-
బంగ్లాదేశ్ను చిత్తు చేసిన భారత్.. 44 పరుగుల తేడాతో విజయం
బంగ్లాదేశ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. సెల్హాట్ వేదికగా వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 1-0 అధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో యస్తికా భాటియా(36) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హర్మన్ ప్రీత్ కౌర్(30), షెఫాలీ వర్మ(31) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రబియా ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తర్ రెండు, త్రిష్నా, ఫాతిమా ఖాటూన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 101 పరుగులకే పరిమితమైంది.బంగ్లా బ్యాటర్లలో కెప్లెన్ సుల్తానా(51) ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో రేణుక సింగ్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా.. పూజా రెండు, శ్రేయంకా, దీప్తి శర్మ, రాధా యాదవ్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఏప్రిల్ 30న జరగనుంది. -
హర్మన్ ధనాధన్.. ఫ్లే ఆఫ్స్కు ముంబై ఇండియన్స్
న్యూఢిల్లీ: భారీ స్కోర్ల మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 95 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్లు) విధ్వంసం ముంబై ఇండియన్స్ను గెలిపించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో శనివారం జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది. ముందుగా గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దయాళన్ హేమలత (40 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ బెత్ మూనీ (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్కు 10.2 ఓవర్లలోనే 121 పరుగులు జోడించారు. మూనీ 27 బంతుల్లో, హేమలత 28 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఒక దశలో ఓవర్కు పది పరుగుల పైచిలుకు దూసుకెళ్లిన రన్రేట్... తర్వాత ఓవర్కు ఒక వికెట్ చొప్పున కోల్పోవడంతో నెమ్మదించింది. సైకా ఇషాక్ 2 వికెట్లు తీసింది. అనంతరం ముంబై 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు యస్తిక భాటియా (36 బంతుల్లో 49; 8 ఫోర్లు, 1 సిక్స్), హేలీ మాథ్యూస్ (18; 4 ఫోర్లు) తొలి వికెట్కు 50 పరుగులతో శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరితో పాటు నట్ సీవర్ బ్రంట్ (2) వికెట్నూ వంద పరుగుల్లోపే కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది. 15.4 ఓవర్లలో ముంబై స్కోరు 121/3. విజయానికి 26 బంతుల్లో 70 పరుగులు కావాలి. ఈ దశలో హర్మన్ప్రీత్ (వ్యక్తిగత స్కోరు 29 బంతుల్లో 40) ఇచ్చిన సునాయాస క్యాచ్ను బౌండరీ వద్ద లిచ్ఫీల్డ్ జారవిడిచింది. దీనిని సద్వినియోగం చేసుకున్న హర్మన్ ఆ తర్వాత విధ్వంసకరంగా ఆడింది. చేయాల్సిన 70 పరుగుల్లో ఆమె ఒక్కతే 6 ఫోర్లు, 4 సిక్స్లతో 55 పరుగులు (19 బంతుల్లో) సాధించడంతో ముంబై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. -
ప్రపంచంలో ఏకైక పురుష క్రికెటర్గా రోహిత్ ఆల్టైమ్ రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో 150వ మ్యాచ్ పూర్తి చేసుకున్న తొలి పురుష క్రికెటర్గా రికార్డులకెక్కాడు. అఫ్గనిస్తాన్తో ఇండోర్ వేదికగా రెండో టీ20 సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. మెన్స్ క్రికెట్లో షార్టెర్ట్ ఫార్మాట్లో తొలుత 150 మ్యాచ్ల మైలురాయి అందుకుంది రోహిత్ శర్మ కాగా... టెస్టుల్లో, వన్డేల్లో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో తొలుత 150 మ్యాచ్లు పూర్తి చేసుకున్న క్రికెటర్లు 150 టెస్టులు: అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా) (డిసెంబర్ 1993) 150 వన్డేలు: అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా) (ఫిబ్రవరి 1987) 150 టీ20లు: రోహిత్ శర్మ(ఇండియా) (జనవరి 2024)*. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో జరుగుతున్న టీ20 సిరీస్ ద్వారా రోహిత్ శర్మ దాదాపు 14 నెలల తర్వాత టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు. మొహాలీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో దురదృష్టవశాత్తూ ఆదిలోనే రనౌట్ అయి డకౌట్గా వెనుదిరిగాడు. ఇక ఇండోర్ వేదికగా ఆదివారం(జనవరి 14) నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్తో విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. టీ20ల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు 161 - హర్మన్ప్రీత్ కౌర్ (భారత్, 2009-2024) 152 - సుజీ బేట్స్ (న్యూజిలాండ్, 2007-2023) 151 - డానీ వ్యాట్ (ఇంగ్లాండ్, 2010-2023) 150 - అలిస్సా హీలీ (ఆస్ట్రేలియా, 2010-2024) 150 - రోహిత్ శర్మ (భారత్, 2007-2024)* -
IND W vs AUS W 3rd T20: సిరీస్ ఎవరిదో?
నవీ ముంబై: మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భారత్, ఆ్రస్టేలియా మహిళా జట్లు చెరొకటి గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇప్పుడు సిరీస్ను గెలుచుకునేందుకు ఫైనల్ లాంటి పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. వన్డే సిరీస్లో క్లీన్స్వీప్ అయిన భారత అమ్మాయిలు ఇప్పుడు టి20 సిరీస్ను కోల్పోడానికి సిద్ధంగా లేరు. ఆఖరి పోరులో ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో హర్మన్ప్రీత్ కౌర్ బృందం బరిలోకి దిగుతోంది. తద్వారా కొత్త ఏడాదిలో క్లీన్స్వీప్ పరాభవాన్ని మరిచేలా ఈ టి20 సిరీస్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో నెగ్గినట్లే ఈ ఆఖరి పోరులోనూ దాన్ని పునరావృతం చేస్తే సిరీస్ కష్టం కానేకాదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమాలు రాణిస్తే తొలి మ్యాచ్ను గెలుచుకున్నంత సులభంగా సిరీస్నూ గెలుచుకోవచ్చు. గత మ్యాచ్లో వీరి వైఫల్యమే జట్టును దెబ్బ తీసింది. దీంతో పాటు కెపె్టన్ హర్మన్ప్రీత్ వరుస వైఫల్యాలు జట్టుకు ప్రతికూలంగా మారాయి. ఈ నలుగురు కీలకమైన చివరి మ్యాచ్లో రాణిస్తే మాత్రం మన మహిళా జట్టుకు తిరుగుండదు. బౌలింగ్లో రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్ నిలకడగా రాణిస్తున్నారు. ఆసీస్తో పోల్చుకుంటే భారత ఫీల్డింగ్ సాధారణంగా ఉంది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్మెంట్కు ఫీల్డింగ్పై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముంది. మరోవైపు ఏకైక టెస్టు మ్యాచ్ ఓడాక అలీసా హీలీ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు దెబ్బతిన్న పులిలా వన్డేల్లో పంజా విసిరింది. తాజా టి20 సిరీస్లోనూ తొలి మ్యాచ్లో చిత్తుగా ఓడినా... రెండో మ్యాచ్లో బదులు తీర్చుకుంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో భారత గడ్డపై రెండో సిరీస్ విజయంపై కన్నేసింది. -
ఆసీస్తో రెండో టీ20.. సిరీస్ విజయమే లక్ష్యంగా!
ముంబై: వన్డే సిరీస్ వైఫల్యాన్ని అధిగమించి తొలి టి20లో ఆ్రస్టేలియా మహిళలపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడే అదే ఊపులో సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. గత మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహంతో హర్మన్ప్రీత్ సేన బరిలోకి దిగుతోంది. మరో వైపు సాధారణ బ్యాటింగ్తో ఓటమిని ఆహ్వానించిన ఆస్ట్రేలియా కోలుకొని సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. యువ పేసర్ టిటాస్ సాధు అద్భుత బౌలింగ్ ప్రదర్శన తొలి మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. 19 ఏళ్ల ఈ బెంగాలీ పేసర్ మరోసారి తన జోరును ప్రదర్శిస్తే ఆసీస్కు కష్టాలు తప్పవు. శ్రేయాంక, దీప్తిల ఆటతో డీవై పాటిల్ స్టేడియంలో స్పిన్నర్ల ప్రభావం కూడా బాగా కనిపించింది. పేసర్లు రేణుక, పూజ కూడా ఆకట్టుకున్నారు. బ్యాటింగ్లో షఫాలీ, స్మృతి మరో బ్యాటర్కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించారు. ఫామ్ కోల్పోయి చివరి రెండు వన్డేల్లో తుది జట్టులో అవకాశం లభించని షఫాలీ తాను ఎంత కీలకమో తొలి టి20 పోరులో చూపించింది. స్మృతి కూడా చాలా కాలం తర్వాత తన స్థాయికి తగ్గ ఆటతీరుతో అలరించింది. జెమీమా, హర్మన్ కూడా చెలరేగితే బ్యాటింగ్లో తిరుగుండదు. జట్టుపరంగా చూస్తే ముఖ్యంగా వన్డేలతో పోలిస్తే ఫీల్డింగ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మరో వైపు ఆ్రస్టేలియా జట్టు అనూహ్య రీతిలో తడబడింది. టి20ల్లో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆ జట్టు ఆలౌట్ కావడం భారత బౌలర్ల పైచేయిని చూపించింది. సీనియర్ బ్యాటర్లు ఉన్న టాప్–5లో పెరీ మినహా అంతా విఫలమయ్యారు. అయితే హీలీ, మూనీ, తహీలా, గార్డ్నర్ రాణిస్తే జట్టు భారీ స్కోరు చేయగలుగుతుంది. వన్డే సిరీస్లో అద్భుత ఆటను చూపించిన లిచ్ఫీల్డ్ టి20 మ్యాచ్లో కూడా సత్తా చాటడం ఆసీస్కు సానుకూలాంశం. ఆమె ఆడిన కొన్ని చక్కటి షాట్లు లిచ్ఫీల్డ్ సామర్థ్యాన్ని చూపించాయి. గత మ్యాచ్లో పూర్తిగా కట్టు తప్పిన ఆసీస్ బౌలింగ్ ఈ సారి ఎంత ప్రభావం చూపిస్తుంననేది ఆసక్తికరం. -
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. ఒత్తిడిలో భారత్
ముంబై: వన్డే సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన సమరానికి భారత మహిళల జట్టు సిద్ధమైంది. వాంఖేడె మైదానంలో శనివారం భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది. తొలి మ్యాచ్ను గెలిచిన ఆసీస్ 1–0తో ఆధిక్యంలో ఉండగా... తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ బృందం ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. నిజానికి ఇదే వేదికపై జరిగిన తొలి మ్యాచ్లో భారత్ భారీస్కోరే చేసింది. కానీ బౌలింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు లోపాలపై దృష్టి పెట్టిన టీమ్ మేనేజ్మెంట్ వీటిని అధిగమించి ఆ్రస్టేలియాను నిలువరించాలనే లక్ష్యంతో ఉంది. మధ్యాహ్నం 1.30 నుంచి జరిగే మ్యాచ్ ‘స్పోర్ట్స్–18’లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. చదవండి: Aus Vs Pak: అంతిమ విజయం మాదే.. హఫీజ్కు కౌంటర్ ఇచ్చిన కమిన్స్! -
ఆసీస్తో వన్డే, టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! యువ క్రికెటర్కు ఛాన్స్
స్వదేశంలో ఆస్ట్రేలియాపై చారిత్రత్మక విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే, టీ20 తలపడేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే వైట్ బాల్ సిరీస్లకు భారత జట్లను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ రెండు సిరీస్లలోనూ భారత జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ నడిపించనుంది. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బౌలర్ శ్రేయాంక పాటిల్కు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అదే విధంగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో అదరగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సైకా ఇషాక్కు కూడా ఆసీస్తో వన్డే, టీ20 జట్లలో సెలక్టర్లు అవకాశం కల్పించారు. మరోవైపు 20 ఏళ్ల మన్నత్ కశ్యకు వన్డే, టీ20 జట్టుల్లో అవకాశం దక్కింది. డిసెంబర్ 28న వాంఖడే వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆసీస్తో మూడు వన్డేలు, మూడు టీ20లు టీమిండియా ఆడనుంది. వన్డే సిరీస్ వాంఖడే వేదికగా జరగనుండగా.. టీ20 సిరీస్ డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. భారత మహిళల వన్డే జట్టు హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, హర్లీన్ డియోల్ భారత మహిళల టీ20 జట్టు హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా! -
ఏకైక టెస్టులో ఆసీస్ను చిత్తు చేసిన భారత్.. సరికొత్త చరిత్ర
India Women vs Australia Women, Only Test: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించి సొంతగడ్డపై చరిత్రాత్మక విజయం అందుకుంది. సమిష్టి ప్రదర్శనతో రాణించి కంగారూ జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు నమోదు చేసింది. మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. కాగా భారత్ ఏకైక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. ఇరు జట్ల మధ్య వాంఖడే వేదికగా డిసెంబరు 21న మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల దెబ్బకు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. అదరగొట్టిన బౌలర్లు, బ్యాటర్లు పూజా వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రాణా మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన భారత్కు ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధాన 74 పరుగులతో అదిరిపోయే ఆరంభం అందించారు. మిడిలార్డర్లో రిచా ఘోష్ 52, జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో దుమ్ములేపారు. ఇక లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్ 47 పరుగులతో అద్వితీయ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఇలా బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 406 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యంలో నిలిచింది. చెలరేగిన భారత బౌలర్లు.. ఆసీస్ పోరాడినా ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 233 పరుగులు సాధించింది. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా పోరాడింది. అయితే, భారత బౌలర్ల ముందు ఆసీస్ పప్పులు ఉడకలేదు. టాపార్డర్, మిడిలార్డర్ పర్వాలేదనిపించినా.. నాలుగో రోజు ఆటలో లోయర్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. స్నేహ్ రాణా నాలుగు వికెట్లుతో చెలరేగగా.. పూజా ఒకటి, రాజేశ్వరి గైక్వాడ్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రెండేసి వికెట్లు పడగొట్టి ఆసీస్ను కట్టడి చేశారు. దీంతో 261 పరుగులకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆలౌట్ అయింది. మొట్టమొదటి టెస్టు గెలుపు ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలోనే మ్యాచ్ను ముగించేసింది. స్మృతి మంధాన 38, జెమీమా రోడ్రిగ్స్ 12 పరుగులతో ఆఖరి అజేయంగా నిలవగా.. 18.4 ఓవర్లలోనే టార్గెట్ను పూర్తి చేసింది. మంధాన ఫోర్ బాది విజయాన్ని ఖరారు చేయగా.. ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెట్ జట్టుకు ఇదే తొలి విజయం. అంతేకాదు 1984 తర్వాత సొంతగడ్డపై ఆసీస్తో టెస్టు ఆడటం కూడా ఇదే మొదటిసారి అది కూడా వాంఖడేలో!! ఇక గతంలో భారత్- ఆసీస్ మహిళా జట్లు పదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. ఆసీస్ నాలుగుసార్లు గెలిచింది. ఆరుసార్లు మ్యాచ్ డ్రా అయింది. చదవండి: WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై వేటు 𝙃𝙄𝙎𝙏𝙊𝙍𝙔 𝙄𝙉 𝙈𝙐𝙈𝘽𝘼𝙄! 🙌#TeamIndia women register their first win against Australia in Test Cricket 👏👏 Scorecard ▶️ https://t.co/7o69J2XRwi#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/R1GKeuRa69 — BCCI Women (@BCCIWomen) December 24, 2023 -
హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో...
ముంబై: సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు ఆడే రెండు కీలక సిరీస్ల కోసం బీసీసీఐ శుక్రవారం జట్లను ప్రకటించింది. ఈ రెండు టీమ్లకు కూడా హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. ఇంగ్లండ్తో 3 టి20 మ్యాచ్ల సిరీస్లో తలపడే భారత జట్టు ఆ తర్వాత ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలతో ఒక్కో టెస్టు మ్యాచ్ ఆడుతుంది. ఆసీస్తో టి20 సిరీస్కు టీమ్ను తర్వాత ప్రకటిస్తారు. ఈ మ్యాచ్లన్నీ ముంబై వేదికగానే జరుగుతాయి. ఈ నెల 6న భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టి20 జరుగుతుంది. ఇంగ్లండ్తో టి20లకు జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, జెమీమా, షఫాలీ, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, అమన్జోత్, శ్రేయాంక, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్, టిటాస్ సాధు, పూజ వస్త్రకర్, కనిక ఆహుజా, మిన్ను మని. ఇంగ్లండ్, ఆసీస్లతో టెస్టులకు జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, జెమీమా, షఫాలీ, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, స్నేహ్ రాణా, శుభ సతీశ్, హర్లీన్ డియోల్, సైకా ఇషాక్, రేణుకా సింగ్, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, పూజ వస్త్రకర్ -
Asian Games 2023: బోణీలోనే బంగారం
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్ల్లో స్మృతి మంధాన కెప్టెన్గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. టిటాస్ సాధు కట్టడి... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్ పేస్ బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్) 1; అమన్జోత్ కౌర్ (రనౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116. బౌలింగ్: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2. శ్రీలంక ఇన్నింగ్స్: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్ (బి) టిటాస్ సాధు 1; విష్మీ (బి) టిటాస్ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్జోత్ కౌర్ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1. ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... మహిళల క్రికెట్లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్కు షూటింగ్లోనే రెండు కాంస్యాలు, రోయింగ్లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్గా రెండోరోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. -
BCCI: ఏపీ పేసర్ అంజలి శర్వాణి చేజారిన గోల్డెన్ ఛాన్స్.. జట్టులోకి ఆమె
ఆసియా క్రీడలు-2023కు ఆంధ్రప్రదేశ్ పేసర్ అంజలి శర్వాణి దూరమైంది. మోకాలి గాయం కారణంగా ఆమె టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ క్రమంలో ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్బౌలర్ స్థానంలో.. పూజా వస్త్రాకర్ను ప్రధాన జట్టులోకి తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. అంజలి స్థానాన్ని హార్డ్ హిట్టింగ్ ఆల్రౌండర్తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 26 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియాలో ఎంట్రీ ఇచ్చింది. మెరుగైన ఆట తీరు కనబరిచి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ప్రస్తుతం గ్రేడ్-సి(రూ. 10 లక్షల వార్షిక వేతనం)లో ఉన్న అంజలి 19వ ఆసియా క్రీడల్లో ఎంట్రీ ఇవ్వనున్న భారత మహిళా ప్రధాన జట్టుకు ఎంపికైంది. అయితే, దురదృష్టవశాత్తూ గాయం కారణంగా మెగా ఈవెంట్లో పాల్గొనే సువర్ణావకాశం ఆమె చేజారింది. అంజలి శర్వాణి జట్టుకు దూరం కావడంతో స్టాండ్ బై ప్లేయర్గా ఉన్న పూజా వస్త్రాకర్కు ప్రధాన జట్టులో చోటు దక్కింది. కాగా సెప్టెంబరు 23 నుంచి ఆసియా క్రీడలు ఆరంభం కానున్నాయి. చైనాలోని హోంగ్జో ఇందుకు వేదిక. ఆసియా క్రీడలు-2023కి భారత మహిళా క్రికెట్ జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, దేవికా వైద్య, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి, పూజా వస్త్రాకర్. స్టాండ్ బై ప్లేయర్ల జాబితా: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్. -
టైమ్ 100 నవ్య సారథుల జాబితాలో హర్మన్ప్రీత్
న్యూయార్క్: భిన్న రంగాల్లో విశేష కృషిచేస్తూ ప్రపంచ గతిని మార్చే కొత్త తరం సారథుల జాబితా అంటూ ప్రఖ్యాత మ్యాగజైన్ టైమ్ తీసుకొచ్చిన జాబితాలో భారతీయ మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్ స్థానం దక్కించుకున్నారు. 2023 టైమ్ 100 నెక్స్ట్: ది ఎమర్జింగ్ లీడర్స్ షేపింగ్ ది వరల్డ్ పేరిట 100 పేర్లతో ఈ జాబితాను సిద్ధంచేశారు. ‘ఆటలో పోటీతత్వం, రగిలిపోయే క్రీడాసక్తితో హర్మన్ప్రీత్.. మహిళా క్రికెట్ను ప్రపంచంలో విలువైన క్రీడా ఆస్తిగా మలిచారు’ అని టైమ్ పొగిడింది. క్షయ వ్యాధి సోకడంతో అతిగా ఔషధాలు వాడి, వాటి దుష్ప్రభావంతో వినికిడి శక్తిని కోల్పోయినా మెరుగైన డ్రగ్ కోసం పోరాడి విజయం సాధించిన నందితా వెంకటేశన్ పేరూ ఈ జాబితాలో ఉంది. ఈమె కృషి ఫలితంగానే భారత్లో క్షయ చికిత్సకు మరింత మెరుగైన జనరిక్ మందులు అందుబాటులోకి వచ్చాయి. పర్యావరణహిత నిర్మాణాలతో మంచి పేరు తెచ్చుకున్న వినూ డేనియల్ పేరూ ఈ జాబితాలో ఉంది. -
భారత్ నుంచి హర్మన్ప్రీత్ మాత్రమే...
ఆ్రస్టేలియాలో జరిగే మహిళల బిగ్బాష్ లీగ్ టి20 టోర్నీకి సంబంధించి ఆదివారం విదేశీ క్రికెటర్ల డ్రాఫ్ట్ కార్యక్రమం జరిగింది. ఇందులో మొత్తం 116 మంది విదేశీ క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా... ఎనిమిది ఫ్రాంచైజీలు 17 మందిని ఎంపిక చేసుకున్నాయి. భారత్ నుంచి 18 మంది క్రికెటర్లు తుది జాబితాలో ఉండగా... కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు మాత్రమే అవకాశం దక్కింది. మెల్బోర్న్ రెనెగెడ్స్ జట్టు హర్మన్ప్రీత్ను ఎంపిక చేసుకుంది. 2021–2022 సీజన్లో హర్మన్ప్రీత్ మెల్బోర్న్ తరఫున ఆడి 406 పరుగులు చేయడంతోపాటు 15 వికెట్లు కూడా తీసింది. -
చైనాకు భారత్ నుంచి భారీ బృందం.. 634 మంది! క్రికెట్ జట్లు ఇవే!
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023 నేపథ్యంలో భారత్ 634 అథ్లెట్లతో భారీ బృందాన్ని పంపించనుంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 38 క్రీడాంశాల్లో ఈ బృందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. చైనాలో హాంగ్జూలో సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. కాగా.. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 572 మంది పాల్గొన్న విషయం విదితమే. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్కు 34 మంది పురుషులు, 31 మంది మహిళలు మొత్తంగా 65 మంది అథ్లెట్లు.. పురుష, మహిళా జట్లకు సంబంధించి 44 మంది ఫుట్బాలర్లు.. హాకీ జట్టు నుంచి మొత్తంగా 36 మంది, క్రికెట్ జట్ల నుంచి 30 మంది ఆసియా క్రీడల్లో భాగం కానున్నారు. స్టార్లంతా ఇక షూటింగ్ విభాగంలో భారత్ నుంచి 30 మంది, సెయిలింగ్ కోసం 33 మంది చైనాకు వెళ్లనున్నారు. అయితే, వెయిట్లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, రగ్బీ తదితర విభాగాలకు సంబంధించి లిస్ట్ వెల్లడి కావాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో స్టార్లు నీరజ్ చోప్రా, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, పీవీ సింధు, మీరాబాయి చాను, సునీల్ ఛెత్రి, హర్మన్ప్రీత్ సింగ్, బజరంగ్ పూనియా తదితరులు భాగం కానున్నారు. క్రికెట్ జట్లు ఇవే! ఈసారి భారత్ నుంచి మహిళా, పురుష క్రికెట్ జట్లు కూడా ఆసియా క్రీడల్లో పాల్గొనుండటం విశేషం. చైనాకు క్రికెటర్లను పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వుమెన్ టీమ్లోని ప్రధాన క్రికెటర్లంతా ఈ మెగా టోర్నీలో భాగం కానుంగా.. మెన్స్ నుంచి ద్వితీయ శ్రేణి జట్టును హాంగ్జూకు పంపనున్నారు. అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టుకు ముంబై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. టీ20 స్టార్లు తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్ తదితరులతో కూడిన ఈ జట్టు ఆసియా బరిలో దిగనుంది. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. మహిళా క్రికెట్ జట్టు హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి స్టాండ్బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ -
హర్మన్ ఆడేది... ఫైనల్ చేరితేనే!
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగాలంటే టీమిండియా ఫైనల్ చేరాలి. ఎందుకంటే చైనా ఆతిథ్యమిచ్చే ఈ ఈవెంట్లో భారత్కు నేరుగా క్వార్టర్ ఫైనల్ ఎంట్రీ లభించింది. కెప్టెన్ హర్మన్పై రెండు మ్యాచ్ల నిషేధం ఉన్న నేపథ్యంలో క్వార్టర్స్, సెమీఫైనల్ గెలిచి భారత్ తుదిపోరుకు అర్హత సాధిస్తే తప్ప ఆమె ఆసియా క్రీడల ఆట ఉండదు. చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఇందులో మహిళల క్రికెట్ ఈవెంట్లో 14 జట్లు, పురుషుల ఈవెంట్లో 18 జట్లు బరిలోకి దిగుతాయి. అయితే ఈ రెండు విభాగాల్లోనూ భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లకు నేరుగా క్వార్టర్స్ ఫైనల్స్ ఎంట్రీ లభించింది. -
చిక్కుల్లో టీమిండియా కెప్టెన్! అప్పీలుకు వెళ్లేది లేదన్న బీసీసీఐ..
ICC- Harmanpreet Kaur- BCCI: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్గా వరుస విజయాలు అందుకున్న హర్మన్ప్రీత్కౌర్ బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ సందర్భంగా అపఖ్యాతి మూటగట్టుకుంది. బంగ్లాతో ఆఖరి మ్యాచ్లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ పెవిలియన్కు చేరే క్రమంలో బ్యాట్తో వికెట్లను కొట్టింది. అంతేకాదు.. సిరీస్ 1-1తో సమానమైన నేపథ్యంలో ట్రోఫీ పంచుకునేటపుడు కూడా కాస్త దురుసుగా ప్రవర్తించింది. బంగ్లాదేశ్ కెప్టెన్ దగ్గరికి రాగానే.. ఈ మ్యాచ్ టై అవడానికి అంపైర్లు కూడా కారణం.. వాళ్లను కూడా పిలువు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించింది. హర్మన్ నుంచి ఊహించని కామెంట్ల నేపథ్యంలో ఆమె తమ జట్టును తీసుకుని డ్రెసింగ్రూంకి వెళ్లిపోయింది. ఈ వరుస సంఘటనల నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం హర్మన్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఐసీసీ సైతం ఆమెపై కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంటూ.. రెండు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధించింది. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలా స్పందిస్తున్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వీవీఎస్ లక్ష్మణ్ అనుచిత ప్రవర్తన గురించి హర్మన్తో మాట్లాడతారు. మేమైతే ఆమె సస్పెన్షన్ గురించి ఐసీసీని సవాలు చేయబోము. ఇప్పటికే ఆ సమయం కూడా మించిపోయింది’’ అని జై షా పేర్కొన్నాడు. కాగా హర్మన్ ప్రవర్తన ఆమె పట్ల గౌరవాన్ని తగ్గించిందనే కామెంట్లు వినిపిస్తుండగా.. అభిమానులు మాత్రం ఇంతకంటే ఓవరాక్షన్ చేసిన వాళ్లు మాత్రం మీకు కనబడరా అంటూ అండగా నిలుస్తున్నారు. కాగా ఐసీసీ నిషేధం నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్ ఆసియా క్రీడలు-2023లో రెండు మ్యాచ్లకు దూరం కానుంది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం! టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
'హర్మన్ప్రీత్ ప్రవర్తన మరీ ఓవర్గా అనిపించింది'
టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై విమర్శల వేడి తగ్గడం లేదు. బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో అంపైర్పై దురుసు ప్రవర్తనతో ఐసీసీ ఆగ్రహానికి గురైన హర్మన్ రెండు మ్యాచ్ల నిషేధం ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఆసియా గేమ్స్లో తొలి రెండు మ్యాచ్లకు హర్మన్ స్థానంలో స్మృతి మంధాన జట్టను నడిపించే అవకాశముంది. కాగా హర్మన్ తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ విషయంలో హర్మన్ చేసింది ఓవర్గా అనిపించిందని.. అంత వైల్డ్గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. "భారత్ విషయంలోనే కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. అయితే వుమెన్స్ క్రికెట్ లో ఇలాంటివి అరుదుగా చూస్తుంటాం. ఇది చాలా ఎక్కువగా అనిపించింది. ఐసీసీ నిర్వహించిన ఒక టోర్నమెంట్లో ఈ సంఘటన జరిగింది. కాగా హర్మన్కు విధించిన శిక్షతో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఓ హెచ్చరిక పంపినట్లు అయింది. క్రికెట్లో దూకుడు సహజమే. అయితే నియంత్రిత దూకుడు మంచిది. హర్మన్ప్రీత్ విషయంలో ఓవర్ అనిపించింది. ఔట్ విషయంలో అంత వైల్డ్గా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు." అని అఫ్రిది స్పష్టం చేశాడు. కాగా హర్మన్ తీరుపై భారత మాజీలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మదన్ లాల్ లాంటి మాజీ క్రికెటర్ స్పందిస్తూ.. బీసీసీఐ కూడా హర్మన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. గత శనివారం మిర్పూర్లో భారత్, బంగ్లాదేశ్ మహిళల మధ్య మూడో వన్డే జరిగింది. ‘టై’గా ముగిసిన ఈ మ్యాచ్లో వేర్వేరు సందర్భాల్లో హర్మన్ దురుసుగా వ్యవహరించింది. ముందుగా తనను అంపైర్ అవుట్గా ప్రకటించడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన బ్యాట్తో స్టంప్స్ను బలంగా కొట్టి పడేయడంతో పాటు వెళుతూ వెళుతూ అంపైర్ను చూస్తూ ఏవో వ్యాఖ్యలు చేసింది. దీనిపై మూడు డీమెరిట్ పాయింట్లు శిక్షగా విధించగా, మ్యాచ్ ముగిసిన తర్వాతా అంపైరింగ్ ప్రమాణాలు బాగా లేవంటూ విమర్శించింది. దీనిపై ఒక డీమెరిట్ పాయింట్ శిక్ష పడింది. అనంతరం వేదికపై బంగ్లాదేశ్ కెప్టెన్ నిగార్ సుల్తానాతో కలిసి ట్రోఫీ అందుకునే సమయంలో ‘మ్యాచ్ టై చేసింది అంపైర్లే తప్ప మీరు కాదు. ఫొటో దిగేందుకు వాళ్లనూ రమ్మనండి’ అంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పింది. దీనిపై సుల్తానా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాస్త మర్యాద నేర్చుకోమంటూ సహచరులతో కలిసి వేదిక నుంచి దిగేసింది. 4 డీమెరిట్ పాయింట్లు అంటే 2 సస్పెన్షన్ పాయింట్లతో సమానం. దాంతో రెండు మ్యాచ్ల నిషేధం పడింది. దీంతోపాటు ఆమె మ్యాచ్ ఫీజులో కూడా 75 శాతం కోత పడింది. ఐసీసీ లెవల్–2 నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్ హర్మన్ కావడం గమనార్హం. Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 Indian Captain Harmanpreet Kaur blasts Bangladesh Cricket board, calls the umpiring and management pathetic. She also exposed the board for insulting the members of the Indian high commission by not inviting them on the stage. Sherni standing up for 🇮🇳 without any fear. pic.twitter.com/HNHXB3TvdW — Roshan Rai (@RoshanKrRaii) July 22, 2023 చదవండి: టీమిండియా కెప్టెన్ దురుసు ప్రవర్తన.. ఐసీసీ చర్యలు Asian Games 2023: హర్మన్పై వేటు.. ఆసియా గేమ్స్లో జట్టును నడిపించేది ఎవరు? #HarmanpreetKaur: 'డేర్ అండ్ డాషింగ్' హర్మన్ప్రీత్.. కుండ బద్దలయ్యేలా! -
హర్మన్పై వేటు.. ఆసియా గేమ్స్లో జట్టును నడిపించేది ఎవరు?
భారత మహిళల జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై ఐసీసీ రెండు మ్యాచ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హర్మన్ సహనం కోల్పోయి బ్యాట్తో వికెట్లను విరగొట్టడం.. అంపైర్తో అనుచితంగా ప్రవర్తించడం ఐసీసీ తప్పుబట్టింది. అనుచిత ప్రవర్తనకు గానూ హర్మన్ ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్లు అంటే 2 సస్పెన్షన్ పాయింట్లతో సమానం. దాంతో రెండు మ్యాచ్ల నిషేధం పడింది. దీంతోపాటు ఆమె మ్యాచ్ ఫీజులో కూడా 75 శాతం కోత పడింది. ఐసీసీ లెవల్–2 నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్ హర్మన్ కావడం గమనార్హం. దీని ప్రకారం ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్లకు హర్మన్ దూరం కానుంది. ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్లో టీమిండియా ఆడబోయే తొలి రెండు మ్యాచ్లకు వైస్కెప్టెన్ అయిన స్మృతి మంధాన జట్టును నడిపించనుంది. కాగా ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూ పట్టణంలో జరగనున్నాయి. ఇక ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా మహిళల జట్టు నేరుగా ఆసియా గేమ్స్కు క్వాలిఫై అయింది. సెప్టెంబర్ 24న భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా హర్మన్ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ.. అనుచిత ప్రవర్తనకు గానూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్లు శిక్షగా విధించగా, మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైరింగ్ ప్రమాణాలు బాగా లేవంటూ విమర్శించింది. దీనిపై ఒక డీమెరిట్ పాయింట్ శిక్ష పడింది. అనంతరం వేదికపై బంగ్లాదేశ్ కెపె్టన్ నిగార్ సుల్తానాతో కలిసి ట్రోఫీ అందుకునే సమయంలో ‘మ్యాచ్ టై చేసింది అంపైర్లే తప్ప మీరు కాదు. ఫొటో దిగేందుకు వాళ్లనూ రమ్మనండి’ అంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పింది. చదవండి: FIFA World Cup: ప్రపంచకప్లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా.. వరల్డ్ కప్లో భారత్-పాక్ మ్యాచ్ రీ షెడ్యూల్.. భద్రతా కారణాల దృష్ట్యా..! -
టీమిండియా కెప్టెన్పై రెండు మ్యాచ్ల నిషేధం: ఐసీసీ ప్రకటన.. ఆమె ఏం తప్పు చేసిందని?
India women's team skipper Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై రెండు మ్యాచ్ల నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం వెల్లడించింది. అందుకే ఈ చర్యలు ఐసీసీ వుమెన్స్ చాంపియన్షిప్ సిరీస్లో భాగంగా ఢాకాలో శనివారం బంగ్లాదేశ్తో మూడో మ్యాచ్ సందర్భంగా హర్మన్ వ్యవహరించిన తీరుపై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. హర్మన్... తాను అవుటైన తర్వాత వికెట్లను బ్యాట్తో కొట్టినందుకు గానూ ఇప్పటికే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు.. డిసిప్లినరి రికార్డులో 3 డిమెరిట్ పాయింట్లు ఇచ్చినట్లు పేర్కొంది. రెండు మ్యాచ్లు ఆడకుండా అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఐసీసీ నియమావళిలోని 2.8 నిబంధనను అతిక్రమించిందన్న ఐసీసీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బహిరంగంగా అంపైర్ను విమర్శించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమె మ్యాచ్ ఫీజులో మరో 25 శాతం కోత(డిమెరిట్ పాయింట్ కూడా) విధించినట్లు వెల్లడించింది. కాగా ఐసీసీ.. హర్మన్పై రెండు అంతర్జాతీయ మ్యాచ్లు నిషేధం విధించిన నేపథ్యంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఆమె ఒక టెస్టు మ్యాచ్ లేదంటే.. రెండు వన్డేలు లేదా రెండు టీ20లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. తప్పుడు నిర్ణయమని అంపైర్పై కోపంతో అలా.. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో భాగంగా ఆఖరి మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. బంగ్లా బౌలర్ నహిదా అక్తర్ బౌలింగ్లో భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్లో నాలుగో బంతికి హర్మన్ స్వీప్ షాట్ ఆడింది. బంతి బ్యాట్కు తగలకుండా.. ప్యాడ్కు తాకింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. ఎల్బీడబ్ల్యూ అయినట్లు పేర్కొన్నాడు. అయితే, బంతి లెగ్స్టంప్నకు ఆవల పిచ్ అయిందనుకున్న హర్మన్ తను అవుట్ కాకపోయినా తప్పుడు నిర్ణయంతో బలిచేశారని ఆగ్రహించింది. ఆ కోపంలోనే బ్యాట్తో వికెట్లను కొట్టింది. అండగా నిలుస్తున్న అభిమానులు అంతేకాదు మ్యాచ్ తర్వాత అంపైరింగ్ ప్రమాణాలను తప్పుబట్టిన ఆమె.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమీషన్కు కనీస మర్యాద చేయలేదంటూ బంగ్లాదేశ్ బోర్డు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దీంతో టీమిండియా అభిమానులు.. ‘‘సూపర్ హర్మన్.. ఆటలో మనకు అన్యాయం జరిగిందని భావించినపుడు కోపం రావడం సహజం. అది మానవ నైజం. ఇక మన హైకమీషన్ పట్ల వాళ్లు వ్యవహరించిన తీరుకు నువ్విచ్చిన కౌంటర్ అదుర్స్. మన పురుష క్రికెటర్లు కూడా ఇంత డేరింగ్గా మాట్లాడేవాళ్లు కాదేమో! నీపై ఐసీసీ చర్యలు తీసుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. చదవండి: రెండు టెస్టుల్లో కలిపి 11 పరుగులు! ఇలా అయితే: డీకే Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
టీమిండియాకు బిగ్ షాక్.. తొలి రెండు మ్యాచ్లకు కెప్టెన్ దూరం
భారత మహిళల క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగలనుంది. చైనాలోని హాంగ్ఝౌ వేదికగా జరుగనున్న ఏసియన్ గేమ్స్లో తొలి రెండు మ్యాచ్లకు (టీ20లు) టీమిండియా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ లేకుండానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇటీవల బంగ్లాదేశ్తో ముగిసిన మూడో వన్డేలో దురుసు ప్రవర్తన కారణంగా ఐసీసీ హర్మన్కు 4 డీ మెరిట్ పాయింట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ క్రికెటర్ 2 డీ మెరిట్ పాయింట్లకు ఓ టీ20 మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన 4 డీ మెరిట్ పాయింట్లు మూటగట్టుకున్న హార్మన్.. టీమిండియా తదుపరి ఆడే ఆసియా క్రీడల్లో తొలి రెండు టీ20లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో ఆసియాలో టాప్ జట్టుగా ఉన్న భారత్ ఏసియన్ గేమ్స్లో నేరుగా క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. ఐసీసీ నిబంధనలు అమలైతే.. ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు హర్మన్ లేకుండా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ ఫైనల్కు చేరుకుంటే హర్మన్ ఆ మ్యాచ్ ఆడేందుకు అర్హత కలిగి ఉంటుంది. హర్మన్ గైర్హాజరీలో స్మృతి మంధన టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో గోల్డ్ మెడల్పై కన్నేసిన భారత్కు కెప్టెన్ హర్మన్ లేకపోవడం పెద్ద లోటుగా పరిగణించాలి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ మహిళల విభాగంతో పాటు పురుషుల విభాగంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఏసియన్ గేమ్స్-2023లో భారత్ పురుషుల క్రికెట్ జట్టు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. -
Harmanpreet Kaur Fined: హర్మాన్ ప్రవర్తనపై ఐసీసీ ఆగ్రహం...నిషేధం తప్పదా ?
-
టీమిండియా కెప్టెన్ దురుసు ప్రవర్తన.. ఐసీసీ చర్యలు
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. బంగ్లాదేశ్తో నిన్న (జులై 22) జరిగిన మూడో వన్డేలో అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ.. బ్యాట్తో వికెట్లను కొట్టనందుకు గాను, అలాగే ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా అంపైర్లపై తీవ్రస్థాయి ఆరోపణలు చేసినందుకు గాను హార్మన్కు ఐసీసీ జరిమనా విధించింది . Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 హర్మన్ వ్యవహరించిన తీరును దురుసు ప్రవర్తనగా పేర్కొన్న ఐసీసీ.. ఆమె మ్యాచ్ ఫీజ్లో 75 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. హర్మన్ ప్రవర్తనను లెవెల్ 2 అఫెన్స్ కింద పరిగణించిన ఐసీసీ.. ఆమెకు 4 డీ మెరిట్ పాయింట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. Indian Captain Harmanpreet Kaur blasts Bangladesh Cricket board, calls the umpiring and management pathetic. She also exposed the board for insulting the members of the Indian high commission by not inviting them on the stage. Sherni standing up for 🇮🇳 without any fear. pic.twitter.com/HNHXB3TvdW — Roshan Rai (@RoshanKrRaii) July 22, 2023 జరిమానాలో 50 శాతం ఆన్ ఫీల్డ్ దురుసు ప్రవర్తనకు, 25 శాతం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుకు కేటాయించినట్లు ఐసీసీ తెలిపింది. అలాగే 3 డీమెరిట్ పాయింట్లు ఆన్ ఫీల్డ్ దురుసు ప్రవర్తనకు, ఓ డీమెరిట్ పాయింట్ ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుకు కేటాయించినట్లు వివరించింది. The controversial dismissal of Harmanpreet Kaur #CricketTwitter #BANvIND pic.twitter.com/XEGdTMgRJd — Female Cricket (@imfemalecricket) July 22, 2023 కాగా, బంగ్లా బౌలర్ నహిదా అక్తర్ వేసిన 34 ఓవర్లో నాలుగో బంతికి హర్మన్ స్వీప్ షాట్ ఆడింది. అయితే, బంతి బ్యాట్కు తగలకుండా.. ప్యాడ్కు తగిలింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చాడు. బంతికి లెంగ్ స్టంప్ అవతల పిచ్ అయిందని భావించిన హర్మన్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయింది. బ్యాట్తో వికెట్లను కొట్టడమే కాకుండా.. కనీస ధర్మాన్ని పాటించడం లేదంటూ అంపైర్ను తిట్టుకుంటూ పెవిలియన్ వైపు వెళ్లింది. ఇంతటితో ఆగని హర్మన్.. మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా బంగ్లాదేశ్ అంపైరింగ్ ప్రమాణాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమీషన్కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు కనీసం స్వాగతం కూడా పలకలేదని అసహనం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ క్రికెట్లో అంపైరింగ్ లోపాలే అనుకున్నాం.. వారికి కనీస మర్యాదలు కూడా తెలియవని తీవ్రస్థాయి పదజాలాన్ని వాడింది. అలాగే ప్రజెంటేషన్ సెర్మనీ మొత్తం పూర్తయ్యాక బంగ్లా ఆటగాళ్లతో ఫోటోలు దిగేందుకు కూడా నిరాకరించింది. -
కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి.. అది మంచి పద్దతి కాదు! హర్మన్పై సీరియస్
బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో దురుసగా ప్రవర్తించిన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. అంపైర్ ఔట్ ఇచ్చాడానే కోపంతో వికెట్లను తన బ్యాట్తో కొట్టి హర్మన్ పెవిలియన్కు వెళ్లింది. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాకుండా మ్యాచ్ అనంతరం కూడా అంపైర్లపై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేసింది. "ఈ మ్యాచ్తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో" అంటూ హర్మన్ పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఐసీసీ కూడా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెపై చర్యలకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సిద్దమైనట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా.. చివరి వన్డేలో హర్మన్ప్రీత్ వ్యవహిరించిన తీరును బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా తప్పుబట్టింది. కాగా ఈఎస్పీఈన్ రిపోర్టు ప్రకారం.. బంగ్లాదేశ్తో పోస్ట్ సిరీస్ ఫోటోలు దిగడానికి కూడా హర్మన్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఈఎస్పీఈన్తో సుల్తానా మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్లో ఏమి జరిగిందో మనందరికి తెలుసు. అది తన వ్యక్తిగత సమస్య. కానీ సహచర (బంగ్లాదేశ్) ఆటగాళ్లతో కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి. కనీసం జాయింట్ ఫోటోగ్రాఫ్ దిగేందుకు కూడా ఆమె నిరాకరించింది. అది మంచి పద్దతి కాదు. నేను కూడా నా జట్టు ఆటగాళ్లను తీసుకుని ఫోటో సెక్షన్ నుంచి వెళ్లిపోయాను. క్రికెట్ అనేది గౌరవం క్రమశిక్షణతో కూడిన ఆట. ఈ మ్యాచ్లో ఉన్న వారు చాలా అనుభవజ్ఞులైన అంపైర్లు. చాలా అంతర్జాతీయ మ్యాచ్ల్లో అంపైర్లుగా పనిచేశారు. మనకు నచ్చినా, నచ్చకపోయినా వారు తీసుకున్న నిర్ణయాలు అంతిమంగా పరిగణించబడతాయి" అని వాఖ్యనించింది. చదవండి: IND vs WI: వారెవ్వా రహానే.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో! వీడియో వైరల్ Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
'డేర్ అండ్ డాషింగ్' హర్మన్ప్రీత్.. కుండ బద్దలయ్యేలా!
టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఎంత డేర్ అండ్ డాషింగ్గా ఉంటుందో మరోసారి చూపించింది. తాను చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా మొహంమీద చెప్పడం ఆమె నైజం. ఇదే ఆమెను అందరిలో స్పెషల్గా నిలిపింది. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన చివరి వన్డేలో అంపైరింగ్ ప్రమాణాలపై అసహనం వ్యక్తం చేసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ట్రోఫీ అందుకోవడానికి ముందు మాట్లాడుతూ.. ''ఈ మ్యాచ్తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో. ఇక మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమీషన్కు కనీసం స్వాగతం పలకలేదు. బంగ్లాదేశ్ క్రికెట్లో అంపైరింగే అనుకున్నాం.. కనీస మర్యాదలకు కూడా చోటు లేదు. మీరు మ్యాచ్కు వచ్చినందుకు మా ఇండియన్ టీమ్ తరపున హైకమీషన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.'' అంటూ పేర్కొంది. Indian Captain Harmanpreet Kaur blasts Bangladesh Cricket board, calls the umpiring and management pathetic. She also exposed the board for insulting the members of the Indian high commission by not inviting them on the stage. Sherni standing up for 🇮🇳 without any fear. pic.twitter.com/HNHXB3TvdW — Roshan Rai (@RoshanKrRaii) July 22, 2023 హర్మన్ప్రీత్ చేసిన వ్యాఖ్యలు టీమిండియా అభిమానులను ఆకట్టుకున్నాయి. ''బహుశా పురుషుల క్రికెట్లో కూడా ఇంత ధైర్యంగా మాట్లాడే సాహసం ఎవరు చేయలేదనుకుంటా. కానీ హర్మన్ప్రీత్ అలా కాదు.. తాను ఏం చెప్పాలనుకుందో అది స్పష్టంగా, ముక్కుసూటిగా చెబుతుంది.. అందుకే ఆమెంటే మాకు గౌరవం'' అంటూ కామెంట్ చేశారు. తప్పుడు నిర్ణయం.. అంపైర్పై కోపంతో బంగ్లాదేశ్ బౌలర్ నహిదా అక్తర్ వేసిన 34 ఓవర్లో నాలుగో బంతికి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ స్వీప్ షాట్ ఆడింది. అయితే, బంతి బ్యాట్కు తగలకుండా.. ప్యాడ్కు తగిలింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చాడు. బంతికి లెంగ్ స్టంప్ అవతల పిచ్ అయిందని, నాటౌట్ అని హర్మన్ భావించింది. దీంతో అంపైర్ నిర్ణయంపై ఆగ్రహించిన హర్మన్.. బ్యాట్తో వికెట్లను కొట్టింది. కనీస ధర్మాన్ని పాటించడం లేదంటూ అంపైర్ను తిట్టుకుంటూ పెవిలియన్ వైపు వెళ్లింది. ఈ సమయంలో బంగ్లా అభిమానుల్లో కొంతమంది ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. హర్మన్ప్రీత్ వ్యంగ్యంగా వారికి బొటనవేలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The controversial dismissal of Harmanpreet Kaur #CricketTwitter #BANvIND pic.twitter.com/XEGdTMgRJd — Female Cricket (@imfemalecricket) July 22, 2023 చదవండి: IND vs BAN: కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్.. బ్యాట్తో వికెట్లను కొట్టి! వీడియో వైరల్ -
కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్.. బ్యాట్తో వికెట్లను కొట్టి! వీడియో వైరల్
ఢాకా వేదికగా భారత మహిళల జట్టు, బంగ్లాదేశ్ మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో ట్రోఫీని భారత్-బంగ్లాదేశ్ జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సరిగ్గా 225 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖరి ఓవర్లో భారత విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని మేఘనా సింగిల్ తీసి రోడ్రిగ్స్కు స్ట్రైక్ ఇచ్చింది. ఆ తర్వాత రోడ్రిగ్స్ మరో పరుగు తీసి స్కోర్లను సమం చేసింది. ఈ సమయంలో స్ట్రైక్లోకి వెళ్లిన మేఘనా సింగ్ వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో మ్యాచ్ టై అయింది. అంతకుముందు ఫర్జానా హాక్ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో సాధించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కోపంతో ఊగిపోయిన హర్మన్ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తన సహనాన్ని కోల్పోయింది. అంపైర్ ఔట్ ఇచ్చాడనే కోపంతో వికెట్లను బ్యాట్తో కొట్టింది. భారత ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నహిదా అక్తర్ బౌలింగ్లో మూడో బంతిని హర్మన్ప్రీత్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది. అయితే బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి ప్యాడ్కు తాకింది. ఈ క్రమంలో బంగ్లా క్రికెటర్లు ఎల్బీకి అప్పీలు చేశారు. అంపైర్ వెంటనే ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. దీంతో అంపైర్ నిర్ణయంపై ఆసంతృప్తి వ్యక్తం చేసిన హార్మన్ ప్రీత్.. తన బ్యాట్తో సంప్ట్ప్ను పడగొట్టి పెవిలియన్కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: Fargana Hoque: బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదు Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: సెన్స్క్స్ డౌట్!
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement