పీసీబీ అధ్యక్ష పదవి రేసులో రమీజ్‌ రజా!  | Ramiz Raja May Replace Ehsan Mani Next Chairman Of Pakistan Cricket Board | Sakshi
Sakshi News home page

పీసీబీ అధ్యక్ష పదవి రేసులో రమీజ్‌ రజా! 

Aug 22 2021 7:46 AM | Updated on Aug 22 2021 7:47 AM

Ramiz Raja May Replace Ehsan Mani Next Chairman Of Pakistan Cricket Board - Sakshi

కరాచీ: మాజీ క్రికెటర్, కామెంటేటర్‌ రమీజ్‌ రజా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఎహ్‌సాన్‌ మనిని కొనసాగించరాదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఆ స్థానంలో తన మాజీ సహచరుడు ఉండాలని ఇమ్రాన్‌  కోరుకుంటుండటంతో రమీజ్‌ అవకాశాలు మెరుగయ్యాడు.

ఈ ఓపెనర్‌ పాక్‌ జట్టు తరఫున 1984 నుంచి 1997 మధ్య కాలంలో 57 టెస్టుల్లో 2833 పరుగులు.. 198 వన్డేల్లో 5851 పరుగులు చేశాడు. 1992 ప్రపంచకప్‌ గెలిచిన పాక్‌ జట్టులో రమీజ్‌ సభ్యుడిగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement