
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మిక డబుల్స్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇండోర్లో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) జోడీ 6–2, 6–1తో మూడో సీడ్ కరోల్ మొనెట్ (ఫ్రాన్స్) –యషీనా (రష్యా) జంటపై నెగ్గింది. 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రష్మిక ద్వయం ప్రత్యర్థి సర్విస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment