deaths
-
హౌతీలపై అమెరికా దాడులు
వెస్ట్ పామ్ బీచ్ (యూఎస్): అంతర్జాతీయ జలాల్లో రాకపోకలు సాగించే అమెరికా రవాణా నౌకలు, యుద్ధనౌకలే లక్ష్యంగా రాకెట్ దాడులకు తెగబడుతున్న యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులపై ట్రంప్ సర్కారు విరుచుకుపడింది. శనివారం హౌతీ స్థావరాలపై బాంబులు, రాకెట్లు, క్షిపణి దాడులతో బెంబేలెత్తించింది. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 31 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని హౌతీ రెబెల్స్ ఆదివారం ప్రకటించారు. ‘‘మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే. 101 మందికి పైగా గాయపడ్డారు’’ అని హౌతీల ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య శాఖ ఆదివారం పేర్కొంది.హౌతీలకు ఇక మూడిందని ఈ సందర్భంగా ట్రంప్ ఘాటు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ‘‘ఉగ్రవాదుల స్థావరాలు, వారి నేతలు, క్షిపణి రక్షణ వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతాయి. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా సముద్రయానం చేయకుండా ఏ ఉగ్ర శక్తీ ఇక అమెరికాను ఆపలేదు. స్వేచ్ఛాయుత సరకు రవాణాయే మా లక్ష్యం’’ అని తన సోషల్ సైట్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. హౌతీలకు ఇకనైనా మద్దతు మానుకోవాలని ఇరాన్ను హెచ్చరించారు.అమెరికా వైమానిక దాడుల వల్ల యెమెన్ రాజధాని సనాతో పాటు ఉత్తర ప్రావిన్స్ సాదలోనూ పేలుళ్లు సంభవించాయి. ఆదివారం తెల్లవారుజామున హొదైదా, బైదా, మరీబ్ ప్రావిన్స్ల్లోనూ వైమానిక దాడులు జరిగినట్లు హౌతీలుధ్రువీకరించారు. వైమానిక దాడులు ఇక రోజూ కొనసాగవచ్చని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వీటికి బెదిరేది లేదని హౌతీలన్నారు. ‘‘అమెరికాకు దీటుగా బదులిస్తాం. గాజాకు తోడుగా నిలుస్తాం. ఎలాంటి సవా ళ్లు ఎదురైనాసరే ఒంటరిగా వదిలేయలేం’’ అని హూతీ మీడియా కా ర్యాలయం ఉపసారథి సస్రుద్దీన్ అమీర్ ప్రకటించారు.రవాణాకు అడ్డంకి ఇజ్రాయెల్కు బుద్ధి చెప్పేందుకు ఆ దేశ నౌకలపై మాత్రమే దాడులు చేస్తున్నామని హౌతీలు గతంలో చెప్పారు. కానీ వారి దాడులతో ఎర్ర సముద్రం, గల్ప్ ఆఫ్ ఏడెన్, బాబ్ ఎల్–మ్యాన్డేబ్ జలసంధి, అరేబియా సముద్రాల్లో సరుకు రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అమెరికాతో పాటు పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేయడం తెల్సిందే. వారిప్పటిదాకా 100కుపైగా రవాణా నౌకలపై దాడులకు పాల్పడ్డారు. దాడుల భయంతో నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తుండటంతో సరుకు రవాణా సమయం, వ్యయం భారీగా పెరిగిపోతున్నాయి. -
జీఎస్టీ అధికారి ఇంట్లో మిస్టరీ మరణాలు..!
కొచ్చి:కేరళలోని కొచ్చిలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్కు చెందిన 42 ఏళ్ల జీఎస్టీ అధికారితో పాటు అతడి 80 ఏళ్ల తల్లి,35ఏళ్ల సోదరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. వీరు చనిపోయి నాలుగు రోజులవుతోందని,మృతదేహాలు కుళ్లిపోవడం స్టార్టైందని కొచ్చి త్రిక్కాకర పోలీసులు తెలిపారు.జీఎస్టీ అధికారి ఇంటిలో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి తలుపు తెరవగా మరణాల విషయం బయటపడింది.అధికారి తల్లి మృతదేహం ఒక షీట్తో కప్పిఉండడం అనుమానాలకు తావిస్తోంది. జీఎస్టీ అధికారి సోదరి జార్ఖండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(జేఏఎస్) అధికారిగా పనిచేస్తున్నారు.ఆమె పబ్లిక్ సర్వీస్ పరీక్షలో తొలి ర్యాంక్ సాధించారు. అయితే పరీక్షల అవకతవకలకు సంబంధించి ఆమెపై ప్రస్తుతం సీబీఐ కేసు విచారణలో ఉంది. ఆమె మరణం ఆశ్చర్యానికి గురిచేసిందని తోటి జేఏఎస్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాథమికంగా వీరివి ఆత్మహత్యలనే పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం వివరాలొచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతుందని పోలీసులు చెబుతున్నారు. -
బంగారు గనిలో ఘోర ప్రమాదం..42 మంది దుర్మరణం
బమాకో:పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలోని ఓ బంగారు గని కుప్ప కూలి 42మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో అనేకమంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. చైనాకు చెందిన కంపెనీ నిర్వహిస్తున్న బంగారు గనిలో శనివారం(ఫిబ్రవరి 15) కొండచరియలు విరిగిపడ్డాయి.ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 42మంది చనిపోయినట్టు ప్రాథమికంగా తేలింది. అయితే గనిని చట్టబద్ధంగా నడుపుతున్నారా లేదా అనేదానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇక్కడ ఈ తరహా ప్రమాదం ఇది రెండవది కావడం గమనార్హం. జనవరి 29న కౌలికోరో అనే ప్రాంతంలో బంగారు గని కూలడంతో చాలా మంది కార్మికులు దుర్మరణం చెందారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు కావడం విషాదం. మాలి జనాభాలో 20 లక్షల మంది(పది శాతం)కిపైనే మైనింగ్ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆఫ్రికాలో మూడో అతిపెద్ద బంగారం ఉత్పత్తిదారుగా ఉన్న మాలిలో తరచు గని ప్రమాదాలు జరుగుతున్నాయి. -
ఏపీలో బర్డ్ ఫ్లూ
సాక్షి, అమరావతి/పెరవలి: ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లో సంభవించిన కోళ్ల మరణాలకు కారణం బర్డ్ ఫ్లూ(bird flu) అని నిర్ధారణ అయింది. రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించాయి. తొలుత నాటుకోళ్లు.. ఆ తర్వాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్.. చివరకు కోళ్లఫారాలనే చుట్టేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 30 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్క నిడదవోలు నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి.ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అప్రమత్తమైన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ.. నివారణ చర్యలు చేపట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 60కు పైగా శాంపిల్స్ను సేకరించి విజయవాడలోని రాష్ట్ర స్థాయి పశువ్యాధి నిర్ధారణ శాలతో పాటు భోపాల్లోని హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్(ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కు పంపింది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కోళ్ల ఫారాల నుంచి సేకరించిన శాంపిల్స్లో ఎవియాన్ ఇన్ఫ్లూయింజ్(హెచ్5ఎన్1)గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు సోమవారం భోపాల్ ల్యాబ్ నుంచి రిపోర్టు రాగానే సమాచారాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య సంస్థతో పాటు వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్కు అందించారు.వైరస్ నిర్ధారణ అయిన ఉభయగోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల పశుసంవర్ధక శాఖాధికారులను అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల్లో లేయర్, బ్రాయిలర్ కోళ్ల ఫారాల్లోని కోళ్ల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండలానికి రెండు చొప్పున ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసి బర్డ్ఫ్లూను ఎదుర్కోడానికి సమాయత్తం చేశారు. ఆందోళన చెందాల్సిన పనిలేదు..ఉభయగోదావరి జిల్లాల్లో రెండు గ్రామాల్లో బర్డ్› ఫ్లూ నిర్ధారణ అయిన మాట వాస్తవమే. అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. సమస్య పూర్తిగా అదుపులోనే ఉంది. 90 శాతం సమస్య పరిష్కారమైంది. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా ఈ వైరస్ వ్యాపించినట్టుగా నిర్ధారణ కాలేదు. ఉడికించిన గుడ్లు, మాంసాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు. – డాక్టర్ టి.దామోదర్నాయుడు, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖరెడ్జోన్స్, సరై్వలెన్స్ జోన్ల ప్రకటన వైరస్ గుర్తించిన గ్రామాలకు కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని రెడ్జోన్, పది కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని సరై్వలెన్స్ జోన్గా ప్రకటించారు. 144, 133 సెక్షన్లను అమలు చేస్తున్నారు. సర్వైలెన్స్ జోన్ పరిధిలో ఉన్న కోళ్ల ఫారాల్లోని కోళ్లు, పశువులు, ఇతర జీవాలతో పాటు మనుషుల రక్త నమూనాలను సేకరించాలని నిర్ణయించారు. ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారికోసం యాంటీ వైరస్ మందులను సిద్ధం చేశారు. కిలోమీటర్ పరిధిలోని పౌల్ట్రీ ఫామ్లలోని కోళ్లు, కోడిగుడ్లను కాల్చి పూడ్చి పెట్టాలని ఆదేశాలిచ్చారు. వైరస్ గుర్తించిన గ్రామాలున్న మండలాల్లో చికెన్ షాపులను మూసివేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. మరోవైపు బర్డ్ఫ్లూని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోళ్ల రైతులతో ఆయా జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, మొన్నటి వరకు కిలో రూ.250 నుంచి రూ.280 వరకు పలికిన కోడి మాంసం ధర గడిచిన వారం రోజులుగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో రూ.150కు మించి పలకడం లేదు. ఫామ్ గేట్ వద్ద రూ.6.25 పలికిన కోడిగుడ్డు ప్రస్తుతం రూ.4.25కు పడిపోయింది. -
అంతుచిక్కని మరణాలపై దర్యాప్తు.. మెట్ల బావి మూసివేత
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ఒక మారుమూల గ్రామంలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది స్వల్ప వ్యవధిలో మృత్యువాత పడటం సంచలనంగా మారింది. ఈ మరణాలకు గల కారణాలు ఇంతవరకూ వెల్లడికాలేదు. దీనిపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అధికారులు మెట్ల బావి సమీప ప్రాంతాన్ని సీల్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బావిలోని నీటిలో పురుగుమందుల ఆనవాళ్లు కనిపించాయి. ఈ నేపధ్యంలో మెట్ల బావి దగ్గర 24 గంటలూ భద్రతా సిబ్బందిని మోహరించారు.రాజౌరి జిల్లాలోని బాధల్ గ్రామంలోని మెట్ల బావికి కంచె ఏర్పాటు చేయాలని, ముగ్గురు భద్రతా సిబ్బందిని 24 గంటలూ అక్కడ మోహరించాలని అదనపు డిప్యూటీ కమిషనర్ దిల్ మీర్ ఆదేశించారు. ఆయన ఒక ఉత్తర్వులో.. ‘బాధల్ గ్రామంలోని బావి నుండి సేకరించిన నీటి నమూనాలలో పురుగుమందుల ఉనికిని నిర్ధారించారు. దీంతో ఆ మెట్ల బావిని మూసివేయాలని నిర్ణయించాం. ఈ మెట్ల బావిలోని నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వినియోగించకూడదు’ అని పేర్కొన్నారు.బాధల్ గ్రామంలో మరణాలకు గల కారణాన్ని తెలుసుకునేందుకు అంతర్-మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కాగా జమ్మూలోని ఎస్ఎంజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ అస్లాం కుమార్తె యాస్మిన్ కౌసర్ కూడా అంతుచిక్కని వ్యాధితో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 7-12 తేదీల మధ్య గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది మృతిచెందారు.ఇటీవల జేకే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖతో పాటు ఇతర విభాగాలు ఈ మరణాలపై దర్యాప్తు చేస్తున్నాయని, అయితే ఈ మరణాలకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదన్నారు. బాధితులు తొలుత జ్వరం, తలనొప్పి, వికారం, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలతో ఆస్పత్రికి వచ్చారని, చికిత్స పొందుతూ కొద్ది రోజులకే మృతిచెందారని మనోజ్ సిన్హా వివరించారు.ఇది కూడా చదవండి: Kumbh Mela: ప్రముఖుల రాక.. మరిన్ని మార్గదర్శకాలు జారీ -
మావోయిస్టుల ఘాతుకం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏడాదిన్నర కాలంగా మావోయిస్టుల ఏరివేతలో ఎదురన్నదే లేకుండా దూసుకెళ్తున్న భద్రతా బలగాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లా కుట్రు సమీపంలో మావోయిస్టులు అమర్చిన శక్తిమంతమైన మందుపాతర పేలిన ఘటనలో 8 మంది జవాన్లు, డ్రైవర్ మృత్యువాత పడ్డారు. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య శనివారం సాయంత్రం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోగా ఓ జవాన్ కూడా నేలకొరిగారు. ఎదురుకాల్పుల సమయంలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం దళాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కూంబింగ్ అనంతరం సోమవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో క్యాంపునకు తిరిగి వస్తున్న డీఆర్జీ బలగాల స్కారి్పయో వాహనాన్ని బెదిరే –కుట్రు రోడ్డులో నక్సల్స్ ఐఈడీ ద్వారా పేల్చేశారు. పేలుడు తీవ్రతకు ఘటనాస్థలి భయానకంగా మారింది. పోలీసు వాహనం శకలాలుగా మారిపోగా, అందులో ఉన్న 8 మంది జవాన్లు, డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలో సిమెంట్ రోడ్డు పెచ్చులుగా లేచి 10 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. జవాన్ల వాహనం భాగాలు పక్కనున్న ఎత్తయిన చెట్ల కొమ్మల చివర వరకు ఎగిరిపడ్డాయి. స్టీరింగ్ రాడ్ మొత్తం వంగిపోయింది. జవాన్ల శరీరాలు తల, మొండెం, కాళ్లు, చేతులు ఛిద్రమై రోడ్డు పక్కన పొలాల్లో పడ్డాయి. అక్కడికి చేరుకున్న బలగాలు సహచరుల శరీర భాగాలను పాలిథిన్ కవర్లలో సేకరించాల్సి వచ్చింది. నేలకొరిగిన జవాన్లంతా స్థానిక గిరిజనులు, లొంగిపోయిన మావోయిస్టులేనని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. ఘటన నేపథ్యంలో గాలింపు మరింత ముమ్మం చేశామన్నారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్లను.. కోర్స బుధ్రం, సోమడు వెంటిల్, డుమ్మా మడకం, బోమన్ సోది, హరీష్ కొర్రమ్, పండరు పద్యం, సుదర్శన్ వీటి, శుభర్నాథ్ యాదవ్గా గుర్తించారు. డ్రైవర్ వివరాలు తెలియరాలేదు. ఫాక్స్హోల్ పద్ధతి యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో మావోయిస్టులు పన్నిన ఉచ్చులో చిక్కకుండా భద్రతా దళాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాము ప్రయాణించే మార్గంలో ముందుగానే యాంటీ ల్యాండ్మైన్ వాహనాలతో తనిఖీలు చేస్తుంటాయి. అయితే వీటికి సైతం చిక్కని రీతిలో ఫాక్స్హోల్ పద్ధతిలో మావోయిస్టులు 70 కిలోల పేలుడు పదార్థాలను రోడ్డు మధ్యలో అమర్చినట్టు తెలుస్తోంది. 2023 ఏప్రిల్ 26న దంతెవాడ జిల్లాలో చోటుచేసుకున్న పేలుడులో 10 మంది డీఆర్జీ జవాన్లు, డ్రైవర్ మరణించారు. అప్పుడు కూడా ఫాక్స్హోల్ పద్ధతినే మావోయిస్టులు ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు.ప్రొటోకాల్ తప్పారా? సాధారణంగా డీఆర్జీ జవాన్లు కాలినడక లేదా బైక్లపైనే ఎక్కువగా కూంబింగ్కు వెళ్తారు. సోమవారం ఘటనలో వారు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్కు దూరంగా వాహనాన్ని ఉపయోగించారు. అది కూడా ల్యాండ్మైన్ ప్రూఫ్ కాకుండా సాధారణ వాహనం. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. గతేడాది భద్రతా దళాల ప్రయాణించే వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోలు పేలుడు పదార్ధాలు ఉపయోగించారు. అయితే అది సరుకు రవాణా వాహనం కావడంతో మృతుల సంఖ్య రెండుకు పరిమితమైంది. ఇదీ చదవండి: ఛత్తీస్గఢ్లో జర్నలిస్టు హత్య..హైదరాబాద్లో నిందితుడి అరెస్టు -
కాలిఫోర్నియాలో కూలిన విమానం
కాలిఫోర్నియా: వరుస విమాన ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. కాలిఫోర్ని యాలో విమాన ప్రమాదం జరిగింది. డిస్నీల్యాండ్కు సమీపంలోని ఆరెంజ్ కౌంటీలో ఉన్న ఫుల్లర్టన్ మున్సిపల్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన నిమిషంలోనే విమానం కుప్పకూలింది. ఓ వాణిజ్య భవనం పైకప్పుపై పడింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 2.09 గంటలకు ఈ ఘటన జరిగింది. సింగిల్ ఇంజన్ కలిగిన నాలుగు సీట్ల చిన్న విమానమే అయినప్పటికీ.. ఫర్నీచర్ గోదామ్పై కుప్పకూలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. విమానం కూలగానే గోదాములో మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేసి సమీప భవనాలను ఖాళీ చేయించారు. గతేడాది నవంబర్లో మరో చిన్న విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా విమానాశ్రయానికి అర మైలు దూరంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. విమానంలో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఇదీ చదవండి: ట్రక్కు దాడి.. ఎఫ్బీఐ కీలక ప్రకటన -
ఇథియోపియాలో ఘోర ప్రమాదం..
అడిస్ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియాలో నదిలో ట్రక్కు పడిన దుర్ఘటనలో 71 మంది మృత్యువాతపడ్డారు. దక్షిణ ప్రాంత సిడామాలోని లెమ్మ లగిడెలో ఆదివారం దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితులంతా పెళ్లి బృందంలోని వారు. కిక్కిరిసిన ట్రక్కు గలానా నదిపైన వంతెన మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి పడిపోయింది. అక్కడి కక్కడే 60 మంది అసువులు బాశారు. మిగతా 11 మంది చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు చెప్పారు. పేద దేశం కావడంతో వివాహాలు వంటి వేడుకలకు వెళ్లే వారు ఎక్కువ ఖర్చయ్యే బస్సులకు బదులుగా తక్కువకే దొరికే ట్రక్కులనే జనం వాడుతుంటారు. రహదారుల నిర్వహణ లోపభూయిష్టంగా మా రడంతో ఇక్కడ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ఇదీ చదవండి: గాలిలో ప్రాణాలు -
మొజాంబిక్లో హింస.. 21 మంది మృతి
మ్యాపుటు:తూర్పు ఆఫ్రికా దేశమైన మొజాంబిక్లో హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘనటల్లో21మంది దాకా మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఏడాది అక్టోబర్ 9న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రీలిమో పార్టీ అధ్యక్ష అభ్యర్థి డేనియల్ చాపో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నిక వివాదాస్పదమైంది. దీనిపై ఓటమి చెందిన అధ్యక్ష అభ్యర్థి వెనాన్సియో సుప్రీంకోర్టుకు వెళ్లారు.కోర్టు చాపో ఎన్నిక సరైనదేనంటూ తాజాగా తీర్పిచ్చింది. దీంతో వెనాన్సియో మద్దతుదారులు హింసకు పాల్పడ్డారు. మొత్తం 236 హింసాత్మక ఘటనలు జరిగాయి. మృతిచెందిన 21 మందిలో ఇద్దరు పోలీసులున్నారు. ఆందోళనకారులు చాలా వాహనాలకు నిప్పంటించారు. రాజధాని మ్యాపుటులో అల్లరిమూకలు షాపులు దోచుకున్నారు. హింసకు భయపడి రాజధాని నగరం నుంచి ప్రభుత్వ అధికారులు పారిపోయినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఆందోళనలతోపాటు దోపిడీలు జరుగుతున్నాయని మొజాంబిక్ తాత్కాలిక మంత్రి పాస్కోల్ రోండా ధృవీకరించారు. కాగా,అధ్యక్ష ఎన్నికల్లో చాపోకు 65 శాతం ఓట్లు రాగా వెనాన్సియోకు 24 శాతం ఓట్లు వచ్చాయి. -
ఐవరీకోస్ట్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది దుర్మరణం
అబుజాన్: ఐవరీకోస్ట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీ బస్సులు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది దుర్మరణం పాలవ్వగా 28 మంది దాకా గాయపడ్డారు. బ్రొకోవా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై దేశ రవాణాశాఖ మంత్రి స్పందించారు.రోడ్లపై ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. రోడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఐవరీకోస్ట్లో ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో ఏటా వెయ్యి మంది మరణిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.గత నెలలోనే దేశంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 21 మంది మరణించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఇదీ చదవండి: స్నేహితుల మధ్య గొడవ.. కెనడాలో భారత విద్యార్థి హత్య -
చట్టాలంటే ప్రజలకు గౌరవం లేదు, భయం లేదు
న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తంచేశారు. చట్టాలను ప్రజలు గౌరవించకపోవడం, చట్టం అంటే ఏమాత్రం భయం లేకపోవడమే ఇందుకు కారణమని ఆక్షేపించారు. గురువారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని చెప్పారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యానని, తన కాలు నాలుగుచోట్ల విరిగిపోయిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే నాలుగు కీలక అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఏటా 30 వేల మందిమృత్యువాత పడుతున్నారని తెలిపారు. జరిమానాలు పెంచినా... ఈ ఏడాది ఇప్పటివరకు 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని గడ్కరీ వివరించారు. మృతుల్లో 60 శాతం మంది యువతీ యువకులే ఉండడం బాధాకరమని చెప్పారు. జరిమానాలు పెంచుతున్నా ప్రజలు లెక్కచేయడం లేదని, నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో తన కళ్లెదుటే ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి వెళ్లిందని అన్నారు. మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో చాలాచోట్ల రోడ్లపై బ్లాక్స్పాట్లు ఉన్నాయని, వీటిని సరి చేయడానికి రూ.40,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
విరుగుడు లేని విషం!
⇒కాగజ్నగర్కు చెందిన యువకుడు (35) కుటుంబ గొడవలతో గడ్డి మందు తాగాడు. చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. అప్పటికే కిడ్నీలు దెబ్బతినడంతో ప్రత్యేక డయాలసిస్ చేశారు. అయినా పరిస్థితి విషమించి నాలుగు రోజుల్లోనే మృత్యువాత పడ్డాడు. ⇒ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన యువకుడు (21) స్నేహితుల మధ్య విభేదాలతో గడ్డి మందు తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. పరిస్థితి చేయి దాటిపోయింది. చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆ యువకుడు బతకడం కష్టమని తేల్చి చెప్పారు. రెండు రోజులకే అతడి ప్రాణాలు పోయాయి.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంట చేన్లలో కలుపు నివారణకు వాడే గడ్డి మందు మనుషుల ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు రెండు, మూడు చోట్ల ‘పారాక్వాట్’ గడ్డి మందు తాగి మరణిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో ఈ మందును తాగిన వారిని కాపాడుకునేందుకు విరుగుడు కూడా లేక నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అత్యంత విషపూరితమైన ఈ మందును పొలాల్లో పిచికారీ చేసే సమయంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలు సమస్యలు వస్తున్నాయి. అది పర్యావరణానికి, జీవజాతులకూ ప్రమాదకరమని వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్సకు లొంగని మందు! పారాక్వాట్ గడ్డి మందు కేవలం పది మిల్లీలీటర్లు (ఎంఎల్) శరీరంలోకి వెళ్లినా ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెప్తున్నారు. అది శ్వాస వ్యవస్థ, కిడ్నీలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని... గుండె, కాలేయం సహా అన్ని అవయవాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. గత ఏడాది ఈ గడ్డిమందు తాగిన ఓ యువకుడికి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఊపిరితిత్తుల మారి్పడి చేయాల్సి వచి్చందని గుర్తు చేస్తున్నారు. చాలా క్రిమిసంహాకర మందులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని.. వాటి తయారీ కంపెనీలే విరుగుడు ఫార్ములా ఇస్తుంటాయని చెబుతున్నారు. కానీ ఈ గడ్డి మందుకు మాత్రం ఇప్పటికీ సరైన విరుగుడు చికిత్స లేక.. ఎన్నో పేద, మధ్య తరగతి జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయని పేర్కొంటున్నారు. ఏమిటీ పారాక్వాట్? పారాక్వాట్ డైక్లోరైడ్గా పిలిచే గడ్డిమందు వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది అత్యంత విషపూరితమైనా.. కూలీల కొరత ఓవైపు, సులువుగా కలుపు నివారణ అవుతుందనే ఉద్దేశంతో మరోవైపు రైతులు ఈ మందును వాడుతున్నారు. కేవలం రూ.200 ఖర్చుతో ఎకరం చేనులో కలుపు నివారణ చేయవచ్చని.. అధిక గాఢత కారణంగా 24 గంటల్లోనే మొక్కలు మాడిపోతాయని అంటున్నారు. పిచికారీ చేసే సమయంలోనూ తలనొప్పి, వికారం, ఒంటిపై దద్దుర్లు వస్తుంటాయని చెబుతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు సరైన చికిత్స లేని ఈ మందు దుష్ప్రభావాలపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని గమనించిన కొందరు వైద్యులు ప్రభుత్వానికి విన్నవించేందుకు ఓ గ్రూప్గా ఏర్పడ్డారు. ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మంచిర్యాల పరిధిలోని ప్రతినిధులు పారాక్వాట్ తీవ్రతపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం ఇచ్చారు కూడా. పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పారాక్వాట్ తీవ్రతపై పరిశోధనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఆత్మహత్య నిరోధక కమిటీలు ఈ మందు విషయంలో అవగాహన కలి్పస్తున్నాయి. తయారు చేసే దేశంలోనే ఆంక్షలు పారాక్వాట్ను చాలా దేశాలు నిషేధించాయి. ఈ మందు తయారీ కంపెనీ ఉన్న స్విట్జర్లాండ్లో, ఉత్పత్తి చేసే చైనాలోనూ ఆంక్షలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశాలోని బుర్లా జిల్లాలో రెండేళ్లలో 170 మంది వరకు ఈ గడ్డి మందు తాగి చనిపోవడంతో నిషేధించాలంటూ ఒత్తిళ్లు వచ్చాయి. అక్కడి సర్కారు పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలపై ఆంక్షలు విధించింది. కానీ రాష్ట్రాలకు 60రోజులు మాత్రమే అమ్మకాలను నిలిపేసే అధికారం ఉండటంతో.. శాశ్వతంగా నిషేధించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. ఈ క్రమంలో కలుపు గడ్డి నివారణ కోసం మరో మందును ప్రత్యామ్నాయంగా చూపాలనే డిమాండ్లు వస్తున్నాయి. కిడ్నీలపై తీవ్ర ప్రభావం ఎవరైనా పారాక్వాట్ తాగిన వెంటనే ఆస్పత్రికి వస్తే బతికే చాన్స్ ఉంటుంది. కిడ్నీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యేక డయాలసిస్ చేస్తాం. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే ప్రాణాలు కోల్పోయినట్టే. అందుకే ఈ మందు తీవ్రతను సర్కారుకు తెలియజేయాలని అనుకుంటున్నాం. – రాకేశ్ చెన్నా, నెఫ్రాలాజిస్టు, మంచిర్యాల నిషేధం విధించాలి గడ్డిమందుతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిమోతాదులో శరీరంలోకి వెళ్లినా బతకడం కష్టమవుతోంది. చికిత్సకు కూడా లొంగకుండా ఉన్న ఈ మందును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాలి. సమాజ శ్రేయస్సు కోసం కొంతమంది వైద్యులం కలసి ప్రభుత్వానికి నివేదించనున్నాం. – సతీశ్ నారాయణ చౌదరి, ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాక్టిషనర్, ఖమ్మంచాలా కేసుల్లో మరణాలే.. పారాక్వాట్కు ఇప్పటికీ సరైన చికిత్స లేదు. మా వద్దకు వస్తున్న చాలా కేసుల్లో మరణాలే సంభవిస్తున్నాయి. ఈ మందు రోగి పెదవులు మొదలు శరీరంలో అన్ని అవయవాలను వేగంగా దెబ్బతిస్తుంది. తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం చాలా కష్టం. – ఆవునూరి పుష్పలత, అసిస్టెంట్ ప్రొఫెసర్, కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
44 వేలు దాటిన మరణాలు
దియర్ అల్–బలాహ్ (గాజా స్ట్రిప్): ఇజ్రాయెల్తో 13 నెలలుగా సాగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 44,000 దాటిందని గాజా ఆరోగ్యశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. ఇందులో సాధారణ పౌరులు ఎంతమంది, హమాస్కు చెందిన వారెందరు అనేది గాజా ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా లెక్కించదు. కాకపోతే మృతుల్లో సగం కంటే ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి 44,056 మంది పాలస్తీనియన్లు మరణించారని, 1,04,268 గాయపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. వాస్తవ మృతుల సంఖ్య ఇంకా అధికంగా ఉండొచ్చని, మెడికోలు చేరుకొలేని ప్రదేశాల్లో శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది మరణించారని వెల్లడించింది. మరోవైపు 17 వేల మంది పైచిలుకు హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. గత ఏడాది అక్టోబరు ఏడో తేదీన దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ ఆకస్మిక దాడితో యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ జరిపిన ఈ మెరుపుదాడిలో 1,200 మరణించగా, 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకున్నారు. -
వెయ్యి రోజుల యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి నేటికి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఈ యుద్ధం ఐరోపాలో అత్యంత ఘోరమైన సంఘర్షణగా రూపుదిద్దుకుంది. పలు నివేదికలలోని వివరాల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక మిలియన్(10 లక్షలు)కు పైగా జనం మరణించడమో, తీవ్రంగా గాయపడటమో జరిగింది.2022లో ప్రారంభమైన 21వ శతాబ్దపు ఈ యుద్ధంలో ఉక్రెయిన్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. యుద్ధంలో దెబ్బతిన్న దేశం నుంచి నిరంతరం హృదయాన్ని కదిలించే వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ఆ దేశం ఎంతో బలహీనంగామారింది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం యుద్ధంలో 80 వేల మంది ఉక్రేనియన్ సైనికులు మరణించారు. నాలుగు లక్షల మందికి పైగా సైనికులు గాయపడ్డారు. పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన వివరాల ప్రకారం రష్యన్ సైనికుల మరణాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని నివేదికలలో మరణించిన సైనికుల సంఖ్య సుమారు రెండు లక్షలు, గాయపడిన వారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలుగా పేర్కొన్నారు. రెండు దేశాల జనాభా ఇప్పటికే క్షీణించింది. యుద్ధానికి ముందే ఇరు దేశాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా సంభవించిన భారీ మరణాల ప్రభావం ఇరు దేశాల జనాభా గణాంకాలపై కనిపిస్తోంది.మరణించిన సైనికుల డేటా గోప్యం?ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మిషన్ తెలిపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్లో ఆగస్టు 2024 నాటికి 11,743 మంది పౌరులు మరణించారు. 24,614 మంది గాయపడ్డారు. ముఖ్యంగా మారియుపోల్ వంటి రష్యన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఈ మరణాలు సంభవించాయి. ఇదేకాకుండా ఉక్రెయిన్లో ఇప్పటివరకు 589 మంది చిన్నారులు కూడా మరణించారు. యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, గ్రౌండ్ దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయి. జాతీయ భద్రత కోసం యుద్ధంలో మరణించిన తమ సైనికుల డేటాను ఇరుపక్షాలు గోప్యంగా ఉంచాయని, పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఇచ్చిన అంచనాలలో చాలా తేడా ఉందని ఒక ఈ మీడియా నివేదిక పేర్కొంది. సైనిక ప్రాణనష్టం విషయంలో కూడా రష్యాకు భారీ నష్టం వాటిల్లిందనే అంచనాలున్నాయి ఈ భీకర యుద్ధంలో ఒక్క రోజులో వెయ్యి మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారు. ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ 2024, ఫిబ్రవరిలో 31 వేలకు పైగా ఉక్రేనియన్ సైనికులు మృతిచెందారని తెలిపారు.ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం మృతియుద్ధం కారణంగా ఉక్రెయిన్లో జననాల రేటు రెండున్నరేళ్ల క్రితం ఉన్న దానికంటే ఇప్పుడు మూడో వంతుకు పడిపోయింది. ఉక్రెయిన్లో దాదాపు నాలుగు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఆరు మిలియన్లకు పైగా ఉక్రేనియన్ పౌరులు విదేశాల్లో ఆశ్రయం పొందారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ జనాభా 10 మిలియన్లకు పైగా తగ్గింది. ఇది అక్కడి జనాభాలో నాలుగింట ఒక వంతు. అంటే ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం తుడిచిపెట్టుకుపోయింది. యుక్రేనియన్ ప్రభుత్వం యుద్ధంలో రోజువారీ ఖర్చు 140 మిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ అని అంచనా వేసింది. ఉక్రెయిన్ 2025 ప్రతిపాదిత బడ్జెట్లో రక్షణ కోసం 26 శాతం అంటే 53.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావంయుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 2022లో 33 శాతం క్షీణించింది. 2023లో ఈ పరిస్థితి కాస్త మెరుగుపడి నష్టం 22 శాతానికి పరిమితమైంది. హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, ఇంధనం, వ్యవసాయ రంగాలు యుద్ధానికి అమితంగా ప్రభావితమయ్యాయి. ఉక్రెయిన్లోని రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా లక్ష్యంగా చేసుకోవడంతో ఉక్రెయిన్ ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతింది.ఉక్రెయిన్లో కొంతభాగం రష్యా స్వాధీనంరాయిటర్స్ నివేదిక ప్రకారం ఉక్రెయిన్లో ఐదవ వంతును రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతాలను తన అదుపులో ఉంచుకుంది. ఈ భాగం గ్రీస్ దేశ పరిమాణంతో సమానం. రష్యన్ దళాలు 2022 ప్రారంభంలో ఉక్రెయిన్లోని ఉత్తర, తూర్పు, దక్షిణ భాగాలలో దాడి చేసి, ఉత్తరాన కీవ్ శివార్లకు చేరుకుని, దక్షిణాన డ్నిప్రో నదిని దాటాయి. రష్యా దాదాపు ఉక్రెయిన్లోని తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని, దక్షిణాన అజోవ్ సముద్ర తీరాన్ని స్వాధీనం చేసుకుంది.పుతిన్కు గిట్టని ఉక్రేనియన్ గుర్తింపు ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యన్ సామ్రాజ్యంలో భాగం. తరువాత సోవియట్ యూనియన్లో భాగమైంది. ఉక్రెయిన్ను మళ్లీ రష్యాలో విలీనం చేయడమే తన లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు సందర్భాల్లో చెప్పారు. పుతిన్ ఉక్రేనియన్ రాష్ట్ర హోదాను, గుర్తింపును తిరస్కరించారు. ఉక్రేనియన్లు నిజానికి రష్యన్లేనని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లక్షలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా ఇరు దేశాల జనాభా, ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ యుద్ధం ప్రపంచ సంక్షోభానికి కూడా దారితీసింది. ఇది కూడా చదవండి: భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం -
యూపీ ఆస్పత్రి ఘటన.. దర్యాప్తునకు నలుగురు సభ్యుల కమిటీ
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ఝాన్సీలోని ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖకు చెందిన నలుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపి ఏడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కమిటీ వైద్యవిద్య డీజీ నేతృత్వంలో దర్యాప్తు జరపనుంది. కాగా,ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవదహనం -
మణిపూర్లో భారీ ఎన్కౌంటర్..11 మంది ఉగ్రవాదులు హతం
ఇంఫాల్:మణిపూర్ జిరిబమ్లో సోమవారం(నవంబర్ 11) భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 11 మంది అనుమానిత కుకీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది.కుకీ మిలిటెంట్లుగా అనుమానిస్తున్న కొందరు సోమవారం జిరిబమ్ పోలీస్స్టేషన్పై దాడికి ప్రయత్నించినప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న రిలీఫ్ క్యాంపును టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మణిపూర్లో గతేడాది జరిగిన అల్లర్లలో జిరిబమ్ పోలీస్స్టేషన్కు ఉగ్రవాదులు పలుమార్లు టార్గెట్ చేసి దాడి చేయడం గమనార్హం. -
గుల్బర్గాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసుల దుర్మరణం
గుల్బర్గా: కర్ణాటక గుల్బర్గా జిల్లాలోని కమలాపురం వద్ద శనివారం(నవంబర్ 9) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వేగంగా వెళుతున్న బొలేరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు హైదరాబాద్ యూసుఫ్గూడ వాసులుగా గుర్తించారు. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: పంజాగుట్టలో కారు బీభత్సం -
పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టిన రైలు.. అక్కడికక్కడే మృతి
తిరువనంతపురం: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. షోర్నూర్ సమీపంలో రైల్వేట్రాక్పై చెత్త శుభ్రం చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను వేగంగా వచ్చిన కేరళ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు కాగా ఇద్దరు మహిళలు. వీరిలో ముగ్గురి మృతదేహాలు ఘటనాస్థలంలో దొరికాయి. మరో మృతదేహం పక్కనే ఉన్న నదిలో పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ట్రాక్పై వస్తున్న రైలును కార్మికులు గమనించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: వేడివేడి కిచిడీ పడి భక్తులకు తీవ్ర గాయాలు -
కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి,కర్నూలుజిల్లా: కర్నూలు జిల్లాలోని నందవరం మండలం ధర్మపురం గ్రామం వద్ద ఎన్హెచ్-167పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం(నవంబర్ 2) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతివేగంతో వెళుతున్న కారు ఆటోను ఢీకొట్టింది.ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వీర నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరిని కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో ఇద్దరికి గాయలవగా గాయపడినవారిలో చాన్నిరి రిజియా పరిస్థితి విషమంగా ఉంది. ఇదీ చదవండి: కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు -
ఇజ్రాయెల్ దాడులు.. ముగ్గురు జర్నలిస్టులు మృతి
బీరుట్/ఖాన్ యూనిస్: గాజాతోపాటు లెబనాన్పై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్లోని హస్బయా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని బీరుట్ కేంద్రంగా పనిచేసేత అరబ్ టీవీ అల్ మయాదీన్ కెమెరామ్యాన్ ఘస్సన్ నాజర్, టెక్నీషియన్ మహ్మద్ రిడా, హెజ్బొల్లా గ్రూపునకు చెందిన అల్ మనార్ టీవీ కెమెరామ్యాన్ విస్సమ్ కస్సిమ్గా గుర్తించారు. ఘటన సమయంలో ఆ భవనంలో ఏడు వేర్వేరు మీడియా సంస్థలకు చెందిన 18 మంది జర్నలిస్టులు ఉన్నారని లెబనాన్ సమాచార మంత్రి జియాద్ మకరీ చెప్పారు. ఇజ్రాయెల్ చర్యను ప్రణాళిక ప్రకారం చేపట్టిన హత్యాకాండగా అభివర్ణించారు. కుప్ప కూలిన భవనం ప్రాంగణంలో ప్రెస్ అనే స్టిక్కర్తో ధ్వంసమైన వాహనాలున్న వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది. ఆ సమయంలో తామంతా విశ్రాంతి తీసుకుంటున్నామని దాడి నుంచి సురక్షితంగా బయటపడిన అల్ జజీరా ఇంగ్లిష్ చానెల్ కరస్పాండెంట్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తాము దాడి చేయలేదని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. గాజాపై యుద్ధం మొదలయ్యాక 128 మంది జర్నలిస్టులు విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయారని జర్నలిస్టుల రక్షణ కమిటీ తెలిపింది. మరోవైపు 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.ఒకే కుటుంబంలోని 36 మంది మృతిగాజాలోని ఖాన్యూనిస్ నగరంపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో మొత్తం 38 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది చిన్నారులు సహా 36 మంది ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. -
టర్కీలో ఉగ్రదాడి.. భారీగా మృతులు..!
అంకారా: టర్కీ రాజధాని అంకారా శివార్లలోని ఓ ఏరోస్పేస్ సంస్థపై ఉగ్రవాదులు బుధవారం(అక్టోబర్ 23) దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మృతి చెందడంతో పాటు కొందరు గాయపడ్డట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక ట్వీట్ చేశారు. Türk Havacılık ve Uzay Sanayii AŞ. (TUSAŞ) Ankara Kahramankazan tesislerine yönelik terör saldırısı gerçekleştirilmiştir.Saldırı sonrası maalesef şehit ve yaralılarımız bulunmaktadır.Şehitlerimize Allah’tan rahmet; yaralılarımıza acil şifalar diliyorum.Gelişmelerden kamuoyu…— Ali Yerlikaya (@AliYerlikaya) October 23, 2024 రాజధాని అంకారా శివారులో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు తొలుత బాంబులతో దాడి చేసి తర్వాత కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఏరోస్పేస్ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో దుండగులు ట్యాక్సీలో ప్రవేశించి తొలుత బాంబు వేసి తర్వాత తుపాకులతో కాల్చారు. దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: అగ్ర నేతలపై ఇజ్రాయెల్ టార్గెట్.. హమాస్ కీలక నిర్ణయం -
రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 474 మంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సగటున రోజుకు 474 మంది చనిపోయారని, ప్రతీ మూడు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం డేటా సేకరణలో ఆందోళనకరమైన గణాంకాలు వెలుగు చూశాయి. కాగా, గతేడాది రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తెలంగాణలో బాగా పెరిగిపోయింది.ఇదిలా ఉండగా..2023 ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.73 లక్షలకు పైగా మరణించారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్) ధరించకపోవడం వల్ల 70% మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రాలు ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వానికి అందించాయి. రోడ్డు ప్రమాదాల కారణాలు, తీవ్రతను అర్థం చేసుకోవడానికి కేంద్రం డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాదే అత్యధిక మరణాలు సంభవించాయి. గతేడాది క్షతగాత్రులు 4.63 లక్షలు గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 4.63 లక్షల మంది గాయపడ్డారు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల సంఖ్య పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇది 2022 కంటే 4% ఎక్కువ. 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది చనిపోయారని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నివేదికలో పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ ప్రకారం 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.71 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రెండు ఏజెన్సీలు 2023కి సంబంధించిన గణాంకాలను విడుదల చేయలేదు. ప్రమాద మరణాల్లో తొలిస్థానంలో ఉత్తరప్రదేశ్.. యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, పశి్చమ బెంగాల్, పంజాబ్, అస్సాం, తెలంగాణ సహా 21 రాష్ట్రాల్లో 2022తో పోలిస్తే 2023లో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, కేరళ, చండీగఢ్ వంటి రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కాగా గతేడాది రోడ్డు ప్రమాదాల్లో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 23,652 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 18,347మంది, మహారాష్ట్రలో 15,366 మంది మరణించారు. క్షతగాత్రుల్లో తమిళనాడు తొలిస్థానం రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారిలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో 72,292 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్లో 55,769 మంది, కేరళలో 54,320 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు. కాగా, గతేడాది మరణించిన వారిలో 44% మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. అలాగే గతేడాది మరణించిన ద్విచక్ర వాహనదారుల్లో 70% మంది హెల్మెట్ ధరించని కారణంగా మృత్యువాతపడ్డారు. -
బొగ్గుగనిలో కాల్పులు..20 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లోని బొగ్గుగనిలో కాల్పులు కలకలం రేపాయి. డుకి జిల్లాలో ఉన్న ఓ బొగ్గుగనిలో కార్మికులపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గనిలో కార్మికుల షెల్టర్ వద్దకు దూసుకొచ్చిన దుండగులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో 20 మంది కార్మికులు మరణించగా మరికొందరు గాయపడ్డారు. కాల్పుల్లో మృతిచెందిన వారిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్కు చెందినవారిగా గుర్తించారు. ఇస్లామాబాద్లో అక్టోబర్ 16,17 తేదీల్లో షాంఘై కోఆపరేషన్ సదస్సు(ఎస్సీవో)జరగనున్న నేపథ్యంలో కాల్పులు జరగడం చర్చనీయాంశమైంది. ఈ సదస్సుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా హాజరవనున్నారు.ఇదీ చదవండి: విమానం నడుపుతూ పైలట్ మృతి -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..పది మంది మృతి
లక్నో:ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో శుక్రవారం(అక్టోబర్4) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారణాసి ప్రయాగ్రాజ్ హైవేపై కట్కా గ్రామం సమీపంలో ట్రాక్టర్ను ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ ట్రాలీ ఏకంగా పక్కనున్న కాలువలో ఎగిరిపడింది. దీంతో ట్రాలీలో ఉన్న 10 మంది కూలీలు మృతిచెందారు.ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని వారణాసి ట్రామా సెంటర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు ట్రాక్టర్ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసు ఉన్నతాధికారి అభినందన్ తెలిపారు.ట్రక్కు డ్రైవర్ ఘటనాస్థలి నుంచి పారిపోయాడని చెప్పారు. ఇదీ చదవండి: వైవాహిక అత్యాచారం నేరం కాదు -
పుణెలో కూలిన హెలికాప్టర్..ముగ్గురు మృతి
పుణె: మహారాష్ట్రలోని పుణెలో బుధవారం(అక్టోబర్2) తెల్లవారుజామున హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు ఒక ఇంజినీర్ దుర్మరణం పాలయ్యారు. పుణెజిల్లాలోని బవ్ధాన్ కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బవ్ధాన్ పరిసర ప్రాంతంలోని గోల్ఫ్కోర్స్లో ఉన్న హెలిప్యాడ్ నుంచి గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ముంబై వెళ్లాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలియనప్పటికీ దట్టమైన పొగమంచు వల్లే హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కుప్పకూలిన హెలికాప్టర్ పుణెలోని హెరిటేజ్ ఏవియేషన్కు చెందినదిగా తేల్చారు. కాగా, ముంబై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ హెలికాప్టర్ పుణె సమీపంలో ఇటీవలే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లోని నలుగురు గాయపడ్డారు.#WATCH | A #helicopter with three people onboard crashed in the Bavdhan area in #Pune. According to the police, two people have died in the incident.More details here: https://t.co/34QkwGCcvh pic.twitter.com/v6tQTKz2K1— Hindustan Times (@htTweets) October 2, 2024 ఇదీ చదవండి: పెరోల్పై డేరా బాబా విడుదల -
హడలెత్తిస్తున్న చిరుత.. 11 రోజుల్లో ఏడుగురిపై దాడి, మృతి
రాజస్థాన్లో ఓ చిరుత ప్రజలను హడలెత్తిస్తోంది. స్థానికులను వేటాడి చంపి తింటూ.. వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. తాజాగా ఉదయ్పూర్లోని ఓ గ్రామంలో పూజారి ప్రాణాన్ని బలిగొంది. సోమవారం తెల్లవారుజామున పూజారి విష్ణుగిరి(65) మృతదేహాన్ని స్థానిక అడివిలో గుర్తించారు. చిరుత అతనిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.మృతదేహాన్ని ఆలయానికి 150 మీటర్ల దూరంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.అయితే చిరుత దాడిలో గత 11 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. చిరుత దాడులు ఎక్కువవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు పలు చోట్ల బోనులు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా పలు చిరుతలు చిక్కాయని చెబుతున్న అధికారులు.. మరోవైపు వాటి దాడులు మాత్రం ఆగడం లేదని పేర్కొంటున్నారు.చిరుతపులి భయంతో పోలీసులు, అటవీశాఖ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో ఉచ్చులు బిగించారు. గత కొన్ని రోజులుగా కొన్ని పాంథర్లు పట్టుబడుతుండగా, చిరుతపులి దాడి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. చిరుత దాడులు క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఆ ప్రాంతంలో పాఠశాలలు మూతపడ్డాయి. సాయంత్రం దాటిన తర్వాత ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బయటకు వస్తే ఒంటరిగా రావొద్దని.. గుంపులుగా రావాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు ర్రలు లేదా ఇతర ఆయుధాలను తమ వెంట తీసుకెళ్లాలని గ్రామస్థులను అధికారులు కోరారు. అయితే అందరిపై దాడి చేసింది ఒకే చిరుతనా అనేది తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అయిఏ అన్ని ఘటనల్లో జంతువు కదలికలు ఒకే రకంగా ఉన్నాయని.. దాడి స్వభావం కూడా ఒకే విధంగా ఉన్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కదలికలను గమనిస్తున్నట్లు చెప్పారు. -
నేపాల్లో పోటెత్తిన వరదలు..50 మంది మృతి
కఠ్మాండు:నేపాల్లో వరదలు పోటెత్తాయి. గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎనిమిది జిల్లాల్లో దాదాపు 50మంది మరణించారు.సుమారు 11మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వరదలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.వరద బాధిత ప్రాంతాల్లో దాదాపు 3 వేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.నేపాల్ సాయుధ పోలీసు దళానికి చెందిన భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు 23 రాఫ్టింగ్ బోట్లు రంగంలోకి దిగాయి. వరదల బారిన చిక్కుకున్నవారిలో ఇప్పటి వరకు 760 మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. -
పేలిన ఆయిల్ ట్యాంకర్.. 25 మందికిపైగా మృతి
పోర్ట్ అవ్ ప్రిన్స్:హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న ఇంధన ట్యాంకర్ పేలిపోయింది.తీర నగరం మిరాగానేలో శనివారం(సెప్టెంబర్14) ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మందికిపైగా దుర్మరణం పాలవ్వగా 50 మందికిపైగా గాయపడ్డారు. రోడ్డుపై వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ టైరు తొలుత పంక్చర్ అయింది. దీంతో ఆయిల్ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో పేలుడు జరిగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్లో తరలించారు.ప్రమాద స్థలాన్ని ప్రధాని గ్యారీ కొనల్ పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘ఇది చాలా భయంకర ప్రమాదం. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయి’అని తెలిపారు. హైతీలో కొన్ని ప్రాంతాలు మిలిటెంట్ గ్యాంగుల ఆధీనంలో ఉండటంతో అత్యవసర వస్తువుల రవాణాకు రోడ్డు మార్గం కంటే నౌకలను ఎక్కువగా వాడుతుండడం గమనార్హం. ఇదీ చదవండి.. చమురు ట్యాంకర్కు మంటలు -
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి
అబుజా: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇంధన ట్యాంకర్, ట్రక్కును ఢీకొన్న ఘటనలో 48 మంది మృతి చెందారు. నైగర్లోని అగాయ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతోపాటు పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ ఢీకొంది. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న పలువురితోపాటు పశువులు సజీవ దహనమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ పేలుడు కారణంగా రోడ్డుపై సమీపంలో ఉన్న ఇతర వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇదీ చదవండి.. అమెరికాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు -
వరద మరణాలపై చంద్రబాబు సర్కార్ దొంగాట
సాక్షి, విజయవాడ: విజయవాడ వరద మరణాలపై చంద్రబాబు సర్కార్ దొంగాట ఆడుతోంది. నిన్నటి వరకు 20 మందే మృతిచెందారని ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 32 మంది చనిపోయారని పేర్లతో సహా చెప్పారు.ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి అసలు అర్హుడివేనా? అని ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలంటూ చంద్రబాబును నిలదీశారు. విజయవాడ విపత్తుకు ముమ్మాటికీ చంద్రబాబు తప్పిదమే కారణమని పునరుద్ఘాటించారు. చేసిన తప్పులకు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడ వరదలకు ఇప్పటికే 32 మంది బలి అయ్యారని.. ఇంకెందరు చనిపోయారో లెక్క తెలియడం లేదని.. ఆ మరణాలకు పూర్తి బాధ్యత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. దీంతో 32 మంది చనిపోయారంటూ ఇవాళ చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. పోస్ట్ మార్టమ్ కోసం మృతదేహాలను మార్చురీకి తరలించారు.మృతుల వివరాలు అధికారికంగా ప్రకటించకపోవడంపై మృతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల్లో ఉన్న మృతుల కుటుంబాలకే ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలకు కూడా అధికారులు సహకరించడం లేదు. వరదల్లో గల్లంతైన వారి జాడ చెప్పాలంటూ బంధువులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదని బాధితులు వాపోతున్నారు. -
కాబూల్లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు ధాటికి ఆరుగురు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. గాయపడ్డవారని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ఆత్మాహుతిదాడికి తామే కారణమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. దాడిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లో 2021 నుంచి తాలిబన్ల పాలన కొనసాగుతోంది. ఇక్కడ తాలిబన్లకు వ్యతిరేకంగా పనిచేసే ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ తరచు స్కూళ్లు, ఆస్పత్రులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. -
రష్యాలో కుప్పకూలిన హెలికాప్టర్.. 22 మంది మృతి
మాస్కో: తూర్పు రష్యాలో 22 మందితో ప్రయాణిస్తూ అదృశ్యమైన హెలికాప్టర్ ఘటన విషాదాంతమైంది. హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. హెలికాప్టర్ నుంచి చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు.హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నవారిలో అందరూ చనిపోయినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.A Vityaz Aero Mil Mi-8 helicopter (RA-25656) impacted terrain at an elevation of 900 m after taking off from the Vachkazhets volcano in Kamchatka Krai, Russia. At least 17 occupants have reportedly died:https://t.co/qGBfRTfp6z pic.twitter.com/fEUPuoUZQ4— Aviation Safety Network (ASN) (@AviationSafety) September 1, 2024 ఎంఐ-8 శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది, 19 మంది ప్రయాణికులతో రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చత్కా ద్వీపకల్పంలోని వచ్కజెట్స్ అగ్ని పర్వతం సమీపం నుంచి శనివారం(ఆగస్టు31) బయల్దేరింది. కానీ, గమ్యస్థానానికి చేరలేదు.వచ్కజెట్స్ సమీపంలో రాడార్ నుంచి హెలికాప్టర్ మాయమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమైనట్లు అంచనా వేస్తున్నారు. ఎంఐ-8 శ్రేణి హెలికాప్టర్లు తరచు ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ రష్యాలో వాటిని ఎక్కువగా వినియోగిస్తుండడం గమనార్హం. -
గజేంద్ర విలాపం
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో వివిధ కారణాల రీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో 528 ఏనుగులు అసహజ రీతిలో మృత్యువాత పడ్డాయంటూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించిన నేపథ్యంలో జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా విద్యుదాఘాతం కారణంగా గత ఐదేళ్లలో (2019–20 నుంచి 2023–24 వరకు) అత్యధికంగా 392 ఏనుగులు మృత్యువాతపడగా.. ఆ తరువాత రైళ్ల ప్రమాదాల బారిన పడి 73 ఏనుగులు మృతి చెందాయి. వేటాడం ద్వారా 50, విషప్రయోగం చేసి 13 ఏనుగులను హతమార్చారు.విద్యుత్ కంచెలతోనే పెను ముప్పు..అటవీ ప్రాంతం సమీపంలోని పంట పొలాల్లోకి ఏనుగులు రాకుండా రైతులు విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తుండడంతో అత్యధికంగా ఏనుగులు మృతి చెందుతున్నాయి. విద్యుత్ ఘాతాల నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెలను తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. అండర్ గ్రౌండ్ లేదా, పోల్స్ పైన మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్రం తెలిపింది.ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కేంద్ర ప్రయోజిత పథకం ద్వారా ఏనుగులు, పరిరక్షణ, వాటి ఆవాసాల్లో చర్యలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రైలు పైలట్లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగు ఉనికి గురించి పైలట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్పాస్, ఓవర్పాస్ను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ ఫ్రంట్లైన్ సిబ్బంది, వన్యప్రా ణుల పరిశీలకులు రైల్వే ట్రాక్లపై రెగ్యులర్ పెట్రోలింగ్ చేయడం తదితర చర్యలను తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.ఏనుగు దంతాల కోసం.. ఏనుగు దంతాల కోసం అత్యధికంగా ఒడిశా, మేఘాలయ, తమిళనాడులో వేటాడి హతమారుస్తున్నారని, అలాగే అసోం, ఛత్తీస్గఢ్లో విషప్రయోగం చేస్తున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రాష్ట్రల్లో ఏనుగుల దంతాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. వేటగాళ్లు, విషప్రయోగాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. విద్యుదాఘాతంతో అత్యధికంగా ఒడిశాలో 71, అసోంలో 55, కర్ణాటకలో 52 మృతి చెందాయి. రైళ్లు ఢీ కొట్టిన ఘటనల్లో అత్యధికంగా అసోంలో 24, ఒడిశాలో 16 మృతి చెందాయి. వేటాడటం ద్వారా ఒడిశాలో అత్యధికంగా 17, మేఘాలయలో 14 ఏనులను చంపేశారు. అసోంలో విషప్రయోగం ద్వారా 10 ఏనుగులను హతమార్చారు. -
కూలిన భారీ చెత్తకుప్ప..18 మంది మృతి
కంపాల: ఉగాండా రాజధాని కంపాలలో డంపింగ్యార్డులోని మట్టితో కప్పేసిన భారీ చెత్తకుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు. మృతిచెందిన వారిలో చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారు.వీధుల్లో ప్లాస్టిక్ ఏరుకునే వారు చెత్తకుప్ప కూలిన సమయంలో అక్కడే ఉండటంతో వారు చెత్తకుప్ప కింద పడి మృతి చెందారు. భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యకు వర్షం అడ్డంకిగా మారింది. -
14 మంది మృతి యాదృచ్ఛికం కాదు: ఢిల్లీహైకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఆశాకిరణ్ షెల్టర్హోమ్లో స్వల్ప వ్యవధిలో 14 మంది మృతి చెందడం యాదృచ్ఛికం కాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. షెల్టర్హోమ్లో పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్రావ్ గేదెలతో కూడిన ధర్మాసనం ఈ కేసును సోమవారం(ఆగస్టు5) విచారించింది. ఈ సందర్భంగా బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. షెల్టర్ హోమ్లో ఉండాల్సినదాని కంటే ఎక్కువ మంది ఉంటే కొందరిని అక్కడి నుంచి తరలించాలని సూచించింది. షెల్టర్హోమ్లోని మంచినీటి పైపులైన్లతో పాటు డ్రైనేజీ పైపులైన్లను పరిశీలించాలని, అక్కడి తాగునీటి నాణ్యతను పరీక్షించాలని ఢిల్లీ జల్బోర్డును ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి షెల్టర్హోమ్లో మొత్తం 25 మంది చనిపోగా కేవలం జులైలోనే 14మంది మరణించారు. -
బీచ్లో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి
మొగదీషు: సోమాలియాలో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు రాజధాని మొగదీషులోని లిడో బీచ్కు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. బీచ్ హోటల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుడులో మొత్తం 32 మంది మృతిచెందగా మరో 63 మంది గాయపడ్డారు. మొగదీషులోని బీచ్లోని ఓ హోటల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపి అక్కడున్నవారిని భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం ఉగ్రవాదుల్లో ఒకరు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో చాలా మంది చనిపోయారు. పేలుడు తీవ్రతకు బీచ్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉగ్రవాదుల దాడి సమాచారమందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురు ఉగ్రవాదులను అంతమొందించారు. మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్ఖైదాతో సంబంధాలున్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. -
2020లో భారత్లో కరోనాతో... 11లక్షల అధిక మరణాలు
న్యూఢిల్లీ: కరోనా వల్ల 2020లో భారత్లో కేంద్రం చెప్పిన వాటికంటే ఏకంగా 11.9 లక్షల అధిక మరణాలు సంభవించినట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి పేర్కొంది. ఇది భారత్ అధికారిక గణాంకాల కంటే 8 రెట్లు, డబ్ల్యూహెచ్ఓ అంచనాల కంటే ఒకటిన్నర రెట్లు అధికం! 2019తో పోలిస్తే ఈ మరణాలు 17 శాతం అధికమని అధ్యయనం పేర్కొంది. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్, మరికొన్ని విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందుకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2019 నుంచి 2020 దాకా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా బాధితుల డేటాను సైతం పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్–19 సంబంధిత మరణాల్లో మూడింట ఒక వంతు మరణాలు ఇండియాలోనే చోటుచేసుకున్నాయని వెల్లడించారు. కోవిడ్–19 ప్రభావం వల్ల ప్రజల సగటు ఆయుర్దాయం 2.6 ఏళ్లు తగ్గినట్లు తెలిపారు. మహిళల ఆయుర్దాయం 3.1 ఏళ్లు, పురుషుల ఆయుర్దాయం 2.1 ఏళ్లు తగ్గినట్లు గుర్తించారు. అధ్యయనం వివరాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రికలో ప్రచురించారు.అవన్నీ కరోనా మరణాలు కాదు అధ్యయనం గణాంకాలపై కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అధ్యయనం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది. ఈ గణాంకాల్లో వాస్తవం లేదని, అవన్నీ కరోనా మరణాలు కావని పేర్కొంది. -
యూపీ, రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదాలు
లక్నో/జైపూర్: యూపీ, రాజస్థాన్లలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 11 మంది మృతి చెందారు. రాజస్థాన్లోని బికనీర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతులంతా హర్యానాకు చెందిన వారని సమాచారం. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జవడంతో అందులో ఇరుక్కున్నవారి మృతదేహాలను బయటికి తీయడం కష్టంగా మారింది. ప్రమాద తీవ్రతకు కారులో నుంచి ఇద్దరు దూరంగా పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఉన్నావోలో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి ఉత్తరప్రదేశ్లోని లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఉన్నావో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక స్కార్పియో వాహనం వేగంగా ట్రక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. స్కార్పియో ఢిల్లీ నుంచి అయోధ్య వెళుతున్నట్లు పోలీసులు చెప్పారు. -
ఒమన్లో కాల్పుల కలకలం
మస్కట్: ఒమన్లోని వాడీ అల్ కబీర్ ప్రాంతంలోని మసీదు సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం(జులై 16) తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా పులువురికి గాయాలయ్యాయని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పోలీసులు సంతాపం ప్రకటించారు. మసీదు దగ్గర భద్రత పెంచామని, కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లో బుధవారం(జులై 10) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో- ఆగ్రా హైవేపై ఉన్నావో వద్ద ట్రావెల్ డబుల్ డెక్కర్ బస్సు, పాల ట్యాంకర్ను వేగంగా ఢీకొట్టింది. #BreakingNews 🚨Major accident happened in Unnao, Uttar Pradesh18 Died & many injured. Double decker Bus collided with Tanker truck 🚛Road Safety must be taken seriously 🙁#Unnao #UP #उन्नाव #UttarPradesh pic.twitter.com/vMjfWHOk7T— Veena Jain (@DrJain21) July 10, 2024 ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకులు మృతి
సాక్షి,సంగారెడ్డిజిల్లా: మహారాష్ట్రలోని పుణె నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు యువకులు అజ్మీర్ దర్గా సందర్శన కోసం వెళ్లారు. దర్గా సందర్శించుకుని తిరిగి వస్తుండగా పుణె శివారులోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, ఖురేషి, రఫిక్, ఫిరోజ్ కురేషి, మజీద్ పటేల్ ప్రమాద స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ అమర్ను పుణెలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. -
హజ్ యాత్ర మృతులపై సౌదీ అధికారిక ప్రకటన.. మరణాలు ఎన్నంటే?
ఇటీవల సౌదీ అరేబియాలో హజ్ యాత్ర సందర్భంగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. ఈ సందర్భంగా యాత్రకు వచ్చిన వారిలో 1301 మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో అస్వస్థతకు గురైన పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు చెప్పుకొచ్చింది.కాగా, సౌదీ అరేబియా హజ్ యాత్రకు ఈ ఏడాది పలు దేశాల నుంచి కొన్ని లక్షల మంది వచ్చారు. దాదాపు 22 దేశాల నుంచి పది లక్షల మంది యాత్రికులు రాగా.. సౌదీ అరేబియా పౌరులు రెండు లక్షలకుపైగా హాజరయ్యారు. పది లక్షలకు మించి ముస్లింలు ఈజిప్టు నుంచి వచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది.అయితే, ఈ ఏడాది అధికార వేడి కారణంగా ఉక్కుపోతతో యాత్రికులు ఇబ్బందిపడ్డారు. చాలా మంది ఎండలో కాలినడకన యాత్రకు రావడంతో వారి ఆరోగ్యం క్షీణించింది. వందలాది మంది క్యూ లైన్లలో నిల్చోవడం జరిగింది. ఈ కారణంగా ఉక్కుపోతలో ఊపిరి ఆడక వారంతా చనిపోయినట్టు ప్రభుత్వం పేర్కొంది. అలాగే, చనిపోయిన వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్ చేయడానికి వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక, మరణాలు సంభవించిన రోజున రికార్డు స్థాయిలో 125 డిగ్రీల (ఫారెన్హీట్) నమోదు అయినట్టు అధికారులు చెప్పారు. Almost two millions of pilgrims has performed the Hajj easily and safely, with all needed services, the numbers of deaths are 1301 and 83% of them has no permit and tried to came to #Mecca through mountains with no shelter and with high temperatures #Hajj pic.twitter.com/QOt2Hytndt— Ahmmed (@Ahmeeed_839) June 24, 2024 మరోవైపు.. హజ్ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్రకు వెళ్లినట్లు తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాల వల్లే వీరంతా మరణించారని వెల్లడించింది. అయితే గతంలో కన్నా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గిందని, గత ఏడాది 187 మంది మరణించినట్టు పేర్కొంది.ఇదిలా ఉండగా.. సౌదీ అరేబియా హజ్ యాత్ర చరిత్రలో మరణాలు అసాధారణం ఏమీ కావు. కొన్ని సార్లు రెండు మిలియన్ మంది వరకు యాత్రలో పాల్గొనే సంఘటనలు ఉన్నాయి. 2015లో మీనాలో తొక్కిసలాటలో 2400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే సంవత్సరం మీనా వద్ద తొక్కిసలాటలో 111 మంది చనిపోయారు. 1990లో హజ్యాత్ర సందర్భంగా 1426 మంది చనిపోయారు. అయితే ఈసారి హీట్వేవ్తో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. Akibat cuaca panas ekstrem di mekkah melebihi 50° , setidaknya lebih dari 550 jema'ah hajj meninggal dunia dan lebih 2.000 orang di rawat.Innalilahi wa innailaihi rooji'un.Meninggal diwaktu yang indah, ditempat yang indah dan sedang memakai pakaian terindah. pic.twitter.com/HgbcnUU8UM— Humairah (@Humairah_922) June 19, 2024 -
ఆ భార్యాభర్తల మృతి తర్వాతే.. 55కి చేరిన తమిళనాడు కల్తీ కాటు మృతుల సంఖ్య!
చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 15 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 55కు చేరుకుంది. ప్రస్తుతం ఇంకా 100 మందికిపైనే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీళ్లలోనూ 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.ఇక, కల్తీ సారా ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించింది. విచారణ చేపట్టాలని ఆదేశించింది. కాగా, సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా.. ఈ కేసు విచారణను సీబీసీఐడీతో కాకుండా సీబీఐతో జరిపించాలని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. #DGNews | #Kallakurichi illicit #liquor deaths:Nos of deceased at Kallakurichi Government Hospital - 30Mundiampakkam Government Hospital - 4Salem Government Hospital - 18JIPMER Hospital in Puducherry - 3Total number of deaths - 55#tamilnadu #கள்ளக்குறிச்சி #Resign_Stalin— Saji Agniputhiran (@Sajiagniputhira) June 22, 2024 మరోవైపు.. కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 55 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ స్పీకర్ అప్పావు వారిని మార్షల్స్తో బయటకు పంపించి వేశారు. ఈ ఆందోళనల్లో ఏఐఏడీఎంకేలోని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం సభ్యులు పాల్గొనక పోవడం గమనార్హం. #WATCH | Tamil Nadu | On Kallakurichi Hooch tragedy, PMK President Dr. Anbumani Ramadoss says, "We want a CBI inquiry into the incident...It is a sad & unfortunate incident which has happened in Kallakurichi. Last year, in the Villipuram & Kanchipuram districts, 29 people died… pic.twitter.com/uPvJvsIWIo— ANI (@ANI) June 21, 2024నిర్లక్ష్యం వల్లే ఇన్ని ప్రాణాలా?కరుణాపురంలో కల్తీసారా తాగి తొలుత దివ్యాంగుడైన పెయింటర్ సురేష్ (35) చనిపోయాడు. ఇదే సారా తాగిన ఆయన భార్య వడివుక్కరసి గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. అయితే డాక్టర్లు ఇద్దరు సహజంగా.. అనారోగ్యంతో చనిపోయారని ప్రకటించారు. రెండు రోజుల తర్వాతే కల్తీసారా వల్లే దంపతులు చనిపోయారని వైద్యులు ప్రకటించారని సురేష్ సోదరుడు మీడియాకు చెబుతున్నాడు. ఒకవేళ.. వీళ్లిద్దరూ చనిపోయిన కారణాలను వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తే మిగిలినవారైనా బతికేవారేమోనన్న చర్చా నడుస్తోందక్కడ. అయితే కావాలనే ఆ కారణం బయటకు చెప్పకుండా వైద్యులు ఉన్నారన్న విమర్శ ఒకటి వినిపిస్తోంది. మరోవైపు.. ఈ భార్యాభర్తలవి కల్తీసారా మరణాలు కావని స్థానిక కలెక్టర్ చెప్పినట్లు అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. ఆయన ప్రకటన తర్వాతే.. మిగతా వాళ్లు సారా తాగి ప్రాణాలు పొగొట్టుకున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కలెక్టర్ను బదిలీ చేశారు. ఎస్పీని సస్పెండ్ చేశారు. కళ్లకురిచ్చిలో కల్తీసారా విక్రేతల నుంచి పోలీసులకు మామూళ్లు వెళ్తుంటాయని బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం మృతుల్లో కళ్లకురుచ్చి ప్రభుత్వాసుపత్రిలోనే 28 మంది ప్రాణాలు వదిలారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురు కంటిచూపు కోల్పోయారు. ఈ ప్రాంతం మారుమూల ఉండడం, సకాలంలో వైద్యం అందకపోవడంతోనే పరిస్థితికి కారణమైంది. -
Kuwait Fire: కువైట్లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో భారతీయులు
కువైట్ సిటీ: కువైట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం (జూన్12) తెల్లవారుజామున 3 గంటలకు సదరన్ అహ్మదిలోని మంగాఫ్లో ఉన్న ఆరు ఫ్లోర్ల అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్లోని ఒక గదిలో ఉన్న కిచెన్ నుంచి ముందుగా మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మంటల్లో మొత్తం 53 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 40 మంది దాకా భారతీయులే. తీవ్రంగా గాయపడిన మరో 40కి పైగా మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినపుడు అపార్ట్మెంట్లో 160 మంది దాకా ఉన్నట్లు సమాచారం. వీరంతా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న నిర్మాణ రంగ కార్మికులని సమాచారం. అగ్ని ప్రమాద ఘటనపై కువైట్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విచారం వ్యక్తం చేశారు. -
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పోర్ట్మోర్స్బీ: పపువా న్యూ గినియాలో కొండచరియలు భారీ బీభత్సాన్ని సృష్టించాయి. శుక్రవారం(మే24) సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో తొలుత 100 మందికిపైగా మృతి చెంది ఉండొచ్చని భావించారు. అయితే మృతుల సంఖ్య భారీగానే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి(యూఎన్) తాజాగా అంచనా వేసింది. ఈ విపత్తులో సుమారు 670 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ‘అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎమ్)’తెలిపింది. గ్రామాలకు గ్రామాలే కొండచరియల కింద కూరుకుపోయినట్లు సమాచారం. మొత్తం 150 ఇళ్లు కొండ చరియల కింద శిథిలమయ్యాయని తేలింది. దీంతో 670 మంది సమాధి అయ్యారని అంచనా వేస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. -
విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ప్రాణనష్టం
పోర్ట్మోర్స్బీ: పపువా న్యూ గినియాలో ప్రకృతి ఆగ్రహించింది. రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారిక మీడియా వెల్లడించింది. తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు ఒక్కసారిగా విరిగి కింద ఉన్న ఆరు గ్రామాలపై పడ్డాయి. పెద్ద సైజు రాళ్లు పడి గ్రామాల్లోని చాలావరకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజలు నిద్రలో ఉన్నపుడు ఇళ్లపై పెద్ద సైజు కొండ రాళ్లు పడటంతో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.కొండ రాళ్ల కింద శిథిలాలు భారీగా కూరుకుపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా మృతదేహాలను వెలికితీశారు. కొండ రాళ్లు విరిగిపడిన గ్రామానికి పోలీసులు, సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదని తెలుస్తోంది. మృతుల సంఖ్యపై న్యూగినియా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో సోమవారం(మే20) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావర్ధాలో ప్యాసింజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వాహనం 20 అడుగుల లోయలో పడిపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువైంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినపుడు వాహనంలో 25 నుంచి 30 మంది దాకా ప్రయాణిస్తున్నారు. -
బీపీతో హార్ట్ఎటాక్
సాక్షి, హైదరాబాద్: బీపీతో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. భారత్లో ఏటా అధిక రక్తప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో సంభవించే మరణాలకు మొదటి ప్రధాన కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. రెండో కారణం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మూడోది డయేరియా, నాలుగోది ఎయిడ్స్, ఐదోది టీబీ, ఆరోది మలేరియా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉమ్మడి నివేదిక తేలి్చచెప్పింది. ఆయా సంస్థలు బీపీని కట్టడి చేసే విధానంపై నివేదిక రూపొందించాయి.2017లో ప్రారంభమైన ఇండియన్ హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్ (ఐహెచ్సీఐ)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది. 2025 నాటికి దేశంలో బీపీ రోగుల సంఖ్యను 25 శాతం తగ్గించాలని నిర్ణయించింది. ఐహెచ్సీఐ కార్యక్రమాన్ని ఈ మూడు సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. 25 రాష్ట్రాల్లోని 141 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 21,579 ఆరోగ్య కేంద్రాల్లో 30 కోట్ల మందిని ఈ కార్యక్రమం పరిధిలోకి వచ్చారు. 19 రాష్ట్రాల్లో బీపీ నియంత్రణ ప్రొటోకాల్ తయారుచేశారు. ఈ కార్యక్రమం మొదటి దశ తెలంగాణ, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రారంభమైంది.18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ... భారత్లో 18 ఏళ్లు పైబడిన ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ ఉంది. అలా 20 కోట్ల మంది బీపీతో బాధపడుతున్నారు. అందులో సగం మందికి బీపీ ఉన్నట్లే తెలియదు. కేవలం 10 శాతం మందే బీపీని అదుపులో ఉంచుకుంటున్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ బీపీ చెక్ చేయాలని ఆ నివేదిక పేర్కొంది. 2025 నాటికి 4.5 కోట్ల మంది బీపీని అదుపులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు... ⇒ ఐహెచ్సీఐ కార్యక్రమం అమలయ్యే చోట నర్సులు, డాక్టర్లు ప్రత్యేకంగా ఉంటారు. అయితే, తెలంగాణ, మహారాష్ట్రల్లో మాత్రమే ప్రత్యేకంగా ఉన్నారు. ⇒ తెలంగాణలో ఈ విధానం అమలులో ఉన్నందున ఏఎన్ఎంలు ఇళ్లకు వెళ్లి బీపీ చెక్ చేస్తున్నారు. ఫోన్ ద్వారా కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ⇒ ఈ కార్యక్రమం కోసం సగటున ఒక వ్యక్తికి ఏడాదికి రూ. 200 మాత్రమే మందుల కోసం ఖర్చవుతుంది. ⇒ బాధితులు ప్రొటోకాల్లో ఉన్న మందులను ఒక నెల అడ్వాన్స్లో ఉంచుకోవాలి. ⇒ తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్లలో 6 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. కేరళలో నెల రోజులు, మహారాష్ట్రలో 2 నెలల స్టాక్ ఉంది. బీపీ రోగులు వ్యాయామం చేయాలి బీపీ రోగులు పొగాకు, మద్యం మానుకోవాలి. ఉప్పు ఒక స్పూన్కు తగ్గించుకోవాలి. ప్రతీ వారం రెండున్నర గంటల వ్యాయామం చేయాలి. రోజుకు నాలుగైదు సార్లు పండ్లు, కూరగాయలు తినాలి. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ చెక్ చేయాలన్న నియమం పెట్టుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో 30 ఏళ్లు పైబడిన వారికే బీపీ చూస్తారు. బీపీ ఉంటే ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు. మందులు తప్పనిసరిగా వాడాలి. –డాక్టర్ కిరణ్ మాదల, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం -
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
సిడ్నీ: ప్రపంచంలో హీట్వేవ్ వల్ల సంభవించే మరణాల్లో అయిదో వంతు భారత్లోనేని ఒక అధ్యయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా హీట్వేవ్ కారణంగా 1.53లక్షల మందికిపైగా మరణిస్తుండగా ఇందులో ఐదో వంతు మంది భారత్లో చనిపోతుండడం కలవరం కలిగిస్తోంది. హీట్వేవ్ మరణాల్లో భారత్ తర్వాత వరుసగా చైనా, రష్యా దేశాలున్నాయి. మొత్తం హీట్వేవ్ మరణాల్లో సగం ఆసియా నుంచే కావడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. 1990 నుంచి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా హీట్వేవ్తో సంభవిస్తున్న మరణాలను యూనివర్సిటీ అధ్యయనం చేసింది. మొత్తం మరణాల్లో 30 శాతం యూరప్లో సంభవిస్తున్నాయని తేలింది. ప్రభుత్వాలు హీట్వేవ్ల పట్ల సమగ్ర దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేసినప్పుడే మరణాలను అరికట్టవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.క్లైమేట్ చేంజ్ మైగ్రేషన్ పాలసీ, హీట్ యాక్షన్ ప్రణాళికలు, అర్బన్ ప్లానింగ్ అండ్ గ్రీన్ స్ట్రక్చర్స్, సామాజిక మద్దతు కార్యాచరణ, పబ్లిక్ హెల్త్కేర్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ అవేర్నెస్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ వంటి చర్యలు హీట్వేవ్ మరణాలు నివారించడానికి తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. -
జమ్మూ- శ్రీనగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
జమ్మూ: జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం(మార్చ్ 29) తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న ట్యాక్సీ వాహనం రాంబన్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 10 మంది దాకా మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్), సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్టీ) ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి.. ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం -
బస్సు లోయలో పడి 45 మంది మృతి
కేప్ టౌన్: ఈస్టర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని బస్సు ప్రమాదం కబళించింది. దక్షిణాఫ్రికాలోని లింపొపొ ప్రావిన్స్లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్క చిన్నారి గాయాలతో సజీవంగా బయటపడింది. బోట్స్వానాకు చెందిన వీరంతా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈస్టర్ ఉత్సవాలకు వెళ్తున్నారు. అదుపు తప్పిన బస్సు కొండప్రాంతంలోని ఎంమట్లకలా వద్ద వంతెన బారియర్లను ఢీకొట్టింది. ఆ పక్కనే ఉన్న 164 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ముక్కలైన బస్సులో భారీగా మంటలు చెలరేగి కొందరు సజీవ దహనం కాగా, మరికొందరు దూరంగా పడిపోయారు. ఘటనలో డ్రైవర్ సహా మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోగా ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే సజీవంగా బయటపడింది. మంటల్లో కొందరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో నుజ్జయిన బస్సులో ఇరుక్కుపోయాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిదేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పొరుగు దేశం బొట్స్వానాకు చెందిన బాధితులంతా దక్షిణాఫ్రికాలోని మోరియా పట్టణంలో ఘనంగా జరిగే ‘జియోన్ క్రిస్టియన్ చర్చి’ ఈస్టర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫొసా బొట్స్వానా అధ్యక్షుడు మసిసితో ఫోన్లో మాట్లాడారు. ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈస్టర్ పండుగ రద్దీ సమయంలో రోడ్డు ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టినప్పటికీ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. #BREAKING : Bus Accident Kills 45 In South Africa At least 45 people were killed as a result of a bus accident, South Africa's Department of Transportation said. An 8-year-old girl is reportedly the only survivor. The crash occurred near Mamatlakala in the northern province of… pic.twitter.com/15tGAbdAM0 — upuknews (@upuknews1) March 29, 2024 బ్రిడ్జి పై నుంచి కింద పడి నేలను ఢీకొట్టిన తర్వాత బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. దీంతో ప్రమాదంలో మరణించిన కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయి. కొన్ని మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుపోగా మరికొన్ని చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు బోట్సువానా నుంచి మొరియా పట్టణానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి.. ప్రముఖ సైకాలజిస్ట్ కన్నుమూత -
బ్రెజిల్లో తుపాను బీభత్సం
రియోడిజెనెరియో: బ్రెజిల్లో తుపాను బీభత్సం సృష్టించింది. రియోడిజెనెరియో రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో తుపాను సృష్టించిన అల్లకల్లోలానికి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పెట్రోపోలిస్ పట్టణంలో ఓ ఇళ్లు కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఒక బాలికను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అదే ప్రాంతంలో బాలిక తండ్రి మృతదేహాన్ని కనుగొన్నారు. సాంటా క్రుజ్ ద సెర్రాలో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. పెట్రోపోలిస్ నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని, క్విటాదిన్హా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పాటు భారీ వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయని రియోడిజెనెరియో గవర్నర్ క్యాస్టట్రో తెలిపారు. వాతావరణ మార్పుల వల్లే బబ్రెజిల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. పపువా న్యూ గినియాలో భూకంపం -
అసలేంటి ఈ స్నేక్ వెనమ్: సెలబ్రిటీలకు అంత మోజు ఎందుకు?
రేవ్ పార్టీలలో బడాబాబులు, సెలబ్రేటీలు అమ్మాయిలతో డ్యాన్సులు, మాదక ద్రవ్యాలు, అశ్లీల డ్యాన్సులు సాధారణంగా వినిపించేవి. మరి కొందరు మత్తు పదార్థాలూ తీసుకుంటారు. మరి సీక్రెట్గా పోలీసుల కంట పడకుండా రేవ్ పార్టీల్లో పాము విషం ఎందుకు హల్చల్ చేస్తోంది. పాము విషం చాలా ప్రమాదకరం. కొన్ని పాములు కరిచిన క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసి పోవడం ఖాయం. మరి ఇంత ఖరీదైన పార్టీల్లో పాము విషానికి కోట్లాది రూపాయల డిమాండ్ ఎందుకు? చాలామంది సెలబ్రిటీలు పాము విషాన్ని డ్రగ్లా ఎందుకు వాడుతున్నారు? వివరాలను ఒకసారి చూద్దాం! ప్రముఖ యూట్యూబర్, ఓటీటీ 'బిగ్ బాస్' విజేత ఎల్విష్ యాదవ్, రేవ్ పార్టీలలో పాము విషాన్ని విక్రయించిన ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. వీరినుంచి స్వాధీనం చేసుకున్న శాంపిల్స్లో నాగుపాము, క్రైట్ జాతుల విషం ఉన్నట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే ఏమిటి? దీన్ని ఎందుకు తీసుకుంటారు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే ఏమిటి? అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన నాగు పాముల విషానికి రేవ్ పార్టీలలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పాము విషాన్ని పౌడర్గా ప్రాసెస్ చేస్తారు. డ్రగ్స్ మాఫియాలో ఇదొక ఘోరమైన రూపంగా అవతరిస్తోంది. ఈ పౌడర్లోని న్యూరోటాక్సిన్ల కారణంగా విపరీత మైన మత్తు రావడంతోపాటు, ఇతర అనేక రకాల లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఈ రకమైన వ్యససాన్ని అఫిడిజం అని పిలుస్తారు. బాగా ఎత్తును పొందుతారు, ఎక్కువ గంటలు నృత్యం చేయగలరు. ఈ పౌడర్ బలాన్ని బట్టి ఆరు-ఏడు గంటల నుంచి ఐదు-ఆరు రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. నిజానికి స్నేక్ వెనమ్ అడిక్షన్ చాలా ప్రమాదకరమైనది , ప్రాణాంతకమైనది కూడా. దీర్ఘకాలంగా దీన్ని వినియోగిస్తున్న వారు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతారు. అందుకే నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో దీన్ని సేవిస్తారట. స్నేక్ వెనమ్ ప్రోటీన్-ఆధారిత టాక్సిన్ అని, ఇది కడుపులోని ఆమ్లాలు, జీర్ణ ఎంజైమ్ల సహాయంతో జీర్ణమవుతుందని చెబుతున్నారు. విషానికి విరుగుడుగా వైద్యులు అందించే సూది మందును సైతం చాలా కొద్ది పరిమాణంలో విషంతో తయారు చేస్తారట. ముఖ్యంగా విదేశాల్లో పాము విషానికి డిమాండ్ ఎక్కువ, ఇది క్రమ మన దేశానికి పాకుతుండటం గమనార్హం. గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్నిరకాల ఔషధాల్లోనూ పాము విషాన్ని వినియోగిస్తారట. పాము కాటు వేస్తే ఏం జరుగుతుంది? కట్ల పింజరి, కట్ల పాము, రాచ నాగు లాంటితో పోలిస్తే నాగు పాములే అత్యంత విషపూరితమైనవిగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,500 రకాల పాములు ఉన్నాయట. అయితే వీటిలో 25 శాతం మాత్రమే విషపూరితమైనవి. ఒక విషపూరితమైన పాము మనిషిని లేదా ఇతర జీవులను కాటు చేసినప్పుడు అది విషపూరితమైన ప్రోటీన్లు, ఎంజైమ్లు, ఇతర పరమాణు పదార్ధాల సంక్లిష్ట మిశ్రమాన్ని రక్త ప్రవాహంలోకి చేరతాయి. దీంతో ఆ పాము విష తీవ్రతను బట్టి, గుండెలోని రక్తం గడ్డ కట్టడం, పక్షవాతం, అంతర్గత రక్తస్రావం లాంటి ప్రమాదకర సంకేతాలు కనిపిస్తాయి. కోలుకోలేని విధంగా మూత్రపిండాలు పాడు కావడం, కణజాల నష్టం,శాశ్వత వైకల్యం , అవయవాలను కోల్పోవడం లాంటివి జరగవచ్చు. ప్రతీ ఏడాది 50 లక్షలమందికిపైగా పాము కాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆఫికా, ఆసియా, మధ్య , దక్షిణ అమెరికా తదితర దేశాల్లో పాము కాటు అనేది తీవ్రమైన సమస్యగా పేర్కొంటారు. 2023 లెక్కల ప్రకారం ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 5.4 మిలియన్ల మంది ప్రజలు పాము కాటు బారిన పడుతున్నారు. సుమారు 81 వేలనుంచి లక్షా,38 వేల దాకా మరణిస్తున్నారు. 1.8 నుండి 2.7 మిలియన్ల మంది పాము కాటు ప్రభావానికి గురవుతున్నారు. మూడు రెట్లకు పైగాబాధితులు శాశ్వత వికలాంగులుగా మారిపోతున్నారు. వ్యవసాయ కార్మికులు, పిల్లలు ఎక్కువగా పాము కాటుకు గురవుతున్నారు. -
USA: ఫ్లోరిడాలో కాల్పుల కలకలం
ఫ్లోరిడా: అమెరికా ఫ్లోరిడాలోని జాక్సెన్ విల్లా బీచ్ నగరం డౌన్ టౌన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులు జరిగిన డౌన్టౌన్ ప్రాంతంలో ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. జాక్సన్ విల్లే బీచ్లో 24వేల మంది జనాభా ఉంటారు. కాగా, అమెరికాలో చిన్న చిన్న గొడవలకు కాల్పులు జరపడం సర్వసాధారణంగా మారింది. ఇటీవలి కాలంలో కాల్పుల ఘటనల్లో పలువురు మృతి చెందారు. దేశంలో వేళ్లూనుకుపోయిన గన్ కల్చర్ ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్షల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి.. అమెరికాకు స్పేస్ ఎక్స్ నిఘా ఉపగ్రహాలు -
Adult Film Stars Serial Deaths: అదీ ఒక సినీ పరిశ్రమే.. అక్కడా చీకట్లెన్నో! (ఫొటోలు)
-
పాక్లో భారీ వర్షాలు.. 37 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్లోని ఆక్రమిత కశ్మీర్తోపాటు బలోచిస్తాన్, ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటల వ్యవధిలో ఈ ప్రాంతాల్లో వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్లో ఇళ్లుకూలి, ఇళ్లలోకి వరద చేరిన ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులేనని అధికారులు తెలిపారు. అదేవిధంగా, బలోచిస్తాన్, పీవోకేలో అయిదుగురు చొప్పున చనిపోయారు. గ్వాదర్ రేవు పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. చైనా–పాకిస్తాన్లను కలిపే కారకోరం హైవే మూతబడింది. -
Texas: విజృంభిస్తున్న కార్చిచ్చు.. భారీగా నష్టం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లో కొద్ది రోజులుగా కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. పానాండిల్, ఓక్లహామా ప్రాంతాల్లో దావానలంలా వ్యాపించిన అతిపెద్ద కార్చిచ్చు స్మోక్హౌజ్క్రీక్ఫైర్ కారణంగా ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 4వేల 4 వందల కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని దహించి వేసిన ఈ కార్చిచ్చులో చాలా ఇళ్లు, నిర్మాణాలు లక్షల సంఖ్యలో చెట్లు కాలిపోయాయి. కార్చిచ్చు వల్ల కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని పూర్తిగా తేల్చలేకపోతున్నామని అధికారులు తెలిపారు. పానాండిల్ ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ఇప్పటివరకు 500 వరకు నిర్మాణాలు మంటల్లో కాలిపోయాయని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. కార్చిచ్చు వల్ల కాలిపోయిన నిర్మాణాలను పరిశీలిస్తే అక్కడ బూడిద తప్ప ఏమీ మిగలలేదని మీడియాతో అబాట్ వ్యాఖ్యానించారు. ఈ వారాంతంలో వాతావరణపరిస్థితులు కార్చిచ్చుకు మరింత అనుకూలంగా మారుతున్నాయని, టెక్సాస్ ఓక్లహామా, కాన్సాస్, న్యూ మెక్సికోలో అగ్ని కీలలు మరింత విజృంభిస్తాయని జాతీయ వాతావరణ సేవల కేంద్రం తెలిపింది. ఇదీ చదవండి.. అమెరికాలో మరో భారతీయుడి హత్య -
Dhaka: ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకాలో ఏడంతస్తుల భవనంలో గురువారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 44 మంది చనిపోగా చాలా మంది గాయపడ్డారు. శ్వాససంబంధ సమస్యల కారణంగా గాయపడ్డవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సమంతాలాల్ తెలిపారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. తొలుత భవనం మొదటి అంతస్తులోని రెస్టారెంట్లో చెలరేగిన మంటలు తర్వాత పై అంతస్తులోని మరిన్ని రెస్టారెంట్లకు వ్యాపించాయి. పై అంతస్తుల్లో రెస్టారెంట్లతో పాటు దుస్తుల దుకాణం కూడా మంటల్లో కాలిపోయింది. ఇప్పటివరకు అగ్నిమాపక సిబ్బంది 75 మందిని రక్షించి అక్కడి నుంచి తరలించారు. అయితే వీరిలో 42 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఘటనలో కొందరు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ప్రమాదం జరిగిన భవనంలో ప్రతి అంతస్తులో రెస్టారెంట్లుండటంతో గ్యాస్ సిలిండర్లు ఎక్కువయి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘనటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి.. గాజాలో ఘోరం ఇజ్రాయెల్ కీలక ప్రకటన -
Bamako: మాలిలో ఘోర బస్సు ప్రమాదం
బమాకో: పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 31 మంది మరణించారు. మంగళవారం రాత్రి కెనీబా పట్టణంలో బ్రిడ్జిపై నుంచి వెళుతున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు బుర్కినా ఫాసోకు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చనిపోయిన వారిలో మాలి పౌరులతో పాటు ఇతరులు కూడా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ ఆఫ్రికాలో ప్రజా రవాణాలో ఏ మాత్రం ప్రమాణాలు ఉండవు. బస్సులు, రైళ్లు కిక్కిరిసి వెళుతుంటాయి. దీంతో ఇక్కడ ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. ఇదీ చదవండి.. రష్యా హక్కుల నేతకు 30 నెలల జైలు -
గుజరాతీ కుటుంబం మృతి కేసు.. యూఎస్లో భారత సంతతి వ్యక్తి అరెస్ట్!
రెండేళ్ల క్రితం(2022) జరిగిన మావన అక్రమ రవాణా ఘటనలో విచారించేందుకు భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికాలోని చికాగోలో అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యులు గల గుజరాతీ కుటుంబం కెనడా నుంచి చట్టవిరుద్ధంగా యూఎస్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా వారు చలిని తట్టుకోలేక గడ్డకట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అమెరికా అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో భారత సంతతికి చెందిన హర్షకుమార్ రామన్లాల్ పటేల్ను చికాగోలోని ఓ హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. రామన్ ఫిబ్రవరి 28న నిర్బంధ విచారణకు హాజరుకానున్నారని చికాగో ట్రిబ్యూన్ పేర్కొంది. డర్టీ హ్యారీ, పరంసింగ్, హరేష్ రమేశ్లాల్ పటేల్ తదితర పేర్లతో చలామణీ అవుతున్న పటేల్.. విదేశీయులను అక్రమంగా రవాణా చేయడం, ఇందుకు కుట్ర పన్నడం లాంటి అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. మానవ అక్రమ రవాణా కుట్రలో పటేల్ ప్రమేయంపై మిన్నెసోటా జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. 2022, జనవరి 19న జరిగిన మానవ అక్రమ రవాణాపై ఈ కోర్టులో విచారణ జరుగుతోంది. భారత్లోని గుజరాత్కు చెందిన జగదీష్ పటేల్( 39)తో పాటు అతని కుటుంబ సభ్యులైన వైశాలిబెన్ పటేల్ (37), విహంగీ పటేల్ (11), ధార్మిక్ పటేల్ (3)లు కెనడా సరిహద్దులోని ఎమర్సన్, మానిటోబా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ, చలికి తట్టుకోలేక గడ్డ కట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు, స్వాధీనం చేసుకుని, ఈ కేసుతో సంబంధమున్న స్టీవ్ షాండ్ (47)ను అరెస్ట్ చేశారు. హర్షకుమార్ పటేల్, షాండ్ మధ్య కమ్యూనికేషన్ వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని గ్యాంబ్లింగ్ నిర్వహణకు హర్షకుమార్ రామన్లాల్ పటేల్ మేనేజర్గా వ్యవహరిస్తున్నాడని షాండ్ తెలిపాడు. వీరిద్దరూ ఫోన్లో పలు విషయాలు మాట్లాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. 2022, జనవరి 19న నార్త్ డకోటా, మిన్నెసోటాలలోని చలి వాతావరణం గురించి వీరు ఫోనులో చర్చించుకున్నారు. మంచు తుఫాను పరిస్ధితులు ఉన్నందున జగదీష్ పటేల్ కుటుంబ సభ్యులంతా తగిన దుస్తులు ధరించారో లేదో చూడాలని షాండ్కు పటేల్ ఓ సందేశంలో సూచించాడు. ఈ కేసు విచారణకు సంబంధించి ఢిల్లీలోని హోంలాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) అధికారి గుజరాత్ పోలీసులతో సమావేశమైనట్లు మిన్నెసోటా జిల్లా కోర్టు పేర్కొంది. -
Spain: అపార్ట్మెంట్లలో చెలరేగిన మంటలు.. నలుగురు మృతి
మాడ్రిడ్: స్పెయిన్లోని వాలెన్సియా పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండు 14 అంతస్తుల అపార్ట్మెంట్లలో చెలరేగిన మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో పిల్లలు, ఫైర్ సిబ్బంది ఉన్నారు. మరో 14 మంది జాడ తెలియడం లేదు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది క్రేన్ల సాయంతో అపార్ట్మెంట్లలో చిక్కుకున్నవారిని రక్షించారు. తొలుత ఒక అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్కు వ్యాపించాయి. భారీ అగ్ని జ్వాలలు, పొగ ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. భవన నిర్మాణంలో వాడిన సామగ్రి కారణంగానే మంటలు వేగంగా వ్యాపించినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచేజ్ అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. BREAKING: Entire multi-storey building on fire in Valencia, Spain pic.twitter.com/sTXMm6KY4p — Insider Paper (@TheInsiderPaper) February 22, 2024 ఇదీ చదవండి.. రష్యాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచన -
ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం
పాట్నా: బిహార్లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మది మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి తీవ్రంగా ఉంది. 15 మందితో ఒక ఆటో లఖిసరాయ్ నుంచి సికంద్రా వైపు వెళుతుండగా గుర్తుతెలియని వాహనం దానిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన వాహనం ఏదనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి.. మంచు వర్షాలు.. రోడ్లు మూసివేత -
న్యూయార్క్ వర్సిటీలో కలకలం.. స్టూడెంట్స్ వరుస మరణాలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవంల రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తేదీన 19 ఏళ్ల జాక్వెలిన్ బీజిల్ అనే విద్యార్థిని లిప్టన్ హాల్లో అచేతన స్థితిలో పడి ఉంది. ఎమర్జెన్సీ డాక్టర్ల బృందం వచ్చి పరిశీలించగా ఆ స్టూడెంట్ చనిపోయినట్లు తేలింది. ఇక డోరీ సాల్టి అనే మరో విద్యార్థి శనివారం ఆర్ట్ డిపార్ట్మెంట్కు చెందిన బర్నే బిల్డింగ్ బయట పడిపోయి ఉంది. ఈ విద్యార్థిని బిల్డింగ్ మీద నుంచి పడిపోయిందా లేక భవనం మీద నుంచి దూకిందా అన్న విషయంపై క్లారిటీ లేదు. సాల్టి కుటుంబానికి సన్నిహితులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. యూనివర్సిటీలో మానసిక సంబంధమైన సమస్యలకు సరైన కౌన్సెలింగ్ లేకపోవడం వల్లే విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. కనీసం చివరి చూపు చూసుకోనివ్వండి -
TN: బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 10 మంది మృతి
చెన్నై: తమిళనాడు విరుదునగర్ జిల్లా శివకాశిలోని ఓ బాణసంచా పరిశ్రమలో శనివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడు కారణంగా పరిశ్రమలో పనిచేస్తున్న 10 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పరిశ్రమలో మొత్తం 200 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. గాయపడ్డవారిని శివకాశీలోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పేలుడు ధాటికి బాణసంచా పరిశ్రమ పక్కనే ఉన్న రెండు భవనాలు నేలమట్టమయ్యాయి. పేలుడు సమయంలో పరిశ్రమలో చిక్కుకున్నవారిని బయటికి తీసుకురావడానికి, మంటలార్పడానికి అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన రసాయన ముడి పదార్థాలను నిల్వ చేయడం వల్లే పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పూర్తి నివేదిక సమర్పించాలని కలెక్టర్ జయశీలన్ ఆదేశించారు. ఇదీ చదవండి.. లిక్కర్ కేసులో కోర్టుకు హాజరైన కేజ్రీవాల్ -
Up: యమునా ఎక్స్ప్రెస్ వే పై ప్రమాదం.. ఐదుగురి సజీవ దహనం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మధుర పరిధిలోని మహవాన్ వద్ద యమునా ఎక్స్ప్రెస్ వేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మందితో ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొన్న ఘటనలో అయిదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వైపు వెళుతోంది. ఈ ప్రమాదం కారణంగా చెలరేగిన మంటల్లో కారు పూర్తిగా కాలిపోయి అందులోని వ్యక్తులు సజీవ దహనమైనట్లు సమాచారం. బస్సులో ఉన్నవారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. ఇదీ చదవండి.. పారా గ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ టూరిస్టు మృతి -
Philippines: విరిగిపడ్డ కొండ చరియలు.. 54 మంది మృతి
మనీలా: పిలిప్పీన్స్లోని డావో ప్రావిన్సు మాకో టౌన్లో బంగారు గని సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 54 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. కొండ చరియల కింద ఇళ్లు, వాహనాలు కూరుకుపోయాయి. గత వారం జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు జరుగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయని డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మూడు వందల మందితో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, బురద వల్ల రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోంది. మళ్లీ కొండ చరియలు విరిగియ పడే అవకాశాలుండటంతో సహాయక సిబ్బంది ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. కొండ చరియలు విరిగిపడ్డప్పటి నుంచి మొత్తం 63 మంది ఆజూకీ తెలియడం లేదు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. ఆగని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు -
యూఎస్లో భారత స్టూడెంట్స్ మరణాలు.. కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఇటీవల అమెరికాలో వరుసగా జరిగిన ఐదుగురు భారత విద్యార్థుల మరణాలకు ఒకదానితో మరొకదానికి ఎలాంటి సంబంధం లేదని, వాటి వెనుక ఎలాంటి కుట్ర లేదని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ వ్యవహారల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ గురువారం మీడియాకు వెల్లడించారు. ‘చనిపోయిన ఐదుగురు భారత విద్యార్థుల్లో ఇద్దరే భారత పౌరులు. మిగిలిన ముగ్గురు భారత సంతతికి చెందిన అమెరికా పౌరులే. డ్రగ్స్కు బానిసైన ఇల్లు లేని ఓ వ్యక్తి వివేక్ సైనీ అనే భారత విద్యార్థిని తలపై సుత్తితో 50సార్లు కొట్టి దారుణంగా చంపాడు. సిన్సినాటిలో జరిగిన మరో ఘటనలో మరో భారత విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వీరు కాక భారత సంతతికి చెందిన ముగ్గురు విద్యార్థులు వివిధ ఘటనల్లో మరణించారు. వీరిలో వివేక్ సైనీ హత్య కేసులో నిందితున్ని అరెస్టు చేశారు. విచారణ వేగంగా జరుగుతోంది.సిన్సినాటి ఘటనలో విద్యార్థి మృతికి సంబంధించిన వైద్య పరీక్షల రిపోర్టుల కోసం వేచి చూస్తున్నాం. భారత విద్యార్థుల మరణాలపై అమెరికాలోని ఆయా ప్రాంతాల ప్రభుత్వ యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నాం. మరణించిన వారి కుటుంబాలకు అవసరమైన సాయం చేస్తున్నాం’ అని జైస్వాల్ తెలిపారు. ఇదీ చదవండి.. ఢిల్లీలో రైతుల భారీ నిరసన.. అడ్డుకున్న పోలీసులు -
Monkey Fever: మంకీ ఫీవర్ కలకలం.. కర్ణాటకలో రెండు మరణాలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్తో ఇద్దరు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివరాల ప్రకారం.. మంకీ ఫీవర్తో కర్ణాటకలో ఇద్దరు మరణించారు. శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాకు చెందిన యువతి (18), ఉడుపి జిల్లా మణిపాల్కు చెందిన ఒక వృద్ధుడు (79) చికిత్స పొందుతూ మృతిచెందారు. జనవరి 8న సదరు యువతి చెందింది. ఇక, ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రణ్దీప్ వెల్లడించారు. ఈ క్రమంలో శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,288 నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో 49 మందికి మంకీ ఫీవర్ ఉన్నట్లు గుర్తించామన్నారు. కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుందన్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి కనిపిస్తాయని చెప్పారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. -
చిలీలో కార్చిచ్చు ఎఫెక్ట్.. 46 మంది మృతి, వేలాది మందికి..
చిలీ: చిలీలో కార్చిచ్చు కారణంగా 46 మంది మృతి చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న కారణంగా మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వివరాల ప్రకారం.. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చిలీలో చెలరేగిన కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. ఈ కార్చిచ్చులో ఇప్పటివరకు కనీసం 46 మంది మృతిచెందినట్లు అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ శనివారం వెల్లడించారు. వేలాది మంది గాయపడినట్లు తెలిపారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. దాదాపు 1,100 ఇళ్లు మంటల్లో కాలిబూడిదైనట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని బోరిక్ విజ్ఞప్తి చేశారు. Dramatic rescue amid raging wildfires 🔥 Moment when firefighters realised that there were people trapped inside burning vehicles as they crossed a highway in #Valparaiso in #Chile Salute 🙏🏽 #bomberos #IncendiosForestal #wildfire #fire #incendio #bushfire #emergency #viral… pic.twitter.com/HSe8SPKSuv — Earth42morrow (@Earth42morrow) February 4, 2024 ఇక, వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. కార్చిచ్చు కారణంగా మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని.. వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ కారణంగా మంటలు చెలరేగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిలీ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్లు మంత్రి కరోలినా వెల్లడించారు. ఇక మంటల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు. Wildfires kill at least 46 people in central Chile, more than 1500 homes destroyed.#IncendioForestal #ruta68 #incendioruta68 #incendio #Valparaíso #VinaDelMar #Chile #Incendios #BREAKING #Wildfire #Fire pic.twitter.com/MzZw3UXkNl — Chaudhary Parvez (@ChaudharyParvez) February 4, 2024 Chile declares state of emergency due to massive forest fires, more than 1000 houses destroyed, 46 fatalities reported.#IncendioForestal #ruta68 #incendioruta68 #incendio #Valparaíso #VinaDelMar pic.twitter.com/ORtQAUP2ls — Chaudhary Parvez (@ChaudharyParvez) February 4, 2024 Şili’de meydana gelen yangın sonrası#Chile pic.twitter.com/uEvyDevcu7 — Reptilian Planet (@reptilianplanet) February 4, 2024 -
China: స్కూల్లో అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి
బీజింగ్: చైనాలోని హెనన్ ప్రావిన్సులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి యశన్పూ గ్రామంలోని ఓ ఎలిమెంటరీ బోర్డింగ్ స్కూల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది చనిపోయారు. ఒకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా జినుహా న్యూస్ రిపోర్ట్ చేసింది. అయితే మృతి చెందిన వారిలో ఎంత మంది విద్యార్థులున్నారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. మంటలకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. 13 కుటుంబాలకు చెందిన 13 మంది చిన్న పిల్లలు ఒక్కసారిగా లేకుండా పోయారు. ఘటనకు కారణమైన వారికి కఠిన శిక్ష విధించకపోతే చనిపోయిన వారి ఆత్మలు శాంతించవని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదీచదవండి.. పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
China: బొగ్గుగనిలో భారీ పేలుడు.. 10 మంది మృతి
బీజింగ్: చైనాలోని హెనన్ ప్రావిన్సులోని ఓ అండర్ గ్రౌండ్ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. బొగ్గు గనిలో సహజంగా ఉత్పత్తయిన గ్యాస్ కారణంగా ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి 10 మంది కార్మికులు మరణించగా మరో ఆరుగురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సీసీ టీవీ వెల్లడించింది. పేలుడు జరిగినపుడు బొగ్గుగనిలో 425 మంది కార్మికులు పనిచేస్తున్నారు.పేలుడు తర్వాత బొగ్గుగనిలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గనుల భద్రతకు సంబంధించి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇటీవలి కాలంలో చైనాలోని బొగ్గుగనుల్లో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గనులపై ప్రభుత్వానికి సరైన నియంత్రణ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2022 సంవత్సరంలో చైనా గనుల్లో 168 ప్రమాదాలు జరగగా ఈ ప్రమాదాల్లో మొత్తం 245 మంది మృతి చెందారు. ఇదీచదవండి.. హౌతీలపై బ్రిటన్ అమెరికా దాడులు -
కోవిడ్ కొత్త కేసులు 774
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 774 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. అదే సమయంలో, యాక్టివ్ కేసుల సంఖ్య 4,187గా ఉందని తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో తమిళనాడు, గుజరాత్లలో ఒక్కరేసి చొప్పున బాధితులు చనిపోయారని పేర్కొంది. శీతల వాతావరణం, కోవిడ్–19 వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి కారణంగా కేసులు వేగంగా పెరుగుదల నమోదవుతోందని తెలిపింది. -
గజరాజుల మృత్యుఘోష
సాక్షి, అమరావతి: దేశంలో గజరాజుల మరణాలు ఇటీవల పెరిగాయి. విద్యుదాఘాతం, రైళ్లు ఢీకొనడం వంటి కారణాలతో పెద్దఎత్తున ఏనుగులు మరణిస్తున్నాయి. వీటికితోడు వేటాడటం, విష ప్రయోగం వంటి కారణాల వల్ల ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 522 ఏనుగులు మృత్యువాత పడ్డాయని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఇటీవల వెల్లడించింది. విద్యుదాఘాతాల కారణంగా ఐదేళ్లలో (2018–19 నుంచి 2022–23 వరకు) అత్యధికంగా 379 ఏనుగులు మృతి చెందినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తరువాత రైలు ప్రమాదాల బారినపడి ఐదేళ్లలో 75 ఏనుగులు మరణించాయి. వేటాడటం ద్వారా 47 గజరాజులను చంపేశారు. దంతాల కోసం విష ప్రయోగం చేసి 21 ఏనుగులను హతమార్చినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. విద్యుత్ కంచెలతోనే తీవ్ర సమస్య విద్యుదాఘాతంతో అత్యధికంగా ఒడిశాలో ఐదేళ్లలో 80 ఏనుగులు, తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో ఒక్కొక్కచోట 53 చొప్పున ఏనుగులు మృతి చెందాయి. రైళ్లు ఢీకొట్టిన ఘటనల్లో అత్యధికంగా అసోంలో 24 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఒడిశాలో 18 ఏనుగులను రైలు ప్రమాదాలు పొట్టనపెట్టుకున్నాయి. వేటాడటం ద్వారా ఒడిశాలో అత్యధికంగా 15 ఏనుగులను హతమార్చారు. మేఘాలయలో 15 ఏనుగులను చంపేశారు. అసోంలో విషప్రయోగంతో ఏకంగా 17 ఏనుగులను హతమార్చారు. అలాంటి వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అటవీ ప్రాంత సమీప పొలాల్లో పంటల్ని కాపాడుకునేందుకు విద్యుత్ కంచెల్ని ఏర్పాటు చేస్తుండటంతో విద్యుదాఘాతానికి గురై ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి. రైల్వేతో సమన్వయ కమిటీ రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రైళ్లు నడిపే పైలట్లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగుల ఉనికి గురించి పైలట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్ పాస్, ఓవర్ పాస్లను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ ఫ్రంట్లైన్ సిబ్బంది, వన్యప్రాణుల పరిశీలకులు రైల్వే ట్రాక్లపై రెగ్యులర్ పెట్రోలింగ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్రం చేసిన సూచనలివి! ♦ విద్యుదాఘాతాల నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెల్ని తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ♦ భూమిపై విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది. అండర్ గ్రౌండ్ లేదా పోల్స్పై మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ♦‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఏనుగుల పరిరక్షణ, వాటి ఆవాసాల్లో చర్యలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తోంది. ♦ ఏనుగుల కదలికలను పర్యవేక్షించడానికి స్థానిక సంఘాలతో ట్రాకర్స్ను ఏర్పాటు చేయడంతో పాటు మానవుల వల్ల నష్టాన్ని నివారించడానికి స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ♦ మానవ–వన్యప్రాణుల సంఘర్షణల హాట్ స్పాట్లను గుర్తించడంతోపాటు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించింది. ♦ అడవి జంతువులకు రుచించని పంటల్ని వేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది. -
‘మధ్యధరా’లో పడవ మునిగి 60 మంది మృతి
కైరో: మధ్యధరా సముద్రంలో పడవ మునిగి 60 మందికి పైగా వలసదారులు దుర్మరణం పాలయ్యారు. యూరప్కు బయల్దేరిన ఈ పడవ లిబియా తీర ప్రాంతంలో బోల్తాపడింది. మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువని ఐరాస వలసల విభాగం ఆదివారం వెల్లడించింది. ఈ మార్గంలో కిక్కిరిసిన అక్రమ పడవల్లో ప్రయాణిస్తూ వేలాది మంది నిర్భాగ్యులు పడవ ప్రమాదాలకు బలయ్యారు. ఈ ఏడాదే 2,250 మంది మరణించారని ఐరాస తెలిపింది. -
ఇండియన్ స్టూడెంట్స్ మరణాలు ఎక్కువగా ఆ దేశంలోనే
న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో విదేశాల్లో 403 మంది భారత విద్యార్థులు చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో కెనడా వెళ్లినవారే ఎక్కువ మంది ఉన్నారు. 2018 నుంచి ఇప్పటివరకు కెనడా వెళ్లిన 91 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల మరణించారు. యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు వెళ్లిన 48 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ వివరాలను కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహజ మరణాలతో పాటు యాక్సిడెంట్లు, ఆరోగ్య పరమైన సమస్యలతో స్టూడెంట్లు మృతిచెందుతున్నట్లు తెలిపింది. అయితే వీటిలో కొన్ని అనుమానాస్పద మరణాలున్నట్లు పేర్కొంది. విదేశాల్లోని భారత విద్యార్థుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని కేంద్రమంత్రి మురళీధరన్ చెప్పారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగి విదేశాల్లో విద్యార్థులు మరణిస్తే వాటిపై ఆయా దేశాల అధికారులతో ఫాలోఅప్ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల మృతికి కారణమైన వారికి సరైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విదేశాల్లో మృతి చెందతున్న భారత విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఎందుకుంటోందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని విదేశాంగ శాఖ అధికారి అరిందమ్ బగ్చి చెప్పారు. ఇదీచదవండి..ఎంపీ మహువాపై లోక్సభ నిర్ణయం అదేనా..! -
ఆకస్మిక మరణాలకు.. టీకాకు సంబంధం లేదు!
అకస్మాత్తుగా తీవ్రస్థాయి వ్యాయామంతో ముప్పు.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన 22 ఏళ్ల యువకుడు!.. వ్యాయామం చేస్తూండగా గుండెపోటు.. 42 ఏళ్ల యాక్టర్ మృతి.. పాతికేళ్లకే గుండెపోటు.. ఆకస్మిక మరణం!.. ఇలాంటి శీర్షికలు వార్తాపత్రికల్లో మీరూ చూసే ఉంటారు. కోవిడ్ తరువాత ఇలాంటి ఆకస్మిక మరణాలు మరీ ముఖ్యంగా తక్కువ వయసు వారిలో ఎక్కువయ్యాయి అన్న చర్చ కూడా జరిగే ఉంటుంది. అయితే ఇందులో వాస్తవం లేదంటోంది భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, క్లుప్తంగా ఐసీఎంఆర్). కోవిడ్ టీకాలతోనే గుండె జబ్బుల ముప్పు పెరిగిందన్నది ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ కంటే ముందు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం మొదలుకొని కుటుంబ ఆరోగ్య చరిత్ర, మితిమీరిన మద్యపానం, అలవాటు లేని తీవ్రమైన పనులు కొనసాగించడం వంటివి యువత ఆకస్మిక మరణాలకు కారణాలు కావచ్చునని వీరు అంటున్నారు. కోవిడ్ తరువాత యువకులు ఆకస్మికంగా గుండెజబ్బుల కారణంగా మరణిస్తున్నారన్న వదంతులు ప్రబలుతున్న సమయంలో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 47 టెరిటరీ ఆసుపత్రుల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ద్వారా అసలు సమస్య ఏమిటన్నది తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ అధ్యయనంలో 18 - 45 మధ్య వయస్కుల ఆకస్మిక మరణాల కారణాలను విశ్లేషించారు. ఈ మరణాల్లో కొంతమంది సెలబ్రిటీలూ ఉండటం గమనార్హం. ‘‘కోవిడ్ వ్యాధి, టీకాలకు ఈ మరణాలకు సంబంధం ఉందన్న ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో అసలు కారణాలేమిటో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేపట్టాం’’ అని ఐసీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. 3645 మంది వివరాలతో... ఐసీఎంఆర్ అధ్యయనంలో భాగంగా మొత్తం 3645 మంది వివరాలను విశ్లేషించారు. ఇందులో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరి ఆ తరువాత 24 గంటల్లోనే మరణించిన వారు కూడా ఉన్నారు. వీరందరూ 18 - 45 మధ్య వయస్కులే. ఆకస్మిక మరణానికి కారణం కాగల వ్యాధులు, సమస్యలు ఏవీ లేనివారే. అక్టోబరు 2021 - మార్చి 2023 మధ్యకాలంలో వీరు ఆకస్మికంగా మరణించారు. ఆకస్మిక మరణాలకు గుండె సంబంధిత సమస్యలే కారణమైనప్పటికీ అన్నీ కార్డియాక్ అరెస్ట్ (అకస్మాత్తుగా గుండె పనిచేయకుండా పోవడం) ఫలితంగానూ జరగలేదని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడియమాలజీ డైరెక్టర్ శాస్త్రవేత్త మనోజ్ ముర్హేకర్ తెలిపారు. మరణించిన వారి సమచారాన్ని, కోవిడ్ బాధితులను పోల్చి చూసినప్పుడు టీకాలే మరణానికి కారణమని సూచించే ఏ అంశమూ బయటపడలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వాస్తవానికి టీకాలు మరణాలను అడ్డుకుంది. ఆకస్మిక మరణాలకు ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు’’ అని ఆయన వివరించారు. కోవిడ్ -19 టీకాలు, వ్యాధి, చికిత్స తరువాత ఆరోగ్యం వంటి విషయాలపై తాము కొంతమందిని ఇంటర్వ్యూ చేశామని, కుటుంబంలో ఆకస్మిక మరణాల చరిత్ర ఏమైనా ఉందా? అన్నదీ పరిశీలించామని, ధూమపానం, మత్తుముందుల వాడకం, మద్యపానం ఎంత తరచుగా చేస్తారు? మరణానికి రెండు రోజుల ముందు అతిగా శ్రమించారా? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నామని... ఇలాంటి కారణాల వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసిందని మనోజ్ ముర్హేకర్ తెలిపారు. ‘‘మద్యపానం ఎంత తరచుగా తీసుకుంటూంటే ఆకస్మిక మరణానికి అవకాశాలు అంత ఎక్కువగా పెరిగాయి’’ అని వివరించారు. రెండు డోసుల టీకాతో రక్షణ... కోవిడ్ వ్యాధి నివారణకు రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశాలు తక్కువైనట్లు తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ చెబుతోంది. అయితే కోవిడ్-19 కారణంగా మరణాలు ఎలా సంభవిస్తాయన్న అంశం ప్రస్తుతానికి పూర్తిగా అర్థం కావడం లేదని తెలిపింది. అయితే సార్స్ కోవ్-2 వ్యాధి వల్ల గుండెజబ్బు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుందని మాత్రం ఈ అధ్యయనం అంగీకరించడం గమనార్హం. ఆకస్మిక మరణాలకూ కారణమవుతుందా? అన్న విషయంపై మాత్రం తగినంత సమాచారం లేదని ఐసీఎంఆర్ చెబుతోంది. కోవిడ్ టీకాల కారణంగా ఆకస్మిక మరణాలు పెరిగాయని కొంతమంది తగిన సాక్ష్యాధారాల్లేకుండా మాట్లాడుతున్రాను. వ్యాక్సీన్లతో మరణాలు తగ్గాయని చెప్పేందుకు రుజువులు ఉన్నాయి. ముప్ఫై ఏళ్ల పైబడ్డ వారు.. అప్పటివరకూ తరచూ వ్యాయామం చేయకుండా.. అకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం మొదలుపెడితే వారిలో ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం వల్ల గుండె రక్తనాళాల్లో అప్పటివరకూ పేరుకుపోయిన గార లాంటి పదార్థం ముక్కలై గుండెపోటుకు దారితీయవచ్చు’’ అని వైద్య నిపుణులు కొందరు చెబుతున్నారు. చదవండి: డయాబెటిస్ పేషెంట్స్.. ఇకపై ఆ బాధ తీరినట్లే -
అమెరికాలో బాలలపైకి దుండగుడి కాల్పులు
సిన్సినాటి: అమెరికాలోని సిన్సినాటిలో ఓ సాయు ధుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో 11 ఏళ్ల బాలుడు, ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు బాలలు గాయపడ్డారు. కారులో వచ్చిన దుండగుడు యథేచ్ఛగా 22 రౌండ్లు కాల్చినట్లు పోలీసు అధికారి టెర్రీ తెలిపారు. ఆ వెంటనే దుండగుడు ఘటనా స్థలి నుంచి మాయమ య్యాడన్నా రు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయిందన్నారు. బుల్లె ట్లు తగిలి 53 ఏళ్ల మహిళ, 11 ఏళ్ల బాలుడు ఘట నాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా, 12, 13, 15 ఏళ్ల ముగ్గురు బాలురు, 15 ఏళ్ల బాలిక గాయపడ్డారని తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆమె వివరించారు. -
కేరళలో భారీ పేలుడు.. ఉగ్రదాడి కలకలం!
తిరువనంతపురం: కేరళలో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ పేలుళ్లను ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రేయర్ మీట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వరపుజ, అంగమలి, ఎడపల్లి ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ఆదివారం ఉదయం 9.20కి ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుడు కారణంగా అక్కడున్నవారు భయాందోళనకు గురై హాలు నుంచి బయటకు పరుగులు తీశారు. #WATCH | Kerala: Outside visuals from Zamra International Convention & Exhibition Centre, Kalamassery; one person died and several others were injured in an explosion here. pic.twitter.com/RILM2z3vov — ANI (@ANI) October 29, 2023 ఇక, పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా గాయాలు కాగా.. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తీవ్రమైన గాయాలతో వున్న క్షత్రగాత్రులను కొచ్చి మెడికల్ కాలేజీ నుంచి కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలిస్తున్నారు. అయితే, ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది. It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB — ANI (@ANI) October 29, 2023 ఇక, పేలుడు ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులందరూ ఎర్నాకులంలో ఉన్నారు. ఘటనా స్థలానికి డీజీపీ వెళ్లారు. పేలుడు ఘటనను చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. డీజీపీతో మాట్లాడాను. దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది కూడా చదవండి: డీకే శివకుమార్ వెంట 70 మంది ఎమ్మెల్యేలు..! -
AP: ప్రభుత్వ ‘కారుణ్యం’
సాక్షి, అమరావతి: కోవిడ్–19తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కారుణ్యం చూపుతోంది. కోవిడ్తో 2,917 మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందగా.. వారి కుటుంబాల్లో ఒకరికి చొప్పున కారుణ్య నియామకాలను చేపట్టిన విషయం తెలిసిందే. గతంలోనే కారుణ్య నియామకాల కోసం 2,744 మంది దరఖాస్తు చేసుకోగా 1,488 మందికి ఉద్యోగాలను కల్పించింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మృతి చెందిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయసు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా కారుణ్య నియామకాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కోసం 330 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 241 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. వీటిలో ఇప్పటి వరకు జిల్లాల వారీగా 164 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. మిగతా 77 మంది అర్హత గల కుటుంబాల్లోని వారికి వెంటనే ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు అందరూ ఉద్యోగాల్లో చేరిన నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచాల్సిందిగా సీఎస్ సూచించారు. -
ఆసుపత్రి డీన్తో టాయ్లెట్ శుభ్రం చేయించిన ఎంపీ
ముంబై: మహారాష్ట్రలోని శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 48 గంటల్లోనే 31 మంది మృత్యువాతపడటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడికి వెళ్లిన నాందేడ్ ఎంపీ హేమంత్ పాటిల్ ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో టాయ్లెట్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన ఆయన ఆసుపత్రి డీన్ శ్యామ్రావ్ వకోడాతో శుభ్రం చేయించారు. మహారాష్ట్రలోని శంకర్ రావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సోమవారం నాటికి 24గా ఉన్న మృతుల సంఖ్య మరో 24 గంటలు గడిచేసరికి 31కి చేరింది. వీరిలో చిన్నారులు కూడా ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మరో 71 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వార్తలు గెలువడుతున్న నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఆసుపత్రి డీన్ వకోడా మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు కొరవడటం తోపాటు ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లనే మరణాలు జరిగాయన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. రోగులకు సరైన వైద్యమే అందిస్తున్నామని కానీ వారే వైద్యానికి సరిగ్గా స్పందించడంలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు కూడా అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో షిండే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. వెంటనే షిండే వర్గానికి చెందిన ఎంపీ హేమంత్ పాటిల్ వెంటనే శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి పరిసరాల్లో తనిఖీలు చేయగా అక్కడి టాయ్లెట్ అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆసుపత్రి డీన్ను పిలిపించి ఆయనతోనే ఆ టాయ్లెట్ను శుభ్రం చేయించారు. ఎంపీ అక్కడే ఉండి నీళ్ళపైపుతో నీళ్లు వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో మరణాలపై దర్యాప్తు చేయడానికి కమిటీని నియమించామని వైద్య, విద్య పరిశోధన డైరెక్టర్ డా.దిలీప్ మైసెఖర్ తెలిపారు. नांदेडमध्ये रुग्ण दगावले, त्याची जबाबदारी अधिष्ठाता यांची आहेच. त्याबद्दल डॉ.वाकोडे यांना उत्तरदायी ठरवलंच पाहिजे. पण त्यांना टॉयलेट साफ करायला लावून शिंदे गटाचे खासदार हेमंत पाटील यांनी काय साधलं? नांदेड रुग्णालयाची दुरवस्था होईपर्यंत हे महाशय कुठे होते? निव्वळ स्टंटबाजी… pic.twitter.com/scTeeoAjlh — Abhijit Karande (@AbhijitKaran25) October 3, 2023 ఇది కూడా చదవండి: అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది: ప్రధాని మోదీ -
ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి
లీమా: దక్షిణ అమెరికా దేశం పెరూలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెరూలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్లిన కారణంగా ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. ఆండెస్ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళ్తుతుండగా అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా 200 మీటర్ల లోతులో ఉన్నలో లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. గత నెలలో కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనాటి ప్రమాదంలో 13 మంది చనిపోయారు. పెరూలో సరైన రోడ్డు సదుపాయాలు లేక ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైంది. ఇక్కడ రాత్రిపూట, పర్వతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి -
నిఫా ఎఫెక్ట్: కంటైన్మెంట్ జోన్లు, స్కూల్స్ బంద్..
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ బారినపడి ఇప్పటికే రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి వైరస్ సోకింది. ఇందులో తొమ్మిది ఏళ్ల చిన్నారి కూడా ఉంది. దీంతో ప్రభుత్వం కోజికోడ్ జిల్లాలోని ఏడు గ్రామ పంచాయితీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నిఫా వైరస్ 130 మందికి సోకిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్గా పేర్కొన్న ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. వ్యాప్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య అధికంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్మెంట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామశాఖ ఆఫీస్లు తక్కువ స్టాఫ్తో నడపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూసివేయాలని కోరారు. కంటైన్మెంట్ జోన్లో మాస్కులు తప్పనిసరి అని తెలిపారు. శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చెప్పారు. రాష్ట్రంలో నిఫా వైరస్ వ్యాప్తి పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందాలు కేరళకు రానున్నాయి. కోజికోడ్ మెడికల్ కాలేజీలో సంచార ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పందులు, గద్దల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేయనున్నారు. వ్యాప్తి ఇలా... ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు.. -
భారత్లో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి!
తిరువనంతపురం: దేశంలో మరోసారి నిపా వైరస్ కలకలం సృష్టించింది. తాజాగా కేరళలో నిపా వైరస్ సోకి ఇద్దరు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, కేరళలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ కారణంగా మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. వివరాల ప్రకారం.. కేరళలో మరోసారి నిపా వైరస్ ప్రబలుతోంది. నిపా వైరస్ సోకడంతో ఇన్ఫెక్షన్ కారణంగా కోజికోడ్ జిల్లాలో ఇద్దరు మృతిచెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మరణించారని తెలిపారు. #NewsAlert| Nipah Virus alert issued in Kerala's Kozhikode after two 'unnatural' deaths. — NDTV (@ndtv) September 12, 2023 అలాగే, మరణించిన వారిలో ఒకరి బంధువులు కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరారు. అయితే, 2018, 2021లో కోజికోడ్ జిల్లాలోనే నిపా వైరస్ కారణంగా పలువురు మరణించారు. మన దేశంలో మొదటిసారి 2001 ప్రాంతాల్లో బెంగాల్లోని సిలిగురిలో ‘నిపా’ వెలుగు చూసింది. మళ్లీ ఆ తర్వాత 2007లో కేరళలో కనిపించింది. నిపా లక్షణాలు.. నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగించి, మెదడువాపునకు (ఎన్సెఫలోపతి) కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే.. 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24–48 గంటల్లో కోమాకి దారితీయవచ్చు. ఇది సోకినవారిలో.. అన్ని వైరల్ ఇన్ఫెక్షన్లోలాగానే.. జ్వరం, ఒళ్లునొప్పులు, వికారం, వాంతులు కనిపించవచ్చు. దేహంలో దీర్ఘకాలికంగా వైరస్ ఉంటే మూర్ఛ (కన్వల్షన్స్), ప్రవర్తనలో మార్పులు (పర్సనాలిటీ ఛేంజెస్) కనిపించవచ్చు. మెడ బిగుసుకుపోవడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఇక కొందరిలో అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్)లోలా ఊపిరి అందకపోవచ్చు. గుండె కండరానికి ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట) వచ్చేలా ‘మయోకార్డయిటిస్’కు దారితీయవచ్చు. అకస్మాత్తు మరణం.. అరుదుగా కొందరిలో లక్షణాలేవీ కనిపించకుండానే అకస్మాత్తుగా మరణం కూడా సంభవించవచ్చు. అయితే ఇది అరుదు. నిపా వైరస్ను సంక్షిప్తంగా ‘ఎన్ఐవీ’ అంటుంటారు. ఇదో రకం ‘ఆర్ఎన్ఏ వైరస్’. మలేషియాలోని ‘కాంపంగ్ షుంగై నిపా’ అనేచోట 1998లో వ్యాపించడంతో ఆ ప్రదేశం పేరిట దీన్ని ‘నిపా’ అంటున్నారు. ఆరేళ్ల తర్వాత బంగ్లాదేశ్లో కనిపించింది. అప్పట్నుంచి ఇది అప్పుడప్పుడూ భారత్, బంగ్లాదేశ్లో కనిపించడం మొదలుపెట్టింది. వ్యాప్తి ఇలా... ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. ‘నిపా’ ఫ్రూట్ బ్యాట్ రకానికి చెందిన గబ్బిలాల నుంచి, పందుల నుంచి, అలాగే.. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. ఇక నిపా సోకిన వ్యక్తులు పీల్చి వదిలే గాలి (ఏరోసాల్స్) వల్ల కాకుండా.. వారి నుంచి వచ్చే తుంపర్లు (డ్రాప్లెట్స్) వల్లనే దీని వ్యాప్తి జరుగుతుందని గుర్తించారు. అయితే ఇప్పటికే కరోనా కారణంగా మనం ధరించే మాస్కులతో దీని నివారణ కూడా జరుగుతుంది కాబట్టి.. మాస్క్ అదనపు / రెట్టింపు ప్రయోజనాలను ఇస్తోందని గ్రహించి, వాటిని తప్పనిసరిగా ధరించడం మంచిది. ఇది కూడా చదవండి: క్యాన్సర్ కణాలకు చెక్! -
ఇంకెన్నాళ్లు నాలా మరణాలు?
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరానికి బాటలు పరుస్తున్న హైదరాబాద్ మహానగరంలో వానలొస్తే.. నాలాలు ఉప్పొంగడం...అందులో పడి ఎవరో ఎవరో ఒకరు చనిపోవడం మామూలైపోయింది. అన్నిరంగాల్లో అద్భుతాలు సాధిస్తున్నప్పటికీ, మిగతా నగరాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వరద కాలువల్లో పడి ప్రాణాలు పోవడం గుండెల్ని పిండి వేస్తోంది. అభం శుభం తెలియని చిన్నారులకు నూరేళ్లు నిండుతుండటం ఎందరినో కలచివేస్తోంది. తాజాగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లు, కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిజాంపేట ప్రగతినగర్లో నాలుగేళ్ల పసిబాలుడు మిథున్రెడ్డి నాలాలో పడి మృతి చెందితే ఆ పాపం ఎవరిది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేటీఆర్ హెచ్చరించినా.. వర్షాల వల్ల ప్రజలు మరణించే పరిస్థితులుండరాదని మునిసిపల్ మంత్రి కేటీఆర్ పలు దఫాలుగా అధికారుల్ని హెచ్చరించినా.. దారుణం జరిగిపోయింది. గత మూడేళ్లుగా నాలాల్లో పడి చిన్నారులు మరణిస్తుండటం తొలచివేస్తోంది. రెండేళ్ల క్రితం నేరే డ్మెట్లో సుమేధ అనే బాలిక మరణించడం తెలిసిందే. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏప్రిల్లో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లు లేక సికింద్రాబాద్ కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి మృతి చెందింది. తాజా ఘటనలోనూ నాలాపై కప్పు సరిగ్గా లేకపోవడం వల్లే బాలుడు అందులో పడి మరణించాడు. స్థానికుల నిర్లక్ష్యం, అధికారుల అశ్రద్ధ ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. #HyderabadRains Four year old Mithun Reddy gets swallowed by the city’s crumbling infrastructure. Mithun was playing at his house when he fell into an open manhole at 11am today. Incident happened at Mechal, Pragathi Nagar, NRI Colony. They found his body at Nizampet, but was… pic.twitter.com/8E8raHbNj3 — Revathi (@revathitweets) September 5, 2023 నాలాల్లో మరణాలు... 2017 నుంచి నాలాల్లో పడి ఎందరో మరణించారు. ● 2017 ఫిబ్రవరిలో యాకుత్పురా నియోజకవర్గంలో నాలాలోపడి జకీర్ అబ్బాస్ (2) అనే బాలుడు మరణించాడు. ● 2018 జనవరిలో చందానగర్ రెడ్డి కాలనీకి చెందిన శివకుమార్ అనే నాలుగేళ్ల బాలుడు నాలాలో పడి మరణించాడు. ● 2018 జూన్లో సత్యరాఘవేంద్రనగర్ కాలనీ ఓపెన్ నాలాలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ● 2018 సెప్టెంబర్లో సరూర్నగర్లో నాలాలో పడి హరీష్(24) అనే యువకుడు గల్లంతయ్యాడు. ● 2018 అక్టోబర్లో బోరబండలో రాజయ్య అనే వ్యక్తి నాలాలో పడి మరణించాడు. ● 2019 సెప్టెంబర్లో నాగోల్ దగ్గరి ఆదర్శనగర్ నాలాలో పడి పోచంపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్కుమార్ మరణించాడు. ● 2019లోనే ఇద్దరు అర్చకులు ద్విచక్రవాహనంపై వెళ్తూ నాలాలో పడిపోగా ఒకరు మృతి చెందారు. ● 2020 సెప్టెంబర్ నేరేడ్మెట్లో నాలాలో పడి సుమేధ(12) అనే బాలిక మృతి చెందింది. ● 2020 నవంబర్లో సరూర్నగర్ కోదండరామ్నగర్లో మార్నింగ్వాక్కు వెళ్లిన వృద్ధురాలు ,సమీంలోని మరో ప్రాంతంలో ఇంకో వ్యక్తి నాలాలో పడి మృతి చెందారు. ● 2021 జూన్లో ఓల్డ్బోయిన్పల్లిలో ఆనంద్ సాయి అనే ఏడేళ్ల బాలుడు నాలాలో పడి మరణించాడు. ● 2021 సెప్టెంబర్లో మణికొండలో నాలా కోసం తవ్విన గుంతలో పడి రజనీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. ● 2023 ఏప్రిల్లో సికింద్రాబాద్ కళాసిగూడలో నాలాలో పడి మౌనిక అనే నాలుగేళ్ల బాలిక మరణించింది. -
పంటనష్టంలో తెలంగాణది మూడోస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు వంటి కారణాలతో 2,044 మంది మరణించినట్లు తెలిపింది. వరదలతో అత్యధికంగా హరియాణాలో 5,40,975 ఎకరాల్లో పంటనష్టం జరగ్గా, హిమాచల్ప్రదేశ్లో 1,89,400 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదించింది. అత్యధికంగా పంటనష్టం జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, మొత్తం 1,51,970 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. తెలంగాణలో 18 మంది మరణించారని, ఇతరత్రా కారణాలతో మరొకరు మృతి చెందారని నివేదికలో వెల్లడించింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెండు విపత్తు నిర్వహణ బృందాలను రాష్ట్రంలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. ఏపీలో 22,537 ఎకరాల్లో పంట నష్టం ఏపీలోని ఐదు జిల్లాల పరిధిలో భారీవర్షాలు, వరదల ప్రభావం ఉందని, వాటి కారణంగా మొత్తంగా 39 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ విభాగం నివేదించింది. మొత్తం 22,537 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తెలిపింది. విపత్తు నిర్వహణ కోసం రెండు బృందాలను ఏపీలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. -
కేంద్రం ప్రయత్నాలను ప్రశ్నించలేం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఈ ఏడాది 9 చీతాల మృతి విషయంలో కేంద్రం ఇచి్చన వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో చీతాల సంతతిని అభివృద్ధి చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై అనుమానాలకు అవకాశం లేదని పేర్కొంది. 1952 తర్వాత దేశంలో చీతాల సంతతి అంతరించిపోయింది. దీంతో, తిరిగి వాటి సంతతిని పెంచే ఉద్దేశంతో గత ఏడాది సెపె్టంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను కునోకు తీసుకువచి్చంది. ఇక్కడ మరో నాలుగు కూనలు జని్మంచాయి. వీటిలో మొత్తం 9 మృత్యువాతపడ్డాయి. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం పిటిషన్ వేసింది. విదేశాల నుంచి తీసుకువచి్చన చీతాలను ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో మనుగడ సాగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. -
విషాదం.. కొడుకు మరణ వార్త విని తండ్రి మృతి
సాక్షి, సంగారెడ్డి: కన్న కొడుకు మరణ వార్త విన్న తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వీరిద్దరి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోంగ్లూర్ తండాకూ చెందిన బానోత్ భీమ్లా శుక్రవారం బైక్పై జోగిపేట్ పట్టణానికి మోటర్ రిపేర్ కోసం వెళ్లాడు. అనంతరం, ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో అల్మాయిపేట సబ్స్టేషన్ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కకు బైక్ పార్క్ చేశాడు. అనంతరం 161 నాందేడ్ జాతీయ రహదారి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో, ఘటనా స్థలంలోనే భీమ్లా మృతిచెందాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, కొడుకు బానోత్ భీమ్లా మరణ వార్త విని అతడి తండ్రి ధర్మ నాయక్ గుండెపోటుతో మరణించాడు. ఇక, ఇద్దరి మరణంలో తండాలో విషాదం నెలకొంది. ఇది కూడా చదవండి: బైక్పై చోరీ కోసం వచ్చి.. ఉన్న బైక్ వదిలి పరార్.. -
వర్షాలు, వరదలతో 9 ఏళ్లలో 17 వేల మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో 2012–2021 సంవత్సరాల మధ్య సంభవించిన వరదలు, భారీ వర్షాలతో 17,422 మంది చనిపోయినట్లు కేంద్రం తెలిపింది. సోమవారం రాజ్యసభలో జల్శక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఈ వివరాలను ఆయన వెల్లడించారు. అతి తక్కువ సమయంలో అతి భారీ వర్షాలు కురియడమే పట్టణ ప్రాంతాల్లో వరదలకు ప్రధాన కారణమన్నారు. ఆక్రమణలకు గురైన సహజ నీటి వనరులు, విచ్చలవిడిగా నిర్మాణాలు, నాణ్యతలేని మురుగు వ్యవస్థ వంటివి సమస్యను మరింత పెంచుతున్నాయని వివరించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2012–21 సంవత్సరాల కాలంలో వర్షాలు, వరదలతో పంటలు, నివాసాలు, ఇతరాలకు కలిపి మొత్తం రూ.2.76 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. -
అగ్రరాజ్యం సహా ప్రపంచవ్యాప్తంగా పేదరికంతో మరణాలు
ప్రపంచంలో గుండె జబ్బులు, కేన్సర్, పొగతాగడం, మెదడు మందగించడం, మధుమేహం మనుషుల మరణాలకు కారణమౌతున్నట్టే పేదరికం కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో చావులకు దారితీస్తోంది. అనేక ఇతర అంశాల వల్ల జనం చనిపోతున్నారనే విషయంపై అమెరికాలో పరిశోధనలు ఇది వరకే జరిగాయి. అలాగే దారిద్య్రం ఈ అత్యంత ధనిక దేశంలో ఎంత మందిని కబళిస్తోందనే అంశంపై కాలిఫోర్నియా యూనివర్సిటీ–రివర్సైడ్ ప్రొఫెసర్ డేవిడ్ బ్రాడీ నేతృత్వంలో తాజాగా పరిశోధన చేశారు. అమెరికాలో దారిద్య్రం చాలా తక్కువ. డెబ్బయి ఎనభై ఏళ్ల క్రితమే సంపన్నదేశంగా అవతరించింది. అయినా, ఇంకా ఇక్కడి ప్రభుత్వం పేదరికాన్ని ఒక ప్రజారోగ్య సమస్యగా పరిగణించదు. పొగతాగడానికి మరణాలకు సంబంధం ఉందని గ్రహించనట్టుగా, దారిద్య్రానికి చావుకు కూడా సంబంధం ఉందనే అంశంపై ఇప్పుడిప్పుడే సర్కార్లకు అవగాహన కలుగుతోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఏడాదికి 4,80,000 మంది అమెరికన్లు పొగ తాగడం వల్ల కన్నుమూస్తున్నారు. ఊబకాయంతో 2,80,000 మంది, మితిమీరిన స్థాయిలో మాదకద్రవ్యాలు సేవించి 1,06,000 మంది మరణిస్తున్నారు. ఈ గణాంకాలన్నీ 2021కి సంబంధిచినవి. అమెరికా ప్రజలను వారి ఆయుష్షు నిండకుండానే చంపేస్తున్న కారణాలపై చేస్తున్న తాజా పరిశోధనల వల్ల జనం ప్రాణాలు కాపాడే ప్రచారోద్యమాలకు మేలు జరుగుతోంది. ప్రజారోగ్యంపై అమెరికన్లలో జాగరూకత పెంచడానికి అవి ఉపకరిస్తున్నాయి. అమెరికాలో పేదరికం పూర్తిగా అంతరించలేదనే వాస్తవం సభ్య ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్రాడీ నాయకత్వంలో ఓహాయో స్టేట్ యూనివర్సిటీ సామాజికశాస్త్రవేత్త ప్రొ.హూయీ జెంగ్, యూనివర్సిటీ ఆఫ్ పోట్స్ డామ్ ప్రొఫెసర్ ఉల్రిచ్ కోహ్లర్ బృందం అమెరికాలో పేదరికం మరణాలు, పర్యవసానాలపై అధ్యయనం చేసింది. గుండె జబ్బులు, కేన్సర్, స్మోకింగ్ తర్వాత జనం ప్రాణాలు తీసే నాలుగో పెద్ద కారణం పేదరికమని ఈ బృందం సర్వేలో తేలింది. తక్కువ ఆదాయాలున్న ప్రజలను పీడించే దారిద్య్రం కారణంగా ఏటా అమెరికాలో 1,83,000 మంది చనిపోతున్నారు. వరుసగా పదేళ్లు దారిద్య్రం బారిన పడడం వల్ల ఏటా 2,95,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఈ దేశంలో పేదలు నివసించే ప్రాంతాల్లో ప్రజారోగ్య సమస్యలు తీవ్రం కావడం, వాటి వల్ల మానసిక ఒత్తిడి పెరిగి దారిద్య్ర మరణాల సంఖ్య పెరుగుతోంది. అమెరికా సెన్సస్ బ్యూరో అనుబంధ నివేదిక లెక్కల ప్రకారం 2021లో దాదాపు 26 లక్షల మంది పేదరికంలో ఉన్నారు. మొత్తంమీద ఇన్నాళ్లకు దేశంలో లక్షలాది ప్రజల ప్రాణాలు ఆయువు నిండకుండానే పోవడానికి కారణమైన పేదరికంపై అమెరికా పాలకులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇండియాలోనూ ప్రజల ప్రాణాలు తీస్తున్న దారిద్య్రం భారతదేశంలో కూడా ప్రజలు ఆయుష్షు తీరకుండానే బయటి కారణాల వల్ల ఎలా, ఎంత మంది మరణిస్తున్నారో ఎప్పటి నుంచో అధ్యయనం చేస్తున్నాయి. ప్రత్యేకించి దారిద్య్రం ప్రత్యక్ష ప్రభావం వల్ల ఎంత మంది కన్నుమూస్తున్నారో పరిశోధనలు చేసే ఆనవాయితీ దేశంలో లేదు. పేదరికం వల్ల ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు? తగినంత ఆదాయం లేకపోవడంతో ఎంత మంది ఏఏ జబ్బులతో చనిపోతున్నారు? పేదరికం పోషహాకార లోపానికి ఎంత వరకు దారితీస్తోంది? దాని వల్ల ఎంత మంది దేశ ప్రజలు కన్నుమూస్తున్నారు? వంటి అంశాలపై ప్రభుత్వానికి అవగాహన ఉంది. కాని, విడిగా పేదరికం ప్రత్యక్షంగా ఎంత మంది ప్రజల చావుకు కారణమౌతోందని విషయం పరిశోధనాంశంగా మారలేదు. ఇండియాలో పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏటా దేశంలో దారిద్య్ర రేఖ దిగువ నుంచి కోట్లాది మంది ప్రజలు పైకి వస్తున్నారు. ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టించడం ద్వారా పేదల సంఖ్యను గణనీయంగా తగ్గించగలుగుతున్నారు. అమెరికా తరహాలో భారత విశ్వవిద్యాలయాలు కూడా ప్రత్యకించి పేదరికం–మరణాలు అనే అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలు మరింత విజయవంతమౌతాయి. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
విషాదం.. పాము కాటుతో తండ్రీకొడుకు మృతి
రాజంపేట: పాము కాటు కారణంగా ఓ పేదింట విషాదం నెలకొంది. అర్ధరాత్రి పాము కాటుకి తండ్రీకొడుకులు బలయ్యారు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వారి మృతితో భార్య అనాథగా అయిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమవువున్నారు. వివరాల ప్రకారం.. రాజంపేట మండలం శేర్ శంకర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు మామిళ్ల తండాకు చెందిన ముద్రిచ్చ రవి (40) తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రవి తనభార్యతో కలసి రోజూలాగే శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి భార్యాపిల్లలతో కలసి భోజనం చేసిన అనంతరం అందరూ కలసి పడుకున్నారు. అయితే, రాత్రి 11.30 గంటల సమయంలో నిద్రలోంచి లేచిన రవి తన చేతిపై నుంచి పాము వెళ్లినట్లు భార్య మంగినికి తెలిపాడు. దీంతో భార్యాభర్తలు దేవుని పేరు తలచుకుని ముడుపు కట్టారు. తర్వాత ఇంట్లో పామును గుర్తించిన రవి కర్రతో కొట్టి దానిని చంపాడు. ఇదిలా ఉండగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత చిన్నకొడుకు వినోద్(11) ఛాతీలో నొప్పివస్తోందని చెప్పి.. అంతలోనే వాంతులు చేసుకున్నాడు. కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పో యాడు. అదే సమయంలో తనకు కళ్లు తిరుగుతున్నాయని రవి భార్య మంగినికి తెలిపాడు. దీంతో వారు పాము కాటుకు గురైనట్లు గ్రహించిన మంగిని చుట్టుపక్కల వారి సహాయంతో రవిని శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో అంబులెన్సులో కామారెడ్డి ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ తెల్లవారు జామున 4 గంటలకు రవి సైతం మరణించాడు. ఒకే రోజు తండ్రీ కొడుకుల మరణంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత, తనయుడి మృతి -
Kuno cheetah deaths: రేడియో కాలర్ మృత్యుపాశమై!
కేంద్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటి ప్రాణాలు కోల్పోతున్నాయి. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా ఎనిమిది చీతాలు మరణించాయి. భారత్లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ఆయన పుట్టిన రోజు నాడు నమీబియా నుంచి తీసుకువచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్క్లో ప్రవేశపెట్టారు. రెండో విడతలో భాగంగా ఈ ఏడాది దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు తీసుకువచ్చారు. మార్చిలో జ్వాల అనే చీతా నాలుగు కూనలకు జన్మనిచ్చింది. అయితే ఏడాది తిరక్కుండానే ఎనిమిది చీతాలు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తేజస్, సూరజ్ అనే రెండు చీతాలు మరణించాయి. ఆ చిరుతల రేడియో కాలర్ల కింద గాయాలన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆ గాయాల్లో పురుగులు కూడా ఉన్నట్టు వారు నిర్ధారించారు. ఇదే తరహా గాయాలు మరో రెండు చీతాల్లో కూడా ఉండడంతో వాటికి రేడియో కాలర్లు తొలగించి చికిత్స అందిస్తున్నారు. వాటి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రేడియో కాలర్లే చీతాల మృతికి కారణం కావచ్చునన్న అనుమానాలు బలపడ్డాయి. రేడియో కాలర్లలో ఉండే చిప్ ఉపగ్రహాల ద్వారా జంతువులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తుంది. చీతాల భద్రత, సంరక్షణ కోసం వీటి అవసరం చాలా ఉంది. రేడియో కాలర్స్ ఎలా కబళించాయి? ► చీతాల కదలికల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం వాటి మెడకి రేడియో కాలర్స్ కట్టారు. వేసవి కాలంలో చెమట, దురద వల్ల చీతాలు తరచుగా మెడపై గీరుకోవడం వల్ల చీతాలకు గాయాలై అది చర్మ సంబంధితమైన ఇన్ఫెక్షన్కు దారితీసి ప్రాణాలు కోల్పోయి ఉండే అవకాశాలున్నట్టు మధ్యప్రదేశ్ అటవీ సంరక్షణ మాజీ అధికారి అలోక్కుమార్ అభిప్రాయపడ్డారు. ► వర్షాకాలం వచ్చాక వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో రేడియో కాలర్స్ కట్టిన మెడ చుట్టూ ఒరుసుకొని పోయి చీతాలకు గాయాలయ్యాయి. ఆ గాయాల మీద క్రిమి కీటకాదులు ముసిరి ఇన్ఫెక్షన్గా మారుతోంది. దీనివల్ల రక్త ప్రసరణకు సంబంధించిన సెప్టిసీమియా అనే పరిస్థితి తలెత్తి చీతాల మరణానికి దారితీసింది. ► ఏదైనా ఒక వస్తువుని సుదీర్ఘకాలం శరీరంపై ఉంచడం వల్ల బ్యాక్టీరీయా సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జర్నల్ ఆఫ్ క్లినికల్ డయాగ్నస్టిక్ రీసెర్చ్లో తేలింది. ముఖ్యంగా చీతాల మెడ చుట్టూ ఉండే జుట్టు మృదువుగా ఉండడం వల్ల రేడియో కాలర్తో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► జంతువులకి వాడే రేడియో కాలర్ బరువు ఆ జంతువు అసలు బరువులో 3% మాత్రమే ఉండాలి. సాధారణంగా రేడియో కాలర్ల బరువు 400 గ్రాముల వరకు ఉంటుంది. 20 నుంచి 60 కేజీల బరువు ఉండే చీతాలకు ఇది సరిపోతుంది. అయితే చీతా మెడ కంటే తల పెద్దది కాదు. దీని వల్ల రేడియో కాలర్ వాటికి అత్యంత బరువుగా అనిపిస్తాయి. చిన్న జంతువులన్నింటిలోనూ ఈ సమస్య ఉంటుంది. రేడియో కాలర్ కట్టడం వల్ల సమస్యలు ఎక్కవయిపోతాయని లండన్లోని రాయల్ వెటర్నరీ కాలేజీ ప్రొఫెసర్ అలన్ విల్సన్ చెప్పారు. ► చీతాలకు గత కొన్ని నెలలుగా రేడియో కాలర్ కట్టే ఉంచారు. కానీ వేసవిలో ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. వానలు కురవడం ప్రారంభమయ్యాక చర్మం నిరంతరం తడిగా ఉండడం వల్ల రేడియో కాలర్ గాయాలు మరింత పెద్దవై చీతాలు మృత్యువాత పడ్డాయి. అన్నీ ఒక్క చోటే ఎందుకు ? : సుప్రీం దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో 40% మృత్యువాత పడడం ఆందోళనకంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. చీతాల ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక్కచోటే ఎందుకు ఉంచుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్ కునో నుంచి వేరే రాష్ట్రాల్లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు చీతాలను తరలించే మార్గాలను అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ బి.ఆర్.గవాయ్. జె.బి. పర్దివాలా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ చెప్పింది. ‘‘చీతాలు మరణించడానికి కారణాలేంటి ? అసలు ఏమిటి సమస్య ? వాతావరణం చీతాలకు అనుకూలంగా లేదా ? ఇంకా ఏమైనా కారణాలున్నాయా ? గత వారంలో రెండు చీతాలు మరణించాయి ? అలాంటప్పుడు అన్ని చీతాలను మధ్యప్రదేశ్ కునోలో ఎందుకు ఉంచాలి ? వాటిని వేరే కేంద్రాలకు ఎందుకు తరలించకూడదు ? అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్రం తరఫున కోర్టుకి హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి త్వరలోనే చీతాల మృతికి గల కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. జులై 29లోగా దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. నమీబియా నుంచి తెచ్చిన చీతాలు: 8 దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాలు: 12 మార్చిలో పుట్టిన చీతాలు : 4 మృతి చెందిన చీతాలు: 3 కూనలు సహా 8 మిగిలిన చీతాలు :16 – సాక్షి, నేషనల్ డెస్క్ -
51 మందిని బలి తీసుకున్న మృత్యు శకటం
నైరోబీ: మృత్యు శకటంలా మారిన ఓ ట్రక్కు 51 నిండు ప్రాణాలను కబళించింది. కెన్యాలోని లొండియాని పట్టణంలో శుక్రవారం సాయంత్రం హైవేపై వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. అనంతరం రహదారి పక్కనే ఉన్న మార్కెట్లో జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మొత్తం 51 మంది మృతి చెందారు. మరో 32 మంది క్షతగాత్రులయ్యారు. మరికొందరు వాహనాల్లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. 🔔 — A road accident in Londiani, western Kenya has claimed at least 48 lives after a lorry carrying a shipping container veered off the road and collided with multiple vehicles. pic.twitter.com/FLOf3dJjGf — OFF-AIR ™ 🔔 (@OffAirNewsRoom) July 1, 2023 ఇది కూడా చదవండి: అర్ధరాత్రి రన్నింగ్ బస్సులో మంటలు.. 25 మంది సజీవదహనం -
'కన్న కొడుకు మృతదేహాన్ని చేతులతో మోస్తూ..' రైలు ప్రమాదంలో కన్నీటి గాథలెన్నో..
ఒడిశా:ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. అయినవారిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఆ మృతదేహాల ముందే విలపిస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్నవారికి ఈ ఘటనను ఎలా తెలపాలో తెలియని దయనీయ స్థితిలో మరెందరో ఉన్నారు. తన చేతులతోనే కన్న కొడుకు మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లానని చెప్తూ ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. సుగాలి చెన్నైలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. ఈ రైలు ప్రమాదంలో సుగాలి పెద్ద కుమారుడు సుందర్తో పాటు బామ్మర్ధి దిలీప్ కూడా మరణించాడు. తన చిన్న కుమారుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. 'మేమంతా తొమ్మిది మందిమి చెన్నైకి బయలుదేరాము. డబుల్ డ్యూటీ చేస్తేనే నెలకు 17,000 సంపాదిస్తాను. ఊర్లో ఉపాది లేక నా కుమారులను కూడా ఏదైనా ఉద్యోగం చేపించాలని చెన్నైకి తీసుకువస్తున్నాను. కానీ మృత్యువు ప్రమాదం రూపంలో ఎదురైంది. నా కొడుకు మృతదేహాన్ని నా చేతులతోనే మోయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో బాధితులు కుప్పలుగా పడి ఉన్నారు.' అని సుగాలి కన్నీటి పర్యంతమయ్యారు. ఇదీ చదవండి:Odisha Train Accident: నిమిషాల వ్యవధిలోనే.. మూడు రైళ్లు.. తపసి సర్ధార్(22) హౌరా నుంచి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో వ్యవసాయ కూలీగా ఏడు నెలలు పని చేసి ఇంటికి వెళుతున్న 11 మంది సభ్యుల్లో ఒకరు. ' అంతా గందరగోళం. అరుపులు, ఏడుపులు వినిపించాయి. నా తలకు ముఖంపై గాయాలయ్యాయి. ఇంకా నాలుగు గంటలైతే మా స్టాప్ వచ్చేది. అమ్మను కలిసేవాడిని.' అని విలపించాడు. గోపాల్ మిర్దా(40), అతని భార్య అంజు దేవి జార్ఖండ్ గడ్డా జిల్లాకు చెందినవారు. బెంగళూరులోని నర్సరీలో రెండు నెలలు పని చేసి ఇంటికి వెళుతున్నారు. ' నా కొడుకుని మా అమ్మే చూసుకుంటుంది. ఇటీవల ఆవిడ ఆరోగ్యం బాగుండట్లేదు. అందుకే ఇంటికి వెళ్లి వారిని చూసుకుందామనుకున్నాం. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. కాలుకు తలకు గాయాలయ్యాయి.' అని దుఖంతో చెప్పారు. ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:Odisha Train Accident: ఈ పాపం ఎవరిది?..ఇది సాంకేతిక సమస్య లేదా మానవ లోపమా?.. -
ప్రకాశం: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్త్క్షి, త్రిపురాంతకం: జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలోని హైవేపై ఆదివారం రాత్రి 10.15 సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీ బస్సు వినుకొండ వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన సాయి(26), పిల్లి శ్రీనివాస్(23), చంద్రశేఖర్ (25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హైవే అంబులెన్స్, 108లో వినుకొండకు తరలించారు. మార్గంమధ్యలో శకంర్ (24) మృతిచెందాడు. అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్ కోసం వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఎస్సై జీవీ సైదులు తెలిపారు. ఇది కూడా చదవండి: కోటిపల్లి రైల్వేలైన్కు కదలిక -
లోయలోకి వాహనం పల్టీ...
జమ్మూ: విద్యుత్ ప్రాజెక్ట్లో పనిచేసే కార్మికులతో వెళ్తున్న వాహనం లోయలోకి పల్టీలు కొట్టడంతో ఏడుగురు మరణించిన ఘటన జమ్మూకశ్మీర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిష్ట్వార్ జిల్లాలోని దఛన్ సమీపంలోని దాంగ్దూరు విద్యుత్ ప్రాజెక్ట్ దగ్గర్లో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రాజెక్ట్ సైట్ సమీపంలో ప్రమాదం జరగడంతో వందలాది మంది కార్మికులు ఘటనాస్థలికి చేరుకుని మృతుల కుటుంబాలకు కంపెనీనే నష్టపరిహారం చెల్లించాలని, క్షతగాత్రులకు తక్షణ ఆర్థికసాయం అందించాలని నిరసనకు దిగారు. భారీ వర్షం పడుతుండటంతో డ్రైవర్కు సరిగా కనిపించకపోవడంతో కొండ మలుపులో వాహనం అదుపుతప్పింది. దీంతో కొండ నుంచి వందల మీటర్ల లోయలోకి వాహనం పల్టీకొట్టి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు జార్ఖండ్ కార్మికులుసహా ఏడుగురు మరణించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా పలు పార్టీల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నాగాపూర్-పూణే హైవేపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వివరల ప్రకారం.. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె నుంచి నాగాపూర్-పూణే హైవేపై మెహకర్ రూట్లో బస్సు వెళ్తోంది. ఎదురుగా స్పీడ్గా వస్తున్న ఓ ట్రక్కు ఆ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతిచెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే.. గాయపడ్డవారిని సింద్కేదార్రాజా హాస్పిటల్లో చేర్పించారు. అయితే, రెండు వాహనాలు వేగంలో ఉండటంతో బలంగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో రెండు వాహనాలు తుక్కుతుక్కయ్యాయి. బస్సు, ట్రక్కుకు చెందిన గ్లాసు ప్యానల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో, ఆ ప్రాంతం భయానకంగా మారిపోయింది. ఇది కూడా చదవండి: రాధ మర్డర్.. ట్విస్ట్లే.. ట్విస్ట్లు.. -
విషాదం.. దుబాయ్లో భారతీయ జంట సహా ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: దుబాయ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడ జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో నలుగురు భారతీయలు(ఓ జంటతో) సహా మరో 16 మంది చనిపోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు సమాచారం. కాగా, భారతీయ జంటను కేరళకు చెందినవారిగా గుర్తించారు. వివరాల ప్రకారం.. దుబాయ్లోని అల్ రస్ ప్రాంతంలో సివిల్ డిఫెన్స్ హెడ్క్వార్టర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని నాలుగో అంతస్తులో సంభవించిన మంటలు క్రమంగా మిగతా అంతస్తులకు పాకాయి. దీంతో, అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటానా స్థలానికి ఫైరింజన్స్ చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఇక, ఈ ప్రమాదంలో భారత్కు చెందిన నలుగురు మృతిచెందారు. ఇక, మృతుల్లో కేరళలోని మల్లాపురానికి చెందిన దంపతులు కలంగదన్ రిజేష్, కందమంగళత్ జిషిగా గుర్తించారు. మంటల కారణంగా వీరిద్దరూ ఊపిరాడక చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సెక్యూరిటీ గార్డు కూడా మృతి చెందినట్లు సమాచారం. జిషి ఖిజాయిస్ క్రెసెంట్ స్కూల్లో టీచర్గా ఉండగా రిజేష్ ట్రావెల్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే, మంటలకు షార్ట్సర్క్యూటే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపటినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు పాకిస్థానీలు, ఓ నైజీరియా మహిళ సహా పలువురు ఉన్నట్టు తెలుస్తోంది. -
దీన్ని ఎవరు విచారిస్తారు?: మహారాష్ట్ర విషాదంపై ఉద్ధవ్ థాక్రే ఫైర్
మహారాష్ట్ర భూషణ్ పురస్కార ప్రధానోత్సవంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 11 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ ఘటనపై ఎవరూ సమగ్రంగా దర్యాప్తు చేస్తారని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఫైర్ అయ్యారు. ముంబై ఖార్గర్లో జరిగిన అవార్డు వేడుకను సరిగా ప్లాన్ చేయలేదని విమర్శించారు. ఈ మేరకు ఉద్ధవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య థాక్రే, ఎన్సీపీ నాయకుడు అజిత పవార్ ఎంజీఎం కమోతేతో కలిసి ఆ కార్యక్రమంలో వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరణించిన కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే చికిత్స పొందుతున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి వైద్య ఖర్చులను భరిస్తుందని సీఎం షిండే ట్వీట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు) -
విషాదాంతమైన BRS ఆత్మీయ సమ్మేళనం
-
దేశం లో కొత్త కరోనా కేసులు...
-
TS: కరోనా టీకా వికటించి 37 మరణాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా వేసుకున్న తర్వాత దాని దుష్ప్రభావాల ఫలితంగా తెలంగాణలో 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కోవిడ్ టీకా ప్రారంభమైన 2021 జనవరి 16 నుంచి ఈ ఏడాది మార్చి 15వ తేదీ వరకు సంభవించిన మరణాలు, టీకా తర్వాత దుష్ప్రభావాలపై ఒక నివేదికను వెలువరించింది. నివేదిక ప్రకారం టీకా తర్వాత దు్రష్పభావాల కారణంగా దేశంలో 92,479 మంది ఆసుపత్రుల పాలయ్యారు. అందులో తెలంగాణలోనే 10,370 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఈ తరహా కేసుల్లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ మొదటి స్థానంలోఉంది. ఆ రాష్ట్రంలో 10,513 ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్లో 10,127 ఘటనలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ మూడు రాష్ట్రాల్లోనే పదివేలకు పైగా ఇటువంటి ఘటనలు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 8,212, పశ్చిమబెంగాల్లో 8,130, కర్ణాటకలో 6,628 మంది ఆసుపత్రులపాలయ్యారు. కాగా, టీకా అనంతరం దేశంలో మొత్తం 1,156 మంది మరణించారు. అందులో అత్యధికంగా కేరళలో 244 మంది మృతి చెందారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 102 మంది, ఉత్తరప్రదేశ్లో 86 మంది మరణించారు. మధ్యప్రదేశ్లో 85, కర్ణాటకలో 75, పశి్చమ బెంగాల్లో 70 మంది మరణించారు. కాగా, ఛత్తీస్గఢ్లో కేవలం ఒకరే మృతిచెందడం గమనార్హం. ప్రతి 19.03 లక్షల డోసులకు ఒక మరణం.. దేశంలో ఇప్పటివరకు కోట్లాది మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. అందులో కరోనా టీకా వేసుకున్న ప్రతీ 23 వేల మందిలో ఒకరు ప్రతికూల ప్రభావాలతో ఆసుపత్రుల్లో చేరారు. తెలంగాణలో ఇప్పటివరకు 3.24 కోట్ల మంది కరోనా టీకా మొదటి డోసు వేసుకున్నారు. ఇందులో 3.15 కోట్ల మంది రెండో డోసు, అలాగే 1.35 కోట్ల మంది బూస్టర్ డోసు తీసుకున్నారు.మొత్తం మూడు డోసులు కలిపి 7.75 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. కాగా, రాష్ట్రంలో టీకా తీసుకున్నవారిలో 37 మంది చనిపోయారు. ఇప్పటివరకు దేశంలో 220 కోట్ల టీకా డోసులు ఇచ్చారు. అంటే ప్రతి 19.03 లక్షల డోసులకు ఒక మరణం సంభవించింది.తెలంగాణలో ప్రతీ 20.96 లక్షల డోసులకు ఒక మరణం సంభవించింది. వీటిని దుష్ప్రభావాలతో ఆస్పత్రుల్లో చేరిన తర్వాత జరిగిన మరణాలుగానే ప్రభుత్వం ప్రకటించింది. అంతేగానీ కరోనా వ్యాక్సిన్ వల్లే నేరుగా సంభవించిన మరణాలుగా ప్రకటించలేదని నిపుణులు అంటున్నారు. కోవిడ్ వ్యాప్తితీవ్రతతో సంభవించిన మరణాలతో పోలిస్తే టీకా అనంతర మరణాలు చాలా స్వల్పమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 8.42 లక్షల మందికి కరోనా సోకగా, అందులో 8.38 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా అధికారికంగా 4,111 మంది చనిపోయారు. ఇతర వ్యాక్సిన్లతోనూ ఇలాగే మరణాలు ఇతర వ్యాక్సిన్లతోకూడా ఇదే తీరులో మరణాలు సంభవిస్తాయి. ప్రతీ మిలియన్ వ్యాక్సిన్ డోసుల్లో ఒక మరణం సంభవిస్తుంది. కరోనా వ్యాక్సిన్ అనంతరం జరుగుతున్న మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే మరే ఇతర వ్యాక్సిన్ కూడా కరోనా టీకా అంత పెద్ద ఎత్తున అన్ని వర్గాలకు వేసినట్లు లేదు. అయినా కూడా సాధారణ స్థాయిలోనే మరణాలు ఉన్నాయి. కరోనా టీకాతోనే కాకుండా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు మృతిచెందితే వారిని కూడా టీకా అనంతర మరణాల జాబితాలో చేర్చే అవకాశముంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. –ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
మళ్లీ భయపెడుతున్న కరోనా.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా టెన్షన్ మళ్లీ స్టార్ట్ అయ్యింది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. మొన్నటి వరకు వందల్లో నమోదైన పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 4వేలకు చొరవైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,823 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 18,389 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. ఇక, శనివారంతో పొల్చితే పాజిటివ్ కేసుల సంఖ్య 27 శాతం పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక, శనివారం దేశవ్యాప్తంగా 2,995 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, వైరస్ బారినపడి ఇప్పటి వరకు 5,30,881 మృతిచెందినట్టు పేర్కొంది. India reports 3,824 new cases of Covid-19 in 24 hours; the active caseload stands at 18,389. pic.twitter.com/i4AOCyHAj3 — ANI (@ANI) April 2, 2023 -
Coronavirus: వరుసగా రెండో రోజు భారీగా కేసులు
గత కొన్ని వారాల నుంచి కరోనా ఉధృతి మళ్లీ కనిపిస్తోంది. దేశంలో నిన్న ఒక్క రోజులోనే మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆరు కొత్త మరణాలు నమోదయ్యాయి. దీంతో క్రియశీలక కేసుల సంఖ్య 15,208కి చేరినట్లయ్యింది. ఇప్పటి వరకు సుమారు 1396 మంది రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు. గత 24 గంట్లో తాజా కేసులతో రికవరి రేటు 98.78% తగ్గింది. మరణాల రేటు 1.19%గా ఉంది. కొద్ది రోజులుగా కేసులు అనుహ్యంగా పెరడం ప్రారంభించాయి. గత మార్చి 30నే దేశంలో తాజాగా నమోదైన కేసుల్లో 50% పెరుగుదల కనిపించింది. కాగా, మహారాష్ట్రలో కొత్తగా 694 కొత్త కేసులు, కేరళలో 765 కేసులు నమోదయ్యాయి India reports 3,095 fresh cases of COVID-19 in the last 24 hours, active cases stand at 15,208. — ANI (@ANI) March 31, 2023 (చదవండి: దేశంలో భారీగా పెరుగుతున్న కేసులు.. మళ్లీ కరోనా టెన్షన్) -
మిస్టరీగా మారిన కొత్త వైరస్.. 24 గంటల్లో ముగ్గురు మృతి!
ఇప్పటికే కరోనా వైరస్తో సతమతమవుతున్న ప్రజలపై మరో వైరస్ దాడి మొదలైంది. వైద్యులకే అంతుచిక్కని కొత్త వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కొత్త వైరస్ కారణంగా ఇప్పటికే ముగ్గురు మృతిచెందడం కలకలం సృష్టించింది. కాగా, ఈ వైరస్ ఆఫ్రికాలో వ్యాప్తిచెందుతోంది. వివరాల ప్రకారం.. ఆఫ్రికా ఖండంలోని బురుండి దేశంలో ఉన్న బజిరోలో ప్రాంతంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తున్నది. అంతుచిక్కని ఈ వైరస్ కారణంగా 24 గంటల్లోనే ముగ్గురు మృతిచెందారు. అయితే, ఈ వైరస్ బారినపడిన వారికి జ్వరం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నట్టు అక్కడి వైద్యులు నిర్దారించారు. ఇదే సమయంలో వైరస్ సోకిన వారికి ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బురుండి దేశ ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు బజిరో పట్టణాన్ని క్వారంటైన్ చేశారు. ఇదిలా ఉండగా, కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సమీప దేశాలను హెచ్చరించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇటీవలే బురుండి పక్క దేశమైన టాంజానియాలో మార్బర్గ్ అనే వైరస్ వ్యాప్తి జరిగింది. దీంతో, ఇదే వైరస్ కూడా బురుండిలో వ్యాప్తి చెందిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బురుండిలో ఎబోలా, మార్బర్గ్ వ్యాప్తి చెందే అవకాశంలేదని ఆరోగ్యశాఖ అధికారులు కొట్టిపారేస్తున్నారు. Deadlier than Covid19: Africa sees new virus that kills within 24 hours, claims three in Burundi A unidentified disease, anticipated as a virus that causes nosebleed and reportedly kills the infected person within 24 hours#indianews #india #newsindia #dailynews #ohmyindia pic.twitter.com/DyjgVdQrTC — Oh My India (@OhMyIndiaNews) March 31, 2023 -
భారత్లో కరోనా టెన్షన్.. ఒక్కరోజులో 40శాతం కేసులు జంప్!
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ టెన్షన్కు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తి కారణంగా భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే 40 శాతం పాజిటివ్ కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3వేలు దాటింది. వివరాల ప్రకారం.. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3016 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైదారోగ్య శాఖ తెలిపింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది ఏకంగా 40 శాతం ఎక్కువ అని స్పష్టం చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా మొత్తం 1,10,522 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం రోజువారీ కేసుల సంఖ్య 2,151గా ఉండగా.. ఒక్కరోజులోనే వెయ్యికిపైగా కేసులు పెరిగాయి. మరోవైపు, దేశంలో వైరస్ కారణంగా నిన్న ఒక్కరోజు 14 మరణాలు చోటుచేసుకున్నాయి. కేరళలో 8, మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2, హిమాచల్ ప్రదేశ్లో ఒకరు మృతిచెందారు. తాజా మరణాలలో దేశంలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,862కి చేరింది. ఇక, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,509గా ఉంది. ఇక రకవరీ రేటు 98.78 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కోరలు చాస్తోంది. బుధవారం ఢిల్లీలో 300 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబర్ 2వ తేదీన 3375 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఆరు నెలల తర్వాత నేడు.. కేసుల సంఖ్య 3వేల మార్క్ దాటింది. India recorded 3,016 new #COVID cases in past 24 hours, a nearly 40% jump since yesterday. @Verma__Ishika reports pic.twitter.com/bTqf7UfPs7 — Mirror Now (@MirrorNow) March 30, 2023 -
గుండె సడెన్ స్టాప్.. కారణలెన్నో!
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థి మరీదు రాకేశ్ గుండెపోటుతో మృతి. రాజస్తాన్కు చెందిన 18 ఏళ్ల సచిన్ హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ కాలేజీ ఆవరణలోనే అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన షేక్ అహ్మద్ (36) ఇటీవలే దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు. అతనికి ఛాతీనొప్పి రావడంతో కుటుంబసభ్యులు అసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న గుండెపోటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా యువతలో కూడా ఇవి సంభవించడం కలవరపరుస్తోంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో ఆలస్యంగా అనేక దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్టు అనేక తాజా అధ్యయనాల్లో వెల్లడౌతోంది. మరోవైపు వయసుతో నిమిత్తం లేకుండా రక్తం గడ్డకట్టే గుణం పెరిగేందుకు దోహదపడేలా జీవనశైలి అలవాట్లు మారడం ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్యనున్న యువత ఆలస్యంగా నిద్రించడం, ఎలాంటి శారీరక శ్రమ, వ్యాయామం లేకుండా సామాజిక మాధ్యమాల్లో, సెల్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఇలా వివిధరకాల డిజిటల్ పరికరాలతో కాలక్షేపం చేస్తూ మానసిక ఒత్తిడికి గురికావడం, తదితరాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆకస్మిక గుండెపోట్లకు ఎన్నో కారణాలు ఆకస్మిక గుండెపోట్లకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కరోనా సోకినవారికి కార్డియో వాస్క్యులర్ జబ్బులు వచ్చే అవకాశాలు అధికమయ్యాయి. కోవిడ్ సందర్భంగా తీవ్రంగా జబ్బుపడినవారికి ప్రమాదం ఎక్కువ. ప్రస్తుతం అనేకమందిలో రక్తం గడ్డకట్టే గుణం పెరుగుతుండడం ఆందోళనకరం. గుండె జబ్బులకు అనేకరకాల వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో కారణమౌతున్నాయి. మానసిక, పని ఒత్తిళ్లు, వాతావరణంలో వివిధరకాల కాలుష్యాలు పెరగడం, జీవనశైలి అలవాట్లు, హైప్రొటీన్ పిజ్జాలు, బర్గర్లు వంటి తిండి ఎక్కువవడం, జిమ్లలో అధికంగా శ్రమించడం వంటి వాటితో యువతరం గుండెపోట్ల బారిన పడడం ఇటీవల పెరిగింది. ఇక వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావం ‘మయోకార్డియల్ డిస్ఫంక్షన్’కు కారణమవుతోంది. యువత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడం, అర్ధరాత్రిళ్లు, తెల్లారేదాకా మెలుకువగా ఉండడంతగ్గించాలి. ఇలాంటి వాటితో ‘సర్కాడియల్ రిథమ్’లో మార్పులొచ్చి హార్మోన్లు, మెటబాలిజమ్లో మార్పులొస్తున్నాయి. కుటుంబంలో గుండె సంబంధిత సమస్యలున్న వారుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. –డా. డి.శేషగిరిరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ బీపీ, షుగర్ కంటే స్ట్రెస్ డేంజర్ పోస్ట్ కోవిడ్లో సడెన్ కార్డియాక్ మరణాలు కొద్దిగా పెరిగాయి. దీనితో పాటు యువకుల్లో, ముఖ్యంగా కాలేజీ చదువుతున్న వారిలో ‘డ్రగ్స్ అడిక్షన్’అనేది పెరిగింది. కొకైయిన్, గంజాయి వంటి మాదకపదార్థాల వాడకం ‘కరోనరీ వాసెస్ ప్లాజె మ్’కు దారితీస్తుంది. కరోనా బారిన పడటం, డ్రగ్స్ వినియో గం వంటి వాటితో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. పొగతాగడం, మద్యం అలవాట్లు, డ్రగ్స్ తీసుకోవడం వంటి వల్ల హార్ట్ అటాక్కు ఎక్కువ అవకాశాలుంటాయి. యంగ్ జనరేషన్ ఎక్కువగా జంక్ఫుడ్కు అలవాటు పడడం, వాయు కాలుష్యం వంటివి కూడా తోడై గుండెపోటుకు కారణమౌతున్నాయి. గతంలో 40, 50 ఏళ్లకు పైబడిన షుగర్, బీపీ వంటివి ఉన్నవారికి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లలోపు వారికే ఇలాంటి సమస్యలు ఎదురౌతున్నాయి. యువతరం కాలేజీల్లో చదువుపరంగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. షుగర్, బీపీ వంటి వాటి కంటే కూడా స్ట్రెస్ అనేది యువకుల్లో మరింత ప్రమాదకరమైనదిగా మారింది. గుండె జబ్బులకు సంబంధించి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. క్రీడలు ఆడేటప్పుడు ఛాతీనొప్పిగా అనిపించినా, బాగా చెమటలు పట్టినా, ఊపిరాడకపోయినా, కొంచెం అసౌకర్యంగా అనిపించినా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. స్మోకింగ్, డ్రగ్స్ వంటివి మానేయాలి. యోగ వంటివి అలవాటు చేసుకోవడం, ధ్యానంతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, డాక్టర్ల ద్వారా సందేహాల నివృత్తి చేసుకుంటే ఇది పెద్దసమస్యగా మారకుండా జాగ్రత్త పడవచ్చు. – డా. ఓరుగంటి సాయి సతీష్, ఫ్రొఫెసర్, కార్డియాలజీ హెడ్, యూనిట్ 1, నిమ్స్ -
పులుల మరణాలపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: దేశంలో అభయారణ్యాల్లో పులుల మరణాలపై మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెద్ద సంఖ్యలో పులులు చనిపోతున్నాయంటూ వచ్చిన వార్తా కథనాలపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. దేశవ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోతున్నందున వాటిని రక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ధర్మాసనం ప్రస్తుతం విచారణ జరుపుతోంది. నేషనల్ టైగర్ కాన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) గణాంకాల ప్రకారం..దేశంలో 2012 నుంచి ఇప్పటి వరకు 1,059 పులులు మరణించాయి. వీటిలో ఏకంగా 270 పులులు టైగర్ స్టేట్గా పేరున్న మధ్యప్రదేశ్లోనివే కావడం గమనార్హం. -
చైనాలో కోవిడ్ మరణ మృదంగం..అంతకంతకూ పెరిగిపోతున్న కేసులు
చైనాలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులతో కుదేలవుతోంది. దీనికి తోడు రోజుకు వేల సంఖ్యలో మరణాల సంభవించడంతో తీవ్ర భయాందోళనలతో సతమతమవుతోంది చైనా. అదీగాక బీజింగ్ కోవిడ్ ఆంక్షలు సడలించాక కేసులు ఘోరంగా పెరగడం ప్రారంభమై అందర్నీ విస్మయపర్చింది. ఈ క్రమంలో ఇటీవలే ఒక వారంలోనే దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో దాదాపు 13 వేల మరణాలు సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. మరణించిన వారిలో చాలామంది వైరస్ బారిన పడినవారేనని ఆరోగ్య అధికారి తెలిపారు. ఈ మేరకు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) కేవలం కరోనాతో ఆస్పత్రుల్లో చేరి శ్వాసకోస వైఫల్యంతో 681 మంది మరణించారని, కరోనా తోపాటు ఇతర వ్యాధుల కారణంగా సుమారు 11,977 మంది మరణించినట్లు పేర్కొంది. కానీ హోం క్వారంటైన్లోనే ఉండి చనిపోయిన వారి సంఖ్యను వెల్లడించలేదు. ఆంక్షలు సడలించాక జనవరి12 నాటికి ఒక్క నెలరోజుల్లోనే దాదాపు 60 వేల మరణాలు సంభవించాయని ఒక వారం ముందు వెల్లడించింది. అంతేగాదు కోవిడ్ ఆంక్షలను ఎత్తేసిన డిసెంబర్ నుంచి అంతకు ముందు కలిపి మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షలకు పైగా ప్రజలు మరణించినట్లు తెలిపింది. చైనాలో జరుపుకునే లూనార్ న్యూ ఈయర్ వేడుకలకు ముందుగానే సుమారు 36 వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వేడుకలను పురస్కరించుకుని మిలియన్ల మంది ప్రజలు తమ సొంతగ్రామాలకు రావడంతో ఈ కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని భయాలు ఎక్కువయ్యాయి. ఐతే దేశంలో ఇప్పటికే 80 శాతం మంది ఈ వైరస్ బారిన పడ్డారు, కాబట్టి ఇప్పట్లో కరోనా సెకండ్వేవ్ వచ్చే అవకాశం లేదని చైనా సీడీసీలోని చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వూ జున్ యూ అన్నారు. (చదవండి: కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో కాల్పులు.. పలువురి మృతి) -
తార్నాకలో ప్రైవేట్ ఉద్యోగి ఘాతుకం.. కాపాడాల్సినవాడే.. కడతేర్చాడు
కంటికిరెప్పలా ఇంటిల్లిపాదినీ కాపాడేవాడే, కుటుంబానికి అండగా ఉండాల్సినవాడే దారుణానికి ఒడిగట్టాడు. కన్నతల్లిని, కట్టుకున్న ఇల్లాలిని, అభమూ శుభమూ లియని కన్న కూతురునూ కడతేర్చాడు. కడకు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. తనతో చెన్నై రావడానికి నిరాకరించిన భార్యతో పాటు కుమార్తెను, కన్నతల్లిని చంపేశాడు. ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ప్రైవేట్ ఉద్యోగి. సోమవారం మధ్యాహ్నం ఈ విషాద ఉదంతం వెలుగులోకి వచి్చంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. చెన్నైకి చెందిన ప్రతాప్ (34) అక్కడి ఓ కార్ల కంపెనీలో డిజైన్ మేనేజర్గా పని చేస్తున్నాడు. ఈయనకు దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తార్నాక ప్రాంతానికి చెందిన సింధూర (32)తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఆద్య ఉంది. సింధూరకు రెండు నెలల క్రితం హిమాయత్నగర్లోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో ఉద్యోగం వచి్చంది. దీంతో ఆమెతో పాటు ఆద్య, ప్రతాప్ తల్లి రాజతి నగరానికి వచ్చారు. తార్నాకలోని రూపాలీ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. చెన్నైలోనే ఉద్యోగం చేస్తున్న ప్రతాప్ వారాంతాల్లో ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడు. చెన్నై వెళదామనే విషయంపై కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బెడ్రూంల్లో నిద్రిస్తుండగా.. చెన్నైలో స్థిరపడటానికి ఉద్యోగం వదిలి రావాలంటూ భార్య సింధూరపై ప్రతాప్ ఒత్తిడి తెస్తున్నాడు. దీనికి ఆమె అంగీకరించడంపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వీకెండ్లో రావడంతో శుక్రవారం ప్రతాప్ నగరానికి వచ్చాడు. చెన్నై వెళ్లే విషయమై రెండు రోజులుగా వీరి మధ్య గొడవలు జరిగి ఆదివారం రాత్రి తారస్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రతాప్.. కుటుంబాన్ని హతమార్చి తానూ తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ప్రధాన బెడ్రూంలో నిద్రిస్తున్న భార్య, కుమార్తెను, కొద్దిసేపటి తర్వాత పక్కనే మరో బెడ్రూంలో పడుకుని ఉన్న తల్లినీ చంపివేశాడు. హాల్లో సీలింగ్ ఫ్యాన్కు తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సింధూర సహోద్యోగులు ఫోన్ చేయడంతో.. సింధూర సోమవారం విధులకు హాజరుకావాల్సి ఉంది. ఆమె బ్యాంక్కు రాకపోవడంతో ఆరా తీసేందుకు సహోద్యోగులు ఫోన్ చేశారు. సింధూర నుంచి స్పందన రాకపోవడంతో మధ్యాహ్నం వరకు ప్రయత్నించారు. చివరకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సింధూర అపార్ట్మెంట్కు వచ్చారు. ఎంత పిలిచినా లోపల నుంచి స్పందన లేకపోవడంతో పక్కన అపార్ట్మెంట్లో నివసించే సింధూర తల్లి జమునను తీసుకువచ్చారు. వీరికి ఫ్లాట్లోకి హాల్లో ఫ్యాన్కు వేలాడుతున్న ప్రతాప్ మృతదేహం కనిపించింది. బెడ్స్పై ఉన్న సింధూర, ఆద్యలను పరిశీలించారు. సింధూర కొన ఊపిరితో ఉండటంతో సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స ప్రారంభించడానికి ముందే ఆమె తుది శ్వాస విడిచింది. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మార్చురీకి తరలించారు. సింధూర తల్లి జమున ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు: సింధూర తల్లి జమున ‘ప్రతాప్ మాకు దగ్గరి బంధువు హైదరాబాద్ నుంచి చెన్నై షిఫ్ట్ కావాలనే విషయంపై భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. కానీ.. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు’ అని జమున మీడియాతో అన్నారు. రాజతి మెడపై ఉన్న గుర్తుల్ని బట్టి ఉరి బిగించి లేదా గొంతు నులిమి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. సింధూర, ఆద్యల మృతికి కారణాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. పోస్టుమార్టం పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్ తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సింధూర కోసం వాళ్ల ఆఫీస్ వారు వచ్చి చూసేదాకా ఇంతటి ఘోరం జరిగిందని నాకు తెలియదు. ఆమె ఫోన్ ఎత్తట్లేదు అని ప్రతాప్ కూడా స్పందించట్లేదని కంగారు పడుతూ వచ్చి చెప్పారు. ఎంత కొట్టినా తలుపులు కూడా తీయట్లేదని ఆందోళన చెందారు. అప్పుడు వచ్చి చూస్తే ఈ ఘోరం కనిపించింది. మేం పక్క అపార్ట్మెంట్లో ఉంటాం. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మా దగ్గరికి వస్తే సరిపోయేది కదా. ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా. -
రష్యాలో ఒకరి తర్వాత ఒకరు.. అపర కుబేరులు ఎందుకు చనిపోతున్నారు?
రష్యాలో అపర కుబేరులు హఠాత్తుగా చనిపోతున్నారు. అంత్యంత అనుమానస్పదంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. కోట్లకు పడగలెత్తిన వారేఎందుకిలా చనిపోతున్నారో అంతు చిక్కడం లేదు. ఒక్క రష్యాలోనే కాదు ఇతర దేశాల్లోనూ రష్యన్ కుబేరులు మిస్టీరియస్గా తలలు వాల్చేస్తున్నారు. ఇవన్నీ ఆత్మహత్యలేనని పుతిన్ ప్రభుత్వం అంటోంది. అయితే మరణాలు జరిగిన తీరు చూస్తే మాత్రం ఇవి హత్యలేమో! అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఇవి హత్యలా? ఆత్మహత్యలా? లేక సహజ మరణాలా? హత్యలైతే వీటి వెనుక ఉన్న కుట్రదారు ఎవరు? సూత్రధారి ఎవరు? హంతకులు ఎవరు? ఏంటీ డెత్ మిస్టరీ? డిసెంబరు 24న మన పొరుగునే ఉన్న ఒడిషాలోని రాయగడలోని ఓ హోటల్ కిటికీ నుంచి పడి రష్యాకు చెందిన ఎంపీ, మల్టీ బిలియనీర్ పావెల్ ఆంటోవ్ అనుమానస్పద స్థితిలో మరణించారు. దీనికి రెండు రోజుల ముందే అంటే డిసెంబరు 22న ఇదే హోటల్లో ఆంటోవ్ సన్నిహితుడు అయిన మరో రష్యన్ వ్లదిమీర్ బిడెనోవ్ గుండెపోటుతో మరణించారు. ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు రష్యన్లు డిసెంబరు 21న ఈ హోటల్ లో దిగారు. ఆంటోవ్ 66వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోడానికి ప్రశాంతంగా ఉండే రాయగడ ప్రాంతాన్ని ఎంచుకున్న నలుగురు స్నేహితులు కలిసి ఇక్కడకు వచ్చారు. బిడెనోవ్ మరణంతో షాక్ తిన్న ఆంటోవ్ డిప్రెషన్లో పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉండచ్చన్నది పోలీసుల అనుమానం. అయితే ఈ రెండూ కూడా సహజ మరణాలో ఆత్మహత్యలో కావని ఇవి కచ్చితంగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్లేనని మరి కొందరు అంటున్నారు. ఇంకో చిత్రం ఏంటంటే ఆంటోవ్ చనిపోయిన రోజే సెయింట్ పీటర్స్ బర్గ్ లోఅడ్మిరల్లీ షిప్ యార్డ్స్ డైరెక్టర్ జనరల్ అలెక్జాండర్ బుజకోవ్ హఠాత్తుగా మరణించారు. ఆయన మరణానికి కారణాలేంటన్నది కూడా ఇప్పటి వరకు తెలియరాలేదు. వెనకున్నదెవరు? ఏంటీ మరణాలు? వీటి వెనుక ఏమన్నా కుట్ర ఉందా? కిరాయి హంతకులు ఉన్నారా? ఉంటే ఆ హంతకుల వెనుక ఉన్నదెవరు? ఎందుకంటే చనిపోయిన ఈ ముగ్గురూ కూడా మామూలు మనుషులు కారు. ఆంటోవ్ అయితే రష్యాలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకుడు. వ్యాపారాల్లోనూ దిట్ట. మిగతా వారూ మల్టీ బిలియనీర్లే. ఒక వేళ వీరివి హత్యలే అయితే.. వీరిని హతమార్చాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? కోట్లకు పడగలెత్తిన వీరిని హతమార్చడానికి కిరాయి హంతకులను కుదుర్చుకోగల సత్తా ఎవరికి ఉంటుంది? కచ్చితంగా ఈ కోటీశ్వరులను తలదన్నే పెద్దలే దీని వెనుక ఉండే అవకాశాలు ఉంటాయి. రష్యాలో ఇలా అనుమానస్పదంగా ప్రాణాలు వదిలేస్తోన్న కుబేరుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? పెద్ద సస్పెన్స్ హర్రర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ను మరిపించే ఈ వరుస మిస్టీరియస్ డెత్స్ వెనుక ఉన్న కథేంటి? ఇదే ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ఈ ఒక్క నెలలోనే అయిదుగురు రష్యన్ కుబేరులు అనుమానస్పదంగా మరణించారు. మొత్తం మీద ఏడాదికాలంగా 22 మంది రష్యన్ ప్రముఖులు భయానకంగా చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది రష్యాలోని ప్రముఖ చమురు , సహజ వాయువు కంపెనీల్లో అత్యున్నత హోదాల్లో ఉన్నవారే కావడం గమనార్హం. గ్రాజ్ పోమ్, నోవాటెక్ వంటి ఆయిల్ కంపెనీలు రష్యాలో వ్యాపారాలను శాసిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలకు చెందిన కుబేరులు అనుమానాస్పదంగా మరణించిన వారిలో ఉండడం విశేషం. చనిపోయిన వారిలో చాలా మంది తాము ఉన్న అపార్ట్మెంట్పై అంతస్థుల కిటికీలనుండి కిందకు పడి చనిపోయారు. కొందరయితే తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. కొద్ది మంది గుండెపోటుతో మరణించినట్లు అధికారులు పేర్కొనగా ఒకళ్లిద్దరి విషయంలో మరణాలకు కారణాలు కూడా తెలీలేదు. కొందరి మరణాలు సంభవించిన తీరు మరీ భయంకరంగా ఉంది. ఇవన్నీ చూస్తే ఇవి నిజంగానే సహజ మరణాలా? ఆత్మహత్యలా? లేక కిరాయి హంతకులతో వీరిని ఎవరైనా తుదముట్టించారా? అన్న అనుమానాలు కలగక మానవు. విగత జీవులుగా భార్య పిల్లలు.. ఆయనేమో ఉరికి నోవాటెక్ కంపెనీ మాజీ డిప్యూటీ ఛైర్మన్ సెర్గీ ప్రోటో సెన్యా ఈ ఏడాది ఏప్రిల్లో కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ వెళ్లారు. అక్కడ ఓ లక్జరీ విల్లాలో బస చేశారు. ఓ రోజు ఉదయాన చూసే సరికి ప్రోటో సెన్యా విల్లా చూరుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. ప్రొటో సెన్యా భార్య, కూతురుల మృతదేహాలు విల్లాలో ఉన్నాయి. ఆ ఇద్దరి శరీరాలపైనా గొడ్డలితో నరికిన ఆనవాళ్లు ఉన్నాయి. అలాగే కత్తితో పొడిచిన గాట్లు కూడా ఉన్నాయి. ప్రొటో సెన్యానే తన భార్యా పిల్లల్ని రాక్షసంగా చంపేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని స్పానిష్ పోలీసులు అన్నారు. ఒకవేళ ప్రొటొ సెన్యా ఆత్మహత్య చేసుకుని ఉంటే ఎందుకు చేసుకుంటున్నాడో ఓ లేఖను పెట్టే వాడు. కానీ ఈ విల్లాలో ఎక్కడా కూడా సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. ఒక్కరోజు ముందే ప్రొటో సెన్యా విషాద మరణానికి ఒక్కరోజు ముందే ఏప్రిల్ 18న గ్యాజ్ ప్రోమ్ బ్యాంక్ మాజీ వైస్ ప్రెసిడెంట్ వ్లడిశ్లావ్ అవయేవ్ మాస్కోలనో తన అపార్ట్ మెంట్ లో భార్య పిల్లలతో సహా శవమై కనిపించారు. తన భార్య పిల్లల్ని కాల్చి చంపిన తర్వాత అవయేవ్ పిస్తోల్తో తనని తాను కాల్చుకుని చనిపోయి ఉండచ్చని భావిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే కంపెనీకి గతంలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఇగోర్ వోలో బుయేవ్ అయితే అవయేవ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని అన్నారు. బహుశా వ్యవస్థలో చాలా పెద్దలకు సంబంధించిన కీలక సమాచారం ఏదో అవయేవ్ కు తెలిసి ఉంటుందని.. అది తమకి ప్రమాదమని భావించే వారి చేతిలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయని ఇగోర్ భావిస్తున్నారు. అనుమానస్పద మృతి అవయేవ్ మరణానికి ఇంచుమించు నెల రోజుల క్రితం మార్చి 23న మెడ్ స్టార్మ్ కంపెనీ అధినేత వాసిలీ మెల్నికోవ్ నోవో గొరోడ్ లోని తన అపార్ట్ మెంట్లో తన భార్య, ఇద్దరు కొడుకులతో సహా అనుమానస్పద స్థితిలో మరణించారు. వైద్య పరికరాల తయారీ కంపెనీ అధినేత అయిన మెల్నికోవ్ తన భార్య, కొడుకులను కత్తితో పొడిచి చంపి అనంతరం తనని తాను పొడుచుకుని చనిపోయారన్నది పోలీసుల కథ. ఉరి తాడుకు వేలాడుతూ గతేడాది జనవరి 30న గ్యాస్ ప్రోమ్ డైరెక్టర్ షుల్మన్ తన ఇంట్లోని బాత్ రూంలో శవమై కనిపించారు. ఆయన పక్కన ఓ సూసైడ్ నోట్ కూడా దొరికినట్లు పోలీసులు చెప్పారు. గ్యాజ్ ప్రోమ్ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ ట్యుల్య కోవ్ సెయింట్ పీటర్ బర్గ్ లోని తన ఇంట్లో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. ట్యుల్యకోవ్ చనిపోయిన మూడు రోజులకే రష్యాలోనే ప్రముఖ ఆయిల్ కంపెనీ మ్యాగ్నెట్ గా పేరొందిన మిఖైల్ వాట్ ఫోర్డ్ ఇంగ్లాండ్ లోని తన ఇంట్లో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. ఆ తర్వాత స్కై రిసార్ట్ అధినేత ఆండ్రీ క్రుకోవ్ స్కీ ఓ శిఖరంపై నుండి జారి పడి చనిపోయారు. పుతిన్పై అనుమానాలు అన్నీ అనుమానస్పద మరణాలే. ప్రతీ మరణ ఘటన లోనూ ఎన్నో ప్రశ్నలు. ఏ ప్రశ్నకూ సమాధానం లేదు. అన్నీ దారుణ ఘటనలే. వీటన్నింటినీ నిశితంగా గమనిస్తే ఇవన్నీ కూడా రష్యా ప్రభుత్వాధినేత పుతిన్ చేయించినవే కావచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తన ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వారిని కానీ.. తనకు కంట్లో నలుసుగా తయారయ్యే వారిని కానీ తనకి భవిష్యత్తులో తలనొప్పిగా మారతారన్న వారిని కానీ ప్రాణాలతో విడిచి పెట్టడం అంత మంచిది కాదని పుతిన్ భావిస్తారన్నది పుతిన్ వ్యతిరేకుల వాదన. మొదట్నుంచీ కూడా పుతిన్ తన ప్రత్యర్ధులపై హత్యాయత్నాలకు పాల్పడిన చరిత్ర ఉందని వారంటున్నారు. రాజకీయాల్లో పుతిన్కు నిద్ర లేకుండా చేసిన రాజకీయ ప్రత్యర్ధి నావెల్నీపై 2020లో విష ప్రయోగం జరిగింది. ఆసుపత్రిలో సుదీర్ఘ చికిత్స అనంతరం నావెల్నీ ప్రాణాలతో బయట పడ్డారు. అంతకు రెండేళ్ల క్రితం 2018లో రష్యా నిఘా విభాగానికి మాజీ అధిపతి అయిన సెర్గీ స్క్రిపాల్ పైనా నావెల్నీ తరహాలోనే విష ప్రయోగం జరిగింది. ఈయన కూడా తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. రష్యా భద్రతాధికారి అలెగ్జాండర్ లిట్వినెంకోపై లండన్లో రేడియో ధార్మిక పదార్ధమైన పొలోనియంను ప్రయోగించారు. అలెగ్జాండర్ మాత్రం ఈ ఘలనలో చనిపోయారు. పుతిన్ పై అనుమానానికి కారణాలు లేకపోలేదు. ఒడిషాలో అనుమానస్పదంగా మరణించిన పావెల్ ఆంటోవ్ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి కాలు దువ్వడాన్ని విమర్శించారు. క్యీవ్ నగరంపై రష్యా వైమానిక దాడులను ఉగ్ర వాద చర్యగా అభివర్ణించారు. అయితే ఆ వెంటనే ఆంటోవ్ పై నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. ఆ వెంటనే ఆంటోవ్ చేత బలవంతంగా క్షమాపణలు చెప్పించేశారు. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు దురదృష్టకరమైనవని అవగాహనా రాహిత్యంతో సాంకేతిక లోపంతో చేసిన వ్యాఖ్యలని ఆంటోవ్ వివరణ ఇచ్చుకున్నారు కూడా. అసలు అపర కుబేరులే ఎందుకు చనిపోతున్నారు.? ఈ మిస్టీరియస్ డెత్స్ వెనుక నిజంగానే పుతిన్ ఉన్నారా? ఇంతకీ ఈ అపర కుబేరులు ఎలా అవతరించారో కూడా తెలుసుకోవాలి. 1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత కమ్యూనిస్టు దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రష్యా కొత్త నేత బోరిస్ ఎల్సిన్ అధికారంలోకి రావడంతోనే పెద్ద ఎత్తున ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించారు. వేలాది సంస్థలను కొందరు ప్రైవేటు వ్యక్తులు చేజిక్కించుకున్నారు. రాత్రికి రాత్రే వారు అపర కుబేరులయ్యే అవకాశం వచ్చింది. ప్రత్యేకించి రష్యాకు ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు సహజ వాయు రంగంలో ప్రైవేటు పెట్టుబడిదారులు అడుగు పెట్టారు. అలా కీలక రంగాలన్నీ దక్కించుకున్న ఈ నయా వ్యాపారులనే ఆలిగాక్స్ అని పిలుస్తున్నారు. వారే రష్యాలో అత్యంత ధనవంతులన్నమాట. పుతిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యాపారుల్లో కొందరు పుతిన్ కు అండగా నిలిచారు. పుతిన్ వ్యవహార శైలి నచ్చక కొందరు దూరంగా ఉన్నారు. ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధానికి కాలుదువ్విన మరుక్షణమే ప్రపంచంలో అందరి కన్నాఎక్కువగా ఆందోళన చెందింది ఈ కుబేరులే. ఎందుకంటే తమ వ్యాపారాలపై యుద్ద ప్రభావం పడుతుందని వీరు భయపడ్డారు. వీరు అనుకున్నట్లే నాటో దేశాల ఆంక్షల తో రష్యన్ బిలియనీర్ల వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. అన్నింటినీ మించి యూకే, ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్ లలో రష్యన్ కుబేరులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. విలాసవంతమైన విల్లాలు, ఎస్టేటులు కొన్నారు ప్రైవేటు జెట్ విమానాలు, ఓడలు పోర్టులు కొన్నారు. రష్యా యుద్ధం మొదలు పెట్టగానే నాటో దేశాలు రష్యా పై కఠిన ఆంక్షలు విధించాయి. రష్యన్లకు ఇతర దేశాల్లో ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఒక పక్క రష్యాలో తమ వ్యాపారాలు పడిపోవడం మరో పక్క విదేశాల్లోని తమ ఆస్తులన్నీ ఫ్రీజ్ అయిపోవడంతో రష్యన్ బిలయనీర్లు ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయారు. ఇది వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేసింది. ఈ ఫ్రస్ట్రేషన్ లోనే యుద్ధానికి కారణమైన పుతిన్ పై వ్యాపారులు మండి పడ్డారు. ఆ కోపంలోనే పుతిన్ పై విమర్శలూ చేశారు. ఆ తర్వాతనే 22 మంది సంపన్నులు అనుమానస్పద స్థితిలో చనిపోతూ వచ్చారు. సస్పెన్స్ సినిమాలో మాదిరిగా ఒకరి తర్వాత ఒకరు ఒకే విధంగా మరణానికి గురి కావడం ఆశ్చర్యచకితులను చేసింది. కొన్ని మరణాలు మరీ బీభత్సంగా క్రూరంగా ఉండడం మిగతా వారిని భయపెట్టింది. ప్రభుత్వం ఏమో ఆత్మహత్యలే అంటుంది. అక్కడి వాతావరణం చనిపోయిన తీరు చూస్తే అవి హత్యలేమో అన్న అనుమానాలు వస్తున్నాయి.ఈ మారణ హోమం ఎప్పటికి అంతం అవుతుందనేది అతి పెద్ద ప్రశ్న. ఉక్రెయిన్ తో యుద్ధం ఆగిన వెంటనే ఈ మరణాలు కూడా ఆగితే మాత్రం ఇవి ముమ్మాటికీ పుతిన్ ప్రభుత్వ హత్యలే అనుకోవలసి వస్తుందని మేథావులు అంటున్నారు. పాలకులను చికాకు పెట్టే వారినీ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టేవారినీ మూడోకంటికి తెలీకుండా మాయం చేసేసి శాల్తీలు గల్లంతు చేయడం అనేది రష్యాకు కొత్తకాదంటున్నారు విశ్లేషకులు. సోవియట్ యూనియన్ రోజుల్లోనూ నాటి గూఢచర సంస్థ కేజీబీ ఇదే చేసేదని వారంటున్నారు. ఇపుడు రష్యాలో కమ్యూనిజం లేకపోవచ్చుకానీ ప్రత్యర్ధులను లేపేసే వారసత్వం మాత్రం అలానే కొనసాగుతోందని వారంటున్నారు. పుతిన్ విధానాలను నిలదీసినందుకే రష్యాలో ఆలిగాక్స్ ల ప్రాణాలు గాల్లో కలుస్తూ ఉండచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సోవియట్ యూనియన్ కాలంలోనే కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన వారిని గుర్తించి కఠిన శిక్షలు విధించడం ఆనవాయితీగా వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశాధినేత పుతిన్ కూడా ఒకనాటి కేజీబీ అధికారి కాబట్టే సోవియట్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లుందని వారు అభిప్రాయ పడుతున్నారు. విషాదం ఏంటంటే రష్యాలో చోటు చేసుకుంటోన్న వరుస మృతి ఘటనల్లో ఏ ఒక్క కేసులోనూ సరియైన సాక్ష్యాలు లేకపోవడం. అయితే దీన్ని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదంటున్నారు మేధావులు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
చైనాలో శవాల గుట్టలు.. శ్మశానాల ముందు మృతదేహాలతో పడిగాపులు!
బీజింగ్: చైనాలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్7 విజృంభిస్తోంది. రోజుకు లక్షల మందికి సోకుతోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచానికి కేసులు, మరణాలు తెలియనీయకుండా డ్రాగన్ ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నా.. సోషల్ మీడియాల్లో బయటపడుతున్న వీడియోలు హృదయాలను కలచివేస్తున్నాయి. వందల మంది మరణిస్తుండడంతో శ్మశానాల ముందు అంత్యక్రియల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆరోగ్య నిపుణులు ఎరిక్ ఫైగిల్ డింగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో తమ వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు పెద్ద క్యూలైన్లో నిలుచుని మృతదేహాలను తీసుకెళ్తున్న హృదయవిదారక వీడియో వైరల్గా మారింది. ‘శ్మశానవాటికల్లో పెద్ద క్యూలైన్లు ఉన్నాయి. మీ ప్రియమైన వారి అంత్యక్రియల కోసం క్యూలైన్లలో వేచి ఉండటమే కాదు, ఆ సమయంలో వారిని మోసుకెళ్లాల్సి వస్తుందని ఊహించుకోండి. భయంకరమైన కోవిడ్ 19 చైనాను చుట్టివేయడంపై సానుభూతి చూపుదాం.’ అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ నుంచి ఓ డాక్యుమెంట్ లీక్ కావడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్ 1 నుంచి 20 మధ్య దేశంలోని సుమారు 17.56 శాతం మంది 25 కోట్ల మందికి వైరస్ సోకింది. రోజుకు లక్షల మంది వైరస్ బారినపడుతున్నారు. 35) Epic long lines at crematoriums… imagine having to not just wait for hours to cremate you loved ones, but have to do it carrying their deceased bodies for all those hours… let’s have empathy for the horrific #COVID19 wave 🌊 crashing into China. 🙏 pic.twitter.com/aQcmmjuCTC — Eric Feigl-Ding (@DrEricDing) December 26, 2022 ఇదీ చదవండి: Dalai Lama Bodh Mahotsav Event: దలైలామా ఈవెంట్ వేళ కరోనా కలకలం.. నలుగురు విదేశీయులకు పాజిటివ్ -
China Corona: అంత్యక్రియలకు కూడా చోటు లేక..
కరోనా పుట్టుకకు కారణమైందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేల.. ఇప్పుడు అదే వైరస్తో మరణమృదంగాన్ని చవిచూస్తోంది. వైరస్ బారిన పడి జనాలు కోకొల్లలుగా మరణిస్తున్నారు. ఐసీయూలన్నీ పేషెంట్లతో నిండిపోతున్నాయి. అయినవాళ్ల అంత్యక్రియల కోసం శ్మశానాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం కరోనా విషయంలో కాకి లెక్కలు చెప్తోంది!. దేశంలో ఇప్పటిదాకా నమోదు అయిన కరోనా కేసులు.. 3,97,195. మరణాల సంఖ్య 5,241. కోలుకున్న వాళ్ల సంఖ్య 3,50,117. ఇది చైనా ప్రభుత్వం చెప్తున్న అధికారిక లెక్కలు. జీరో కోవిడ్ పాలసీ పేరుతో మూడేళ్ల పాటు.. వైరస్ను కట్టడి చేయగలిగిన చైనా, జన జీవనంతో ఆటాడుకుంది. అయితే ఆ పాలసీ బెడిసి కొట్టింది. వ్యాక్సినేషన్ మీద దృష్టి పెట్టకపోవడం, అందుకు సంబంధించిన పరిశోధనలు సజావుగా సాగకపోవడంతో.. కొత్త వేరియెంట్లు విరుచుకుపడ్డాయి. చివరికి.. చేసేది లేక చేతులెత్తేసింది ప్రభుత్వం. ప్రపంచానికి ఘనంగా పరిచయం చేసుకున్న జీరో కొవిడ్ పాలసీ ఘోరంగా బెడిసి కొట్టింది. అధికారంగా ఫస్ట్ వేవ్ను ఎదుర్కొంటోంది ఆ దేశం. అదీ ప్రపంచంలో ఏ దేశం కరోనాతో ఇంత భయానకమైన పరిస్థితిని ఎదుర్కొలేనంత దారుణంగా!. అత్యధిక జనాభా ఉన్న దేశంలో.. కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆస్ప్రతుల్లో కరోనా బాధితులకు బెడ్స్ దొరకడం లేదు. ఎక్కడ పడితే అక్కడ పేషెంట్లకు చికిత్స అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లను తీసుకెళ్తున్న ఆంబులెన్స్లు.. ఆస్పత్రుల నిరాకరణతో సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో మరణాలూ సంభవిస్తున్నాయి. బీజింగ్ నైరుతి భాగంతో పాటు నగరాలు, పలు పట్టణాల్లో ఎమర్జెన్సీ వార్డులు ఇసుకేస్తే రాలనంత జనం క్యూకడుతున్నారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి ఇప్పటిదాకా కేవలం ఏడుగురు మాత్రమే కరోనాతో చనిపోయారని ప్రకటించుకుంది అక్కడి ప్రభుత్వం. కానీ, పేషెంట్లు కిక్కిరిసిపోవడంతో పాటు మరణాలు అంతే వేగంగా సంభవిస్తున్నాయని అక్కడి ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కథనాలు ప్రచురిస్తున్నారు. కరోనా సోకిన వాళ్లు న్యూమోనియా, శ్వాసకోశ సమస్యలతో మరణిస్తేనే.. అది కరోనా మరణం కిందకు వస్తుందంటూ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఇదంతా మరణాల లెక్కలను దాచేందుకు చేస్తున్న ప్రయత్నం అని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో వైరస్ సోకి.. చికిత్సలో మరణిస్తున్నా కూడా అది కరోనా మరణాల కిందకు రావడం లేదు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు కూడా. కేవలం ఆక్సిజన్ సరఫరాకు మాత్రమే కాదు.. కరెంట్ సరఫరా కూడా కొరత నడుస్తోంది చైనాలోని పలు ప్రావిన్స్లో. చైనా ప్రకటించుకున్న మరణాల లెక్క తప్పని చెప్పే మరో ఉదాహరణ. జువోజూ ప్రావిన్స్కు 20 కిలోమీటర్ల దూరంలోని గావోబెయిడియాన్లోని స్మశానానికి.. బీజింగ్ నుంచి శవాల వాహనాలు క్యూ కడుతున్నాయి. కానీ, నిర్వాహకులు మాత్రం పది రోజుల పాటు వేచి చూడాలని చెప్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో.. వాహనాల్లోనే ఐస్బాక్సుల్లో శవాలను ఉంచుతున్నారు. ఎంతో మంది చనిపోతున్నారని చెప్తున్నాడు ఆ వాటికలోనే పని చేసే జావో యోంగ్షెంగ్ అనే వ్యక్తి. రాత్రింబవలు పని చేస్తున్నా.. తమ పనిని పూర్తి చేయలేకపోతున్నామని వాపోతున్నాడతను. చైనాలో అత్యధిక జనాభా వ్యాక్సినేషన్కు దూరంగా ఉంది. కరోనా సోకదనే ధైర్యం.. ఒకవేళ సోకినా రోగనిరోధక శక్తి ద్వారా ఎలాగోలా నెట్టుకు రావొచ్చు.. అన్నింటికి మించి ప్రభుత్వం కఠినంగా అమలు చేసిన లాక్డౌన్ వల్ల నానా ఇబ్బందులు వాళ్లను తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా చేశాయి. ‘‘ఈ దశలో మనం(భారత్) ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, చైనా తీవ్రత చూసైనా మేలుకుందాం. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉందాం. అత్యవసరంగా వ్యాక్సినేషన్లో పాల్గొనండి. మాస్క్ ధరించడం, అనవసర ప్రయాణాలను తప్పించడం.. తగు జాగ్రత్తలు పాటిస్తేనే.. వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అంతా సురక్షితంగా ఉండొచ్చు అని టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్మిశ్రా చెప్తున్నారు. -
గుట్టలు గుట్టలుగా శవాలు.. అయినా కరోనాతో ఒక్కరూ చనిపోలేదట..!
బీజింగ్: చైనాలో కరోనా ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి కేసులు విపరీతంగా పెరిగాయి. రోజు వేల మంది వైరస్ బారినపడుతున్నారు. వందల మంది చనిపోతున్నారు. ఆస్పత్రుల్లో రోగులు కిక్కిరిసిపోతున్నారు. శ్మశాన వాటికల్లో శవాలు గట్టలుగుట్టలుగా కన్పిస్తున్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. చైనా లెక్కలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కరోనా వల్ల మంగళవారం ఒక్కరు కూడా చనిపోలేదని ఆ దేశ ఆరోగ్య శాఖ బుధవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. సోమవారం ఐదుగురే మరణించారని పేర్కొంది. ఇప్పటివరకు మొత్తం 5,241 మంది మాత్రమే వైరస్ కారణంగా చనిపోయినట్లు చెబుతోంది. మంగళవారం కొత్తగా 3,101 మందికి వైరస్ సోకిందని చైనా వెల్లడించింది. వీరిలో 52 మంది విదేశాల నుంచి వచ్చిన వారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి చైనాలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 3,86,276కి చేరిందని పేర్కొంది. అయితే చైనా లెక్కలకు వాస్తవ పరిస్థితుల వ్యత్యాసానికి కారణం ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా సోకిన వారు దుష్ప్రభావాలు లేదా మరే ఇతర కారణంతో చనిపోయినా దాన్ని కోవిడ్ మరణాల కిందే లెక్కకడుతున్నాయి. చైనాలో మాత్రం నిబంధనలు మరోలా ఉన్నాయి. వైరస్ సోకి శ్వాసకోస వ్యవస్థ దెబ్బతిని చనిపోయిన వారిని మాత్రమే కరోనా మృతులుగా గుర్తిస్తోంది. వైరస్ సోకి మిగతా ఏ కారణంతో చనిపోయినా.. వారిని కోవిడ్ మృతులుగా గుర్తించడం లేదు. అలాగే లక్షణాలు ఉంటేనే కరోనా కేసుగా లెక్కగడుతోంది. చైనాలోని ఓ ఆస్పత్రిలో శవాలు ఈ కారణంగానే చైనాలో రోజుకు ఎంతమంది చనిపోయినా.. అధికారిక కరోనా మరణాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ నిపుణుల అంచనాల ప్రకారం చైనాలో ప్రస్తుతం రోజుకు 40వేల కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. వందల మంది వైరస్కు బలవుతున్నారు. అక్కడ ఆస్పత్రులు కూడా పడకల ఖాళీ లేనంత రద్దీగా మారాయి. శవాలను ఖననం చేసేందుకు శ్మశానవాటికల్లో ఖాళీ కూడా లేని దుస్థితి ఉంది. చదవండి: ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్లైన్ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు -
కరోనా మరణాలను దాచేందుకు చైనా కొత్త ఎత్తుగడ
బీజింగ్: ప్రజాగ్రహంతో కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసింది చైనా. ఈ క్రమంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రానున్న 3 నెలల్లో దేశంలోని 60 శాతం మంది వైరస్ బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నట్లు నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈక్రమంలో కోవిడ్ ద్వారా సంభవించే మరణాలను దాచిపెట్టేందుకు డ్రాగన్ దేశం కొత్త ఎత్తుగడ వేసింది. శ్వాసకోశ అవయవాల వైఫల్యంతో మరణించిన వారినే అధికారికంగా కోవిడ్ మరణాలుగా పరిగణిస్తామని మంగళవారం ప్రకటించింది. ఆంక్షల సడలింపు తర్వాత మంగళవారం అత్యధికంగా 5 మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. అయితే, అది అధికారిక లెక్కప్రకారమే. కానీ, ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య శాఖ ప్రకారం చైనాలోని ప్రధాన నగరాల్లో ఒమిక్రాన్ వేరియంట్లు బీఏ.5.2, బీఎఫ్.7లు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(ఎన్హెచ్సీ) ఈ ప్రకటన చేసింది. కేవలం శ్వాసకోశ సంబంధిత అవయవాల వైఫల్యంతో మరణించిన వారినే అధికారికంగా లెక్కల్లోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ఏ విధంగా లెక్కిస్తామనే అంశాలపై నోటీసులు జారీ చేసింది. సైంటిఫిక్, రియలిస్టిక్ పద్ధతిలో ఆ ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో కరోనా సోకిన తర్వాత గుండెపోటు, ఇతర వ్యాధులతో మరణించిన వారిని లెక్కల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక -
కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనాలో తొలిసారి మరణాలు!
బీజింగ్: కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి జీరో కోవిడ్ పాలసీ పేరుతో చైనా ప్రభుత్వం అత్యంత కఠినతరమైన ఆంక్షలు అమలు చేసింది. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిబంధనలను డిసెంబర్ 7న ఎత్తివేసింది. ఆంక్షలు సడలించిన తర్వాత చైనాలో తొలి కరోనా మరణాలు నమోదైనట్లు సింగపూర్ డైలీ వెల్లడించింది. చైనా ప్రభుత్వ మీడియాలో పనిచేసిన మాజీ జర్నలిస్టులు ఇద్దరు కోవిడ్ కారణంగా చనిపోయినట్లు తెలిపింది. డిసెంబర్ 8న ఒకరు, డిసెంబర్ 15న మరొకరు వైరస్కు బలైనట్లు చెప్పింది. అయితే చైనా ఆరోగ్య శాఖ మాత్రం ఈ మరణాలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఆంక్షలు సడలించిన తర్వాత ఎవరైనా వైరస్ కారణంగా చనిపోయారా? అనే విషయాలను ప్రభుత్వం వెల్లడించడం లేదు. జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేశాక కరోనా కేసులను ట్రాక్ చేయడం సాధ్యం కావట్లేదని ఆ దేశ ఆరోగ్య శాఖ చేతులెత్తేసింది. చదవండి: రెండేళ్ల బాలుడ్ని అమాంతం మింగేసిన నీటిగుర్రం.. చివరకు ఏమైందంటే? -
కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి.. పలువురికి అస్వస్థత
పట్నా: కల్తీ మద్యానికి బిహార్లో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా మరో ఆరుగురు మద్యం కాటుకు బలయ్యారు. ఛాప్రా జిల్లాలోని సరన్ ప్రాంతం ఐసౌపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోయిలా గ్రామంలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించిన క్రమంలో ఐదుగురు గ్రామంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. మరికొంత మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మృతులు సంజయ్ సింగ్, హరిందర్ రామ్, కునాల్ సింగ్, అమిత్ రంజన్లు సహా మరికొంత మంది కల్తీ మద్యం తాగి అనారోగ్యానికి గురయ్యారని మధురా డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా? అనే విషయంపై విచారిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రాణం తీసిన ప్రేమ?.. 80 రోజుల క్రితం అదృశ్యమై -
మృత్యుఘాతం
న్యూయార్క్: గాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా దాదాపు 44 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ‘గాయాల నివారణ, సంరక్షణ’ 14వ ప్రపంచ సదస్సు సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదిక విడుదల చేసింది. గాయాలు, హింస వల్ల ప్రపంచవ్యాప్తంగా నిత్యం 12,000 మంది బలైపోతున్నారని నివేదికలో వివరించింది. 5 నుంచి 29 ఏళ్ల వయసున్నవారిలో సంభవిస్తున్న మరణాలకు తొలి 5 కారణాల్లో 3 కారణాలు గాయాలకు సంబంధించినవేనని స్పష్టం చేసింది. జనం మృత్యువాత పడడానికి రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, నీటిలో మునిగిపోవడం, అగ్ని ప్రమాదాలు, విషం తీసుకోవడం వంటివి ప్రధానంగా కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తేల్చిచెప్పింది. ప్రతి 6 మరణాల్లో ఒకటి ఆత్మహత్య, ప్రతి 9 మరణాల్లో ఒకటి హత్య, ప్రతి 61 మరణాల్లో ఒకటి యుద్ధం, ఘర్షణల వల్ల సంభవిస్తున్నాయని పేర్కొంది. సంపన్నులతో పోలిస్తే పేదలు గాయాల వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రీయెసస్ తెలిపారు. -
ముంచెత్తిన వరదలు.. ఎటు చూసినా నీరే! 600 మంది మృతి
అబుజా: దక్షిణ ఆఫ్రికా దేశం నైజీరియాను వరదలు ముంచెత్తాయి. గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వివిధ ప్రమాదాల్లో మొత్తం 600 మంది మరణించారు. నైజీరియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద విపత్తు అని అధికారులు తెలిపారు. Nigeria is experiencing a flooding crisis, but the government is not taking any immediate action. It has become an ‘overwhelming’ disaster, killing over 500 people and displacing 1.4 million people. #NigeriaFloods pic.twitter.com/vNvJNXPjXV — EiE Nigeria (@EiENigeria) October 17, 2022 వరదల కారణంగా దాదాపు 13 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2 లక్షల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల పంట నీటమునిగింది. సహాయక బృందాలు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అయితే వరదల హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, మౌలిక వసతుల లేమి, పేలవ ప్రణాళిక కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. నైజీరియాలో ప్రతి ఏటా వర్షాకాలంలో వరదలు సంభవిస్తూనే ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం భారీ విపత్తు వచ్చింది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. Large parts of 31 States are affected by massive flooding. Over 500 dead. Unimaginable pain and suffering. Urgent Help Needed! Begging Mr President to: -Declare a state of emergency in the affected areas - Address the flood victims@toluogunlesi @nemanigeria @MBuhari https://t.co/oxL5WFjVjj pic.twitter.com/CSBEcvziIV — Dr Aloy Chife (@ChifeDr) October 16, 2022 వర్షాకాలం పూర్తయ్యే నవంబర్ చివరి వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని నైజీరియా వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని మొత్తం 36కు గాను 26 రాష్ట్రాల్లో వరద ప్రభావం ఉన్నట్లు చెప్పింది. It doesn't seem like we have a National Crisis at hand, probably because #Lagos and #Abuja are not flooded. #NigeriaFloods pic.twitter.com/9ji4OWW7xz — #LeaveNoOneBehind (@Temple_Oraeki) October 15, 2022 చదవండి: తాలిబన్ల చేతితో దారుణమైన చావు తప్పదని తెలిసి..! -
కోవిడ్ కట్టడిలో భారత్ భేష్. మరి మరణాలు?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిలో విఫలమై ప్రపంచ దేశాలు అల్లాడుతుంటే కోవిడ్ సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒక వేళ కోవిడ్ సమర్థ నిర్వహణ అంశం ఉండి ఉంటే భారత్ ఈ విషయంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ను పొంది ఉండేదని బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్మాన్ వ్యాఖ్యానించారు. ఫౌండేషన్ ఆరో వార్షిక లక్ష్య సాధకుల (గోల్కీపర్స్) నివేదిక విడుదల సందర్భంగా మంగళవారం ఆయన పీటీఐ వారాసంస్థతో మాట్లాడారు. ‘‘దేశ సమస్యలను పరిష్కరించుకుంటూనే హఠాత్తుగా వచ్చిపడిన కోవిడ్ మహమ్మారి అదుపులో భారత్ విజయం సాధించింది. కోవిడ్ కట్టడికి అవలంబించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శనీయం. 200 కోట్ల కరోనా టీకాల పంపిణీ, ఏకంగా 90 శాతం వ్యాక్సినేషన్ రేటుతో ఎన్నో విషయాల్లో దిక్సూచీగా మారింది.. దేశీయంగా టీకాలను ఉత్పత్తి చేయించి వ్యాక్సిన్ తయారీ రంగంలో పెద్దన్న పాత్ర కొనసాగిస్తోంది. వచ్చే ఏడాది జీ20 కూటమికి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటూ ఎన్నో అంతర్జాతీయ వేదికలపై భారత్ సత్తా చాటుతోంది. పేదరిక నిర్మూలన, నవజాత శిశు మరణాల రేటు తగ్గుదల వంటి అంశాల్లోనూ మంచి పురోగతి సాధించింది. కోవిన్ యాప్ ద్వారా త్వరితగతిన కోట్లాది వ్యాక్సిన్ల పంపిణీని సుసాధ్యంచేసింది. భారత్లో స్వయం ఉపాధి బృందాల ద్వారా మహిళలు సాధించిన సాధికారత, ప్రగతి అమోఘం’ అని సుజ్మాన్ అన్నారు. ఆక్సిజన్ కొరతతో కోవిడ్ మరణాలపై ఆడిట్ కరోనా రెండో వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరతతో సంభవించిన మరణాలపై ఆడిట్ చేయించాలని పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవించాయన్న వాదనను ఆరోగ్య శాఖ కొట్టిపారేయడం దురదృష్టకరమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు పరిహారమివ్వాలని పేర్కొంది. కమిటీ తన 137వ నివేదికను సోమవారం రాజ్యసభకు సమర్పించింది. కేసులు భారీగా పెరిగిపోవడంతో ఆరోగ్య మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని తెలిపింది. రాష్ట్రాలకు అవసరాలను అనుగుణంగా సిలిండర్లను పంపిణీ చేయలేక తీవ్ర సంక్షోభానికి కేంద్రం కారణమైందని తప్పుబట్టింది. క్యాన్సర్ను గుర్తించదగిన వ్యాధిగా పేర్కొనాలని మరో నివేదికలో కేంద్రానికి సూచించింది. ఇదీ చదవండి: రేపిస్ట్ ఇల్లు నేలమట్టం! -
దేశంలో 77.5% మరణాలకు కారణాలు తెలియడం లేదు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలంటే క్రమ పద్ధతితో కూడిన దినచర్య, మెరుగైన ఆహారపు అలవాట్లు ఉండాలి. గాడితప్పితే రోగాల బారినపడి ముందస్తుగానే మృత్యు ఒడికి చేరడం ఖాయం. ఇలాంటి ముందస్తు మరణాలకు సరైన కారణాలు తెలిస్తే వాటిని తగ్గించడానికి మార్గాలు అన్వేషించడం సులభమవుతుంది. కానీ దేశంలో 77.5 శాతం మరణాలకు కారణాలు తెలియడం లేదు. అంటే వాటికి సంబంధించిన వివరాలు కేవలం ఆయా కుటుంబసభ్యుల వరకే పరిమితమవుతున్నాయి. ఉత్తరాది వైద్యులు, నిపుణుల అధ్యయనం ముందస్తు మరణాలను తగ్గించి, మనుషులు దీర్ఘాయుష్షుతో జీవించేందుకు సరైన వ్యూహాన్ని రూపొందించాలంటే ప్రతి మరణాన్ని నమోదు చేయడంతో పాటు సరైన కారణం తెలుసుకోవాలని ఉత్తరాది రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖలకు చెందిన కొందరు వైద్యుల అధ్యయనం స్పష్టం చేస్తోంది. దేశంలో సంభవిస్తున్న మరణాలకు సంబంధించి ప్రభుత్వాల వద్ద ఏమేరకు సమాచారముందనే కోణంలో కొందరు వైద్యులు, ఇతర నిపుణులతో కూడిన బృందం పరిశీలన జరిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ గణాంకాల ఆధారంగా 2018 నుంచి 2020 మధ్య కాలంలో చోటు చేసుకున్న మరణాలు ఎందువల్ల సంభవించాయో తెలుసుకునేందుకు సంబంధిత పత్రాలను (మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్(ఎంసీసీడీ) పరిశీలించింది. అయితే చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాల వద్ద నమోదైన అనేక మరణాలకు కారణాలు లేకపోవడం గమనార్హం. చాలావాటికి అనారోగ్య సమస్యల పేరిట మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నప్పటికీ.. లోతైన పరిశీలనను, కారణాలను నమోదు చేయడం లేదు. గోవా బెస్ట్ .. బిహార్ లీస్ట్ మరణాలకు సంబంధించి ఎంసీసీడీ రికార్డు జాతీయ సగటు 22.5 శాతంగా ఉంది. 2020లో దేశవ్యాప్తంగా 80.62 లక్షల మరణాలు నమోదయ్యాయి. అయితే వీటిల్లో 18.11లక్షల మరణాలకు మాత్రమే మెడికల్ సర్టిఫికేషన్ దక్కింది. మిగతా 77.5 శాతం మరణాలకు రోగ నిర్ధారణ కాకపోవడం గమనార్హం. వాస్తవానికి జరుగుతున్న మరణాల్లో అతి తక్కువ మాత్రమే ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. అలా రికార్డయిన వాటిలోనూ మూడోవంతుకు పైగా మరణాలకు కారణాలు రికార్డు కావడం లేదు. ఇక ఎంసీసీడీ రికార్డులో గోవా ప్రథమ స్థానంలో, అట్టడుగు స్థానంలో బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, కేరళ ఉన్నాయి. తెలంగాణ 30.9 శాతంతో 15వ స్థానంలో ఉంది. -
ఆరిపోతున్న ప్రాణదీపాలు.. ఒడిదొడుకులు, ఒత్తిళ్లను తట్టుకోలేక..
సాక్షి, హైదరాబాద్: వైద్య వృత్తిలో ఒడిదొడుకులు, ఒత్తిళ్లను తట్టుకోలేక అనేకమంది యువ వైద్యులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2016 నుండి 2020 మధ్య కాలంలో 18 నుండి 30 సంవత్సరాల వయస్సులో వివిధ రకాల వృత్తుల్లో ఉన్న 3,100 మంది పలు సమస్యలతో ఆత్మహత్య చేసుకోగా.. ఇందులో ఎక్కువమంది వైద్యులు ఉన్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పేర్కొంది. అదే కాలంలో వివిధ వయస్సుల వారు 12,397 మంది పరీక్షల్లో ఫెయిల్ అవడంతో ఆత్మహత్య చేసుకున్నారని, వీరిలోనూ వైద్య విద్యార్థులున్నారని తెలిపింది. సూపర్ స్పెషాలిటీ చేస్తేనే.. వైద్య విద్య పూర్తిచేస్తే జీవితంలో హాయిగా స్థిరపడిపోవచ్చనే భావన ఉంది. కానీ వాస్తవం అందరు మెడికల్ విద్యార్థుల విషయంలో ఒకేలా లేదు. ఈ రోజుల్లో ఎంబీబీఎస్ పూర్తిచేయగానే స్థిరపడిపోయినట్లు కానేకాదు. కనీసం పీజీ లేకపోతే ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థిరపడాలంటే 15 ఏళ్లు.. ఎంబీబీఎస్ నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు కోర్సులు పూర్తి చేసే సరికి పదేళ్లు దాటుతుంది. అది కూడా సకాలంలో పీజీ సీటొస్తేనే. లేకుంటే అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. తర్వాత బయటకు వచ్చి స్థిరపడే సరికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. అంటే వైద్య వృత్తిలో స్థిరపడాలంటే మొత్తంగా 15 ఏళ్లు పడుతుందన్న మాట. మరోవైపు లక్షలు, కోట్లు ఖర్చు చేసి ఎంబీబీఎస్ పూర్తి చేసినా, తర్వాత మళ్లీ కోట్లల్లో డబ్బులు పెడితేనే పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సులు చదవగలిగే పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు పీజీ సీటు రాక.. ఇటు ఎంబీబీఎస్తో ఏమీ చేయలేక, జీవితం ఎలా గడపాలో తెలియక ఎందరో యువ డాక్టర్లు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీల్లో యోగాను ప్రవేశపెట్టి, విద్యార్థుల్లో ఒత్తిడిని, నిరాశను తగ్గించేందుకు ప్రయత్నిస్తుండటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. విదేశీ గ్రాడ్యుయేట్లు ఇక్కడి పరీక్షలో ఫెయిల్! ఇక్కడ సీట్ల కొరతతో వేలాది మంది విద్యార్థులు విదేశాల్లో మెడిసిన్ చదువుతుండగా, దేశంలో నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పరీక్ష పాసయ్యేవారు 20 శాతం కూడా మించడం లేదు. ఈ ఏడాది జూన్లో జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షలో కేవలం 2,348 మంది మాత్రమే పాసయ్యారు. ఓ జర్నల్ ప్రకారం.. వైద్యుల ఆత్యహత్యకు దారితీస్తున్న పరిస్థితులు.. ►ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో మూడింట ఒక వంతు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థులు కాగా మిగిలినవారు ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు ఉంటున్నారు. అనేక ఒత్తిళ్ల కారణంగా వీరంతా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పీజీలో ఆర్థిక భారం, వృత్తి పరమైన ఒత్తిడి, వివాహ సమస్యలు వంటివి కారణాలుగా ఉన్నాయి. ►ముఖ్యంగా ఒత్తిడికి సంబంధించిన ఆత్మహత్యలే 60 శాతం వరకు ఉంటున్నాయి. ►ఎంబీబీఎస్ పూర్తయి, పీజీ సీట్లు రానివారిలో చాలామంది యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. కేవలం ఎంబీబీఎస్తో స్థిరపడే అవకాశం లేకపోవడం వల్ల చాలామంది యువతుల తల్లిదండ్రులు వీరిపై ఆసక్తి చూపించడం లేదు. ►కొందరు ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సులు చేశాకే పెళ్లి చేసుకోవాలని ఆగిపోతున్నారు. దీంతో వారికి 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో వారిలో ఒత్తిడి పెరుగుతోంది. ►ఎంబీబీఎస్ వైద్యులు కేవలం కేర్టేకర్ల మాదిరిగానే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తుంటారు. అందుకే వారి పట్ల యాజమాన్యాలు చిన్నచూపు చూస్తూ తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. ఇది వారిని కుంగుబాటుకు గురిచేస్తోంది. ►పీజీ పూర్తయినా వెంటనే స్థిరపడిపోతామన్న గ్యారంటీ లేదు. వారి చిన్నప్పటి క్లాస్మేట్స్ కొందరు ఇంజనీరింగ్, ఐఐటీ వంటి కోర్సులు చదివి 22–23 ఏళ్లకే లక్షల్లో సంపాదిస్తుండటం వారిలో ఆత్మన్యూనతా భావన కలిగిస్తోంది. ప్రతి ఆత్మహత్య వెనుక 20 ప్రయత్నాలు ఆత్మహత్య రిస్క్ వైద్యుల్లోనే ఎక్కువ. ఏటా దేశంలో లక్ష మంది వైద్యుల్లో 40మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి ఆత్మహత్య వెనుక సగటున 20 ప్రయత్నాలు ఉంటున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, జాతీయ కార్యవర్గ సభ్యుడు, ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య ఒత్తిడి, నిరాశతోనే.. ఎంబీబీఎస్ తర్వాత పీజీలో తామనుకున్న స్పెషలైజేషన్లో సీటు రాకపోవడంతో చాలామంది వైద్య విద్యార్థులు డిప్రెషన్లోకి పోతున్నారు. ఆ సీట్లు రాకపోవడంతో ఒత్తిడికి గురవుతున్నారు. – డాక్టర్ కరుణాకర్రెడ్డి, వీసీ, కాళోజీ హెల్త్ వర్సిటీ ఎంబీబీఎస్తో బతకలేరు ఈ రోజుల్లో ఎంబీబీఎస్తో బయట బతికే పరిస్థితి లేదు. తప్పనిసరిగా పీజీ చదివితేనే భవిష్యత్తు ఉంది. అయితే ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ ఉన్నా, పీజీ సీట్లు ఆ మేరకు లేవు. దీంతో చాలామంది వైద్య నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఇలాంటి కారణాలతోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. – డాక్టర్ కార్తీక్ నాగుల, రాష్ట్ర అధ్యక్షుడు, జూడాల సంఘం -
కల్తీ మద్యం తాగి 21 మంది మృతి.. మరో 10మందికి అస్వస్థత
గాంధీనగర్: కల్తీ మద్యం తాగి 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన గుజరాత్లోని బొటాడ్ జిల్లా, రోజిడ్ గ్రామంలో సోమవారం జరిగింది. సుమారు 10 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చేరినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నాటు సారా తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. ‘కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 21 మంది మరణించారు. మరో 10 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చేరారు. స్థానిక పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.’ అని పేర్కొన్నారు. రోజిడ్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొంత మంది ఆదివారం రాత్రి అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయమే ఇద్దరు మరణించారు. మిగిలిన వారు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలుగా పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి రోజిడ్ గ్రామంలో నాటు సారా తాగిన తర్వాత తన భర్త అనారోగ్యానికి గురైనట్లు ఓ మహిళ.. పోలీసులకు తెలిపింది. మరోవైపు.. ఆదివారం రాత్రి ఓ కొట్టులో నాటు సారా కొనుగోలు చేసిన తర్వాత సుమారు 25 మందికిపైగా అనారోగ్యానికి గురైనట్లు ఓ బాధితుడు తెలిపారు. సోమవారం సాయంత్రం బొటాడ్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి వివరాలు సేకరించారు భవనగర్ రేంజ్ ఐజీ అశోక్ కుమార్ యాదవ్. డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గుజరాత్ పర్యాటనలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నాటు సారా అమ్ముతున్నట్లు ఆరోపించారు. ఇదీ చదవండి: గంజాయి తాగాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఉచిత సలహా! -
యూపీలో పిడుగుల వర్షం.. ఒకే రోజు 14 మంది మృతి
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో బుధవారం పిడుగుల వర్షం కురిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. సహాయ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. బండా జిల్లాలో పడిన పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. ఫతేపూర్లో ఇద్దరు, బలరామ్పుర్, చందౌలీ, బలుందర్శహర్, రాయ్బరేలీ, అమేఠీ, కౌశాంబీ, సుల్తాన్పుర్, చిత్రకూట్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. పిడుగుల ఘటనలపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించాలని సూచించినట్లు చెప్పారు కమిషనర్. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు -
భారత్లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
భారతీయులకు స్వల్ప ఊరట లభించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,793 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్తో 27 మంది మృతిచెందారు. ఇక, కరోనా నుంచి 9,486 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో 96,700 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు దేశంలో 43,418,839 మంది వైరస్ బారినపడగా.. కరోనాతో 5,25,047 మంది మృత్యువాతపడ్డారు. ఇక, 4,27,97,092 కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.22 శాతం వద్ద ఉంది. భారత్లో సోమవారం 19,21,811 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,31,43,196 కోట్లకు చేరింది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయి. కొత్తగా 366,742 మంది కరోనా బారినపడగా.. మరో 759 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 6,351,925కు చేరుకుంది. ఇది కూడా చదవండి: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 25 మంది.. -
విషవాయువు లీక్.. 12 మంది మృతి, 199 మందికి అస్వస్థత
విషపూరిత వాయువు లీకేజీ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో 251 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోర్డాన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జోర్డాన్ దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో క్లోరిన్ గ్యాస్ లీకేజీ అయ్యింది. జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్ గ్యాస్తో నిండిన ట్యాంకర్లను షిప్పుల్లో ఎక్కించే సమయంలో ప్రమాదం జరిగింది. క్లోరిన్ గ్యాస్ ఉన్న ట్యాంకర్ ప్రమాదవశాత్తు కిందిపడిపోవడంలో భారీ పేలుడు సంభవించింది. పసుపు రంగు క్లోరిన్ విష వాయువు ఆ ప్రాంతంలో విస్తరించింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 251 మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రతినిధి ఫైసల్ అల్ షాబౌల్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 199 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విష వాయువు వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఓడరేవుకు ఉత్తరాన 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకాబా నగర ప్రజలు మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. కిటికీలు, తలుపులు మూసివేసుకోవాలని హెచ్చరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. At least 10 people have died and more than 250 injured after a toxic gas leak at Aqaba Port in Jordan. pic.twitter.com/kjTDaPkelw — Suzanne (@suzanneb315) June 27, 2022 ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం.. 42 మంది మృతి -
భారత్లో వ్యాక్సిన్లతో... 42 లక్షల ప్రాణాలు నిలిచాయి
లండన్: కరోనా మహమ్మారిని వ్యాక్సిన్లు సమర్థంగా ఎదుర్కొంటున్నాయని, వాటివల్ల 2021లో భారత్ 42 లక్షల మరణాలను నివారించిందని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. యూకేలోని లండన్లో ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు కోవిడ్–19 వాస్తవ మరణాలను, డిసెంబర్ 8, 2020, డిసెంబర్ 8, 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాక్సినేషన్ను సరిపోల్చి చూస్తూ ఈ లెక్కలు వేశారు. భారత్లో 42 లక్షలకు పైగా మరణాలను నివారించినట్టు ఆ అధ్యయనం తెలిపింది. ‘‘భారత్కు సంబంధించినంత వరకు ఈ ఏడాది కాలంలో 42,10,000 మరణాలను నివారించగలిగిందని మాకు అంచనాలున్నాయి’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ ఒలివర్ వాట్సన్ చెప్పారు. 2 కోట్ల ప్రాణాలు పోయేవి కరోనా మరణాల విషయంలో అధికారిక లెక్కలకి, వాస్తవ ఫలితాలకు మధ్య భారీ తేడా ఉన్నట్టు విమర్శలున్నాయి. కరోనాతో 189 దేశాల్లో 3.14 కోట్ల మంది మరణిస్తారని అనుకుంటే వ్యాక్సిన్లు రావడం వల్ల వారిలో 1.98 కోట్ల మంది ప్రాణాలు కాపాడుకోగలిగామని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతీ దేశంలో 40శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని ఉండి ఉంటే 5.99 లక్షల మరణాలు తప్పేవని అధ్యయనం పేర్కొంది. 17 వేలకు పైగా కేసులు న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. కేవలం ఒక్క రోజులోనే 30శాతం కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 17,336 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నాలుగు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. కరోనాతో ఒక్క రోజులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. -
మరో కొత్త వైరస్ కలకలం.. 19 మంది మృతి
కొత్త వైరస్లు మానవాళికి సవాల్లు విసురుతున్నాయి. ఇప్పటికే కరోనా, దాని కొత్త వేరియంట్లతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న ప్రజలను మంకీ ఫాక్స్, మ్యాంగో ఫీవర్, టమాటో వ్యాధులు మరింత టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా కాంగో ఫీవర్ కేసులు పెరగడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. జంతువుల నుంచి మనుషులకు సోకే కాంగో ఫీవర్ ఇరాక్లో కలకలం రేపుతోంది. కొత్త వైరస్ వ్యాప్తితో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. శరవేగంగా వ్యాపించడం, అంతర్గత, బహిర్గత రక్తస్రావానికి(ముక్కు నుంచి రక్తం కారడం) దారి తీయడం, విపరీతమైన జ్వరం దీని ముఖ్య లక్షణాలు. దీని బారిన పడ్డ ప్రతీ ఐదుగురిలో ఇద్దరి చొప్పున మరణిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ వైరస్ తొలిసారిగా మొట్టమొదట 1944లో క్రిమియాలో కనుగొనబడింది. ఈ తర్వాత 1979లో ఇరాక్లోనే వెలుగు చూసింది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఎక్కువగానే కనిపించే కాంగో ఫీవర్ వైరస్ ఇరాక్ ప్రజలను అల్లకల్లోలం చేస్తోంది. ఇక, ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తుంది. అయితే, ఈ వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం మరింత టెన్షన్ పెడుతోంది. కాగా, కాంగో హెమోరేజిక్ అనే పేను ద్వారా జంతువుల్లో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల్లో ఈ వైరస్ వాహకంగా ఈ పేలు పనిచేస్తుంది. వైరస్ బారిన పడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు, పశువధ కేంద్రాల్లోని పదార్థాల ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. ఇది కూడా చదవండి: విమాన ప్రయాణం విషాదాంతం -
గుండె జబ్బులు, నిమోనియా, ఆస్తమా..
న్యూఢిల్లీ: దేశంలో 2020లో సంభవించిన మరణాల్లో 42 శాతం మరణాలకు కేవలం గుండె జబ్బులు, నిమోనియా, ఆస్తమా కారణమని అధ్యయనంలో తేలింది. ఏడాదిలో 18,11,688 మెడికల్లీ సర్టిఫైడ్ మరణాల గణాంకాల ఆధారంగా ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ‘ఇండియా రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్’ తాజాగా మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ 2020 పేరిట నివేదిక విడుదల చేశారు. కరోనా మహమ్మారి వల్ల 2020లో 1,60,618 మంది మృతిచెందినట్లు నివేదికలో పేర్కొన్నారు. అంటే మొత్తం మరణాల్లో కరోనా సంబంధిత మరణాలు కేవలం 8.9 శాతమే. అలాగే రక్తప్రసరణ సంబంధిత వ్యాధుల కారణంగా 32.1 శాతం మంది, శ్వాస సంబంధిత జబ్బుల వల్ల 10 శాతం మంది మరణించినట్లు గుర్తించారు. ఇక టీబీ, సెప్టిసెమియా కారణంగా 7.1 శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధ్యయనకర్తలు తెలిపారు. అంతేకాకుండా డయాబెటిస్, పోషకాహార లేమి వంటి వాటితో 5.8 శాతం మంది, గాయాలు, విషం సేవించడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వంటి వాటితో 5.6 మంది, క్యాన్సర్తో 4.7 శాతం మంది మృతిచెందారు. 2020లో మెడికల్లీ సర్టిఫైడ్ మరణాల్లో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు ఉన్నారు. మొత్తం మరణాల్లో 28.6 శాతం మంది(5,17,678) బాధితులు 70 ఏళ్ల వయసు దాటినవారే కావడం గమనార్హం. బాధితుల్లో ఏడాదిలోపు వయసు ఉన్నవారు 5.7 శాతం మంది ఉన్నారు. 15 నుంచి 24 ఏళ్లవారిలో 19 శాతం మందిని రక్తప్రసరణ సంబంధిత వ్యాధులే పొట్టనపెట్టుకున్నాయి. -
కోవిడ్ మరణాలు.. డబ్ల్యూహెచ్వో వర్సెస్ భారత్
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రత్యక్షంగా లేదంటే.. పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రకటించింది. భారత్లో కరోనా మరణాలు 47 లక్షలని తెలిపింది. అయితే సంస్థ ప్రకటనను భారత్ అంగీకరించలేదు. మరణాల లెక్కింపునకు సంస్థ అనుసరించిన పద్ధతులపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ లెక్కల ప్రకారం ప్రపంచంలో జనవరి 2020 ఆరంభం నుంచి 2021 డిసెంబర్ చివరకు మరణించినవారి సంఖ్య 1.33– 1. 66 కోట్లు ఉంటుందని, సరాసరిన తీసుకుంటే ఈ సంఖ్య 1.49 కోట్లని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చెబుతున్నారు. ఈ గణాంకాలు ప్రభుత్వాలకు ఆరోగ్యవ్యవస్థ మెరుగుపరచాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయన్నారు. ఈ లెక్కలో కరోనా సోకి చనిపోయినవారితో పాటు ఆరోగ్యవ్యవస్థ, సమాజంపై కరోనా ప్రభావం వల్ల మరణించినవారు కూడా ఉన్నారని డబ్ల్యూహెచ్వో తెలిపింది. ఈ పరోక్ష మరణాలు దక్షిణాసియా, యూరప్, అమెరికాలో అధికమని సంస్థ తెలిపింది. భారత్లో ఈ లెక్క 47, 40,894 పైనే ఉంటుందని సంస్థ ప్రకటించింది. తమ గణాంకాలు భారత అధికారిక గణాంకాలతో భిన్నంగా ఉండొచ్చని తెలిపింది. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మరణాల లెక్కింపు కోసం వాడిన పద్ధతులు సరైనవి కావని, ఈ లెక్కపై తమ అభ్యంతరాలను సంస్థకు తెలియజేస్తామని భారత ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్లో కేంద్రం వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటిదాకా కరోనాతో చనిపోయిన వాళ్ల సంఖ్య 5, 23, 000 కు పైనే ఉంది. అంటే.. డబ్ల్యూహెచ్వో ఇస్తున్న గణాంకాలు అధికారిక గణాంకాల కంటే పది రెట్లు దాకా ఎక్కువన్నమాట. కరోనానే కారణం కాదు! భారత దేశంలో అధికారికంగా 2019లో 76.4 లక్షల మరణాలు(అన్నిరకాల మరణాలు) రికార్డు కాగా, 2020లో 6.2 శాతం పెరిగి 81.2 లక్షలకు చేరాయి. ఈ పెరుగుదలకు కేవలం కరోనా మాత్రమే కారణం కాదని నీతిఆయోగ్ సభ్యుడు పాల్ చెప్తున్నారు. ఇక మన అధికారిక లెక్కల ప్రకారం ఒక్క 2020లో భారత్లో లక్షన్నర కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కానీ ప్రపంచ కోవిడ్ మరణాల్లో.. మూడింట ఒకవంతు భారత్లో సంభవించినట్లు డబ్ల్యూహెచ్వో సంస్థ గణాంకాలు చూపుతున్నాయి. -
కరోనా వైరస్ ఉధృతి: షాంఘైలో ఒక్క రోజే 51 మంది మృతి
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. బీజింగ్లో ప్రముఖులుండే చయోయంగ్ ప్రాంతంలో కరోనా కేసులు పదుల్లో వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఇక్కడి 35 లక్షల మందికి మూడు విడతల్లో నిర్థారణ పరీక్షలు ప్రారంభించింది. బీజింగ్లో ఆదివారం బయటపడిన 14 కేసుల్లో 11 చయోయంగ్ జిల్లాలోనివేనని అధికారులు తెలిపారు. షాంఘైలో ఒక్క రోజు వ్యవధిలో అత్యధికంగా మరో 51 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో, ఇక్కడ కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 138కి చేరుకుంది. షాంఘైలో కొత్తగా 2,472 కేసులు నిర్థారణయ్యాయి. చైనా ప్రధాన భూభాగంలో ఆదివారం ఒక్క రోజే మరో 20,190 కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. -
దేశంలో కరోనా మరణాలపై ట్విస్ట్.. కేంద్రంపై రాహుల్ విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం నిలకడగా ఉంది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య మరోసారి చర్చనీయాంశమైంది. కాగా, తాజాగా కోవిడ్ మరణాల విషయంలో భారత ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో తేడా వుందంటూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. దీంతో, కోవిడ్ మరణాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ‘ప్రధాని మోదీ సత్యాలు మాట్లాడరు. మాట్లాడేవారిని మాట్లాడనివ్వరు. ఆక్సిజన్ కొరతతో ఎవ్వరూ మరణించలేదని ఇప్పటికీ మోదీ చెబుతుంటారు. కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 5 లక్షలు కాదు.. 40 లక్షల మంది కోవిడ్తో మృతిచెందారు. ఇది ముందు నుంచీ నేను చెబుతూనే వున్నాను. కోవిడ్ మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి’ అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. मोदी जी ना सच बोलते हैं, ना बोलने देते हैं। वो तो अब भी झूठ बोलते हैं कि oxygen shortage से कोई नहीं मरा! मैंने पहले भी कहा था - कोविड में सरकार की लापरवाहियों से 5 लाख नहीं, 40 लाख भारतीयों की मौत हुई। फ़र्ज़ निभाईये, मोदी जी - हर पीड़ित परिवार को ₹4 लाख का मुआवज़ा दीजिए। pic.twitter.com/ZYKiSK2XMJ— Rahul Gandhi (@RahulGandhi) April 17, 2022 -
అవి సహజ మరణాలే
సాక్షి, అమరావతి: జంగారెడ్డి గూడెంలో ఇటీవల మృతి చెందిన వారివి సహజ మరణాలేనని సంబంధిత కుటుంబాల వారు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. మృతుల కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలను చూపించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. పక్షవాతంతో బాధపడుతూ.. మా నాన్న మూడేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ మంచంలోనే ఉన్నారు. 6వ తేదీన ఫిట్స్ వచ్చి చనిపోయాడు. అయితే ఆయన సారా తాగి చనిపోయాడని ప్రచారం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది. – మృతుడు వేమవరపు గురుబ్రహ్మం కుమార్తె, దేవాయగూడెం ఆరోగ్యం చెడిపోయి మృతి వెంకటరమణను 2018 నుంచి ఆస్పత్రికి తిప్పుతున్నాం. అంతకు ముందే మద్యం అలవాటుంది. ఆస్పత్రిలో పరీక్షలు చేస్తే గుండె, లివర్, ఎముకలు పాడయ్యాయన్నారు. మద్యం తాగడం వల్లనే ఇలా జరిగిందని, ఎక్కువ రోజులు బతకవని డాక్టర్లు చెప్పారు. ఇప్పటికైనా మద్యం మానకపోతే వైద్యం చేయమని కోప్పడ్డారు. ఆరోగ్యం పూర్తిగా చెడిపోవడం వల్లే ఇప్పుడు చనిపోయాడు. – మృతుడి సోదరి, తల్లి, జంగారెడ్డిగూడెం సారా అలవాటే లేదు అప్పారావు కూలి పనులకు గుడివాడ వెళ్లాడు. అక్కడ పడిపోవడంతో వైద్యం చేయించి, ఇంటికి తీసుకొచ్చారు. మళ్లీ ఇబ్బంది రావడంతో ఏలూరు ఆస్పత్రికి తీసుకెళ్లిన అరగంటకే చనిపోయాడు. కానీ పేపర్లలో నాటు సారా తాగి చనిపోయాడని రాశారు. అతడికి సారా అలవాటే లేదు. మా పరువు తీశారు. – మృతుడి కుటుంబ సభ్యులు, ఉణుదుర్రు ఆస్తమా జబ్బుతో చనిపోయాడు సత్యనారాయణకు పదేళ్లుగా దగ్గు, ఆయాసం ఉన్నాయి. 73 ఏళ్లు. 6వ తేదీన ఆయాసం ఎక్కువవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. వైద్యం చేస్తుండగానే చనిపోయాడు. ఆయనకు మద్యం అలవాటు లేనేలేదు. కానీ పేపర్లు, టీవీల్లో సారా తాగి చనిపోయాడని ప్రచారం చేశారు. ఇప్పుడు మేం బయటకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. – మృతుడి కుటుంబ సభ్యులు, బుట్టాయిగూడెం పురుగుల మందు తాగి.. నాగరాజు దంపతుల మధ్య గొడవలున్నాయి. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆమెను బెదిరిద్దామని పురుగుల మందు తాగి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇతనికి మద్యం తాగే అలవాటైతే ఉంది. కానీ పురుగుల మందు తాగడం వల్లే చనిపోయాడు. కానీ నాటు సారా తాగి చనిపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. – మృతుడి కుటుంబ సభ్యులు, గుండుగొలను -
లక్ష దిగువకు పడిపోయిన కరోనా కేసులు! కొత్తగా ఎన్నంటే..
Corona New Cases Update: భారత్లో మూడో వేవ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడం మొదలైంది. గత ఇరవై నాలుగు గంటల్లో 83, 876 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో.. మొత్తం 83, 876 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 11,56,363 మందికి కరోనా టెస్ట్లు నిర్వహించగా.. 83 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా మరణాలు 895 చోటు చేసుకున్నాయి. ఒక్కరోజులో 1,99, 054 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జనవరి 6 తర్వాత లక్ష మార్క్కు దిగువన కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 11, 08, 938 కాగా, రోజూవారీ పాజిటివిటీ శాతం 5, 02, 874గా ఉంది. ఇక ఇప్పటివరకు దేశంలో కరోనాతో 5, 02, 874మంది(అధికార గణాంకాల ప్రకారం) చనిపోయారు. మొత్తం రికవరీల సంఖ్య 4,06,60,202గా నమోదు అయ్యింది. వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా భారత్లో ఇప్పటిదాకా 1,69,63,80,755 డోసులు అందించింది. #Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/DmnW6kanpU pic.twitter.com/06W1fEECj9 — Ministry of Health (@MoHFW_INDIA) February 7, 2022 వర్క్ఫ్రమ్ హోం ముగిసింది కాగా, సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కార్యాలయాలకు పూర్తి హాజరు కావాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యాలయాలు కోవిడ్ ప్రోటోకాల్లను ఖచ్చితంగా పాటించాలని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్ఫ్రమ్ హోం ఇక ముగిసినట్లేనని సింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ విజృంభణ సమయంలో కేంద్ర ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. -
ఆ జన్యువులోనే కోవిడ్ మరణాల గుట్టు!
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మందిని బలితీసుకుంది. కొన్నిదేశాల్లో ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. ఈ వైరస్ బారినపడి చనిపోయినవారిలో.. పెద్దవయసువారు, వివిధ వ్యాధులున్నవారే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని మధ్యవయసువాళ్లు, యువత కూడా ఉన్నారు. మరి ఇలా ఏ అనారోగ్యం లేకుండా నిక్షేపంగా ఉన్నవారు కూడా కోవిడ్తో చనిపోవడానికి వారిలో జన్యు వ్యత్యాసమే (జీన్ వేరియేషన్) కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంతకీ ఆ జన్యువు ఏమిటి, ఎందుకు ప్రాణాల మీదికి వస్తోంది, పరిశోధనలో తేలిన వివరాలివి.. ఊపిరితిత్తుల కణాల్లో.. సాధారణంగా పిల్లలు, యువతతోపాటు 60 ఏళ్లలోపు వయసు వారిలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) ఎక్కువగా ఉంటుంది. 60 ఏళ్లు దాటినవారిలో వయసు పెరిగినకొద్దీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కానీ కోవిడ్ బారినపడి చనిపోయినవారిలో 30ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయసువారు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జీనోమిక్స్ విభాగం శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. తీవ్రస్థాయిలో కోవిడ్కు గురై ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారు, తక్కువగా ప్రభావితమైన వారి జన్యుక్రమాన్ని పోల్చి చూశారు. మన ఊపిరితిత్తుల కణాల్లో ఉండే ‘ఎల్జెడ్టీఎఫ్ఎల్1’ అనే జన్యువులోని ఒక వేరియేషన్ కరోనా మరణాలు ఎక్కువగా ఉండటానికి కారణమని గుర్తించారు. ఏమిటీ ‘ఎల్జెడ్టీఎఫ్ఎల్1’? ఊపిరితిత్తుల కణాలగోడలు దృఢంగా ఉండటానికి, వైరస్ల దాడిని ఎదుర్కొని, కణాలు తిరిగి బలం పుంజుకోవడానికి ఈ జన్యువు తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ జన్యువులో రెండు రకాలు (వేరియంట్లు) ఉన్నాయని.. అందులో ఒకరకం కోవిడ్ ఇన్ఫెక్షన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తోడ్పడితే.. మరో రకానికి ఈ శక్తి తక్కువగా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఇలా తక్కువ శక్తి ఉన్న రకం జన్యువు.. దక్షిణాసియా దేశాల వారిలో 60 శాతం, యూరోపియన్ దేశాల్లో 15 శాతం, ఆఫ్రికా వారిలో 2.4 శాతం, తూర్పు ఆసియా దేశాల వారిలో 1.8 శాతం ఉన్నట్టు తేలిందని వివరించారు. ‘రిస్క్’ రెండింతలు.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా మన శరీరంలో నేరుగా ఎక్కువ ప్రభావం పడిన జన్యువు ‘ఎల్జెడ్టీఎఫ్ఎల్1’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ జేమ్స్ డేవిస్ చెప్పారు. అయితే కేవలం ఈ ఒక్క జన్యువు కారణంగానే పెద్ద సంఖ్యలో మరణాలు నమోదైనట్టు చెప్పలేమని.. మధుమేహం, గుండెజబ్బులు వంటివి ఉన్నవారిలో తక్కువ శక్తి ఉన్న జన్యువు ఉంటే.. మరణించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. భారతదేశంలో టైప్–2 మధుమేహం,గుండె జబ్బుల బాధితులు ఎక్కువని.. దానికితోడు తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్జెడ్టీఎఫ్ఎల్1’ జన్యువు ఉన్నవారి సంఖ్య కూడా ఎక్కువేనని జేమ్స్ డేవిస్ తెలిపారు. ఈ రెండింటి కారణంగానే కరోనా రెండో వేవ్ సమయంలో భారతదేశంలోని కొన్నిప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మరణాలు నమోదయ్యాయని వెల్లడించారు. వయసు పెరిగిన కొద్దీ.. తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్జెడ్టీఎఫ్ఎల్1’ జన్యువు ఉన్నవారు.. తమకంటే పదేళ్లు ఎక్కువ వయసున్న వారితో సమానంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు లోనవుతారని ప్రొఫెసర్ జేమ్స్ డేవిడ్ వెల్లడించారు. అలాంటి వారిలో 20–30 ఏళ్ల తర్వాత ప్రతి పదేళ్లకు ప్రమాద అవకాశం రెండింతలు అవుతూ ఉంటుందని వివరించారు. అయితే తక్కువ సామర్థ్యమున్న ‘ఎల్జెడ్టీఎఫ్ఎల్1’ జన్యువు ఉన్నంత మాత్రాన ప్రమాదకరమని అనుకోవద్దని.. ఇతర జన్యువులు, రోగ నిరోధక శక్తి, ఎలాంటి వ్యాధులు లేకపోవడం వంటివి రక్షణగా ఉంటాయని స్పష్టం చేశారు. -
అచ్చం రక్తంలాగే ఉండే బీట్రూట్ జ్యూస్.. తాగితే దోమలు ఖతం
మనుషులకు అతిపెద్ద శత్రువులు దోమలే. రకరకాల వ్యాధులను వ్యాపింపజేస్తూ లక్షలాది మంది మరణాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి దోమలను నిర్మూలించడంపై దృష్టిపెట్టిన శాస్త్రవేత్తలు.. బీట్రూట్ జ్యూస్ ఆధారంగా రక్తంకాని రక్తాన్ని సృష్టించారు. అందులో విషపూరిత పదార్థాలను కలిపి దోమలను హతమార్చే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ కీటకనాశనుల ప్రమాదం నుంచి.. ప్రస్తుతం మనం దోమలను హతమార్చేందుకు మస్కిటో రిపెల్లెంట్లు, రసాయనాలు కలిపిన అగరుబత్తులు వంటి వాటిని వినియోగిస్తున్నాం. వాటిలో విషపూరిత పదార్థాలు దోమలను చంపడమో, మనుషులను కుట్టే సామర్థ్యాన్ని దెబ్బతీయడమో చేస్తాయి. కానీ ఆ రసాయనాలు మనుషులకు కూడా హానికరమేనని వైద్యులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే.. స్వీడన్కు చెందిన ‘మాలిక్యులర్ అట్రాక్షన్’స్టార్టప్ శాస్త్రవేత్తలు.. మనుషులకు హానికలగకుండా దోమలను ఆకర్షించి చంపే విధానాన్ని అభివృద్ధి చేశారు. చదవండి: ఆడ దోమలే ఎందుకు కుడతాయి.. వాళ్లను ప్రేమిస్తాయి! ‘మలేరియా’వాసనతో.. మలేరియా వ్యాధి సోకినవారి నుంచి ఒక రకమైన వాసన వస్తుంటుంది. మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం పరాన్నజీవులు.. మన రక్తంలోని ఎర్రరక్త కణాలను ఆక్రమించి, విచ్ఛిన్నం చేసినప్పుడు వెలువడే ‘హెచ్ఎంబీపీపీ’అనే రసాయనమే దీనికి కారణం. దోమలు ఈ వాసనకు విపరీతంగా ఆకర్షితమవుతాయి. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ‘హెచ్ఎంబీపీపీ’మాలిక్యూల్స్తోనే దోమలకు చెక్పెట్టవచ్చని తేల్చారు. చదవండి: సైలెంట్ అయిపోయిన డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్ బీట్రూట్ జ్యూస్లో కలిపి.. అచ్చం రక్తం లక్షణాలను పోలి ఉండేలా.. అంతే సాంద్రత, రంగుతో బీట్రూట్ జ్యూస్ను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. దానిలో దోమలను ఆకర్షించే ‘హెచ్ఎంబీపీపీ’మాలిక్యూల్స్ను, మొక్కల ఆధారిత విష పదార్థాలను కలిపారు. దీనిని దోమలు ఉన్న చోట పెట్టారు. హెచ్ఎంబీపీపీ వాసనకు ఆకర్షితమైన దోమలు రక్తంకాని రక్తాన్ని పీల్చుకున్నాయి. విషపదార్థం ప్రభావంతో కాసేపటికే అన్నీ చనిపోయాయి. అయితే మలేరియాను వ్యాప్తి చేసే అనాఫిలిస్ రకం దోమలు ఎక్కువగా ఆకర్షితమయ్యాయని.. వివిధ మాలిక్యూల్స్ను ఉపయోగించడం ద్వారా ఇతర వ్యాధులను వ్యాప్తిచేసే దోమలనూ చంపవచ్చని మాలిక్యులర్ అట్రాక్షన్ సంస్థ ప్రకటించింది. ఈ పరిశోధన వివరాలు ఇటీవలే కమ్యూనికేషన్ బయాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మనుషులకు హానికలగకుండా.. ‘‘దోమల నిర్మూలన కోసం వినియోగించే రసాయనాలను గాలిలో స్ప్రే చేయడమో, రిపెల్లెంట్ పరికరాలతో ఆవిరిగా మార్చడమో చేస్తుంటారు. వాటిని మనం కూడా పీల్చుకుంటుంటాం. ఆ విష పదార్థాలు మన శరీరంలో చేరి దుష్ప్రభావాలు కలిగిస్తాయి. అదే మేం రూపొందించిన పద్ధతిలో దోమలు వాటంతట అవే వచ్చి విషపూరిత పదార్థాన్ని పీల్చుకుని చనిపోతాయి. మనుషులకు ఎటువంటి హానీ ఉండదు. పైగా ఖర్చుకూడా తక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కాపాడొచ్చు..’’అని మాలిక్యులర్ అట్రాక్షన్ సంస్థ సీఈవో లెచ్ ఇగ్నటోవిజ్ వెల్లడించారు. దోమలకు బ్యాక్టీరియా ఎక్కించి.. దోమల నియంత్రణకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో డెంగీకి కారణమయ్యే దోమల నియంత్రణపై ఇండోనేషియాలో చేసిన ప్ర యోగం దాదాపు విజయవంతమైంది. శాస్త్రవేత్తలు దోమల్లో డెంగీ వైరస్ను వ్యాప్తిచేసే సామర్థ్యాన్ని దెబ్బతీసే ‘వొల్బాచియా’ బ్యాక్టీరియాను ఎక్కించారు. ఈ దోమలను పలు ప్రాంతాల్లో వదిలారు. ఆ బ్యాక్టీరియా ఇతర దోమలకూ వ్యాపించి.. డెంగీ కేసులు తగ్గాయి. -
Blood Thinners: ఇవి 50% వరకు కోవిడ్ మరణాలను తగ్గిస్తున్నాయి..
న్యూఢిల్లీ: బ్లడ్ థిన్నర్లు (రక్తాన్ని పలుచగా చేసే మందులు) కోవిడ్ మరణాలను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు లాన్సెట్ ఈ–క్లినికల్ మెడిసిస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అమెరికాలోని 60 ఆస్పత్రుల్లో 2020 మార్చి 4 నుంచి ఆగస్టు 27 వరకు, 6,195 మంది రోగులపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీ, స్విట్జర్లాండ్లోని బాసెల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 90 రోజలు పాటు యాంటీ కోయాగ్యులేషన్ థెరపీ ఇచ్చి ఈ వివరాలను సేకరించారు. చదవండి: జైకోవ్–డి వ్యాక్సిన్ రూ.1,900 ఏం తేలింది ? రక్తాన్ని పలుచగా చేసే మందుల కారణంగా కోవిడ్ మరణాలు తగ్గినట్లు గుర్తించారు. కరోనా వల్ల ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డం కట్టి, సంకట స్థితి ఏర్పడుతోంది. బ్లడ్ థిన్నర్ల వల్ల ఈ ముప్పు తగ్గుతోంది. కోవిడ్ సోకే నాటికే బ్లడ్ థిన్నర్లు వాడుతున్న వారిలో కరోనా ముప్పు, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం, మరణాలు గణనీయంగా తగ్గుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. బ్లడ్ థిన్నర్లు వాడుతున్న వారిలో 43శాతం మంది ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేకుండానే కోవిడ్ను జయించినట్లు పరిశోధన తెలిపింది. మరణాలు కూడా దాదాపు సగం కంటే తక్కవ ఉన్నట్లు తేలింది. గుండె కొట్టుకోవడంలో అసమానతలు ఉండటం, ఊపిరితిత్తులు–కాళ్లలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఉన్నవారికి సాధారణంగా వైద్యులు బ్లడ్ థిన్నర్లు ఇస్తుంటారు. చదవండి: పేగులపై పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్.. ఈ సమస్యలుంటే అప్రమత్తం కావాల్సిందే అదే కీలకం.. కోవిడ్తో ఆస్పత్రిలో చేరిన ప్రారంభంలో బ్లడ్ థిన్నర్లను ఇవ్వడం ద్వారా కరోనా తీవ్రమయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గుతున్నాయని పరిశోధకురాలు, మిన్సెసొటా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సామెహ్ హొజాయెన్ తెలిపారు. ప్రపంచంలో చాలా మెడికల్ సెంటర్లు ప్రస్తుతం ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. తమ బృందం ప్రస్తుతం ఈజిప్ట్తో పాటు పలు దేశాల్లో ఇదే పరిశోధనను నిర్వహిస్తోందని తెలిపారు. -
కోవిడ్ మరణాలపై డేటా ఇవ్వండి: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు కూడా చనిపోలేదని, దీనికి సంబంధించిన రిపోర్టులేవీ తమ వద్ద లేదన్న కేంద్రం తాజాగా కీలక ఆదేశాలు చేసినట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ కొరతతో మరణాల సమాచారం కోసం కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల లోపే ఆయా రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు ఈ డేటాను సమర్పించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెడికల్ ఆక్సిజన్ కొరతతో చనిపోయిన కరోనా బాధితుల డేటాని సమర్పించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. ప్రస్తుత పార్లమెంట్ సెషన్ ముగిసే (ఆగస్టు 13) నాటికి ఈ డేటాను పార్లమెంటులో సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా కరోనా రెండో దశలో వేవ్ ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదన్న కేంద్రం ప్రకటనపై విమర్శలు చెలరేగాయి. ఈ నెల 20న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు కోవిడ్ మరణాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక మరణాలను నివేదించలేదని ఆరోగ్యశాఖ సహాయమంత్రి సమాధానం పెద్ద దుమారాన్నే రాజేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై మండిపడిన సంగతి తెలిసిందే. -
భారత్లో కరోనా మరణాలు 34–49 లక్షలు?
వాషింగ్టన్: కరోనా మహమ్మారి ఎందరో చిన్నారుల్ని అమ్మనాన్నలకు దూరం చేసింది. కరోనా బట్టబయలైన మొదటి 14 నెలల్లో 21 దేశాల్లో 15 లక్షల మందికి పైగా పిల్లలు అమ్మ నాన్నలు లేదంటే సంరక్షకుల్ని కోల్పోయినట్టుగా ది లాన్సెట్ జర్నల్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. భారత్లో 1,19,000 వేల మంది తల్లిదండ్రుల్లో ఒకరికి దూరమై దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ చేసిన ఈ అధ్యయనానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ డ్రగ్ అబ్యూజ్ (ఎన్ఐడీఏ) నిధుల్ని సాయం చేసింది. ‘ కరోనా ఆడవారికంటే మగవారిపైనే ఎక్కువ ప్రభావం చూపింది. తండ్రులు, తాతయ్యలను కోల్పోయిన పిల్లలే అధికంగా ఉన్నారు’ అని ఎన్ఐడీఏ డైరెక్టర్ నోరా డీ వోల్కావ్ చెప్పారు, అధ్యయనం వివరాలు ఇవీ ► 21 దేశాల్లో 11,34,000 మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఒకరిని, లేదంటే వారి సంరక్షకులైన బామ్మ, తాతయ్యలని కోల్పోయారు. వీరిలో 10,42,000 మంది తల్లిదండ్రుల్లో ఒకరినీ, లేదంటే ఇద్దరినీ కోల్పోయారు. మొత్తమ్మీద 15,62,000 మంది చిన్నారులు పెద్దల అండని కోల్పోయారు. ► భారత్లో 1,19,000 మంది చిన్నారుల తల్లిదండ్రులు, లేదంటే సంరక్షకుల్ని పోగొట్టుకుంటే వారిలో 25,500 మంది చిన్నారుల తల్లుల్ని కరోనా మింగేసింది,. 90,751 మంది చిన్నారుల తండ్రుల్ని కోవిడ్ బలి తీసుకుంది. ► దక్షిణాఫ్రికా, పెరూ, అమెరికా, భారత్, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో అధికంగా చిన్నారులు అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నారు. ► ప్రతీ వెయ్యి మంది పిల్లల్లో తల్లి లేదంటే తండ్రిని కోల్పోయిన పిల్లలను పరిగణనలోకి తీసుకుంటే ఇతర దేశాల కంటే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రతీ వెయ్యి మంది పిల్లలకు తల్లిదండ్రుల్లో సంరక్షకుల్ని కోల్పోయిన వారి రేటు 0.5 ఉంటే దక్షిణాఫ్రికాలో 6.4, పెరూ (14.1), బ్రెజిల్ (3.5), కొలంబియా (3.4), మెక్సికో (5.1), రష్యా (2.0), అమెరికా (1.8)గా ఉంది. భారత్లో కరోనా మరణాలు 34–49 లక్షలు? భారత్లో కరోనాతో మృతి చెంది అధికారిక లెక్కల్లోకి రాని వారు 34 నుంచి 49 లక్షల మంది ఉంటారని తాజా నివేదిక వెల్లడించింది. భారత్కు చెందిన మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, /అమెరికాలో స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్కి చెందిన జస్టిన్ సాండ్ఫర్, హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన అభిషేక్ ఆనంద్లు కలసికట్టుగా ఈ నివేదికను రూపొందించారు. కరోనా మరణాలపై గణాంకాలతో పాటుగా తము కొంత అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించారు. దేశంలో జనవరి 2020, జూన్ 2021 మధ్య 34 లక్షల నుంచి 49 లక్షల మంది వరకు కోవిడ్ బారిన పడి మరణించినట్టుగా వారు వెల్లడించారు. భారత్ చెబుతున్న అధికారిక లెక్కల కంటే ఈ సంఖ్య చాలా చాలా ఎక్కువ. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారం నాటికి 4,18,480 ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచంలో కరోనా మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత స్థానం భారత్దే. -
స్వతంత్ర భారతంలో.. ఇంతటి ఘోర విషాదం లేదు: రిపోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్వేవ్ సృష్టించిన కల్లోలం అంతా ఇంకా కాదు. రికార్డు స్తాయిలో రోజుల వారీ 4 లక్షలకు పైగా కేసులతో, 4 వేలకు పైగా మరణాలతో పెను విపత్తును మరిపించింది. మందులకొరత, బెడ్ల కొరత, ఆక్సిజన్ దొరక్క బాధితుల బాధలు అన్నీ ఇన్నీ కావు. అయితే అధికారిక లెక్కలతో పోలిస్తే దాదాపు రెట్టింపు మరణాలను ప్రభుత్వం దాచిపెట్టిందన్న తీవ్ర విమర్శల మధ్య షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. నిజమైన మరణాలు వందల వేలు కాదు అనేక లక్షలు ఎక్కువ అని.. స్వాతంత్ర్యం తరువాత దేశంలో ఇదే అత్యంత ఘోరమైన మానవ విషాదమని వ్యాఖ్యానించింది. దేశ విభజన తరువాత భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విషాదం మరొకటి లేదని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ తయారుచేసిన ఒక నివేదిక పేర్కొంది. జూన్ 2021 నాటికి భారత అధికారిక కోవిడ్-19 మరణాల సంఖ్య 4 లక్షలుగా ఉండగా వాస్తవానికి, విపత్తుగా అధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యానించింది. అధికారిక లెక్క లకంటే 49 లక్షల అదనపు మరణాలు సంభవించాయని తెలిపింది. 2020 జనవరి 2021 జూన్ మధ్య దాదాపు 50 లక్షలు (4.9 మిలియన్లు) మంది మరణించి ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. మొదటి వేవ్ కాలంలో 20 లక్షలమంది మరణించి ఉండవచ్చని కూడా తెలిపింది. ఫస్ట్వేవ్ ఉధృతిని, విషాదాన్ని, గుర్తించడంలో వైఫల్యమే సెకండ్ వేవ్ బీభత్సానికి దారితీసిందని అని నివేదిక పేర్కొంది. వాషింగ్టన్ ఆధారిత థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ దీన్ని తయారు చేసింది. అంతేకాదు భారత మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ సహ రచయితగా వ్యవహరించిడం విశేషం. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అభిషేక్ ఆనంద్, సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్కు చెందిన జస్టిన్ సాండేఫర్ ఈ నివేదికను రూపొందించారు. సెరోలాజికల్ అధ్యయనాలు, గృహ సర్వేలు, రాష్ట్ర స్థాయి పౌర సంస్థల అధికారిక సమాచారం, అంతర్జాతీయ అంచనాల ఆధారంగా, వాషింగ్టన్ ఆధారిత గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ దేశంలో మంగళవారం మూడు అంచనాలతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. కచ్చితమైన కోవిడ్ మరణాలను అంచనా వేయడం కష్టమే అని అంగీకరించినప్పటికీ అధికారిక లెక్కలతో పోలిస్తే వాస్తవ మరణాలు చాలా ఎక్కువ అని తెలిపింది. -
‘ఆక్సిజన్ మరణాల’ పై తీవ్ర దుమారం: ఖండిస్తున్న రాష్ట్రాలు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ రెండో దశ ఈ ఏడు దేశాన్ని గజగజ వణికించింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన విషయం తెలిసిందే. కేసులు రెండు లక్షలు దాటగా.. మృతుల సంఖ్య పదివేలు దాటడం కల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా వైద్యారోగ్య సేవలు కరువయ్యాయి. ముఖ్యంగా ప్రాణవాయువు ఆక్సిజన్ తీవ్రంగా వేధించింది. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక వందలాది మృతి చెందారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆక్సిజన్ కొరతతో ఎవరూ మృతి చెందలేదని తాజాగా మంగళవారం ప్రకటించడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు రాష్ట్రాల మంత్రులు కేంద్ర ప్రకటన ‘పచ్చి అబద్ధం’ అని ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రకటనపై ఢిల్లీ, కర్ణాటక మంత్రులు స్పందించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు. ఈ ప్రకటన ‘పూర్తి అవాస్తవం’ అని పేర్కొన్నారు. చాలా మరణాలు ఆక్సిజన్ కొరతతో సంభవించాయని బుధవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సత్యేందర్ జైన్ తెలిపారు. ఆక్సిజన్ కొరతతో మరణాలు లేకుంటే ఆస్పత్రులు ఎందుకు హైకోర్టులను ఆశ్రయిస్తున్నాయి? అని ప్రశ్నించారు. ఆస్పత్రులు, మీడియా ఆక్సిజన్ కొరత వార్తలను చూస్తునే ఉన్నాయి. ఆక్సిజన్ మరణాలు సంభవిస్తున్నాయని టీవీ ఛానల్స్ కూడా ప్రసారం చేశాయా లేదా అని నిలదీశారు. కళ్లారా మరణాలను చూశామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. ఇలాగే ఉంటే త్వరలోనే కరోనా వైరస్ కూడా లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని సత్యేందర్ జైన్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో అయితే ఆక్సిజన్ మరణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒక్క జిల్లాలోనే (చామరాజ్నగర్ జిల్లా ఆస్పత్రి) 36 మంది ఆక్సిజన్ కొరతతో మరణించారని ఓ నివేదిక ధర్మాసనానికి చేరింది. ఈ నివేదికను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీఎన్ అశ్వత్నారాయణ్ ఖండించారు. అవి ఆక్సిజన్ మరణాలు కాదని.. ఆ ఆస్పత్రి నిర్లక్ష్యంతో సంభవించిన మరణాలుగా అభివర్ణించారు. ‘ఆ మరణాలు ఆక్సిజన్తో జరగలేదు. దీనిపై విచారణ కొనసాగుతోంది’ అని తెలిపారు. ‘గుడ్డిగా కేంద్రం ప్రభుత్వం అనాలోచితంగా చేసిన ప్రకటన’ అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ తెలిపారు. ‘చాలామంది తమ ఆత్మీయులు, బంధువులను ఆక్సిజన్ కొరతతో కోల్పోయారు. ఆస్పత్రులు, మీడియా వీటిని రోజూ చూస్తూనే ఉన్నాయి. ఆక్సిజన్ కొరతతో మరణించారని టీవీల్లో ప్రసారాలు వచ్చాయి’ అని తెలిపారు. ఈ అంశంపై వేణుగోపాల్ రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ పిటిషన్ వేశారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటన చేసిందని.. తప్పించుకునే ధోరణిలో చేసిన ప్రకటనగా ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. కరోనా మృతులకు నష్ట పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పించుకోవడానికి ఈ ప్రకటన చేసిందని గుర్తు చేస్తున్నారు. -
ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదా: చిదంబరం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్వేవ్లో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు మరణం కూడా నమోదు కాలేదని కేంద్రం తాజాగా ప్రకటించడం దుమారాన్ని రాజేసింది. దీనిపై ప్రతిపక్షపార్టీనాయకులు, ఇతరనేతలు కేంద్రంపై దుమ్మెత్తి పోశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీచిదంబరం మరోసారి నరేంద్రమోదీ సర్కార్పై ధ్వజమెత్తారు. గుడ్డి, చెవిటి ప్రభుత్వం సత్యాన్ని చూడలేదు, నిజాలను వినలేదంటూ మండిపడ్డారు. ప్రతీ విషాదాన్ని అబద్దాలు, అసత్యాలతో మాయం చేసే ఆర్ట్ ప్రభుత్వం సొంతమని ఆయన ఎద్దేవా చేశారు. మొదట వ్యాక్సీన్ల కొరత లేదన్నారు. మధ్యప్రదేశ్లో టీకాల కొరత ఏర్పడింది. దేశంలో చాలా టీకా కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇపుడు ఆక్సిజన్ కొరత కారణంగా మరణాల నివేదికలు లేవని కేంద్రం చెబుతోందంటూ మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. మరణాలు లేవని ప్రకటించలేదు... మరణాల నివేదికలు లేవని మాత్రమే మంత్రిగారు ప్రకటించారు దీన్ని గమనించాలంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరోనా రెండో దశలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాతాల్లో ఆక్సిజన్ కారణంగా కరోనా మరణాలు సంభవించలేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభకు తెలియజేశారు. అయితే ఆక్సిజన్కు డిమాండ్లో భారీగా పెరగడంతో రాష్ట్రాల మధ్య సమాన పంపిణీకి కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. మొదటి దశలో 3,095 మెట్రిక్ టన్నులతో పోలిస్తే రెండోదశలో దాదాపు 9,000 మెట్రిక్ టన్నులకు చేరిందని వివరించింది. ఏప్రిల్ 15 న మొదటి కేటాయింపు జరగ్గా, తీవ్రతను బట్టి ఎప్పటికపుడు సమీక్షిస్తూ ఆక్సిజన్ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. 2021 మే 28 నాటికి అధిక భారం ఉన్న 26 రాష్ట్రాలకు మొత్తం 10,250 మెట్రిక్ టన్నుల కేటాయించినట్టు వెల్లడించారు. Now, it is “no reports of deaths due to shortage of oxygen”. Read that carefully. Minister did not say there were “no deaths”. He said “no REPORTS of deaths” A blind and deaf government will not be able to “see” or “hear” the truth. — P. Chidambaram (@PChidambaram_IN) July 20, 2021 -
ఆ ఊర్లో ఏదో జరుగుతుంది.. వరుస మరణాలతో ఆందోళన
తాంసి(బోథ్): వరుస మరణాలతో ఆ గిరిజనం మనసు కీడు శంకిస్తోంది. గ్రామానికి ఏదో కీడు జరిగిందని.. మరణాలకు అదే కారణమని భయం వెంటాడుతోంది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం గిరిగాం గ్రామ పంచాయతీ పరిధి బేతాళ్గూడ గ్రామం నుంచి ఒక్కో కుటుంబం ఇళ్లను ఖాళీ చేసి వెళ్తోంది. ఇక్కడ 20 గృహాలు, 60 మంది జనాభా ఉంటుంది. కొన్ని నెలలుగా వీరు అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నారు. మృతులంతా పురుషులే. రెండేళ్లలో 12 మంది మరణించినట్లు సమాచారం. జూన్లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా అదే కుటుంబంలో మూడు నెలల కిందట ఒకరు, ఆరు నెలల కిందట మరొకరు అనారోగ్యంతో చనిపోయారు. గ్రామానికి ఏదో కీడు జరిగిందని గ్రామస్తుల్లో భయం మొదలైంది. గ్రామంలో ఉంటే తామూ చనిపోతామని ఊరు వదిలి వెళ్లారు. బేతాళ్గూడకు రెండు కిలోమీటర్ల దూరంలోని అంబుగాం గ్రామ పాఠశాల సమీపంలో తొమ్మిది కుటుంబాలు తాత్కాలిక షెడ్లు వేసుకున్నాయి. వామన్నగర్ గ్రామంలో మరో ఐదు కుటుంబాలు షెడ్లు వేసుకుని నివాసం ఉంటున్నాయి. అంతుచిక్కని మరణాలు.. గిరిజనులు ఎలా మృతిచెందారో అంతుచిక్కడం లేదు. మరణానికి కారణం అనారోగ్యమా..? సీజనల్ వ్యాధులా..? దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలా..? అనేది ఎవరికీ తెలియడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు గిరిజనులకు సరైన అవగాహన కలి్పంచడం లేదు. మరణాలకు కారణాలు తెలుసుకుని గ్రామస్తులకు అవగాహన కలి్పస్తే ప్రజలు తిరిగి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -
కరోనా పేషెంట్లకు బోన్ డెత్ ముప్పు?
ముంబై: కరోనా నుంచి కోలుకున్న రోగులకు బోన్ డెత్ రూపంలో కొత్త ప్రమాదం తలెత్తడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాస్కులార్ నెక్రోసిస్(ఏవీఎన్)లేదా బోన్ టిష్యూ డెత్గా పిలిచే ఈ వ్యాధిని ఇప్పటివరకు ముగ్గురు కరోనా వచ్చి తగ్గినవారిలో కనుగొన్నట్లు హిందూజా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా రోగులకు బ్లాక్ ఫంగస్ రూపంలో ముప్పు ఎదురై అందరినీ ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే! తాజాగా కరోనా అనంతరం ఏవీఎన్ ముప్పు పెరగవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్రోగులకు వాడే స్టిరాయిడ్లే ఈ ఏవీఎన్ వచ్చేందుకు ప్రాథమికంగా కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫీమర్ ఎముక వద్ద మొదలైన నొప్పితో ముగ్గురు ఆస్పత్రికి వచ్చారని, కోవిడ్ వచ్చిన తగ్గిన రెండు నెలలకు వీరిలో ఈ సమస్య బయటపడిందని డా. సంజయ్ అగర్వాల్ చెప్పారు. కోవిడ్ ట్రీట్మెంట్లో దీర్ఘకాలం పాటు కార్టికోస్టిరాయిడ్లు వాడడంతో ఏవీఎన్ కేసులు పెరుగుతున్నాయని బీఎంజే కేస్ స్టడీస్లో ప్రచురితమైన ఆర్టికల్లో సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. దీర్ఘకాలం కోవిడ్తో పోరాటం చేసినవారిలో ఈ బోన్డెత్ లక్షణాలు గమనించామని మరికొందరు డాక్టర్లు సైతం చెబుతున్నారు. వచ్చే ఒకటి రెండు నెలల్లో ఇలాంటి కేసులు పెరగవచ్చని, స్టిరాయిడ్ల వాడకమైన 5–6 నెలలకు ఈ వ్యాధి బయటపడుతుంటుందని డా. రాహుల్ పండిట్ చెప్పారు. సెకండ్ వేవ్ ఏప్రిల్లో గరిష్ఠాలకు చేరిందని, అప్పుడు వైద్యం చేయించుకున్నవారిలో బోన్డెత్ లక్షణాలు బయటపడేందుకు కొంత సమయం పట్టవచ్చని అంచనా వేశారు. అయితే సంజయ్ అభిప్రాయం ప్రకారం త్వరలోనే ఏవీఎన్ కేసులు పెరుగుతాయి. సాధారణంగా ఏవీఎన్ లక్షణాలు బయటపడేందుకు చాలా నెలలు పడుతుందని, కానీ ఇప్పుడు ట్రెండ్లో స్వల్పకాలంలోనే ఈ లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ వ్యాధి సోకినవాళ్లను తొలినాళ్లలో గుర్తిస్తే మంచి వైద్యం అందించవచ్చన్నారు. తొలిదశలో ఎలాంటి ఆపరేషన్లు అవసరం ఉండదన్నారు. కోవిడ్ వచ్చి తగ్గినవాళ్లు తొడలు, హిప్ జాయింట్ వద్ద నొప్పి కొనసాగుతుంటే ఎంఆర్ఐ స్కానింగ్కు వెళ్లాలని, అనంతరం ఏవీఎన్ వ్యాధి సోకిందేమో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తొలిదశలో బిస్ఫాస్ఫోనేట్ థెరపీ ద్వారా దీన్ని తగ్గించవచ్చన్నారు. -
కోవిడ్ మరణాల పై సుప్రీం కోర్టు కీలక తీర్పు
-
ఇక అక్కడ పనిదినాలు నాలుగు రోజులే!
కరోనా వైరస్ ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. రిమోట్ నుంచి హైబ్రిడ్ వర్కింగ్ విధానానికి దారితీసింది. ఇందులో భాగంగా జపాన్ మరో అడుగు ముందుకు వేయబోతోంది. పని దినాలను ఐదు నుంచి నాలుగు రోజులకు తగ్గించాలని అనుకుంటోంది. ఈ మేరకు ఒక ప్రతిపాదనను వార్షిక ఆర్థిక విధానాల మార్గదర్శకాలలో కీలకంగా చేర్చింది. టోక్యో: జపాన్ గవర్నమెంట్ 2021 కొత్త ఆర్థిక విధానాలతో వార్షిక మార్గదర్శకాల్ని విడుదల చేసింది. అందులో ఐదురోజుల పనిదినాలకు బదులు.. నాలుగు రోజులే పనిరోజులు ఉండాలని ప్రతిపాదించింది. ఉద్యోగుల పని-జీవితం ఈ రెండు విషయాల్ని పరిగణనలోకి తీసుకుని.. వాటిని సమతుల్యం చేసే విధంగా ఈ విధానాల్ని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. జపాన్ అంటే హార్డ్వర్కింగ్కు కేరాఫ్ అనే ముద్ర ప్రపంచం మొత్తం ఉంది. అలాంటి దేశంలో తమ పని గంటల్ని తగ్గించాలని ఉద్యోగులు చాలా ఏళ్లుగా కోరుకుంటున్నారు.. ఉద్యమిస్తున్నారు. ఈ తరుణంలో నాలుగు రోజుల పనిరోజులు ఊరట కలిగించేదే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో రాజకీయ నేతలు సైతం జోక్యం చేసుకుంటున్నారు. కొందరు నేతలు కార్పొరేట్ ప్రతినిధులతో ఎంప్లాయిస్ పనిగంటల తగ్గింపు, వర్క్ఫ్రమ్ హోం లాంటి అంశాల గురించి చర్చిస్తున్నారు. ఇక తాజా మార్గదర్శకాలపై వాళ్లంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెలలోపే నాలుగు రోజుల పనిదినం పాలసీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే మేధావులు మాత్రం రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకుంటున్నారు. నాలుగు రోజుల పనిదినాల వల్ల అవుట్పుట్ తగ్గిపోతుందని, ప్రొడక్టివిటీపెరగకపోయినా.. ఉత్తేజంగా పని చేస్తారని, అదే టైంలో జీతాల కోతల గురించి కూడా ఉద్యోగులు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కరోషి మరణాలు వర్క్ప్లేస్ మరణాలకు జపాన్ ఉద్యోగులు పెట్టుకున్న పేరు. తీవ్ర పని ఒత్తిడితో గుండెపోటు తదితర అనారోగ్య సమస్యలతో చనిపోయినా, లేదంటే ఒత్తిడితో ఆత్మహత్యలుచేసుకున్నా వాటిని కరోషి మరణాలుగా పరిగణిస్తారు. 2015, క్రిస్మస్నాడు మట్సూరి టకహషి(24) అనే యువతి.. పని ఒత్తిడి తట్టులేక ఆత్మహత్య చేసుకోవడంతో జపాన్ పని వాతావరణం, పని గంటల గురించి వీర లెవల్లో చర్చ జరిగింది. చదవండి: బఫెట్ రాజీనామా! ఎం జరిగిందంటే.. -
పెత్తనంపై ధ్యాస తప్ప బాధ్యత పట్టదా?
‘‘కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే’’ అని ఉత్తర భారతదేశంలోని ఆరు రాష్ట్రాల ప్రజలు అభిప్రాయపడ్డారు. ‘ప్రశ్నమ్’, ‘ది ప్రింట్’ సంస్థలు సంయు క్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బిహార్, హరియాణా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో 14,881 మందిని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో 70 శాతం మంది పురుషులు, 30 శాతం మంది మహిళలు. 52 శాతం మంది యువత కాగా, 36 శాతం మంది మధ్య వయస్కులు, 12 శాతం మంది అరవై యేళ్లు దాటినవారు. ఈ ఆరు రాష్ట్రాలలోని 967 అసెంబ్లీ నియోజక వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములయ్యారు. బిహార్లో 41 శాతం మంది కేంద్ర ప్రభుత్వమే కోవిడ్ ఉత్పా తానికీ, ప్రాణ నష్టానికీ ప్రధాన కారణమని భావించగా, 21 శాతం మంది రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉందని చెప్పారు. అదే సమయంలో 38 శాతం మంది ఇది తమ దురదృష్టమని బాధపడ్డారు. అదేవిధంగా ఉత్తర్ప్రదేశ్లో 46 శాతం కేంద్రాన్నీ, 20 శాతం రాష్ట్రాన్నీ బాధ్యులుగా పేర్కొన్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రముంది. ఆరు రాష్ట్రాల్లో సరాసరి 39 శాతం మంది ఇది తమ తలరాత అని పేర్కొన్నారు. అంటే భారత దేశంలో ఖర్మ సిద్ధాంతం ఎంత బలంగా ఉందో అర్థం అవుతుంది. భారతీయులు ఎంతటి విపత్తునైనా తమ తలరాత అనుకునేంతటి బలహీనులుగా మలచడంలో పాలకులు ఎంతగా కృతకృత్యుల య్యారో అర్థం చేసుకోవచ్చు. రాజస్తాన్లో 47 శాతం మంది ప్రభు త్వాలను దీనికి బాధ్యులుగా పేర్కొనలేదు అంటే మనం ఉన్నది ఎలాంటి సమాజమో పూర్తిగా అర్థమౌతుంది. ఇప్పటివరకు దేశంలో 38 కోట్ల 13 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించగా 2 కోట్ల 95 లక్షలకు పైగా పాజిటివ్గా తేలినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 3 లక్షల 77 వేల మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటì ంచింది. ఈ లెక్కలు ఏవీ సంపూర్ణ సత్యాలు కావని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఇటీవల బిహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తమ లెక్కలను సవరించగా, గతంకన్నా ఎక్కువ మర ణాలు ఉన్నట్టు తేలింది. అదే విధంగా ఈ సర్వేలో 17 శాతం మంది తమ కుటుంబంలో ఎవరో ఒకరు మరణించినట్టు చెప్పారు. అంటే మృతుల సంఖ్య ఇంకా అధికంగా ఉన్నట్లు అంచనావేయొచ్చు. తెలంగాణలో మరణాలు గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే చాలా ఎక్కువని తేలింది. జనన, మరణాల నమోదులో తేలిన అంశాన్ని ఒక ఆంగ్ల పత్రిక ఇటీవల వెల్లడించింది. ఉదాహరణకు 2019లో 1,22,102 మంది మరణించగా, 2020లో 1,54,992 మంది చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. 2021 మే నాటికి 76,024 మంది చనిపోయినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో ఈ మరణాల సంఖ్య అధికంగా నమోదైంది. అన్నింటికన్నా ఘోర మైన విషయం, ఉత్తర్ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో శవాలను దహనం చేయక గంగానదిలో విసిరివేసినట్టు అనేక విజువల్స్, ఫొటోలు బయటకొచ్చాయి. ప్రభుత్వాలు చూపుతోన్న లెక్కలకు కనీసం ఐదు రెట్లు అధికంగా మరణాలు సంభవించినట్టు నిపుణులు అంచనా వేశారు. కోవిడ్ విషయంలో మరొక ముఖ్యమైన అంశం ప్రజల ప్రాణాలతో పాటు, ఆస్తులు కోల్పోవడం, అప్పుల పాలు కావడం. తమ జీవితమంతా రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినదంతా ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించుకొని, చివరకు ఆప్తుల ప్రాణాలను సైతం దక్కించుకోలేక శవాలను వెంటబెట్టుకొచ్చిన ఘటనలు మన చుట్టూ కోకొల్లలు. శంషాబాద్లోని ఒక కుటుంబంలో ముగ్గురు చనిపోగా, దాదాపు 80 లక్షల రూపాయలు హాస్పిటల్ బిల్లు చెల్లిం చుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకించి సెకండ్ వేవ్లో ప్రజలు వెచ్చించిన డబ్బు వేలకోట్లలో ఉంది. ఎవరి బొక్కసాలను నింపింది, దీనిలో ఎవరి వాటా ఎంత? దీనిని వెలికితీయాల్సిన గురుతర బాధ్యత పౌరసమాజంపై ఉంది. మన దేశంలో మొత్తం ఆసుపత్రులు 69,265 కాగా, ఇందులో 43,487 ఆసుపత్రులు ప్రైవేట్లో, 25,778 ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, తెలంగాణ, హరియాణా, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్. అదే విధంగా మొత్తం పడకల సంఖ్య 18,99,228 కాగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 11,85,242 ఉన్నాయి. సెకండ్ వేవ్లో దాదాపు 40 రోజులకు పైగా అన్ని ఆసుపత్రులలోని పడకలు, ప్రత్యేకించి ప్రైవేట్ ఆసుపత్రులలో ఖాళీగా లేవు. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజూ ఒక పడకకు ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేసిన డబ్బు 15 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉంది. సరాసరి 50 వేల రూపాయలు ఒక పడకకు అనుకుంటే దాదాపు దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రైవేట్ ఆసు పత్రులకు సమర్పించుకున్న డబ్బు రెండు లక్షల యాభైవేల కోట్లకు పైనే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ సమయంలో వైద్యం మీద పెట్టిన ఖర్చు చాలా తక్కువ. నిజానికి ప్రభుత్వాలు వాళ్ళు నిర్వ హించిన ప్రభుత్వాసుపత్రులలో వైద్యం అందించడం మినహా ఎటు వంటి సహాయం ప్రజలకు అందించలేకపోయారు. ఇంజెక్షన్లు, ఆక్సి జన్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ను కూడా సమర్థవంతంగా అరికట్ట లేకపోయారు. ఇటువంటి మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్రాలకన్నా కేంద్రానిదే ప్రధాన బాధ్యత. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక ట్రాఫిక్ పోలీస్ చేసిన పని కూడా చేయలేకపోయింది. అధికారాలన్నింటినీ తన అధీనంలో పెట్టుకుని, రాష్ట్రాల హక్కులను నిరర్థకంగా మార్చింది. అంతే కాకుండా తాను చేసిన నిర్ణయాలను తానే విస్మరించింది. ఏప్రిల్, 2, 2020న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక సర్క్యులర్ను విడుదల చేసింది. 2005లో ఆమోదించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం, కోవిడ్ చికిత్సలో అవసరమయ్యే మాస్కులు, పీపీఈ కిట్లు, గ్లోవ్స్, వెంటిలేటర్స్ను ఉత్పత్తి చేయడం, కొనుగోలు చేయడం, దిగుమతి చేసుకోవడం, పంపిణీ చేయడం లాంటి పనులు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నిపుణుల కమిటీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఏఏ వస్తువులు ఎన్ని కావాలో నివేదించుకుంటే, కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఆక్సిజన్ ఉత్పత్తి, పంపిణీని కూడా కేంద్రం తన చేతుల్లోనే ఉంచుకుంది. దీనివల్ల ఏప్రిల్, మే నెలల్లో జరిగిన అల్లకల్లోలం కళ్ళారా చూశాం. కేంద్ర ప్రభుత్వ అధికార కేంద్రీకరణ వల్ల ఎవ్వరూ ఊహించని జననష్టం, ప్రాణనష్టం వాటి ల్లింది. దీనివల్ల మందులు, ఆక్సిజన్ ఇతర వస్తువులు ఏవీ సరైన సమయంలో ఆసుపత్రులకు అందలేదు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫ లమైన విషయం కేంద్రంలోని ప్రతిపక్షాలకే కాదు, అధికార పక్షానికీ తేటతెల్లం అయ్యింది. అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు, ఉత్తర్ప్రదేశ్లో కుంభమేళా నిర్వహణ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కోవిడ్ విపత్తుకి లక్షలాది మంది ప్రజల విలువైన ప్రాణాలు బల య్యాయన్న విషయం ప్రజలకర్థం కావడానికి వేరే ఉదాహరణలు అక్కర్లేదన్నది జగమెరిగిన సత్యం. నిలువునా కూలిన కుటుంబాలు, ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ, అ«థఃపాతాళానికి కూరుకుపోయిన పేదల బతుకులు, జీవనాధారాన్ని కోల్పోయిన వృద్ధులు, మహిళలు, పిల్లలు, ఉపాధి కరువై ఉరివేసు కుంటున్న ప్రైవేటు ఉద్యోగులు, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడు తోన్న విద్యారంగం... ఇంతకు మించిన ఉదాహరణలేవీ పాలకుల చిత్తశుద్ధిని అంచనావేసేందుకు ప్రజలకు అవసరం లేదన్నదొక్కటే సంపూర్ణ సత్యం. అందుకే అన్ని లెక్కలూ తేలాలి. అది తేల్చాల్సింది ప్రజలే. మల్లేపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
కొవిడ్ పరిహారం 4 లక్షలు.. ఏం తేల్చారు?
న్యూఢిల్లీ: కొవిడ్-19తో మరణించిన బాధితులకు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించే విషయంపై సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ అభ్యర్థనల వ్యహారంలో ఏం తేల్చారని శుక్రవారం సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆరా తీసింది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, సహేతుకమైన ఈ అంశం పరిశీలనలో ఉందని, దీనిపై బదులు ఇవ్వడానికి మరికొంత టైం కావాలని కోర్టును కోరాడు. బిహార్ ప్రభుత్వం కరోనా వైరస్తో చనిపోయిన బాధితులకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద నాలుగు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ విషయం మీడియా ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని బెంచ్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ అభ్యర్థనల విషయంలో ఏం తేల్చారని, కరోనా మరణాల ఎక్స్గ్రేషియా స్పష్టమైన రూల్స్ తెలపాలని బెంచ్ కోరింది. అంతేకాదు మరో పిటిషన్లో కొవిడ్ డెత్ సర్టిఫికెట్లు మంజూరు చేయడంలో అవకతవకలు, జాప్యం జరుగుతోందన్న ఆరోపణలపై ఏం స్పందిస్తారని కోర్టు ఆరా తీసింది. దీనిపై మెహతా స్పందిస్తూ.. ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చా యని, వీటిని పరిష్కరించడంపైనే కేంద్రం దృష్టి సారించిందని పేర్కొన్నాడు. అయితే సొలిసిటర్ జనరల్ రెండువారాల గడువు కోరగా కోర్టు అందుకు ఒప్పుకోలేదు. మే 24నే పిటిషన్లు దాఖలు కావడంతో.. ఇంకెంత గడువు ఇవ్వాలని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 18న కేంద్రం తన వివరణను అందించాలని డెడ్లైన్ విధిస్తూ, జూన్21న తదుపరి విచారణ ఉంటుందని మెహతాకు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 12(ii) ప్రకారం.. కరోనాతో చనిపోయిన వాళ్లకు నాలుగు లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాదు బాధిత కటుంబాల బాధ్యతల్ని ప్రభుత్వాలే భరించాలని ఓ పిటిషన్దారుడు పేర్కొన్నాడు. ఇక మరో పిటిషన్లో కొవిడ్ మరణాల సర్టిఫికెట్ల జాప్యంపై పేర్కొనగా, ఐసీఎంఆర్ గైడ్లెన్స్ ప్రకారం సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. చదవండి: వాక్సినేషన్.. దేవుడ్ని ప్రార్థించండి -
Brazil: జనాగ్రహంతోనూ కరోనా విలయం!
కరోనా జస్ట్ ఎ ఫ్లూ అనే స్టేట్మెంట్ ఇచ్చిన తిట్లు తిన్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో శైలిపై తీవ్ర దుమారం రేగుతోంది. తమ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు కారకుడంటూ ఆయనపై వేల క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో బోల్సోనారోకు వ్యతిరేకంగా ఓవైపు ప్రజలు నిరసనలు చేపడుతుంటే.. ఆ నిరసనల వల్ల కేసుల తారాస్థాయి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బ్రసీలియా: కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేసులు, మరణాలు పెరగడానికి కారకుడు అవుతున్నాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సొంత దేశ ప్రజలు ఆయన మీద ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఫుట్బాల్ మ్యాచ్ల నిర్వహణకు అనుమతులు, ఫలితంగానే వైరస్ వ్యాప్తికి కారకుడయ్యాడంటూ మండిపడుతున్నారు. అయితే బోల్సోనారో మీద కోపంతో చేస్తున్న నిరసనలే ఇప్పుడు అక్కడ కొంప ముంచుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. పెరుగుతున్న కేసులు బోల్సోనారోకి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్కు వ్యతిరేకంగా ఆయన చేసిన కామెంట్స్, పైగా ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్లకు మరోసారి అనుమతులు ఇవ్వడంపై వేల మంది రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వైరస్ బారిన పడుతున్న వారిలో నిరసనకారులు కూడా ఉంటున్నారని న్యూయార్క్కి చెందిన ఓ ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రచురించింది. కిందటి నెలలో బ్రసీలియాలో చేపట్టిన పదివేల మంది నిరసనకారుల్లో.. 2 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. వాళ్లలో 189 మంది చనిపోయినట్లు ఆ వెబ్ సైట్ కథనం పేర్కొంది. అలాగే పోయిన శనివారం కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు దిగారు. 16 నగరాల్లోని వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు బోల్సోనారోని ‘రక్త పిశాచి’గా పేర్కొంటూ సావోపాలో బెలూన్లు ప్రదర్శించారు. అయితే ఈ నిరసనల్లో పాల్గొన్న సుమారు 22 వేలమంది కరోనా బారినపడ్డారని, 380 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆ కథనం ప్రస్తావించింది. మరోవైపు ఈ కథనంపై స్పందించేందుకు బ్రెజిల్ ప్రభుత్వం నిరాకరించింది. తగ్గని మరణాలు కాగా, బుధవారం తన పాలనలో జరిగిన అభివృద్ధి గురించి జాతిని ఉద్దేశించి బొల్సొనారో ప్రసగించాడు. ఈ విషయం ముందే తెలియడంతో ఆ టైంకి ప్రజలంతా ప్లేట్లు, చప్పట్లతో నిరసన తెలియజేశారు. అయితే వీధుల్లోకి వేలమంది గుంపులుగా రావడం, మాస్క్లు లేకుండా నిరసనల్లో పాల్గొనడం ఆందోళన కలిగిస్తోందని బ్రెజిల్ ఆరోగ్య విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. నిరసనల టైంలో కొవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలా ఉంటే బ్రెజిల్లో మరణాల లెక్కలు మాత్రం తగ్గట్లేదు. బ్రెజిల్లో కరోనా విజృంభణ తర్వాత ఒకానొక తరుణంలో నాలుగు వేలకు పైగానే మరణాలు సంభవించాయి. బుధవారం కూడా లక్ష కేసులు, ఇరవై ఐదు వందలకుపైగా మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులు సంయమనం పాటించాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: రూల్స్ పాటించరా? అయితే.. -
హృదయ విదారకం: ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదగాథ..
కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే కబళిస్తోంది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గుర్ని బలి తీసుకుంటోంది. ఒకరు చనిపోయిన వార్త మరొకరికి తెలియకముందే మహమ్మారి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. భార్యాభర్తలు, తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్లు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు.. ఇలా అనేక కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు అయినవాళ్లు, ఆప్తులు మరణిస్తుండటంతో ఎంతోమంది వృద్ధులు, మరెంతో మంది పిల్లలు అనాథలుగా మారుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడిన ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదగాథ.. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ మూడురోజుల వ్యవధిలో తండ్రీకొడుకుల మృతి నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వెంపటి వీరాంజనేయులు (64) ఆయన చిన్న కుమారుడు రాంబాబు (36) మూడు రోజుల వ్యవధిలోనే కరోనాతో చనిపోయారు. వీరాంజనేయులు తన ఇద్దరు కుమారులతో కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. తొలుత వీరాంజనేయులు పెద్ద కుమారుడు రాఘవులకు కరోనా రావడంతో చికిత్స తీసుకుం టున్న సమయంలోనే తండ్రి వీరాంజనేయులు, ఆయన చిన్న కుమారుడు రాంబాబు కూడా కరోనా బారినపడ్డారు. రాంబాబు మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 8వ తేదీన మృతి చెందాడు. కాగా అప్పటికే నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరాంజనేయులు మే 11న మృతి చెందడంతో ఉమ్మడి కుటుంబంలో విషాదం అలుముకుంది. రాంబాబుకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రాఘవులు కోలుకున్నాడు. కొడుకు లేడన్న బాధతో తండ్రి.. కరోనా కోరలకు చిక్కిన ఓ కుటుంబం చికిత్స కోసం రూ.15 లక్షల పైచిలుకు ఖర్చు చేసినా ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఆ కుటుంబంలో తండ్రీ తనయులు ఇద్దరినీ కరోనా మింగేసింది. ఇద్దరు మగవాళ్లను కోల్పోయిన కుటుంబంలో మిగిలిన ఇద్దరు ఆడవాళ్లు.. తమవారి చికిత్స కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఊళ్లో ఉన్న వ్యవసాయ భూమిని అమ్మకానికి పెట్టారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు గ్రామానికి చెందిన తన్నీరు భిక్షం (55) కుటుంబం దీనావస్థ ఇది. భిక్షం దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ పెళ్లిళ్లుఅయ్యాయి. వీరిలో చిన్న కుమారుడు తన్నీరు విజయ్ (26) బతుకుదెరువు కోసం కొన్ని రోజులు హైదరాబాద్లో ఉండి ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. గత ఏడాది లాక్డౌన్ ప్రకటించిన తర్వాత పనులు దొరకక నాగార్జునసాగర్కు మకాం మార్చి.. ఇంటర్నెట్ కేఫ్లో పని చేస్తున్నాడు. ఆయన కరోనా బారిన పడడంతో.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈ నెల 7వ తేదీన మృతి చెందాడు. అప్పటికే విజయ్ తల్లిదండ్రులు ఇద్దరికీ కరోనా పాజిటివ్ రాగా హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స పొందారు. తమ కుమారుడు చనిపోయాడన్న విషయం తెలియగానే హోమ్ క్వారంటైన్లో ఉంటున్న తండ్రి భిక్షం సొమ్మసిల్లి పడిపోయాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 12వ తేదీన మృతి చెందాడు. యోగా గురూజీ దంపతులను.. మింగిన కరోనా చిత్తలూరి నర్సయ్య సూర్యాపేట జిల్లాలో యోగా గురూజీగా ప్రజలకు చిరపరిచితుడు. కొన్నేళ్లుగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చి అనేక మందికి ఆరోగ్య నియమాలు.. యోగాసనాలు నేర్పించాడు. అలాంటి యోగా గురువును, ఆయన భార్యను కరోనా కాటేసింది. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య (60) రిటైర్డ్ వార్డెన్. భార్య యాదమ్మ(55)తో పాటు కొన్నేళ్లుగా కోదాడ పట్టణంలో ఉంటున్నారు. వీరిద్దరూ మే మొదటి వారంలో కరోనా బారిన పడ్డారు. నాలుగైదు రోజులు ఇంట్లోనే వైద్యం తీసుకున్నారు. అయిదు రోజుల తర్వాత నర్సయ్యకు దగ్గు ఎక్కువ కావడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు. అప్పటికే కొద్దిపాటి లక్షణాలు ఉన్న భార్య యాదమ్మను కూడా అదే కారులో తీసుకెళ్లారు. దీంతో ఆమెకు కూడా వైరస్ సోకింది. ఇరువురు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతుండగా యాదమ్మకు బ్లాక్ ఫంగస్ సోకడంతో మే 9న చనిపోయింది. భార్య మరణించిన విషయం నర్సయ్యకు తెలియనివ్వలేదు. తర్వాత ఆయనకు కూడా బ్లాక్ ఫంగస్ సోకడంతో శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం దక్కలేదు. కరోనాతో కొడుకు.. మనోవేదనతో తల్లి ఎదిగిన కొడుకు తనకు ఆసరా ఆవుతాడని కలలు కన్న ఆ కన్నతల్లి.. తన కళ్ల ముందే అతను కరోనా బారిన పడి విలవిల్లాడుతుంటే తల్లడిల్లిపోయింది. మంచి ఆస్పత్రిలో చేర్పించి కొడుకును బతికించుకో వాలనుకుంది. కానీ మాయదారి కరోనా అతన్ని కాటేసింది. ఆ మనోవేదనను తట్టుకోలేక పోయిన ఆ తల్లి రెండ్రోజుల క్రితం గుండాగి చనిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. మండల కేంద్రానికి చెందిన కోట లక్ష్యయ్య, ఎల్లమ్మ(60) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. పిల్లల చిన్నతనంలోనే లక్ష్మయ్య చనిపోవడంతో... ఎల్లమ్మ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపి ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు కూడా చేసింది.. ఎల్లమ్మ కొడుకు కోట కుమార్ ఊళ్లోనే కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసారాగా నిలిచాడు. గ్రామంలో మేస్త్రీ పనులు చేసుకుంటూనే.. చదువుపై ఆసక్తితో మరో వైపు చదువుకుని డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత చదువులు చదివి కుటుంబ పేదరికాన్ని జయించాలని కలలు కనేవాడు. అయితే, ఏప్రిల్ 19 తేదీన కుమార్ (26)కు కరోనా సోకింది. ఇంట్లో ఉండి వైద్యులు చెప్పిన ప్రకారం మందులు వాడుతుండ గానే 20వ తేదీ సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. హైదరాబాద్ తీసుకువెళ్లి పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్పించడానికి ప్రయత్నం చేసినా.. ఎక్కడా బెడ్లు దొరకలేదు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో గాంధీకి తీసుకువెళ్లారు. అంబులెన్స్ నుంచి తీసుకువెళ్లి బెడ్మీద పడుకోబెట్టగానే అతను ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు చనిపోయిన వార్త తెలిసినప్పటి నుండి తల్లి ఎల్లమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ బాధలోనే గుండె ఆగి అదే నెల 23న మృతిచెందింది. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి.. ఒకే ఇంట్లో తొమ్మిది రోజుల వ్యవధిలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లికి చెందిన తండ్రి దుంపల లక్ష్మీనారాయణరెడ్డి (75) మే 17న కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందారు. 24న పెద్ద కుమారుడు గౌతంకుమార్రెడ్డి (40), 25న పెద్దనాన్న, మాజీ సర్పంచ్ సత్యారెడ్డి (80) మృతి చెందారు. సత్యారెడ్డికి రూ.3 లక్షలు, లక్ష్మీనారాయణరెడ్డికి రూ.50 వేలు ఖర్చు పెట్టినా ప్రయోజనం దక్కలేదు. గౌతంకుమార్రెడ్డికి ఏకంగా రూ.11 లక్షలు వెచ్చించినా చివరి చూపు చూసుకోలేని పరిస్థితిలో హైదరాబాద్లోనే అంత్యక్రియలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది ఉండగా ఐదుగురికి కరోనా సోకింది. వీరిలో ముగ్గురు చనిపోయారు. రోజుల వ్యవధిలోనే తల్లీ కొడుకు.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి డివిజన్ పరిధి లోని వంగూర్కు చెందిన గంధం సురేష్ 15 సంవత్సరాల క్రితం కల్వకుర్తికి వచ్చి కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. మే మొదటి వారంలో సురేష్తో పాటు ఆయన తల్లి పార్వతమ్మ, భార్య ఇద్దరు కుమారులకు కరోనా సోకింది. అందరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు. పార్వతమ్మ, సురేష్ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న పార్వతమ్మ మే 24న తుదిశ్వాస విడిచింది. 27వ తేదీన సురేష్ కూడా మరణించాడు. బంధువులు రూ.18 లక్షలు ఖర్చు చేసినా వారి ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించే సురేష్ అకాల మరణంతో ఆయన కుటుంబం ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. -
కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆసరా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మృతుల సంఖ్య పెరగడంతో ఉద్యోగుల్లో ఏర్పడిన భయాందోళనలు తొలగించేందుకు, ఆర్జిస్తున్న ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఆసరాగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ను ప్రకటించింది. కార్మిక రాజ్యబీమా సంస్థ (ఈఎస్ఐసీ), ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో)ల ద్వారా కార్మికులకు అదనపు ప్రయోజనాలను ఇస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఆదివారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా... ఎవరెవరు అర్హులో వివరిస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. ఉద్యోగికి కోవిడ్ వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే ఈఎస్ఐసీ ఆన్లైన్ పోర్టల్లో పేర్లు నమోదైన ఉద్యోగి కుటుంబ సభ్యులందరికీ ప్రయోజనాలు వర్తింపజేయాలని నిర్ణయించింది. ‘బీమా సభ్యత్వం ఉన్న వ్యక్తి తనకు కోవిడ్ నిర్ధారణ జరగడానికి కనీసం మూడు నెలలు ముందుగా ఈఎస్ఐసీ ఆన్లైన్ పోర్టల్లో పేరు నమోదు చేసుకుని ఉండాలి. బీమా సభ్యత్వం ఉన్న వ్యక్తి తనకు కోవిడ్ నిర్ధారణ జరిగిన సంవత్సరానికి మునుపటి ఏడాదిలో నియమితుడై ఉండి, తన వేతనం నుంచి కనీసం 78 రోజుల పాటు ఈఎస్ఐసీ చందా చెల్లించి ఉండాలి’ అని పేర్కొంది. ఈ అర్హతలన్నీ ఉన్న ఉద్యోగులు కోవిడ్ వ్యాధితో మరణించిన పక్షంలో సదరు వ్యక్తులపై ఆధారపడిన వారికి, సంబంధిత ఉద్యోగి దినసరి వేతనంలో 90 శాతం చొప్పున మొత్తం నెలవారీగా పెన్షన్ను చెల్లిస్తారు. ఇది జీవితాంతం అందుతుంది. ఈ పథకం గతేడాది మార్చి 24 నుంచి రెండేళ్ల పాటు అమలులో ఉంటుందని పేర్కొంది. ►ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఆధ్వర్యంలోని డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకంలోనూ కొన్ని మార్పులు చేసింది. ►మరణించిన ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని రూ. 6 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. ►కనీసం 12 నెలలపాటు ఒకే సంస్థలో కొనసాగుతూ ఈఎస్ఐ చందా చెల్లించాలనే నిబంధనను సడలించారు. ఏడాదికాలంలో ఒకటికి మించి సంస్థల్లో పనిచేసినా.. 2.5 లక్షల కనీస హామీ ప్రయోజనం లభిస్తుంది. ►కనీస హామీ ప్రయోజన రూపంలో చెల్లించే రూ. 2.5 లక్షల పరిహారానికి సంబంధించిన నిబంధనను గతేడాది ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వచ్చేలా పునరుద్ధరణ.