ని సంవత్సరాలకు ఆనందభాష్పంగా మారింది. ఇంతకాలానికి ‘యూరో’కా అంటూ ఆ దేశం పొలికేక పెట్టింది. అవును... పోర్చుగల్ ఫెజ్ ఈసో... పోర్చుగల్ సాధించింది. తమ చరిత్రలో తొలిసారి యూరో ఫుట్బాల్ కోటలో జెండా పాతింది. అంచనాలు తలకిందులయ్యాయి. అందలం ఎక్కుతుందని భావించిన ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ తుది మెట్టుపై చతికిలపడింది. ఎవరూ ఊహించనిరీతిలో పోర్చుగల్ జట్టు తొలిసారి యూరో చాంపియన్గా అవతరించింది. సొంతగడ్డపై ఫేవరెట్ ఫ్రాన్స్ను బోల్తా కొట్టించిన పోర్చుగల్ ఎట్టకేలకు అంతర్జాతీయ టైటిల్ లోటును తీర్చుకుంది. 12 ఏళ్ల క్రితం అందినట్టే అంది చేజారిన యూరో ట్రోఫీని ఈసారి ఒడిసి పట్టుకుంది. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడినా... మిగతా ఆటగాళ్లు పట్టుదలతో పోరాడి పోర్చుగల్ను విజేతగా నిలిపారు. తమ సారథి రొనాల్డోకు చిరస్మరణీయ కానుకను ఇచ్చారు. తొలిసారి యూరో టైటిల్ నెగ్గిన పోర్చుగల్ ≈ ఫైనల్లో ఫ్రాన్స్పై 1-0తో విజయం ≈ అదనపు సమయంలో గోల్ చేసిన ఎడెర్ ≈ గాయంతో మధ్యలో వైదొలిగిన రొనాల్డో ≈ ఆధిపత్యం చలాయించినా ఆతిథ్య జట్టుకు నిరాశే పారిస్: అతి కష్టమ్మీద లీగ్ దశను దాటిన పోర్చుగల్ ఆఖరికి యూరో చాంపియన్గా అవతరించి సంచలనం సృష్టించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూరో ఫుట్బాల్ చాంపియన్షిప్ ఫైనల్లో పోర్చుగల్ 1-0తో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును ఓడించింది. మ్యాచ్ 109వ నిమిషంలో సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఎడెర్ 25 అడుగుల దూరం నుంచి కళ్లు చెదిరేరీతిలో కుడి కాలితో సంధించిన శక్తివంతమైన కిక్ ఫ్రాన్స్ గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ లక్ష్యానికి చేరింది. ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత పోర్చుగల్ ఆటగాళ్లు మిగిలిన 11 నిమిషాల్లో ఫ్రాన్స్ జట్టుకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా నిలువరించి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. అంతకుముందు నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు ఖాతా తెరువడంలో విఫలమయ్యాయి. యూరో టోర్నమెంట్ చరిత్రలో ఓ ఫైనల్ మ్యాచ్లో నిర్ణీత సమయంలో గోల్ కాకపోవడం ఇదే తొలిసారి. గోడలా పాట్రిసియో, పెపె రికార్డుస్థాయిలో మూడోసారి యూరో టైటిల్ సాధించాలని ఆశిస్తూ బరిలోకి దిగిన ఫ్రాన్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అయితే ఫైనల్ చేరే క్రమంలో ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోని ఫ్రాన్స్కు అంతిమ సమరంలో మాత్రం చుక్కెదురైంది. పలుమార్లు ఫ్రాన్స్ జట్టుకు గోల్ చేసే అవకాశాలు వచ్చినా... పోర్చుగల్ గోల్కీపర్ రుయ్ పాట్రిసియో, డిఫెండర్ పెపె అడ్డుగోడలా నిలబడి ఫ్రాన్స్ ఆశలను నిర్వీర్యం చేశారు. మరోవైపు పోర్చుగల్ స్టార్ ఆటగాడు రొనాల్డోను కట్టడి చేయాలనే లక్ష్యంతో ఫ్రాన్స్ ఆటగాళ్లు కనిపించారు. ఈ క్రమంలో రొనాల్డోను పలుమార్లు మొరటుగా నిలువరించారు. తొమ్మిదో నిమిషంలో పాయెట్ ధాటికి రొనాల్డో మోకాలికి గాయమైంది. 25వ నిమిషంలో నొప్పికి తాళలేక మైదానంలో కూలబడి మిగిలిన మ్యాచ్కు దూరమయ్యాడు. అంతకుముందు తొమ్మిదో నిమిషంలో గ్రిజ్మన్ కొట్టిన హెడర్ షాట్ను పోర్చుగల్ గోల్కీపర్ పాట్రిసియో అద్భుతంగా అడ్డుకున్నాడు. సారథి కోసం సైనికుల్లా... రొనాల్డో మైదానం వీడటంతో ఇక ఫ్రాన్స్ జట్టుకు ఎదురు ఉండదని భావించినా అలా జరగలేదు. తమ సారథి కోసం పోర్చుగల్ సహచరులు సైనికుల్లా పోరాడారు. 34వ నిమిషంలో సిసోకో కొట్టిన షాట్ను పోర్చుగల్ కీపర్ పాట్రిసియో సమర్థంగా నిలువరించాడు. ద్వితీయార్ధంలోనూ ఫ్రాన్స్ తమ ప్రయత్నాలను కొనసాగించింది. కానీ వారికి ఆశించిన ఫలితం దక్కలేదు. 79వ నిమిషంలో రెనాటో శాంచెస్ స్థానంలో ఎడెర్ను సబ్స్టిట్యూట్గా పోర్చుగల్ బరిలోకి దించింది. 80వ నిమిషంలో క్వారెస్మా కొట్టిన షాట్ను ఫ్రాన్స్ గోల్కీపర్ నిలువరించాడు. 84వ నిమిషంలో సిసోకో షాట్ను పాట్రిసియో మళ్లీ అడ్డుకున్నాడు. ఇంజ్యూరీ సమయంలో ఫ్రాన్స్ ఆటగాడు గిగ్నాక్ కొట్టిన షాట్ గోల్పోస్ట్ బార్కు తగిలి బయటకు వెళ్లింది. నిర్ణీత 90 నిమిషాలు పూర్తయ్యాక రెండు జట్లు గోల్ చేయకపోవడంతో 30 నిమిషాల అదనపు సమయాన్ని ఇచ్చారు. 15 నిమిషాల తొలి అర్ధభాగంలోనూ గోల్ నమోదు కాలేదు. అయితే రెండో అర్ధభాగంలో నాలుగు నిమిషాలు ముగిశాక ఎడెర్ సుదూరం నుంచి కొట్టిన షాట్ ఫ్రాన్స్ గోల్పోస్ట్లోనికి వెళ్లడంతో పోర్చుగల్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఆ తర్వాత ఫ్రాన్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా స్కోరును సమం చేయడంలో విఫలమై ఓటమి భారాన్ని మూటగట్టుకుంది. 41 ఫ్రాన్స్ జట్టుపై పోర్చుగల్ 41 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. 56 సొంతగడ్డపై జరిగిన ప్రధాన టోర్నమెంట్లో ఫ్రాన్స్ ఓడిపోవడం 56 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1 ఓ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఒక జట్టు లీగ్ దశలో మూడో స్థానంలో నిలిచి... టైటిల్ సాధించడం ఇదే తొలిసారి. 2 మైకేల్ ప్లాటిని (ఫ్రాన్స్-1984లో) తర్వాత ఒకే యూరో టోర్నీలో అత్యధికంగా ఆరు గోల్స్ చేసిన రెండో ప్లేయర్గా గ్రిజ్మన్ (ఫ్రాన్స్) గుర్తింపు పొందాడు. 2 ఈ టోర్నీలో ఫ్రాన్స్ ప్లేయర్ గ్రిజ్మన్కు లభించిన అవార్డులు. అతనికి గోల్డెన్ బూట్ (టాప్ స్కోరర్-6 గోల్స్), గోల్డెన్ బాల్ (ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ) పురస్కారాలు దక్కాయి. 10 యూరో టైటిల్ను సాధించిన పదో జట్టు పోర్చుగల్. జర్మనీ, స్పెయిన్ మూడేసిసార్లు, ఫ్రాన్స్ రెండుసార్లు విజేతగా నిలిచాయి. సమష్టిగా సాధించారు... యూరో కప్ సాధించిన అనంతరం స్వదేశం చేరిన పోర్చుగల్ జట్టుకు అభిమానులనుంచి భారీ ఎత్తున ఘన స్వాగతం ల భించింది. ఆటగాళ్లతో రాజధాని లిస్బన్కు వచ్చిన ప్రత్యేక విమానాన్ని రంగు రంగుల వాటర్ కెనాన్లతో ముంచెత్తారు. అనంతరం ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు జరిగింది. ఆ తర్వాత జట్టు సభ్యులు దేశాధ్యక్షుడు మార్సెల్ రెబెలో డిసౌజాను కలిశారు. ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ కమాండర్స్’ అవార్డుతో జట్టును సత్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. లీగ్ దశలో మూడు మ్యాచ్లూ డ్రా... అదృష్టం కొద్దీ అత్యుత్తమ మూడో స్థానపు జట్లలో నిలవడంతో నాకౌట్ అవకాశం ... టోర్నీ ఆరంభం సమయంలో ఎవరికీ అంచనాల్లేవు... అయినా పోర్చుగల్ సాధించి చూపించింది. ఫైనల్ సహా ఏడు మ్యాచ్లలో ఒక్క సారి మాత్రమే నిర్ణీత సమయంలో మ్యాచ్ గెలవగలిగినా, ఒకే యూరోలో మూడు సార్లు అదనపు సమయం ఆడిన తొలి జట్టుగా నిలిచినా... పోర్చుగల్ సాధించిన విజయం విలువ తక్కువేమీ కాదు. ‘మాకు గెలిచే అర్హత లేదని చాలా మంది చెప్పుకుంటే చెప్పుకోనీ. మేం మాత్రం సగర్వంగా తిరిగి వెళుతున్నాం. మేం పావురాల్లా సాధారణంగా కనిపించినా, పాముల్లా తెలివితేటలు ప్రదర్శించాం’ అని ఆ జట్టు కోచ్ ఫెర్నాండో సాంటోస్ చెప్పడం ఎలాంటి స్థితినుంచి పోర్చుగల్ చాంపియన్గా నిలిచిందో సూచిస్తుంది. పోర్చుగల్ టీమ్ వన్ మ్యాన్ ఆర్మీ ఎంత మాత్రం కాదు... ఇన్నాళ్లూ రొనాల్డో ఒక్కడే అంతా అయి కనిపించిన ఆ జట్టు ఇప్పుడు సమష్టి తత్వంతో యూరో చాంపియన్గా నిలిచింది. అతను లేకుండా కూడా ఫైనల్లో సత్తా చాటి టైటిల్ సాధించగలగడమే మరో విశేషం. ఫ్రాన్స్ను వారి సొంతగడ్డపై 41 ఏళ్ల తర్వాత చిత్తు చేసి చాంపియన్గా నిలవడం అనేది అసాధారణం. ఈ విజయంలో జట్టులో ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. కెప్టెన్ రొనాల్డో నుంచి ఫైనల్ హీరో ఎడెర్ వరకు అంతా తమ పరిధిలో చెలరేగారు. వీరందరినీ నడిపించిన సాంటోస్ వ్యూహ చతురతా ఉంది. కోచ్ మార్గదర్శనంలో... చాలా మంది భావిస్తున్నట్లు ఇదేమీ అనుకోకుండా దక్కిన గెలుపు కాదు. ఐస్లాండ్, ఆస్ట్రియాలతో డ్రా తర్వాత హంగేరీ చేతిలో చిత్తుగా ఓడబోయి లక్కీగా డ్రా చేసుకోగలిగిన జట్టు ఇప్పుడు చాంపియన్గా నిలిచింది. క్లిష్ట సమయంలో కోచ్ సాంటోస్ సమర్థంగా తన బాధ్యత నిర్వర్తించారు. ఆయన కోచ్గా వచ్చిన తర్వాత తొలి మ్యాచ్లోనే ఆల్బేనియా చేతిలో పోర్చుగల్ ఓడింది. అయితే ఆ తర్వాత 14 మ్యాచ్లలో జట్టుకు పరాజయం లేదు. ఫైనల్లో ఎడెర్ను అనూహ్యంగా మైదానంలోకి దించిన వ్యూహం అద్భుతంగా పని చేసింది. అన్నింటికి మించి ఇతర పెద్ద జట్లతో పోలిస్తే ఆటగాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా మంచి వాతావరణం ఉండేలా ఆయన చూశారు. ఒకరిని మించి మరొకరు టోర్నీలో సహజంగానే స్టార్ ప్లేయర్ రొనాల్డో ముద్ర కనిపించింది. అంతా అతని చుట్టే తిరిగినట్లు అనిపించినా ఇతర ఆటగాళ్ల ప్ర దర్శన కూడా జట్టును గెలిపించింది. పెపె అద్భుత డిఫెన్స్ జట్టు కు బలంగా మారింది. పోలండ్పై గోల్ చేసిన 18 ఏళ్ల కొత్త కుర్రా డు సాంచెజ్ మ్యాచ్ను పెనాల్టీల వైపు మళ్లించాడు. ఫైనల్లో గోల్ కీపర్ పాట్రిసియో రక్షణ గోడను ఛేదించడం ఫ్రాన్స్ వల్ల కాలేదు. ఇక ఒక్క గోల్తో ఎడెర్ హీరోగా మారిపోయాడు. ఇంతకు ముందు 28 మ్యాచ్లు ఆడినా కేవలం ఫ్రెండ్లీలలో 3 గోల్స్ చేసిన అతను జట్టులో అందరికంటే తక్కువ గుర్తింపు ఉన్న ఆటగాడు. కానీ ఫైనల్ ద్వారా ఇప్పుడు అతని స్థాయి పెరిగిపోవ డం ఖాయం. ఇక పోర్చుగల్ తదుపరి లక్ష్యం 2018 ప్రపంచకప్. రూ. 189 కోట్లు యూరో టైటిల్ సాధించిన పోర్చుగల్కు ప్రైజ్మనీ రూపంలో మొత్తం 2 కోట్ల 55 లక్షల యూరోలు (రూ. 189 కోట్లు) లభించాయి. రన్నరప్ ఫ్రాన్స్ జట్టుకు 2 కోట్ల 45 లక్షల యూరోలు (రూ. 181 కోట్లు) దక్కాయి. - సాక్షి క్రీడావిభాగం -
చరిత్ర సృష్టించిన పోర్చుగల్
-
చరిత్ర సృష్టించిన పోర్చుగల్
పారిస్: యూరో కప్లో పోర్చుగల్ చరిత్ర సృష్టించింది. ఆతిథ్య జట్టు ఫ్రాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి పోర్చుగల్ తొలిసారి యూరోకప్ను అందుకుంది. ఇరుజట్లు హోరాహోరీగా తలపడిన ఫైనల్ మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా వచ్చిన పోర్చుగల్ ఆటగాడు ఏడర్.. అదనపు సమయంలో గోల్ కొట్టి తమ దేశానికి మరపురాని విజయాన్ని అందించాడు. స్టార్ ఆటగాడు క్రిస్టియన్ రొనాల్డో గాయంతో ఫస్ట్ ఆఫ్లోనే మైదానాన్ని వీడినా పోర్చుగల్ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆడింది. యూరోకప్ విజయంతో పోర్చుగల్ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. 2004 యూరోకప్లో ఆతిథ్య జట్టుగా ఫైనల్కు చేరిన పోర్చుగల్.. 1-0 గోల్స్ తేడాతో గ్రీస్ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడు మాత్రం ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ను అదే స్కోరుతో ఓడించి పోర్చుగల్ యూరోకప్ కలను నెరవేర్చుకోవటం విశేషం. -
కల నెరవేరేనా...
పోర్చుగల్... తమ చరిత్రలో ఎప్పుడూ ఒక్క మేజర్ టైటిల్ కూడా గెలవని జట్టు. స్టార్ ఆటగాడు రొనాల్డో సూపర్ ప్రదర్శనతో ఈసారి ఫైనల్కు వచ్చింది. ఇప్పుడు గెలవకపోతే మళ్లీ గెలవలేమనే కసితో బరిలోకి దిగుతోంది. ఫ్రాన్స్... ఈసారి యూరో గెలిస్తే మూడుసార్లు గెలిచిన జట్టుగా జర్మనీ, స్పెయిన్ల సరసన నిలుస్తుంది. సొంతగడ్డపై అభిమానులను నిరాశపరచకూడదనే పట్టుదలతో ఆడబోతోంది. మరి ఎవరి కల నెరవేరుతుంది..? యూరో ఫైనల్ నేడు ⇒ తొలి టైటిల్పై పోర్చుగల్ గురి ⇒ రికార్డు కోసం ఫ్రాన్స్ ఆరాటం ⇒ రొనాల్డో, గ్రిజ్మన్లపైనే దృష్టి రాత్రి 12.30 గంటల నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం పారిస్: యూరోపియన్ చాంపియన్షిప్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అభిమానులను అలరించిన ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు నేడు (ఆదివారం) జరిగే ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ టోర్నీలో కొత్త స్టార్గా అవతరించిన ఆంటోనీ గ్రిజ్మన్ (ఫ్రాన్స్)తో పాటు క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)ల సత్తాకు ఈ మ్యాచ్ అసలైన పరీక్ష కానుంది. సొంత ప్రేక్షకుల మద్దతుతో తమ జట్టును మరోసారి చాంపియన్గా నిలపాలని గ్రిజ్మన్ భావిస్తున్నాడు. మరోవైపు పోర్చుగల్కు మేజర్ టైటిల్ లేని లోటును తీర్చాలనే కసితో రొనాల్డో ఉన్నాడు. 2004లో స్వదేశంలోనే జరిగిన యూరో కప్ ఫైనల్లో గ్రీస్ చేతిలో 0-1తో పోర్చుగల్ ఓడిపోయింది. అప్పుడు 19 ఏళ్ల రొనాల్డో జట్టు ఓటమికి కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఇక ఫ్రాన్స్ జట్టు 1984, 2000లో యూరో కప్లో విజేతగా నిలిచింది. అయితే ఈ రెండు సార్లు సెమీస్లో పోర్చుగల్ను ఓడించే తుది పోరుకు చేరింది. ఇది ఈ జట్టుకు మూడో ఫైనల్. చివరిసారి ఈ రెండు జట్లు 2006 ప్రపంచకప్ సెమీస్లో తలపడగా జిదానే ఏకైక గోల్తో ఫ్రాన్స్ గెలిచింది. 1975లో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్లో ఫ్రాన్స్పై నెగ్గిన పోర్చుగల్ ఆ తర్వాత త లపడిన 10 సార్లు పరాజయమే ఎదుర్కొంది. పటిష్టంగా ఫ్రాన్స్: ప్రత్యర్థితో పోలిస్తే ఫ్రాన్స్ స్టార్ ఆటగాళ్లతో పైచేయిలో ఉంది. గోల్డెన్ బూట్ రేసులో ఆరు గోల్స్తో అందరికన్నా ముందున్న గ్రిజ్మన్ మరోసారి కీలకం కానున్నాడు. అతడితో పాటు ఫార్వర్డ్ గిరౌడ్, మిడ్ఫీల్డర్లు పయెట్, పోగ్బా ప్రత్యర్థి ఆటగాళ్లను వణికిస్తున్నారు. పోరాటమే ధ్యేయంగా..: రొనాల్డో ఇప్పటిదాకా ఫ్రాన్స్ జట్టుపై విజయం రుచి చూడలేదు. సెమీస్లో వేల్స్పై అత్యద్భుత ఆటను చూపెట్టి ఫామ్లో ఉన్న అతడిపైనే జట్టు ఆశలున్నాయి. నాని తనకు సహకారం అందిస్తే ఫ్రాన్స్కు ఇబ్బందులు తప్పవు. -
రొనాల్డో మ్యాజిక్, ఫైనల్లో పోర్చుగల్
లియోన్: యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో ఎట్టకేలకు పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ రొనాల్డో మెరిశాడు. టోర్నీ ఆరంభం నుంచి స్థాయికి తగిన ప్రదర్శన చేయడంలేదనే విమర్శలు ఎదుర్కొంటున్న రొనాల్డో.. బుధవారం రాత్రి వేల్స్తో జరిగిన కీలక సెమీస్లో సత్తా చాటడంతో పోర్చుగల్ యూరో కప్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. దీంతో.. సంచలన ప్రదర్శనతో గత 50 ఏళ్లలో ఓ మేజర్ టోర్నీ సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి బ్రిటిష్ జట్టుగా చరిత్ర సృష్టించాలని భావించిన వేల్స్కు నిరాశే మిగిలింది. రెండు జట్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్ 50వ నిమిషంలో రొనాల్డో అద్భుతమైన హెడ్డర్తో పోర్చుగల్ను ఆధిక్యంలో నిలిపాడు. అనంతరం రొనాల్డో షాట్ను నాని గోల్గా మలచడంతో 2-0తో పోర్చుగల్ విజయం సాధించింది. గురువారం రాత్రి ఫ్రాన్స్, జర్మనీల మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ విజేతతో పోర్చుగల్ ఫైనల్లో తలపడనుంది. -
బేల్ X రొనాల్డో
* వేల్స్, పోర్చుగల్ సెమీస్ పోరు * యూరో కప్ లియోన్: గ్యారెత్ బేల్, క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచ ఫుట్బాల్లో అత్యంత విలువైన ఆటగాళ్లే కాకుండా తమ ఆటతో అభిమానులను మంత్రముగ్ధులను చేయగల సత్తా ఉన్నవారు. స్పానిష్ లీగ్లో రియల్ మాడ్రిడ్ తరఫున ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కలిసే ఆడతారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. ఎవరి బలమేమిటో.. బలహీనత ఏమిటో ఇరువురికి మంచి అవగాహన ఉంది. గత మూడేళ్లలో వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా రియల్ మాడ్రిడ్ రెండు చాంపియన్స్ లీగ్ టైటిళ్లను దక్కించుకోగలిగింది. అయితే ఇప్పుడు తమ జట్ల ఆశలను మోస్తూ ప్రత్యర్థులుగా ఎవరు గొప్పో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. యూరో కప్లో భాగంగా నేటి (బుధవారం) రాత్రి వేల్స్, పోర్చుగల్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. నిజానికి ఈ మ్యాచ్ను రెండు జట్ల మధ్య కాకుండా ఇద్దరి స్టార్ల షోగానే అంతా భావిస్తున్నారు. ఇక తమ సంచలన ప్రదర్శనతో గత 50 ఏళ్లలో ఓ మేజర్ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి బ్రిటిష్ జట్టుగా చరిత్ర సృష్టించాలని వేల్స్ ఉవ్విళ్లూరుతుండగా... కిందా మీదా పడుతూ ఇక్కడిదాకా వచ్చిన పోర్చుగల్ ఈ మ్యాచ్లోనైనా స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించి టైటిల్ వేటలో నిలవాలని భావిస్తోంది. జోష్లో వేల్స్ ఇప్పటికే ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను క్వార్టర్స్లో కంగుతినిపించి తామేమిటో వేల్స్ నిరూపించుకుంది. ఆ మ్యాచ్లో బేల్ పెద్దగా రాణించకపోయినా సమష్టి కృషితో సెమీస్కు రాగలిగింది. అయితే అంతకుముందు మ్యాచ్ల్లో తను చూపిన ప్రతిభ అద్భుతం. ఇప్పటికే మూడు గోల్స్తో జోరుమీదున్నాడు. నిజానికి వేల్స్ ఇక్కడిదాకా రాగలుగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ తమ గ్రూప్లో టాప్లో నిలిచింది. అలాగే బెల్జియంపై 3-1తో నెగ్గి అందరికీ షాక్ ఇచ్చింది. హల్ రాబ్సన్-కను సూపర్ ఫామ్ ఇక్కడా కొనసాగితే పోర్చుగల్కు ఇబ్బందులు తప్పవు. కానీ మిడ్ఫీల్డర్ ఆరోన్ రామ్సే, డిఫెండర్ బెన్ డేవిస్ ఈ మ్యాచ్కు దూరం కావడం గట్టి ఎదురుదెబ్బగానే భావించవచ్చు. రామ్సే స్థానంలో ఇప్పటిదాకా బెంచికే పరిమితమైన ఆండీ కింగ్ను ఆడించనున్నారు. రొనాల్డో ఫామ్ కీలకం మరోవైపు పోర్చుగల్ ఆటతీరు సెమీస్ వరకు అంత అద్భుతంగా సాగలేదనే చెప్పవచ్చు. నిర్ణీత 90 నిమిషాల్లో ఇప్పటిదాకా ఒక్క గోల్ కూడా చేయకుండా సెమీస్కు చేరింది. తమ గ్రూప్ మ్యాచ్లన్నీ డ్రాగానే ముగిశాయి. క్వార్టర్స్లో పెనాల్టీ షూటవుట్తో నెగ్గింది. జట్టు ఒత్తిడినంతా భరిస్తున్న రొనాల్డో.. హంగెరీతో మ్యాచ్లో రెండు గోల్స్ చేసి నాలుగు యూరో కప్లలో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అయితే ఐస్లాండ్, ఆస్ట్రియా, క్రొయేషియా, పోలండ్లపై విఫలమయ్యాడు. అతడి ఫామ్లేమి జట్టును ఆందోళనపరుస్తోంది. ఈసారైనా తన హోదాకు తగ్గ ఆటతీరును ప్రదర్శించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. తను మరో గోల్ సాధిస్తే యూరో చరిత్రలో తొమ్మిది గోల్స్ చేసిన మైకేల్ ప్లాటిని సరసన నిలుస్తాడు. డిఫెండర్ పెపే గాయం కారణంగా ఆడేది అనుమానంగా మారింది. మైదానంలోకి పిల్లల్ని తేకండి పారిస్: మ్యాచ్ను గెలిచిన ఆనందంలో తమ భార్యా పిల్లలతో మైదానంలో సంబరాలు జరుపుకోవడం ఇక కుదరదని యూరో చాంపియన్షిప్ నిర్వాహకులు తేల్చి చెప్పారు. క్వార్టర్స్లో బెల్జి యంపై విజయంతో సంచలనం సృష్టించిన అనంతరం వేల్స్ ఆటగాళ్లు తమ పిల్లలను మైదానంలోకి తీసుకొచ్చి ఎంజాయ్ చేశారు. ‘ఇది యూరో చాంపియన్షిప్. ఫ్యామిలీ పార్టీ ఎంతమాత్రం కాదు. చిన్న పిల్లలకు స్టేడియం అంత సురక్షితమైనది కాదు. ఒకవేళ అభిమానులు ఫీల్డ్ పైకి వస్తే వారి భద్రత పరిస్థితి ఏమిటి? మేం ఎలా సమాధానం చెప్పుకోవాలి?’ అని టోర్నీ డెరైక్టర్ మార్టిన్ కాల్లెన్ ప్రశ్నించారు. -
రొనాల్డో <vs> లెవెండోస్కీ
నేడు పోర్చుగల్, పోలాండ్ క్వార్టర్స్ మ్యాచ్ మరో గోల్ చేస్తే రొనాల్డో కొత్త చరిత్ర యూరో కప్ మార్సెల్లీ: క్లబ్ స్థాయిలో తిరుగులేని సూపర్ స్టార్లు... యూరోపియన్ ఫుట్బాల్లోనూ హేమాహేమీలే... కానీ తమ దేశాల తరఫున ఇంతవరకు అనుకున్న స్థాయిలో మాత్రం ఆడలేకపోయారు. ఒకరు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అయితే... మరొకరు పోలాండ్ ఆటగాడు రొబెర్టో లెవెండోస్కీ... ఇప్పుడు ఈ ఇద్దరికి మరో అవకాశం వచ్చింది. యూరోపియన్ ఫుట్బాల్ చాంపియన్షిప్లో భాగంగా నేడు (గురువారం) ఇరుజట్ల మధ్య జరగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇరువురూ తమ జట్లను గెలిపించాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోలేని పోర్చుగల్... ప్రిక్వార్టర్స్లో క్రొయేషియాపై మాత్రం నెగ్గింది. అయితే నిర్ణీత 90 నిమిషాల్లో కనీసం ఒక్కసారి కూడా ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడి చేయకుండా పూర్తిగా రక్షణాత్మక ధోరణితో ఆడిందనే విమర్శలను ఎదుర్కొంది. అయితే క్వార్టర్స్ మ్యాచ్లో తమ ప్రదర్శనతో వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టాలని రొనాల్డో బృందం భావిస్తోంది. అలాగే యూరో చరిత్రలో అత్యధిక గోల్స్ (9) చేసిన మైకేల్ ప్లాటిని (ఫ్రాన్స్) రికార్డును సమం చేసేందుకు రొనాల్డో ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్లోనే ఈ ఫీట్ను పూర్తి చేయాలని అతను తహతహలాడుతున్నాడు. పోర్చుగల్ తరఫున సాంచెస్, పెపె, గోమెస్, నాని, మారియో వంటి ఆటగాళ్లు చెలరేగితే... పోలాండ్కు కష్టాలు తప్పవు. ప్రిక్వార్టర్స్లో పెనాల్టీ షూటౌట్లో స్విట్జర్లాండ్ను ఓడించిన పోలాండ్ తొలిసారి యూరో టోర్నీలో క్వార్టర్స్కు చేరుకుంది. దీంతో మరో అద్భుత ప్రదర్శనతో పోర్చుగల్కు చెక్ పెట్టాలని ఆటగాళ్లు కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుతం జట్టులో అందరూ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే గత నాలుగు మ్యాచ్ల్లో కనీసం ఒక్క గోల్ కూడా చేయని లెవెండోస్కీ షూటౌట్లో మాత్రం అదరగొట్టాడు. దీంతో మరోసారి అతనిపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ముఖాముఖి రికార్డులో పోర్చుగల్, పోలాండ్ 10 సార్లు తలపడ్డాయి. పోర్చుగల్ నాలుగు మ్యాచ్ల్లో, పోలాండ్ మూడు మ్యాచ్ల్లో గెలిచాయి. మరో నాలుగు మ్యాచ్లు ‘డ్రా’ అయ్యాయి. నేటి రాత్రి గం. 12.30 నుంచి సోనీ సిక్స్, సోనీ ఈఎస్పీఎన్లలో ప్రత్యక్ష ప్రసారం -
రాబిన్హుడ్ ఆర్మీ!
ఆదర్శం ‘పెద్దలను దోచి పేదలకు పెట్టు’ అనేది రాబిన్ హుడ్ సిద్ధాంతం. అయితే ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ సభ్యులు ఆ సిద్ధాంతాన్ని సవరించినట్లున్నారు. వారు చేస్తున్న మంచి పనులను చూస్తుంటే ‘పెద్దలను అడిగి పేదలకు పెట్టు’ అనేది వారి సిద్ధాంతమనిపిస్తుంది.ఇరవై ఏడేళ్ల ఆనంద్ సిన్హా పోర్చుగల్ కేంద్రంగా పని చేస్తున్న ‘రీ-ఫుడ్ ఇంటర్నేషన్’ అనే స్వచ్ఛందసంస్ధ గురించి చదివి ప్రభావితమయ్యాడు. ఆహారం వృథా కానీయకుండా, మిగులు ఆహారాన్ని ఆకలితో అలమటించే పేదలకు అందించడమే లక్ష్యంగా ‘రీ-ఫుడ్ ఇంటర్నేషనల్’ పని చేస్తుంది. ‘ఆ పని ఇక్కడ ఎందుకు చేయకూడదు?’ అనుకున్నాడు ఆనంద్. తన ఆలోచనను మిత్రులతో పంచుకున్నాడు. అలా అందరూ కలిసి ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ (ఆర్హెచ్ఏ)ను ప్రారంభించారు. ఆరుగురితో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడొక ఉద్యమంలా మారింది. మన దేశంలోని ప్రధాన పట్టణాల్లోనే కాదు పాకిస్థాన్లోని కరాచీ, లాహోర్లలో కూడా ఆర్హెచ్ఏ సేవలు కొనసాగుతున్నాయి.‘ఆర్హెచ్ఏ మొదలు పెట్టినప్పుడు మేము ఆరుగురు సభ్యులమే. ఇప్పుడు ఇది ఎన్నో రాష్ట్రాల్లో విస్తరించి ఒక సైన్యంలా మారింది’’ అంటాడు ఆనంద్ సిన్హా. ‘‘రెస్టారెంట్లతో టచ్లో ఉండటానికి మా ఫేస్బుక్ పేజీ ఉపకరిస్తుంది. మా పోస్ట్లు ఎందరినో కదిలించి సేవామార్గం వైపు నడిపిస్తున్నాయి’’ అంటాడు పాకిస్థాన్లో ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ ప్రారంభానికి తోడ్పడిన ఆఫ్రీది అనే యువకుడు.వివిధ ప్రాంతాల్లో యువత చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ వాలంటీర్స్గా పని చేస్తుంటారు. తమ ప్రాంతంలోని రెస్టారెంట్ యజమానులతో మాట్లాడి మిగిలిపోయిన ఆహారాన్ని తమకు డొనేట్ చేయమని అడుగుతారు. ఆ ఆహారాన్ని నిలువ నీడ లేనివారికి, అనాథలకు అందిస్తారు. గుర్గావ్లోని ‘కెబాబ్ ఎక్స్ప్రెస్’ రెస్టారెంట్ వంద తాజా వడపావ్లు, మరో రెస్టారెంట్ తాజా ఖిచిడీ, పరోటాలను ఉచితంగా అందిస్తున్నాయి. అదే బాటలో ఇప్పుడు ఎన్నో రెస్టారెంట్లు పయనిస్తున్నాయి. ఢిల్లీలో 30 రెస్టారెంట్లు ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ ప్రాజెక్ట్కు సహకరిస్తున్నాయి. మిగులు ఆహారాన్ని మాత్రమే కాకుండా తాజా ఆహారాన్ని కూడా ఉచితంగా అందిస్తున్నాయి. కొందరు రెస్టారెంట్ యజమానులయితే పంపిణీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు.పెళ్లిళ్ల సీజన్లో జరిగే ఆహార వృథా ఇంతా అంతా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేటరర్ల సహకారంతో విందుల్లో మిగిలిపోయే ఆహారం వృథా కాకుండా ప్రయత్నిస్తోంది రాబిన్హుడ్ ఆర్మీ. హైదరాబాద్ వాలంటీర్లు ఒక పెళ్లి విందులో మిగిలిపోయిన ఆహారంతో 970 మంది ఆకలి తీర్చగలిగారు! ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటూ ‘ఆర్హెచ్ఏ’ కోసం పని సమయం వెచ్చించడం చూసేవాళ్లకు ‘కాస్త కష్టమైన పని’ అనిపించవచ్చు. తోటి ఉద్యోగులు తమ విరామ సమయాన్ని వినోదానికి వెచ్చిస్తుంటే తాము మాత్రం ఎండలో రోడ్ల మీద గడపాల్సి రావచ్చు. అయితే ‘ఇది కష్టమైన పని’ అనిగానీ, ‘వ్యక్తిగత సమయాన్ని కోల్పోతున్నాం’ అనే విచారంగానీ ఆర్హెచ్ఏ వాలంటీర్లలో కనిపించదు. ‘నలుగురి కోసం ఒక మంచి పని చేస్తున్నాం’ అనే భావనే వారిని నడిపిస్తోంది. ‘మార్పు గురించి అదేపనిగా ఆలోచించడం కంటే... ఎవరికి వారు ఒక అడుగు ముందుకు వేస్తే ఆ మార్పు కచ్చితంగా కనబడుతుంది’ అని నమ్ముతుంది రాబిన్హుడ్ సైన్యం. ఇది కాదనలేని సత్యం. -
పొర్చుగల్లో శాయో ఈస్టిబో ఉత్సవాలు
-
తవ్వితీసిన శవానికి పట్టాభిషేకం
పీఛేముడ్ పద్నాలుగో శతాబ్దంలో పోర్చుగల్ దేశానికి నాలుగో అఫాన్సో రాజుగా ఉండేవాడు. అఫాన్సో రాజావారికి డాన్ పెడ్రో (ఒకటో పీటర్) అనే పుత్రరత్నం ఉన్నాడు. ప్రకృతి సహజధర్మం ప్రకారం రాజావారి పుత్రరత్నానికి కూడా వయసొచ్చింది. వయసొస్తే ఏ కుర్రాడైనా ఊరుకుంటాడా? రాకుమారుడు పెడ్రో కూడా అంతే! ప్రేమలో పడ్డాడు. అతగాడు ఏ రాచకన్నెనో వలచి ఉంటే ఇంత కథ జరిగేది కాదు గానీ, ఒక నిషిద్ధ వర్గానికి చెందిన ఇనెస్ పిరాస్ డి క్యాస్ట్రో అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగాడు. ఆమెనే పెళ్లాడాలనుకున్నా, తండ్రిచాటు బిడ్డ కావడంతో ఆ పని చేయలేకపోయాడు. అఫాన్సో రాజావారికి కొడుకు తీరు ఏమాత్రం నచ్చలేదు. కొడుకు ప్రేమను చంపడం తన వల్లకాదని ఆయనగారికి అర్థమైపోయింది. కొడుకు ప్రేమను చంపడం అసాధ్యమైనా, అతగాడి ప్రియురాలిని అంతం చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదని కూడా ఆయనగారి ‘రాచ’తెలివికి తట్టింది. రాజు తలచుకోవాలే గానీ, ఎన్ని మొండేల నుంచి వాటి తలకాయలు వేరుపడవు? మూడో కంటికి తెలియకుండా ఈ పనిని నిర్వర్తించే బాధ్యతను ముగ్గురు నమ్మినబంటులకు అప్పగించారు. వారు అత్యంత రాజభక్తితో, రాకుమారుడి సామాన్య ప్రియురాలిని పరలోకానికి సాగనంపారు. రాకుమారుడు పెడ్రోకు శోకక్రోధాలు ఏకకాలంలో కలిగినా, అప్పటికి ఏమీ చేయలేని నిస్సహాయత. కాలం గడిచి, అఫాన్సో రాజావారు కాలధర్మం చెందారు. తండ్రి మరణంతో పెడ్రో పట్టాభిషిక్తుడయ్యాడు. గద్దెనెక్కడమే తడవుగా తన ప్రియురాలి హత్యపై దర్యాప్తుకు హుకుం జారీ చేశాడు. ముగ్గురు హంతకుల్లో ఒకడు తప్పించుకుపోయినా, మిగిలిన ఇద్దరూ రాచభటుల చేతికి చిక్కారు. వాళ్లిద్దరికీ గుండెలు పెకలింపజేసి మరణశిక్ష విధించాడు. తర్వాత తన ప్రియురాలి సమాధిని తవ్వించి, ఆమె శవాన్ని బయటకు తీయించాడు. రాజ లాంఛనాలతో ఆ శవానికే రాణిగా పట్టాభిషేకం జరిపించి, సభాసదుల చేత గౌరవవందనం చేయించాడు. -
పేరులో నేముంది
అర్జెంటీనా (వింత కథల పుట్ట) పోర్చుగల్కు చెందిన ఫ్రాన్సిస్కో డి టోరెస్ అనే ఒక సముద్రవర్తకుడు ప్రయాణిస్తున్న ఓడ ప్రమాదానికి గురైంది. సముద్రంలో కొట్టుకుపోతున్న టోరెస్ను కొందరు రక్షించి, తమ దేశానికి తీసుకెళ్లి, సపర్యలు చేశారు. కొంతకాలం తర్వాత టోరెస్ను స్వదేశానికి పంపుతూ, వీడ్కోలు ఇచ్చే సందర్భంలో తమ ఆతిథ్యానికి గుర్తుగా కొన్ని ఆభరణాలను బహూకరించారు. చనిపోయాడనుకున్న టోరెస్ క్షేమంగా తిరిగి వచ్చేసరికి అందరూ సంతోషించారు. టోరెస్ తాను ప్రమాదం నుంచి బయటపడిన విధానాన్ని, అక్కడివారు తనను ఆదరించిన తీరును గురించి చెప్పి, వారు తనకు బహూకరించిన ఆభరణాలను చూపించాడు. తెల్లగా మెరుస్తున్న ఆ ఆభరణాలను చూసి అందరూ ముచ్చటపడి, తమకు కూడా కావాలన్నారు. దాంతో టోరెస్ కొందరిని వెంటబెట్టుకుని ఆ దీవికి వెళ్లి, అక్కడివారిని ఆభరణాల గురించి అడిగాడు. వారు అతనికి ఓ తెల్లటి కొండను చూపించి, ఆ కొండ రాళ్లతోనే తాము ఆభరణాలను తయారు చేశామని చెప్పారు. టోరెస్ వారి అనుమతితో ఆ కొండరాళ్లను కొన్నింటిని తనతోబాటు తీసికెళ్లి, ఆ రాళ్లను శుద్ధి చేసి, వాటితో ఆభరణాలు తయారు చేసి అమ్మకం సాగించాడు. అలా తనకు ముడిసరుకు కావలసి వచ్చినప్పుడల్లా ఆ దీవికెళ్లి రాళ్లు తెచ్చుకునేవాడు. ఆ కొండకు అర్జెంటీనా అని పేరు పెట్టాడు. లాటిన్లో ఆర్జంటమ్ అంటే వెండి అని అర్థం. అలా ఆ దేశానికి అర్జెంటీనా అనే పేరు స్థిరపడిపోయింది. -
కొమ్ములు తిరిగిన కొట్లాట
రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి... కత్తులతో మనుషుల్ని మనుషులు చంపుకునే వికృత క్రీడ ఎప్పుడో కనుమరుగైంది. కానీ అనాదిగా స్పెయిన్లో బుల్ఫైట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. చావే భయపడేలా అత్యంత క్రూరంగా చంపుతుంటే.. అది చూసి చప్పట్లు చరిచి, ఈలలు వేసే సంస్కృతి వందల ఏళ్లుగా వదలడం లేదు. క్రీడగా చెప్పుకునే బుల్ఫైట్పై ఈ వారం మైదానం ప్రత్యేకం. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ఐదారు వందల కిలోల బరువున్న ఎద్దును ఎదుర్కోవడం ఒక మనిషికి సాధ్యం కాదు.. కానీ అదే ఎద్దును శారీరకంగా, మానసికంగా వేధించి.. రెండు రోజులు కడుపు మాడ్చి.. వీపుపై కత్తుల్లాంటి వాటితో పోట్లు పొడిచి.. రక్తం కారేలా చేసి.. ఇరవై నిమిషాల్లో చంపే వికృత క్రీడ బుల్ ఫైట్.. స్పెయిన్, మెక్సికో లాంటి కొన్ని దేశాల్లో ఈ బ్లడ్ ఫైట్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన సాగుతోంది. వందల ఏళ్లుగా... ఎద్దులతో కొట్లాట అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది స్పెయిన్ బుల్ఫైట్. అక్కడ బుల్ ఫైటింగ్ కొన్ని వందల ఏళ్లుగా సాగుతోంది. పురాతన రోమ్ కాలంలో బుల్ ఫైటింగ్కు ప్రజాదరణ చాలా ఎక్కువ. ఏళ్లుగా ఇది స్పెయిన్ సంస్కృతిలో భాగమైంది. అయితే స్పెయిన్లో ప్రస్తుత తరహాలో జరుగుతున్న బుల్ ఫైటింగ్ 300 ఏళ్లుగా సాగుతోంది. పోటీలకు ప్రత్యేక ఎద్దులు... స్పెయిన్లో బుల్ ఫైటింగ్కు ఉపయోగించే ఎద్దులు ప్రత్యేక బ్రీడ్కు చెందినవి. పశువుల్లో ఉపజాతి అయిన బాస్ టారస్ ఇబెరికస్ ఎద్దును బుల్ఫైటింగ్లో ఉపయోగిస్తారు. వీటిని టోరో బ్రావో, ఇబెరియన్ బుల్ అని పిలుస్తారు. వీటిని దక్షిణ స్పెయిన్తో పాటు పోర్చుగల్, లాటిన్ అమెరికా దేశాల్లో పెంచుతారు. ఇవి ఎక్కువగా నల్లగా, ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వీటిలో అసాధారణ స్థాయిలో జన్యువులు, డీఎన్ఏ ఉండటం వల్ల దూకుడుతనం, శక్తి, బలం, సత్తువ అధికంగా ఉంటుంది. వీటినే పోటీల్లో బరిలోకి దించుతారు. మూడు నుంచి నాలుగేళ్ల వయసున్న వీటి బరువు 500 నుంచి 700 కేజీల మధ్య ఉంటుంది. వీళ్లే బుల్ ఫైటర్లు... బుల్ ఫైటింగ్లో ప్రధాన పాత్ర పోషించేది ప్రధాన మెటడారే. ఇతనికి స్టార్ హోదా ఉంటుంది. స్టార్ మెటడార్ కోసమే కొందరు ప్రత్యేకంగా బుల్ ఫైటింగ్ చూస్తారు. బుల్ ఫైటింగ్లో మెటడార్కు మరో ఇద్దరు సహాయకులుగా వ్యవహరిస్తారు. ముగ్గురు బాండెరిల్లేరోస్, ఇద్దరు పికెడార్లు తమ వంతు సాయం చేస్తారు. ఇక ఎద్దును చంపే క్రమంలో వీరందరి పాత్ర ఉన్నా.. చివరికి హీరో మాత్రం ప్రధాన మెటడారే. అప్పుడప్పుడు మనుషుల ప్రాణాలూ... బుల్ ఫైటింగ్ ఉద్దేశం ఎద్దులను చంపడం. అయితే ఈ పోటీల్లో అప్పుడప్పుడు బుల్ఫైటర్లు చనిపోతారు. కుమ్మేయాలన్న కసితో ఉన్న ఎద్దును రెచ్చగొట్టే క్రమంలో కానీ.. లేదంటే వాటి వీపులో పికాను లేదంటే బ్యాండెరిల్లాస్ను పొడిచే క్రమంలో బుల్ఫైటర్లను ఎద్దులు కుమ్మేస్తాయి. ఎద్దుల కుమ్ముడికి బుల్ఫైటర్లు చనిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 1700వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 500లకు పైగా బుల్ ఫైటర్లు చనిపోయినట్లు విశ్లేషకుల అంచనా. ఫైటర్లు.. శిక్షణ.. బుల్ ఫైటింగ్లో ఎద్దును చంపడమంటే మాటలు కాదు.. కుమ్మేయాలన్న కసితో ఉన్న ఎద్దును రింగ్లో చంపాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. బుల్ ఫైటర్ల కోసం బుల్ ఫైటింగ్ను ప్రోత్సహించే దేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే స్కూళ్లు కూడా ఉంటాయి. చాలా మంది శిక్షణ పొందేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఐదేళ్ల వయసు నుంచి బుల్ఫైటింగ్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇక స్పెయిన్లో బుల్ఫైటర్ రింగ్లోకి అడుగుపెట్టాలంటే ముందుగా ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పాసవ్వాల్సి ఉంటుంది. జంతు ప్రేమికుల సమరం... బుల్ఫైట్ చూసే వారికి ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రతీయేటా ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల కారణంగా 2.5 లక్షల ఎద్దులు చనిపోతున్నాయి. అయితే వీటిని అత్యంత పాశవికంగా చంపడాన్ని నిరసిస్తూ కొన్నేళ్లుగా జంతు ప్రేమికులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం బుల్ ఫైటింగ్ స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, మెక్సికో, కొలంబియా, వెనిజులా, పెరు, ఈక్వెడార్లో జరుగుతున్నాయి. అయితే జంతు ప్రేమికుల పోరాటం కారణంగా అర్జెంటీనా, కెనడా, క్యూబా, డెన్మార్క్, ఇటలీ, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో బుల్ ఫైటింగ్పై నిషేధం విధించారు. క్రీడనా? కళనా? వందల ఏళ్లుగా జరుగుతున్న బుల్ ఫైటింగ్ క్రీడ అని కొందరు వాదిస్తుంటే.. కాదు కాదు.. ఇదో కళ అని మరికొందరు వాదిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో జరుగుతుండటంతో బుల్ఫైటింగ్పై పెద్దగా దృష్టి సారించడం లేదు. అయితే క్రీడా విశ్లేషకులు మాత్రం ఎద్దులను చంపడమూ ఓ క్రీడేనా? అని సన్నాయి నొక్కులు నొక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. బుల్ఫైట్ సాగేదిలా... కేవలం 20 నిమిషాల్లో ముగిసే బుల్ఫైట్ మూడు దశల్లో సాగుతుంది. ఎద్దును భయపెట్టేలా శబ్దం చేయడంతో పోటీ ప్రారంభమవుతుంది. తొలి దశలో పికెడార్లు గుర్రంపై స్వారీ చేస్తూ ఎద్దును కవ్విస్తారు. అలిసిపోయేలా చేయడమే వారి పని. అదే క్రమంలో వాళ్లు తమ దగ్గరున్న 6 నుంచి 8 అంగళాల పొడవు, 2 అంగుళాల మందం ఉన్న ‘పికా’ అనే ఆయుధంతో వీపు భాగంలో పొడిచి మెడ నరాలు తెగేలా చేస్తారు. దీంతో ఎద్దు శరీరంలోంచి రక్తం కారడం మొదలవుతుంది. ఎద్దు మరణానికి ఇక్కడే కౌంట్డౌన్ మొదలవుతుంది. రెండో దశలో సహాయ మెటడార్లు(వీరిని బాండెరిల్లేరోస్ అని కూడా పిలుస్తారు) బ్యాండెరిల్లాస్(ఈటె లాంటి పదునైన కత్తి)తో రంగంలోకి దిగుతారు. ఐదు, ఆరు బ్యాండెరిల్లాస్లను ఎద్దు వీపుభాగంలో లోనికి గుచ్చుతారు. దీంతో అది అలిసిపోతుంది. మూడోది, అంతిమ దశలో ప్రధాన మెటడార్ రింగ్లోకి వచ్చి ఎద్దు ప్రాణాలను తీస్తాడు. ఎరుపు బట్టతో ఎద్దును ఆటూ ఇటూ ఆడిస్తూ అది పూర్తిగా కింద పడిపోయేలా చేస్తాడు. ఇదంతా ముగియడానికి 6 నిమిషాలు పడుతుంది. ఒకవేళ ప్రధాన మెటడార్ ప్రాణాలు తీయడంలో ఇబ్బంది పడితే అతనికి సహాయకుడిగా మరొకరు రింగ్లోకి వస్తారు. చివరికది రక్తం కక్కుకుని ప్రాణాలు విడుస్తుంది. పలు దేశాల్లో... బుల్ ఫైటింగ్లో ఎద్దును అత్యంత క్రూరంగా చంపడాన్ని చూశాం... అయితే కొన్ని దేశాల్లో బుల్ ఫైట్ను అటు ఎద్దుకు, ఇటు బుల్ ఫైటర్కు హాని జరగకుండా పోటీలు నిర్వహిస్తారు. మరికొన్ని దేశాల్లో రెండు ఎద్దుల మధ్య పోటీలను కూడా నిర్వహిస్తారు. పెర్షియన్ గల్ఫ్(ఒమన్, యూఏఈ)లో రెండు ఎద్దుల మధ్య బుల్ ఫైట్ పోటీలు జరుగుతాయి. అమెరికాలో బుల్ ఫైటర్ (రొడియో క్లౌన్) పేరుతో పోటీలు జరుపుతారు. టర్కీ, టాంజానియా, జపాన్లలో ఎద్దుల మధ్య పోటీలు నిర్వహిస్తారు. జల్లికట్టుపై సుప్రీం నిషేధం... భారత్లో అత్యంత వివాదాస్పదమైన క్రీడ ‘జల్లికట్టు’.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ ఏడాది మేలో నిషేధం విధించింది. ప్రతీయేటా తమిళనాడులో జరిగే ఈ జల్లికట్టు పోటీలు జరిగిన ప్రతీసారి వివాదాస్పదమే. స్పెయిన్ బుల్ఫైటింగ్లా ఎద్దును ఈ పోటీల్లో చంపరు. అయితే ఇందులో పాల్గొనే వాళ్లు ఎద్దును లొంగదీసుకుంటారు. ఈ ప్రయత్నంలో చాలామంది చనిపోయారు. గత రెండు దశాబ్దాల్లో రెండు వందల మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆ రెండు రోజులూ... బుల్ ఫైట్లో రింగ్లోకి వచ్చిన ఎద్దు రంకెలేస్తూ కనిపించిన వారిని కనిపించినట్లుగా కొమ్ములతో కుమ్మేయాలన్న కసితో అటూ, ఇటూ పరుగెత్తుతుంది. అయితే సాధారణంగా ఎద్దులు ఎవరికీ హాని చేయవు. కానీ రింగ్లోకి వచ్చిన తర్వాత అది పిచ్చెక్కినట్లుగా వ్యవహరిస్తుంది. అలా చేయడానికి కారణం ఉంది. బుల్ఫైట్కు సిద్ధం చేయడంలో భాగంగా రెండు రోజుల పాటు దానికి నరకం చూపిస్తారు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తారు. నీళ్లలో తడిపిన న్యూస్ పేపర్లను దున్నపోతు రెండు చెవుల్లోకి దూరుస్తారు. దీంతో వాటికి ఏమీ వినిపించదు. దూదిని ముక్కు రంధ్రాల్లోకి దూర్చడం ద్వారా శ్వాసక్రియకు ఆటంకం కలిగేలా చేస్తారు. ఫలితంగా అది శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. వాజిలిన్ను రెండు కళ్లకు రుద్దుతారు. దీంతో వాటికి చూపు మందగిస్తుంది. కాళ్లు కాలిపోతున్నాయనిపించేలా గాఢత ఎక్కువగా ఉన్న ద్రావణాన్ని పూస్తారు. దీనివల్ల ఎద్దు పట్టుతప్పిపోతుంది. ఒకరకంగా అది కింద పడిపోయేలా చేస్తుంది. జననాంగాల్లోకి సూదిని గుచ్చుతారు. బలమైన లాక్సెటీవ్స్ అనే డ్రగ్స్ను ఆహారంతో కలిపి పెడతారు. అది తిన్న ఎద్దు విరేచనాలకు లోనవుతుంది. ఫలితంగా నీరసంగా తయారవుతుంది. ఎద్దు బలహీనంగా తయారయ్యేలా (కొన్నిసార్లు బలంగా తయారయ్యేలా) డ్రగ్స్ తినిపిస్తారు. రింగ్లోకి పంపే కంటే రెండు రోజుల ముందు ఎద్దును చీకటిగా ఉన్న బాక్స్లో ఉంచుతారు. దీంతో అది దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతుంది. రెండు రోజుల తర్వాత ఒక్కసారిగా రింగ్లోకి వదులుతారు. బాక్స్లోంచి బయటకు వచ్చిన ఎద్దు తనకు ఎట్టకేలకు విముక్తి కలిగిందన్న భావనతో రింగులో కలియ తిరుగుతుంది. అదే సమయంలో తనను చిత్రహింసలకు గురి చేసిన వారిని కొమ్ములతో చంపేయాలన్న కసి దానిలో కనిపిస్తుంది. అందుకే రింగ్లో కనిపించిన వారిని కనిపించినట్లుగా కుమ్మేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంది. -
కిల్లర్ హెయిర్ స్టయిల్!
‘వెంట్రుకల గుణం మీద స్టయిల్ ఆధారపడి ఉంటుంది, స్టయిల్ కోసం వెంట్రుకలను ఇబ్బంది పెట్టవద్దు’ ఇలాంటి బోలెడు సలహాలు న్యాయ నిర్ణేతలుగా వచ్చిన వాళ్లు ఔత్సాహికుల కోసం చెప్పారు. పోర్చుగల్లోని లిస్బన్ పట్టణంలో ఇటీవల ‘మెన్స్ హెయిర్ స్టయిల్’ పోటీలు జరిగాయి. పద్దెనిమిది దేశాల నుంచి వెయ్యికి పైగా ఎంట్రీలు వచ్చాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పద్నాలుగు మంది మెన్స్ హెయిర్ స్టయిలిస్ట్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీలో ఐర్లాండ్కు చెందిన పాల్మాక్ ‘కిల్లర్ కట్’ హెయిర్ స్టయిల్ బహుమతి గెలుచుకుంది. ‘‘ఒక సెలూన్లో బార్బర్గా నా కెరీర్ మొదలైంది. తీరికవేళల్లో రకరకాల హెయిర్ స్టయిల్లు ప్రయత్నించేవాడిని. ఆ అలవాటే బహుమతి అందుకునేలా చేసింది’’ అంటున్నాడు పాల్మాక్. ఈయన సెలూన్ను మాత్రమే నమ్ముకోకుండా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడు. తన లేటెస్ట్ స్టయిల్స్ను ట్విట్టర్, ఫేస్బుక్లలో పెడుతుంటాడు. ‘వెంట్రుకల గుణం మీద స్టయిల్ ఆధారపడి ఉంటుంది, స్టయిల్ కోసం వెంట్రుకలను ఇబ్బంది పెట్టవద్దు’ ఇలాంటి బోలెడు సలహాలు న్యాయ నిర్ణేతలుగా వచ్చిన వాళ్లు ఔత్సాహికుల కోసం చెప్పారు. మీ వెంట్రుకలు మందంగా ఉంటే, ఈసారి సెలూన్కు వెళ్లినప్పుడు- ‘‘కిల్లర్ కట్ చెయ్ గురూ’’ అని అడగండి. ‘‘అదేమిటి?’’ అని అడిగేతే ప్రపంచ తలకట్టు పోటీలో బహుమతి గెలుచుకున్న ‘కిల్లర్ కట్’ గురించి చెప్పండి.‘‘మీ దగ్గర ఇంతుందా!’’ అన్నట్లు బార్బర్ చూస్తే చూడనివ్వండి. కొత్త విషయం చెబితే వినని వారు ఎవరు ఉంటారు చెప్పండి! -
పోర్చుగల్ పై జర్మనీ గ్రాండ్ విక్టరీ
-
‘జి’లో ఈజీ కాదు!
గ్రూప్-జి విశ్లేషణ జర్మనీ, పోర్చుగల్, ఘనా, అమెరికా ప్రతి ప్రపంచకప్లో ఓ గ్రూప్ ఉంటుంది. అందులో అందరూ ఉద్ధండపిండాలే ఉంటాయి. దానినే ‘గ్రూప్ ఆఫ్ డెత్’ అని పిలుస్తారు. నాకౌట్కు చేరుకునే అర్హత ఈ నాలుగు జట్లకూ ఉంటుంది. అయితే క్లిష్టమైన ‘డ్రా’ కారణంగా రెండు జట్లకు నిరాశ తప్పదు. పరిశీలకులు ఈసారి ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా ‘జి’ గ్రూప్ను పరిగణిస్తున్నారు. టైటిల్ ఫేవరెట్ జర్మనీ, పోర్చుగల్, అమెరికా, ఘనా జట్లు ఈ గ్రూప్లో ఉన్నాయి. ఈ నాలుగు జట్ల మధ్య జరిగే ప్రతీ మ్యాచ్ కీలకమే. ఏ జట్టయినా ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. మాజీ చాంపియన్ జర్మనీ ‘గ్రూప్ టాప్’గా నిలిచే అవకాశం ఉంది. 2006, 2010 ప్రపంచకప్లతో పాటు 2008, 2012 యూరో కప్లలో కనీసం సెమీఫైనల్కు చేరిందంటే ఈ జట్టు సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచకప్ గెలిచి 14 ఏళ్లు కావడంతో మరోసారి అద్భుతమైన ఆటతీరును కనబరిచి నాలుగోసారి టైటిల్ అందుకోవాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్ ప్రదర్శన: ఈ మెగా టోర్నీలో అత్యధిక టైటిళ్లు సాధించిన బ్రెజిల్ (5 సార్లు), ఇటలీ (4 సార్లు) తర్వాతి స్థానం జర్మనీదే. ఇప్పటిదాకా మూడు సార్లు చాంపియన్గా నిలిచిన జర్మనీ (1954, 1974, 1990) నాలుగుసార్లు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. నాలుగుసార్లు మూడో స్థానంలో, ఒకసారి నాలుగో స్థానంలో నిలిచింది. మూడుసార్లు మినహాయిస్తే ఆ జట్టు అంచనాలకు తగ్గట్లుగానే తన ఆటతీరును ప్రదర్శించింది. మొత్తానికి 17 సార్లు ప్రపంచకప్లో బరిలోకి దిగిన ఈ మాజీ చాంపియన్ చివరిసారిగా 1990లో విజేతగా నిలిచింది. 18వ సారి ప్రపంచకప్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అర్హత సాధించారిలా: క్వాలిఫయింగ్లో జర్మనీ అద్భుతంగా ఆడింది. యూరోప్ రీజియన్లోని గ్రూప్ ‘సి’లో జర్మనీ 10 మ్యాచ్ల్లో 28 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 9 మ్యాచ్ల్లో గెలిచిన జర్మనీ కేవలం ఒకే మ్యాచ్ను డ్రాగా ముగించింది. ఈ గ్రూప్లో ఓటమెరుగని జట్టు జర్మనీయే. కీలక ఆటగాళ్లు: గోల్కీపర్లలో నంబర్వన్గా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మాన్యువల్ న్యూయర్ ప్రపంచకప్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఫుల్బ్యాక్ ఫిలిప్ లామ్, బాస్టియన్ ష్వీన్స్టీగర్ చాలా కాలం కిందటే అంతర్జాతీయ సాకర్లో ఖ్యాతిని ఆర్జించారు. మీసట్ ఒజిల్, థామస్ ముల్లర్, పొడోల్స్కీ జట్టుకు ఆయువుపట్టు లాంటి వాళ్లు. ఇక యువ ఆటగాళ్లు మార్కో రియస్, ఆండ్రీ షురెల్, టోనీ క్రూస్, మారియో గోట్జే తమ సత్తా చాటుతున్నారు. కోచ్: జోకిమ్ లో; అంచనా: ఫైనల్ చేరుకునే అవకాశం. ఘనా ఫిఫా ర్యాంకుల్లో ఘనాది 37వ స్థానం... ఈ ర్యాంకును చూసిన వారెవరైనా ఈ గ్రూప్లో ఉన్న ఘనాను సాధారణంగా తక్కువగా ఉంచనా వేస్తారు. అయితే గత రెండు ప్రపంచకప్లో ఘనా ఆకట్టుకునే స్థాయిలో ఆడింది. కానీ ఇటీవలి కాలంలో ఈ జట్టు ఆటతీరు నామమాత్రంగా ఉంది. ప్రపంచకప్ ప్రదర్శన: 2006 ప్రపంచకప్లో ఘనా తొలిసారిగా బరిలోకి దిగి రెండో రౌండ్కు చేరింది. 2010లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అర్హత సాధించారిలా: క్వాలిఫయింగ్లో భాగంగా గ్రూప్ ‘డి’లో ఘనా ఆరు మ్యాచ్ల్లో ఐదింట విజయం సాధించి ప్లే ఆఫ్కు చేరింది. ఈజిప్టుతో జరిగిన ప్లే ఆఫ్ తొలి మ్యాచ్లో ఘనా 6-1తో గెలవగా.. రెండో మ్యాచ్లో 1-2తో ఓడింది. గోల్స్ ఆధారంగా ప్రపంచకప్కు అర్హత సాధించింది. కీలక ఆటగాళ్లు: మైకేల్ ఎస్సైన్, ముంతారి, ఆండ్రీ అయెవ్, క్వాడ్వో అసమో, కెవిన్ ప్రిన్స్ బోటింగ్, అసమో గ్యాన్లు ప్రత్యర్థి అవకాశాలను దెబ్బ తీయడంలో ఎక్స్పర్ట్స్. కోచ్: క్వెసి అప్యా అంచనా: పోర్చుగల్, అమెరికాలపై నెగ్గితే నాకౌట్కు చేరుతుంది. అమెరికా అమెరికా ఇటీవలి కాలంలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. జర్మనీ మాజీ ప్లేయర్ జుర్గెన్ క్లిన్స్మన్ కోచ్గా ఉండటం అమెరికాకు కలి సొచ్చే అంశం. ప్రపంచకప్ ప్రదర్శన: అమెరికా ఇప్పటిదాకా తొమ్మిదిసార్లు ప్రపంచకప్లో పాల్గొంది. అయితే ఒక్కసారి కూడా చాంపియన్గా నిలవలేకపోయింది. ఫిఫా తొలి ప్రపంచకప్ (1930)లో అమెరికా సెమీస్కు చేరి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. గత ప్రపంచకప్లో అమెరికా ప్రి క్వార్టర్స్లోనే ఇంటిదారి పట్టింది. అర్హత సాధించారిలా: క్వాలిఫయింగ్ తుది రౌండ్ను ఓటమితో మొదలుపెట్టిన అమెరికా... ఆవెంటనే కోలుకుంది. ఆ తర్వాత ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సత్తా చాటింది. మొత్తానికి యూఎస్ఏ 10 మ్యాచ్ల్లో 7 విజయాలు, ఒక డ్రాతో 22 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచకప్కు అర్హత సాధించింది. కీలక ఆటగాళ్లు: రొనాల్డో(పోర్చుగల్), ఒజిల్ (జర్మనీ) లాంటి ఆటగాళ్లు ఈ జట్టుకు లేకపోయినా... గ్రూప్ స్టేజ్లో ప్రత్యర్థికి షాకిచ్చే సత్తా అమెరికాకు ఉంది. లాండన్ డొనొవా, క్లయింట్ డెంప్సే, జోజి ఆల్టిడోర్, ఎడ్డి జాన్సన్, మైకేల్ బ్రాడ్లే జట్టులో కీలక ఆటగాళ్లు. కోచ్: జుర్గెన్ క్లిన్స్మన్ అంచనా: గ్రూప్ దశలో ఆడే మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు తప్పనిసరి. -
ఏడాదికి రూ. 1235 కోట్లు!
బార్సిలోనా: ‘ఫిఫా’ అత్యుత్తమ ఆటగాడిగా ఈ ఏడాది అవార్డు సొంతం చేసుకున్న పోర్చుగల్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో వ్యక్తిగతంగా మరో ఘనతను సాధించాడు. ఫుట్బాల్ ప్రపంచంలో ఈ ఏడాది సంపన్నమైన క్రీడాకారుడిగా రొనాల్డో నిలిచాడు. తాజా లెక్కల ప్రకారం అతని సంపాదన సంవత్సరానికి 122 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 1235 కోట్లు)గా ఉంది. ఈ జాబితాలో గత ఏడాది అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లండ్ దిగ్గజం బెక్హామ్ను (రిటైర్ కావడం వల్ల) పరిగణనలోకి తీసుకోలేదు. గత ఏడాది రియల్ మాడ్రిడ్తో 76 మిలియన్ పౌండ్ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు నైకీ తదితర సంస్థల స్పాన్సర్షిప్తో రొనాల్డో భారీగా ఆర్జిస్తున్నాడు. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ 120.5 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 1220 కోట్లు)తో రెండో స్థానంలో ఉన్నాడు. సామ్యూల్ ఇటో, వేన్ రూనీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.