Asian Games 2023: India men's and women's cricket teams get direct entries to quarterfiinals - Sakshi
Sakshi News home page

హర్మన్‌ ఆడేది... ఫైనల్‌ చేరితేనే! 

Published Sat, Jul 29 2023 2:30 AM | Last Updated on Sat, Jul 29 2023 9:41 AM

India directly into the quarter finals of the Asian Games - Sakshi

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగాలంటే టీమిండియా ఫైనల్‌  చేరాలి. ఎందుకంటే చైనా ఆతిథ్యమిచ్చే ఈ ఈవెంట్‌లో భారత్‌కు నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ ఎంట్రీ లభించింది. కెప్టెన్‌ హర్మన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం ఉన్న నేపథ్యంలో క్వార్టర్స్, సెమీఫైనల్‌ గెలిచి భారత్‌ తుదిపోరుకు అర్హత సాధిస్తే తప్ప ఆమె ఆసియా క్రీడల ఆట ఉండదు.

చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 8 వరకు ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఇందులో మహిళల క్రికెట్‌ ఈవెంట్‌లో 14 జట్లు, పురుషుల ఈవెంట్‌లో 18 జట్లు బరిలోకి దిగుతాయి. అయితే ఈ రెండు విభాగాల్లోనూ భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు నేరుగా క్వార్టర్స్‌ ఫైనల్స్‌ ఎంట్రీ లభించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement