అక్రమంగా మట్టి తరలిస్తుండగా..
● రెండు ట్రాక్టర్ల స్వాధీనం
విడవలూరు: అనుమతి లేకుండా మండలంలోని ముదివర్తి గ్రామం నుంచి మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల కథనం మేరకు.. కొంతకాలంగా పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని చుట్టుపక్కల గ్రామాలతోపాటు, ఇటుకబట్టీలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని రెండు ట్రాక్టర్లను పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment