పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకులు మృతి | 5 Telangana Youth Died In Pune Accident | Sakshi

పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకులు మృతి

Published Tue, Jul 2 2024 9:41 PM | Last Updated on Tue, Jul 2 2024 9:47 PM

5 Telangana Youth Died In Pune Accident

సాక్షి,సంగారెడ్డిజిల్లా: మహారాష్ట్రలోని పుణె నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు. 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు యువకులు అజ్మీర్‌ దర్గా సందర్శన కోసం వెళ్లారు. దర్గా సందర్శించుకుని తిరిగి వస్తుండగా పుణె శివారులోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, ఖురేషి, రఫిక్‌, ఫిరోజ్‌ కురేషి, మజీద్‌ పటేల్‌ ప్రమాద స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ అమర్‌ను పుణెలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement