పాక్‌లో ఐసీసీ బృందం పర్యటన: భారత్‌ మ్యాచ్‌లు అక్కడేనా? | ICC Delegation to Visit Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌లో ఐసీసీ బృందం పర్యటన.. టీమిండియా మ్యాచ్‌లు అక్కడేనా?

Published Wed, Sep 18 2024 9:37 AM | Last Updated on Wed, Sep 18 2024 2:53 PM

 ICC Delegation to Visit Pakistan

కరాచీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఉన్నతస్థాయి బృందం పాకిస్తాన్‌లో పర్యటించేందుకు మంగళవారం కరాచీ చేరుకుంది. వచ్చే ఏడాది ఇక్కడ ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ జరగనుంది. 

ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యులు గల ఐసీసీ బృందం ఆతిథ్య వేదికల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, కల్పించే సదుపాయాలను స్వయంగా పర్యవేక్షించనుంది. ఐసీసీ ఈవెంట్ల భద్రతాధికారి, జనరల్‌ మేనేజర్, ప్రొడక్షన్‌ మేనేజర్, ఐసీసీ పిచ్‌ కన్సల్టెంట్‌ ఈ బృందంలో ఉన్నారు. ఈ ఏడాది పిచ్‌ కన్సల్టెంట్‌ అండీ అట్కిన్సన్‌ పాక్‌లో పర్యటించడం ఇది మూడోసారి.

 ఈ బృందం ముందుగా కరాచీలో ఉన్న స్టేడియం, ఆటగాళ్లు బస చేసే హోటల్స్‌ను పరిశీలిస్తుంది. అనంతరం ఇస్లామాబాద్, లాహోర్‌లకు పయనమవుతుంది. భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో ఉండటంతో బృందం ప్రత్యేక దృష్టిపెట్టనుంది. ఈ బృందం నివేదిక ఆధారంగా లోటుపాట్లపై చర్చించిన తర్వాత వేదికల మార్పులు చేర్పులు, టోర్నమెంట్‌ తుది షెడ్యూలు ఖరారు చేస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement