పేలిన వ్యాన్‌ టైర్‌ | - | Sakshi
Sakshi News home page

పేలిన వ్యాన్‌ టైర్‌

Published Mon, Aug 26 2024 12:12 PM | Last Updated on Mon, Aug 26 2024 12:12 PM

-

–14 మందికి తీవ్రగాయాలు

తిరుత్తణి: వ్యాన్‌ టైర్‌ పేలిన ఘటనలో చేపల వ్యాపారులు 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తిరుత్తణి పరిసర ప్రాంతాలకు చెందిన చేపల వ్యాపారులు చేపలు కొనుగోలు కోసం చైన్నెలోని కాశిమేడు చేపల మార్కెట్‌కు వెళ్లారు. ఆదివారం ఉదయం తిరుత్తణి తిరుగు పయనమయ్యారు. చైన్నె తిరుపతి జాతీయ రహదారిలోని రామంజేరి వద్ద వెళుతుండగా అకస్మాత్తుగా టైర్‌ పేలడంతో వ్యాన్‌ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ముత్తురామన్‌, కుప్పమ్మ, వళ్లియమ్మాళ్‌, సుగుణ, ఎల్లమ్మ, మునియమ్మ, కృష్ణవేణి, సరస్వతి, లలిత, శరత్‌కుమార్‌, ధనలక్ష్మి, రాజలక్ష్మి సహా 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కనకమ్మసత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement