టీమిండియా కెప్టెన్‌కు విశ్రాంతి.. కారణం? | Asia Cup 2024 Ind vs Nep: India Opt To Bat Captain Harmanpreet Kaur Rested Why | Sakshi
Sakshi News home page

Ind vs Nep: టీమిండియా కెప్టెన్‌కు విశ్రాంతి

Published Tue, Jul 23 2024 7:35 PM | Last Updated on Tue, Jul 23 2024 8:21 PM

Asia Cup 2024 Ind vs Nep: India Opt To Bat Captain Harmanpreet Kaur Rested Why

వుమెన్స్‌ ఆసియా టీ20 కప్‌-2024లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించి సెమీస్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో నేపాల్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మేనేజ్‌మెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో పాటు ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌కు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టింది. హర్మన్‌, పూజా స్థానాల్లో బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ ఎస్‌.సజన, ఫాస్ట్‌ బౌలర్‌ అరుంధతిరెడ్డి తుదిజట్టులో స్థానం దక్కించుకున్నట్లు తెలిపింది.

డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత మహిళా క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ షెఫాలీ వర్మ పరుగుల ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. పవర్‌ ప్లే ముగిసే సరికి 19 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది.

మరో ఓపెనర్‌ దయాలన్‌ హేమలత 17 బంతుల్లో 15 రన్స్‌ చేసింది. ఈ క్రమంలో ఆరు ఓవర్లు(పవర్‌ ప్లే) పూర్తయ్యేసరికి టీమిండియా హాఫ్‌ సెంచరీ మార్కు అందుకుంది. యాభై పరుగులు పూర్తి చేసుకుంది.

ఇండియా వుమెన్‌ వర్సెస్‌ నేపాల్‌ వుమెన్‌ తుదిజట్లు
భారత్‌
షెఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ఎస్ సజానా, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతి రెడ్డి.

నేపాల్‌
సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా (కెప్టెన్), డాలీ భట్టా, రుబీనా ఛెత్రి, పూజా మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ (వికెట్ కీపర్), సబ్నమ్ రాయ్, బిందు రావల్.

గ్రూప్‌-ఏ పాయింట్ల పట్టిక ఇలా
ఆసియా కప్‌-2024లో  గ్రూప్‌-ఏలో ఇండియా, పాకిస్తాన్‌, నేపాల్‌, యూఏఈ జట్లు ఉన్నాయి. భారత్‌ ఇప్పటి వరకు పాకిస్తాన్‌, యూఏఈలపై గెలిచి టాపర్‌(నెట్‌ రన్‌రేటు +3.298)గా ఉంది.

ఇక తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్‌.. తర్వాత నేపాల్‌, యూఏఈలపై విజయం సాధించింది. తద్వారా మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్‌ రన్‌రేటు + 1.158)లో కొనసాగుతోంది.

ఇక శ్రీలంక, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌, మలేషియా గ్రూప్‌-బిలో ఉన్నాయి. శ్రీలంక, థాయ్‌లాండ్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.నేపాల్‌తో భారత్‌ మ్యాచ్‌ ఫలితం తర్వాత సెమీస్‌ బెర్తులు అధికారికంగా ఖరారుకానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement