
టీడీపీ నేతలు వేధిస్తున్నారు
● సజ్జలకు వివరించిన రవీంద్రారెడ్డి
సోమశిల: టీడీపీ నేతలు అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని అనంతసాగరం మండల పరిధిలోని రేవూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త బోయిళ్ల రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని రవీంద్రారెడ్డి బుధవారం కలిశారు. ఏదో ఒక కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారని, బెదిరింపులకు గురి చేస్తున్నారని రవీంద్రారెడ్డి చెప్పారు. ఈ విషయాలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని సజ్జల భరోసా ఇచ్చారు.