
ట్రాక్టర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● ఇద్దరికి గాయాలు
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పెట్రోల్ బంకు సమీపంలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను ఢీకొన్న ఘటన మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి ఏఎస్పేటకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీసీపల్లి పెట్రోల్ బంకు సమీపంలో ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లోని ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం దెబ్బతింది. క్షతగాత్రులను ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment