pune
-
నాన్నా.. నేనేం నేరం చేశాను..!
నాన్న.. పిల్లలకు కంటి రెప్ప, నాన్న.. పిల్లల భవిష్యత్ కు భరోసా, నాన్న..పిల్లలకు నడత నేర్పించే మార్గదర్శి.. అన్నింటీకి మించి నాన్న అంటే వెనుక ఉండి నడిపించే శక్తి. మరి అటువంటి నాన్న అత్యంత కర్కశంగా తన బిడ్డను చంపేసుకుంటే ఏమనాలి. రాక్షసుడు అనే పదం సరిపోదేమో. నాన్నే తన పాలిట రాక్షసుడై జీవితాన్నే ఛిదిమేస్తే.. ఆ నరక యాతన ఎంతలా ఉంటుంది. ‘నాన్నా.. నేనేం నేరం చేశాను’ అని అసువులు బాసేముందు మూగరోదన తప్ప.ఈ తరహా ఘటనలు ఎన్నో ప్రతీ రోజూ ఏదొకటి మనకు తారసపడుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో తన కన్న కొడుకునే పొట్టబెట్టుకున్నాడు తండ్రి.. అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారి బాలుడిని దారుణంగా చంపేశాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్న ఆ తండ్రి.. ఆ బాలుడి పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానంతో కొడుకును హత్య చేశాడు. అతి దారుణంగా హత్య..ఆ బాలుడి గొంతును కోసేసి, ఆ తర్వాత అటవీ ప్రాంతంలో పడేశాడు కర్కశ తండ్రి. మాధవ్ తికేతీ, స్వప్నాలకు హిమ్మాత్ మాధవ్ ఒకే ఒక్క కొడుకు. ఎంతో గారంగా పెరగాల్సిన ఆ చిన్నారి.. తల్లి దండ్రుల మనస్పర్థలకు బలయ్యాడు. ఒకవైపు భార్యపై అనుమానం పెంచుకున్నాడు మాధవ్ తికేతి. ఇదే విషయంలో వీరిద్దరికి తీవ్రమైన ఘర్షణ ఈ గురువారం జరిగింది. దాంతో కొడుకును తీసుకుని వెళ్లిపోయాడు మాధవ్ తికేతి. అయితే తిరిగిరాలేదు. కొడుకును హత్య చేసి పుణేలోని చందాన్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు. భర్త, కొడుకును తీసుకుని వెళ్లి ఇంకా తిరిగి రాలేదని భార్య స్వప్ప ఆందోళన చెందింది. పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ పసిబాలుడు హత్యకు గురైనట్లు గుర్తించారు.హత్య చేసిన రోజు’(గురువారం) ఇంటి నుంచి మధ్యాహ్నం గం. 12.30 నిం.లకు కొడుకును తీసుకుని బయటకు వెళ్లిన మాధవ్ తివేతి.. ఆ తరువాత అదే రోజు గం. 2.30ని.లకు ఒక చోట పిల్లాడితో కనిపించినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో నమోదైంది. ఆపై అదే రోజు గం. 5.30 ని.లకు ఒంటరిగా వస్త్ర దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసినట్లు సీసీ టీవీల ఫుటేజ్ ల ఆధారంగా గుర్తించారు. అంటే ఆ బాలుడ్ని గం. 2.30ని.ల నుంచి గం. 5.30 ని.ల మధ్యలో హత్య చేసి ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు.దీనిపై గత రాత్రి(శుక్రవారం) ఆ బాలుడి తల్లి, మాధవ్ భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త.. కుమారుడిని తీసుకువెళ్లి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈరోజు(శనివారం) పిల్లాడు హత్య గావించబడిన విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో మాధవ్ను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. అయితే కొడుకును తానే చంపినట్లు మాధవ్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా కేసును దర్యాప్తు చేస్తున్నామని, హత్యా అభియోగాలు కింద కేసు కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఒక సీనియర్ పోలీస్ అధికారి స్పష్టం చేశారు. -
‘స్వార్గేట్’ కేసు : నిందితుడి పోలీసు కస్టడీ పొడిగింపు
‘స్వార్గేట్’అత్యాచారం కేసు నిందితుడికి కోర్టు మార్చి 26 వరకు పోలీసు కస్టడీ విధించింది. 12 రోజుల పోలీసు కస్టడీ అనంతరం గడేను బుధవారం కోర్టులో హాజరు పరిచాం. కస్టడీని పొడిగించాలని కోర్టుకు విన్నవించాం. ఈమేరకు మార్చి 26 వరకూ నిందితుడికి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ’అని క్రైంబ్రాంచ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముందే క్రిమినల్ నేపథ్యం ఫిబ్రవరి 25 తెల్లవారుజామున స్వార్గేట్ టెర్మినస్ వద్ద ఎమ్మెస్సార్టీసీ బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దత్తాత్రాయ్ గడే అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. బాధితురాలు ఫిబ్రవరి 25 తెల్లవారుజామున సతారా జిల్లాలోని తన స్వస్థలానికి వెళ్లేందుకు స్వార్గేట్ బస్టాండ్లో వేచి ఉండగా బస్కండక్టర్నని చెప్పి గాడే ఆమెను అప్పటికే అక్కడ ఉన్న బస్సులో ఎక్కాల్సిందిగా కోరాడు. ఈమేరకు బాధితురాలు బస్సులోపలికి వెళ్లగా గాడే రెండు తలుపులూ మూసివేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం డ్రోన్లు స్నిఫర్ డాగ్ల సహాయంతో శిరూర్ తహసీల్ పరిధిలో తన స్వస్థలం గుణత్ గ్రామానికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గడేను పట్టుకున్నారు. అతడిపై ఇప్పటికే అరడజను క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. -
బీట్స్తో అదరగొట్టేసిన బుడ్డోళ్లు : 3 కోట్ల వ్యూస్, ఓ లుక్కేసుకోండి మరి!
‘బాల్యం బంగారు నిధి’ ఇది అందరం ఒప్పుకునే మాట. బాల్య స్మృతులు ఎవరికైనా చెప్పలేనంత ఉల్లాసాన్ని ఇస్తాయి. బాల్యం అనగానే అందమైన అనుభూతులు, అనుభవాలు ఒక్కసారిగా మనల్ని చుట్టుముడతాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించిన జ్ఞ్యాపకాలు ఒక్కసారిగా నిద్ర లేస్తాయి. చిన్నపుడు మనం చేసిన అల్లరి, చిలిపి చిలిపి చేష్టలు గుర్తొస్తాయి. బ్లాక్ బోర్డుపై రాసిన రాతలు, స్కూలు బెంచ్పై చెక్కుకున్నపేర్లు, అదేదో సినిమాలో అన్నట్టు నచ్చిన అమ్మాయిపై పేపర్ బాల్ విసరడం, అది మాస్టార్కు తగిలి, వీపు పగలడం ఇలా.. ఎన్నో..ఎన్నో గుర్తుకు వస్తాయి కదా. ఇపుడు మీరు చదవబోయే కథనం కూడా అలాంటి ఎన్నో అనుభవాలను గుర్తు చేస్తుంది. పుణేకు చెందిన విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.ప్రాజెక్ట్ అస్మి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఇది 3 కోట్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. కమెంట్లు వెల్లువెత్తాయి. పూణేలోని ఒక పాఠశాల చెందిన బ్యాచ్ జామెట్రీ బాక్స్, బెంచె మీద వాయిస్తూ అద్భుతమైన సంగీతాన్ని సృష్టించారు. వాటర్ బాటిల్ను మాత్రమే ఉపయోగించి డ్రమ్ బీట్స్తో అదరగొట్టేశారు. ఒకరి తరువాత ఒకరు తమ టాలెంట్తో రెచ్చిపోయారు. దీంతో తరగతి గది ఒక చిన్న కచేరీ వేదికగా మారిపోయింది. దీంతో టీచర్లు కూడా అలా మైమరిచిపోయారు. చుట్టూ ఉన్న పిల్లలు, స్నేహితులు చప్పట్ల మోత మోగించారు. చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా? View this post on Instagram A post shared by Project Asmi (@projectasmi_pune)అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి విద్యార్థులు ఉత్పత్తి చేసే బీట్లు , రిథమ్లు భలే ఉంటాయి. వారి క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం. కల్మషం లేని లేత వయసులో వారి ప్రతిభను ,సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప ప్రతిభావంతులుగా మారతారు. మరి ఈ బాల శివమణిలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందో వేచి చూద్దాం. -
‘మెడలో తాళి, నుదుటున బొట్టు లేదు.. మీ భర్త మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు’: కోర్టు
ముంబై : వాళ్లిద్దరూ భార్యా, భర్తలు. అయితే, భర్త తనని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోరింది. ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో న్యాయమూర్తికి, మహిళకు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పూణేకు చెందిన అంకుర్ ఆర్ జగిధర్ లాయర్గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ తనని సంప్రదించిందని, అందుకే ఆమె తరుఫున వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తన క్లయింట్ కేసు పూణే జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని, విచారణ సమయంలో న్యాయమూర్తితో జరిగిన వాదనలను భార్య తరుఫు లాయర్ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో పూణే జిల్లా కోర్టులో ‘‘నా క్లయింట్ విడాకుల కేసు విచారణ జరిగింది. విచారణలో భర్త తన డిమాండ్లను నెరవేర్చాలని కోర్టును కోరింది. అయితే, ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి నా క్లయింట్ను ఇలా ప్రశ్నించారు. ‘‘ఏమ్మా.. మిమ్మల్ని చూస్తుంటే మొడలో మంగళసూత్రం, నుదుట బొట్టు పెట్టుకునేవారిలా కనిపించడం లేదే? వివాహం జరిగిన స్త్రీగా మీరు కనిపించకపోతే.. మీ వారు.. మిమ్మల్ని ఎలా ఇష్టపడతారు? అందుకే భర్తలతో ప్రేమగా ఉండండి. కఠువగా ఉండకండి అని సలహా ఇచ్చారు.అంతేకాదు.. మాటల మధ్యలో న్యాయమూర్తి ఇలా అన్నారు. ‘‘ఒక స్త్రీ బాగా సంపాదిస్తే, ఆమె ఎప్పుడూ తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న భర్తనే కోరుకుంటుంది. తక్కువ సంపాదిస్తున్న వ్యక్తి చాల్లే అని సరిపెట్టుకోదు. అదే బాగా సంపాదించే వ్యక్తి తాను వివాహం చేసుకోవాలనుకుంటే, తన ఇంట్లో పాత్రలు కడిగే పనిమనిషినైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి మీరు మీ భర్త పట్ల కాస్త ప్రేమను చూపించండి. కఠినంగా ఉండొద్దు అని ఇద్దరు దంపతుల్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారని వివరిస్తూ’’ సదరు న్యాయవాది రాసిన సోషల్ మీడియా పోస్టు నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. -
నిందితుడి అరెస్ట్.. ఎలా చిక్కాడంటే!
-
పూణే అత్యాచార కేసు.. నిందితుడు రామ్దాస్ అరెస్ట్
పూణే: మహారాష్ట్రలోని పూణే అత్యాచార కేసులో నిందితుడు దత్తాత్రేయ్ రామ్దాస్ గాదేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దారుణ ఘటన తర్వాత 75 గంటల గాలింపు అనంతరం నిందితుడు పోలీసులకు చిక్కాడు. నిందితుడి కోసం పోలీసులు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.వివరాల ప్రకారం.. పూణేలోని స్వర్గేటు బస్టాండ్ వద్ద 26 ఏళ్ల యువతిపై బస్సులో అత్యాచారానికి పాల్పడిన దత్తాత్రేయ్ రామ్దాస్ పోలీసులకు చిక్కాడు. 75 గంటల గాలింపు చర్యల అనంతరం నిందితుడు రామ్దాస్ను శుక్రవారం తెల్లవారుజామున శ్రీరూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, పోలీసు స్టేషన్కు తరలించారు. అత్యాచార ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు అందజేస్తామని పోలీసుశాఖ సైతం తెలిపింది.Pune rape case -; Accused, Dattatray Ramdas Gade, has been arrested by Pune Crime Branch from a village in Shirur Tehsil of Pune district#punecrime #Rape #maharshtra @PuneCityPolice pic.twitter.com/G8PdSUGHO8— Indrajeet chaubey (@indrajeet8080) February 28, 2025 జరిగింది ఇదీ..పూణేలో అత్యంత రద్దీగా ఉండే బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్గేట్లో మంగళవారం ఉదయం అత్యాచార చోటు చేసుకుంది. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్స్టేషన్కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు. గ్రామానికి వెళ్లే బస్సు మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు.బస్సులోకి వెళ్లేందుకు యువతి తటపటాయించడంతో లోపల ప్రయాణికులు ఉన్నారని.. నిద్రలో ఉండటంతో వాళ్లు లైట్లు వేసుకోలేదని నమ్మించాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్ (36)గా పోలీసులు గుర్తించారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్ మీద ఉన్నాడని తెలిపారు. రామదాస్ను పట్టుకొనేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం. -
అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ ఏమన్నారంటే..
ఢిల్లీ: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్జంక్షన్లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు.చంద్రబూడ్ ఏమన్నారంటే..ఈ అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ స్పందించారు. ‘గతంలో ‘నిర్భయ’ ఉదంతం చోటు చేసుకున్న తర్వాత చట్టంలో అనేక మార్పులు వచ్చాయి. కేవలం చట్టాల వల్లే మహిళలకు రక్షిణ కల్పించలేం. దీన్ని సొసైటీ ఒక పెద్ద బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చట్టాలు అమలు తీరు కూడా కచ్చితంగా ఉండాలి. మహిళల రక్షణ కోసం చట్టాలను సరైన విధానంలో అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. తాము బయటకు వెళితే రక్షణ ఉంది అనే భావన మహిళలకు రావాలి. ఈ తరహా కేసుల్లో ఇది చాలా ముఖ్యమైన అంశం. విచారణ న్యాయబద్ధంగా జరగాలి.. అలాగే కఠినమైన శిక్షలను అమలు చేయాలి. తొందరగా విచారణ పూర్తి చేసి శిక్షలను కూడా అంతే త్వరగా అమలు చేయాలి. ఇందులో న్యాయ వ్యవస్థతో పాటు పోలీసులది కూడా పెద్ద బాధ్యతే’ అని చంద్రచూడ్ స్పష్టం చేశారు. నిందితుడి కోసం జల్లెడ పడుతున్న పోలీసులుఈ అత్యాచార ఘటనలో నిందితుడిగా చెప్పబడుతున్న 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన అనంతరం తిరిగి తన ప్రాంతానికి వెళ్లే క్రమంలో అతను చెరుకు తోటల్లో ఉన్నాడనే అనుమానంతో అక్కడ పోలీసులు సోదాలు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అత్యాచార ఘటన తర్వాత ఆ నిందితుడు తన డ్రెస్ మార్చుకోవడంతో పాటు షూస్ కూడా మార్చినట్లు తెలుస్తోంది. తొలుత కూరగాయాలు తీసుకెళ్లే వ్యాన్ లో అతను తిరిగి పయనమైనట్లు గుర్తించిన పోలీసులు.. అటు తర్వాత అతని ఇంటికి సమీపంగా ఉన్న చెరుకు తోటల్లో ఉన్నట్లు అనుమానిస్తన్నారు. దాంతో ప్రత్యేకమైన డాగ్ స్క్వాడ్స్తో పాటు డ్రోన్లను కూడా ఉపయోగించి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. పుణె బస్టాండ్లో దారుణం.. ఒంటరిగా ఉన్న మహిళకు మాయమాటలు చెప్పి -
‘అతడికి ఉరిశిక్ష సరైందే’.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర పూణేలోని ఓ పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో దారుణం జరిగింది. నిలిపి ఉన్న బస్సులో నిందితుడు.. యువతిపై దారుణానికి ఒడిగట్టాడు . ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర అధికార శివసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్లు ఈ తరహా దారుణాలకు పాల్పడే నిందితుల్ని ఉరితీయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బస్సులో జరిగిన దుర్ఘటనపై మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి చెందిన పార్టీ నేతలు గురువారం స్వర్గేట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన బాట పట్టారు. మహా ప్రభుత్వం మహిళల భద్రత కంటే ఉచితాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో బస్సు దుర్ఘటనపై ఏక్నాథ్ షిండే స్పందించారు. పుణే ఘటన చాలా దురదృష్టకరం. నిందితులు ఎవరైనా ఉపేక్షించబోం. అలాంటి వారిని ఉరితీయాలి’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అజిత్ పవార్ సైతం దారుణంపై మీడియాతో మాట్లాడారు. స్వర్గేట్ బస్ స్టేషన్లో జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం, అవమానకరమైనది. నిందితుడు చేసిన నేరం క్షమించరానిది. ఇలాంటి నేరస్తులకు మరణశిక్ష తప్ప మరొకటి ఉండదు. దారుణంపై సమాచారం అందుకున్న వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయాలని పూణే పోలీసు కమిషనర్ను ఆదేశించినట్లు చెప్పారు. ఇంటికి వెళ్లేందుకు.. బస్సు కోసం ఎదురు చూస్తూపూణేలోని నిత్యం రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్లో యువతిపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సతారా జిల్లాలోని ఫల్తానా ప్రాంతానికి చెందిన యువతి మంగళవారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్టాండ్లో బస్సు కోసం వేచిచూస్తోంది. అసలే ఆలస్యం అవుతుంది. బస్సులు కనిపించడం లేదని యువతి ఆందోళనకు గురైంది. ఆ సమయంలో బాధితురాలికి సమీపంలో దత్తాత్రేయ రాందాస్ గాడే (36) కనిపించాడు. బస్సులు రాకపోకల గురించి ఆరా తీసింది. సమీపంలో ఓ ఉన్న బస్సును చూపిస్తూ.. ఆ బస్సు మీ ఊరు వెళుతుందని నమ్మించే ప్రయత్నించాడు. ప్లాట్ఫారమ్ మీదకు రావాల్సిన బస్సు ఆక్కడ ఎందుకు ఆగి ఉంది? ఆగి ఉంటే లైట్లు ఎందుకు ఆర్పేశారు? అని ఇలా ప్రశ్నించింది. దీంతో గాడే.. బస్సులో ప్రయాణికులు ఉన్నారని, అందరూ నిద్రలో ఉండడం వల్ల లైట్లు ఆర్పేశారు. కావాలంటే మీరే చూడండి అంటూ యువతిని నమ్మించాడు. గాడే మాటల్ని నమ్మిన యువతి బస్సు దగ్గరికి వెళ్లింది. ప్రయాణికులు ఉన్నారా? లేరా? అని చూసేందుకు బస్సు డోర్ ఓపెన్ చేసింది. వెంటనే నిందితుడు యువతిని బస్సు లోపలికి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తనపై జరిగిన దారుణాన్ని తన స్నేహితురాలికి చెప్పడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పలు కేసులు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 బృందాలుగా విడిపోయి గాలింపులు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పోలీసుల గాలింపు చర్యల్లో బస్సులో యువతిపై అత్యాచారానికి పాల్పడింది 36ఏళ్ల దత్తాత్రయ రాందాస్ గాడే అని నిర్ధారించారు. గాడేపై గతంలో దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆ కేసుల్లో జైలు శిక్షను అనుభవించి 2019లో నుండి బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా, మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. -
పుణె బస్టాండ్లో దారుణం
పుణె: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్జంక్షన్లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు. గతంలో ఇతనిపై దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు సతారా జిల్లాలోని ఫల్టణ్ పట్టణానికి వెళ్లే బస్సు ఎక్కేందుకు బాధిత మహిళ ఈ బస్టాండ్లోని ఒక ప్లాట్ఫామ్ వద్ద వేచిచూస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన నిందితుడు ‘సోదరీ’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. తాను బస్ కండక్టర్ను అని, మీరు ఎక్సాలిన బస్సు సమీపంలో ఆగి ఉందని చెప్పి, సమీపంలో ఆగి ఉన్న ‘శివ్ షాహీ’ ఏసీ బస్సును చూపించాడు. అది మీరు వెళ్లాల్సిన రూట్లో వెళ్తుందని చెప్పి ఆ బస్సు ఎక్కాలని ఆమెకు సలహా ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఎవరూ లేని ఆ బస్సు ఎక్కింది. లైట్లు ఆఫ్ చేసి, చిమ్మచీకటిగా ఉన్న బస్సును ఎక్కేందుకు తొలుత ఆమె తటపటాయించింది. బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండటంతో లైట్లు ఆర్పివేశారని, నచ్చజెప్పి బస్సులో లోపలిదాకా వెళ్లేలా చేశాడు. వెంటనే వెనకాలే వచ్చిన అతను బస్సు తలుపు మూసేసి, ఆమెను రేప్చేసి పారిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్మార్థనా పాటిల్ చెప్పారు. ఘటన జరిగినప్పుడు బస్టాండ్లో ఎన్నో బస్సులు, ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు. మహిళ తనకు జరిగిన అన్యాయంపై వెంటనే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఫల్టణ్కు వెళ్లే బస్సు ఎక్కి మార్గమధ్యంలో తన స్నేహితురాలికి ఫోన్చేసి ఘోరాన్ని వివరించింది. ఆమె సలహామేరకు బాధితురాలు వెంటనే బస్సు దిగి సమీప పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్చేసేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటుచేసి వేట మొదలెట్టారు. పోలీస్స్టేషన్కు ఈ బస్టాండ్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. నిందితుడు గతంలో ఒక కేసులో బెయిల్ సంపాదించి 2019 ఏడాది నుంచి బయటే ఉన్నాడు.విపక్షాల విమర్శలు‘‘ఏమాత్రం భయం లేకుండా అసాంఘిక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. పుణెలో నేరాలను అరికట్టడంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం విఫలమయ్యారు’’ అని ఎన్సీపీ(ఎస్పీ) నాయ కురాలు, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు. -
డోపింగ్లో దొరికిన మారథాన్ విజేత
న్యూఢిల్లీ: రెండు నెలల క్రితం పుణేలో నిర్వహించిన హాఫ్ మారథాన్ పరుగులో విజేతగా నిలిచిన ప్రధాన్ విలాస్ కిరులేకర్ డోపింగ్లో దొరికిపోయాడు. దీంతో అతనిపై తాత్కాలిక నిషేధం విధించారు. డిసెంబర్లో నిర్వహించిన 21.09 కిలోమీటర్ల రేసును ప్రధాన్ విలాస్ అందరికంటే ముందుగా ఒక గంటా 4 నిమిషాల 22 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. అయితే అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్ని ల్యాబ్లో పరీక్షించగా, నిషిద్ధ ఉ్రత్పేరకం మెల్డొనియమ్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్లూఏ)కు చెందిన స్వతంత్ర ఏజెన్సీ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) ప్రధాన్ విలాస్పై చర్యలు చేపట్టింది. గతనెల భారత్కు చెందిన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ మాధురి కాల్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడటంతో ఏఐయూ సస్పెన్షన్ వేటు వేసింది. 2016లో రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపొవా కూడా ఈ మెల్డొనియమ్ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో ఆమెపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. సాధారణంగా మెల్డొనియమ్ను డాక్టర్లు హృద్రోగులకు, నరాల జబ్బులున్న రోగులకు శక్తి కోసం సిఫారసు చేస్తారు. -
ఇంట్లో 300 పిల్లులు ఎలా వచ్చాయి ?
-
రామ్కుమార్ సంచలనం
పుణే: మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు రామ్కుమార్ రామనాథన్(Ramkumar Ramanathan) మెయిన్ ‘డ్రా’కు మరో విజయం దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో రామ్కుమార్ సంచలనం సృష్టించాడు. టాప్ సీడ్, ప్రపంచ 267వ ర్యాంకర్ ఇలియాస్ ఇమర్ (స్వీడన్)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 403వ ర్యాంకర్ రామ్కుమార్ 5–7, 6–1, 6–4తో గెలుపొందాడు.ఒక గంట 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రామ్కుమార్ తొమ్మిది ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్లో కిమర్ కాప్జాన్స్ (బెల్జియం)తో రామ్కుమార్ ఆడతాడు. ఈ మ్యాచ్లో నెగ్గిన ప్లేయర్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. చైనా జట్టుకు ఇండోనేసియా షాక్కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఇండోనేసియా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో జరిగిన ఫైనల్లో ఇండోనేసియా 3–1తో నెగ్గింది. తొలి మ్యాచ్గా జరిగిన మిక్స్డ్ డబుల్స్లో రివాల్డీ–ఫాదియా జంట 21–11, 21–13తో జువాన్–మెంగ్ యింగ్ జోడీని ఓడించడంతో ఇండోనేసియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక రెండో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో ఫర్హాన్ 21–15, 21–13తో హు జె ఆన్ను ఓడించడంతో ఇండోనేసియా ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్గా జరిగిన మహిళల సింగిల్స్లో జు వెన్ జింగ్ 21–12, 21–13తో కుసుమ వర్ధినిపై గెలవడంతో చైనాకు తొలి విజయం దక్కింది. నాలుగో మ్యాచ్గా జరిగిన పురుషుల డబుల్స్లో షోహిబుల్ ఫిక్రి–డానియల్ మారి్టన్ జోడీ 21–15, 21–9తో చెన్ జుజున్–హువాంగ్ ది (చైనా) ద్వయంపై గెలిచి ఇండోనేసియాకు టైటిల్ను ఖరారు చేసింది. -
ఆన్లైన్ గేమ్లో పరిచయం.. ఆపై అత్యాచారం..
ఫిలింనగర్: ఆన్లైన్ గేమ్ నగరానికి చెందిన ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలతో ఆ చిన్నారిని లొంగదీసుకున్నాడు. ఆన్లైన్ చాటింగ్లో తియ్యటి కబుర్లతో ఆమెను ఆకట్టుకుని ఫొటోలు షేర్ చేయించుకున్నాడు. అందులో బాలిక నగ్న ఫొటోలు కూడా ఉండడంతో తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి పూణే నుంచి హైదరాబాద్ వచ్చి తన వాంఛను తీర్చుకుని వెళ్లేవాడు. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని షేక్పేట్ ప్రాంతానికి చెందిన బాలిక 2021లో ఏడో తరగతి చదివే సమయంలో ప్రతిరోజూ సాయంత్రం ‘ఎమాంగ్ అజ్’ యాప్లో ఆన్లైన్ గేమ్ ఆడుతుండేది. ఈ క్రమంలోనే ‘రూథ్లెస్’ పేరిట ప్రొఫైల్ ఉన్న ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అతని ద్వారా పూణె ఎంఐటీ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతున్న ఖుష్ డేవ్ (21) సదరు బాలికకు పరిచయం అయ్యాడు. వారు యాప్ ద్వారా చాట్ చేయడం ప్రారంభించారు. మొదట్లో ఒకరికొకరు స్నేహితుల్లా ఉండేవారు. ఆ తర్వాత 2023లో ఆమెకు టెలిగ్రామ్ లింక్ షేర్ చేసి ఆ యాప్ ద్వారా చాట్ చేయమని అడిగాడు. దీంతో టెలిగ్రామ్ ద్వారా చాట్ చేసుకునేవారు. చాట్ చేసే క్రమంలో బాలిక ఫొటోలను షేర్ చేయాల్సిందిగా ఖుష్డేవ్ అడగ్గా ఆమె నిరాకరించింది. రోజంతా ఆమెను బలవంతం చేయడంతో ఆమె తన ఫొటోలను, వీడియోలను పంపింది. నగ్న ఫొటోలతో బెదిరింపులు.. వాటిలో నగ్న ఫొటోలు కూడా ఉండటంతో అప్పటి నుంచి ఆ ఫొటోలను ఆమె తల్లిదండ్రులు, బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. తనను కలవాల్సిందిగా బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో గత ఏడాది అక్టోబర్ 6న టోలిచౌకీలోని ఓ పార్కులో కలిసింది. అప్పటి నుంచి ప్రతిరోజూ తనను కలవాల్సిందిగా డిమాండ్ చేస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు తనను బయటకు పంపడం లేదని చెప్పినా రాత్రిపూట అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పాడు. అర్ధరాత్రి అత్యాచారం.. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 24న బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, 25న తెల్లవారుజామున అక్కడికి వచ్చిన ఖుష్డేవ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కలుసుకున్నారు. ఇదే అదునుగా మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడానికి బాలిక భయపడింది. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితురాలికి చెప్పడంతో ఆమె టీచర్ దృష్టికి తీసుకెళ్లింది. టీచర్ ద్వారా ప్రిన్సిపాల్కు, ఆమె ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలియగా వారు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఖుష్డేవ్పై బీఎన్ఎస్ సెక్షన్ 65(1), 351 (2), సెక్షన్ 5 రెడత్ విత్ 6, పోక్సో చట్టం–2012, సెక్షన్ 67 ఐటీ చట్టం–2008 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాడు చెత్తకుండీలో... నేడు క్రికెట్ దిగ్గజం!
‘జీవిత వాస్తవాలు ఫిక్షన్ కంటే వింతగా ఉంటాయి’అంటారు. దీనికి బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పుణెలోని ఒక చెత్తకుండీలో దయనీయమైన స్థితిలో కనిపించిన ఆ పాపను విధి ఆస్ట్రేలియాకు చేర్చింది. ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్గా లిసా సత్తా చాటింది. వరల్డ్ కప్ గెలుచుకుంది.మహారాష్ట్రలోని పూణేలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపను అనాథాశ్రమం ముందు ఉన్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు. ఆ ఆశ్రమ నిర్వాహకుడు పాపను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడు ‘లైలా’ అనే పేరు పెట్టాడు. ఆ రోజుల్లో స్యూ, హరేన్ అనే అమెరికన్ దంపతులు మన దేశానికి వచ్చారు. వారికి ఒక బిడ్డ ఉన్నప్పటికీ అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ఇండియాకి వచ్చారు.‘మాకు అందమైన అబ్బాయి కావాలి’ అంటూ ఆ దంపతులు ఆశ్రమానికి వచ్చారు. కోరుకున్న అబ్బాయి వారికి కనిపించలేదు. అయితే స్యూ కళ్లు లైలా మీద పడ్డాయి. లైలా ప్రకాశవంతమైన గోధుమ రంగు కళ్లు, అమాయకమైన ముఖం చూసి వావ్ అనుకుంది స్యూ. ఆ తరువాత లైలాను దత్తత తీసుకున్నారు. (Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట)దత్తత తరువాత ‘లైలా’ పేరు ‘లిసా’గా మారింది. మొదట్లో యూఎస్లో ఉన్న ఆ దంపతులు ఆ తరువాత సిడ్నీలో శాశ్వతంగా స్థిరపడ్డారు. కుమార్తెకు క్రికెట్ ఆడడం నేర్పించారు. ఆ ఆటే లిసా జీవితాన్ని మార్చేసింది. మొదట లిసా మాట్లాడింది. ఆ తరువాత ఆమె బ్యాట్ మాట్లాడింది. ఆ తరువాత ఆమె రికార్డ్లు మాట్లాడడం మొదలైంది! (నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్)ఐసీసీ ర్యాంకింగ్ విధానం మొదలైనప్పుడు ఆమె ప్రపంచంలోనే నంబర్వన్ ఆల్రౌండర్గా ఉంది. నాలుగు ప్రపంచ కప్లలో పాల్గొంది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్గా సత్తా చాటిన లిసా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. -
మరొకరిని బలిగొన్న పూణె వైరస్
పూణే: మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ (గ్విలియన్-బారే సిండ్రోమ్) మరొకరి ప్రాణాన్ని బలిగొంది. రాష్ట్రంలో జీబీఎస్ వైరస్ కారణంగా రెండవ మరణం నమోదయ్యింది. పూణేకు చెందిన ఒక మహిళ జీబీఎస్ బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ వ్యాప్తి చెందుతోందనడానికి ఉదాహరణగా నిలిచింది.గతంలో ఈ వైరస్ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. పూణేలో ఇప్పటివరకు 127 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ పూణేలోని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. కేసులు కూడా మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అనుమానిత జీబీఎస్(Guillain-Barré syndrome) కేసుల సంఖ్య 127కి చేరింది. ఈ వైరస్తో బాధపడుతున్న 13 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఇదే వైరస్తో షోలాపూర్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. పూణేలో అతనికి ఇన్ఫెక్షన్ సోకింది.షోలాపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ డాక్టర్ సంజీవ్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కాళ్ల నొప్పులు, విరేచనాలతో బాధపడుతున్న ఒక బాధితుడిని జనవరి 18న ఆసుపత్రిలో చేర్చించారు. అతను వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.జీబీఎస్ అనేది ఒక అరుదైన వ్యాధి. దీని బారినపడితే శరీర భాగాలు అకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి. కండరాల బలహీనత ఏర్పడుతుంది. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా జీబీఎస్కి కారణమవుతాయని వైద్యులు తెలిపారు.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రంలోనూ ‘లివ్ ఇన్’కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి -
ది ఇండియా స్టోరీ ప్రారంభం
‘ది ఇండియా స్టోరీ’ని మొదలెట్టారు హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). శ్రేయాస్ తల్పాడే, కాజల్ అగర్వాల్ లీడ్ రోల్స్లో నటిస్తున్న మూవీ ‘ది ఇండియా స్టోరీ’(The India Story). చేతన్ డీకే దర్శకత్వంలో సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పుణేలోప్రారంభమైంది. ‘‘ది ఇండియా స్టోరీ’ తొలి షెడ్యూల్ని పుణే(Pune)లోప్రారంభించాం. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని, ఓ ప్రభావితమైన కథను చూపించబోతున్నాం. ఆగస్టు 15న థియేటర్స్లో కలుద్దాం’’ అని ‘ఎక్స్’ వేదికగా కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. ‘ది ఇండియా స్టోరీ’ లోని ఓ మేజర్ షెడ్యూల్ చిత్రీకరణ కొల్హాపూర్లో జరగనుందని బాలీవుడ్ సమాచారం. రైతుల కష్టాలు, వ్యవసాయ రంగంలో కొన్ని పురుగులమందు వ్యాపార సంస్థలు చేసే మోసాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని టాక్. -
పూణేలో కొత్త వైరస్ కలకలం.. 71కి చేరిన కేసులు
పూణే: మహరాష్ట్రలో కొత్త వైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం సృష్టించింది. పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ గులియన్ బారే సిండ్రోమ్ (GBS) కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో ఆరు కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 71కి చేరుకుంది. వీరిలో 14 మందికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. వైరస్ కారణంగా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ర్యాపిడ్ ఫోర్స్ టీమ్ను ఏర్పాటుచేసింది.పూణేలో కొత్త వైరస్ వ్యాప్తి అక్కడ ప్రజలకు వణికిస్తోంది. గులియన్ బారే సిండ్రోమ్ (GBS) బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వైరస్బారినపడిన వారి సంఖ్య తాజాగా 71కి చేరుకుంది. బాధితుల్లో 47 మంది పురుషులు, 24 మంది మహిళలు ఉండగా.. వీరిలో 14 మందికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇక, ఈ వ్యాధి వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది. దీంతో, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక పరిశోధనా టీమ్ను ఏర్పాటు చేసింది. అయితే, జీబీఎస్కు చికిత్స లేదు. దీని బారినపడిన వ్యక్తులు కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.జీబీఎస్ అంటే ఏమిటి?గులియన్ బారే సిండ్రోమ్ (GBS) అనేది అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. దీని కారణంగా నరాల బలహీనత, తిమ్మిరి లేదా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గులియన్-బారే సిండ్రోమ్ అరుదైనది వ్యాధి. మాయో క్లినిక్ ప్రకారం.. గులియన్-బారే సిండ్రోమ్ లక్షణాలు కనిపించడానికి కనీసం ఆరు వారాల ముందు శ్వాసకోశ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి.లక్షణాలు ఇలా..బాధితులకు మెట్లు ఎక్కడం, నడవడం కష్టమవుతుంది.నరాల బలహీనత, కాళ్లు, చేతులు, ముఖం, శ్వాస కండరాలు బలహీనమవుతాయి.నరాలు దెబ్బతినడం వల్ల మెదడులో అసాధారణ సంకేతాలు వస్తాయి.అసాధారణ హాట్బీట్, రక్తపోటు మార్పులు, జీర్ణక్రియ సమస్యలు, మూత్రాశయ నియంత్రణలో సమస్యలు కూడా ఉంటాయి. -
పరువు నష్టం కేసులో రాహుల్కు బెయిల్
పుణే: హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలెదుర్కొంటున్న కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిలిచ్చింది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం రాహుల్ వర్చువల్గా హాజరు కావడంతో ఎంపీ/ ఎమ్మె ల్యేల ప్రత్యేక కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ జోషి ఈ మేరకు కోర్టుకు ష్యూరిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 18వ తేదీన తదుపరి విచారణ ఉంటుందని, ఈ కేసులో ప్రత్యక్షంగా రాహుల్ హాజరయ్యే అవసరం లేకుండా కోర్టు మినహాయింపు ఇచ్చిందని లాయర్ మిలింద్ చెప్పారు.ఇదీ చదవండి: కోల్డ్ కాఫీ చేసిన రాహుల్ గాంధీ, వైరల్ వీడియో -
ఘోరం.. చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి
ముంబై : పూణే జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతిని జిల్లా అటవీ శాఖ అధికారులు అధికారంగా ధ్రువీకరించారుపూణేలోని షిరూర్ తాలూకా పింపల్సుతి గ్రామానికి చెందిన రక్ష నిఖమ్ (4) ఇంట్లో ఆడుకుంటుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత చిన్నారిని నోట కరుచుకుని స్థానిక చెరుకు తోటల్లోకి తీసుకెళ్లింది. చిరుత పులి రాకను గమనించిన తల్లి కాపాడండి అంటూ కేకలు వేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రక్ష కోసం గాలింపు చర్యలు చేపట్టారు.రెండు గంటల పాటు గాలింపు చర్యల అనంతరం చెరుకు తోటలో చిన్నారి జాడ దొరికింది. చిన్నారిపై చిరుత తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడితో బాలిక తల,మొండెం వేర్వేరుగా కనిపించాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జున్నార్ ఫారెస్ట్ డివిజన్ అధికారి మితా రాజ్హన్స్ మాట్లాడుతూ బాలికపై దాడి చేసిన చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. -
పుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ
పుణే: ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమరావతికి చెందిన కార్మికులు వారి కుటుంబాలతోపాటు రెండు రోజుల క్రితం ఉపాధి కోసం పుణేకు వచ్చారు. వఘోలి ప్రాంతంలోని కెస్నాడ్ ఫటా ఫుట్పాత్పై వీరంతా నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో అదుపు తప్పిన ఓ ట్రక్కు ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైగా దూసుకెళ్లింది. ఘటనలో రెండేళ్లలోపు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ గజానన్ టొట్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
తప్పతాగి ఫుట్పాత్పైకి ఎక్కించి.. పుణేలో ఘోరం
ముంబై: పుణేలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. ఫుల్గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఫుట్పాత్పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఫుట్పాత్ నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.సుమారు ఒంటి గంట సమయంలో ఓ వ్యక్తి వాహనం నడుపుతూ వాఘోలి చౌక్ ఏరియాకు చేరుకున్నాడు. హఠాత్తుగా తన బండికి అక్కడే ఉన్న ఫుట్పాత్పైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు పోవడానికి కారణమైనందుకు మోటార్ వెహికిల్స్ యాక్ట్తో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మృతుల్లో.. ఏడాది, రేండేళ్ల వయసున్న చిన్నారులు, విశాల్ పన్వర్(22) ఉన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలు.. కేశ్నాథ్ ఫాటా ఏరియాలో ఫుట్పాత్పై పడుకున్నారని, వాళ్లపై నుంచి ట్రక్కు దూసుకెళ్లిందని, వాహనం నడిపిన వ్యక్తి బాగా తాగి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.#महाराष्ट्र के पुणे में भयानक सड़क हादसा..नशे में धुत #डंपर ड्राइवर ने फुटपाथ पर सो रहे 9 लोगों को कुचला, 3 की मौत#Maharashtra #Pune #accident #footpath #Dumper #drunkdriving pic.twitter.com/y71i5EtaAQ— mishikasingh (@mishika_singh) December 23, 2024Pune: Dumper Truck Driver Claims Three Lives, Injures Nine In Wagholi Near Kesnand Phata In a tragic incident on Pune’s Wagholi area near Kesnand phata, a speeding dumper truck ran over 12 people sleeping on a footpath, killing three and injuring nine. The accident, reportedly… pic.twitter.com/K6T09Om7v4— Pune Pulse (@pulse_pune) December 23, 2024 -
హైదరాబాద్ సహా మూడు నగరాలకు ఫుల్ డిమాండ్: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాలకు భారీ ఎత్తున వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వలసల లేకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడుతూ..‘భారత్ సహా పలు దేశాల్లో(ఆఫ్రికన్) ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా రాబోయే రెండు దశాబ్దాల్లో కొన్ని దేశాల ప్రజలు భారత్వైపు చూసే అవకాశం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా ఉండటంతో వారు ఇక్కడికి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఫలితంగా పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతాయని అన్నారు.ఇదే సమయంలో భారత్ విషయానికి వస్తే హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాల్లోకి వలసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అందుకే వారంతా ఇక్కడే వచ్చేందుకు చూస్తారు. అప్పుడు ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం కారణంగా ఇక్కడ పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వలసలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కార్పొరేట్ ప్రపంచం, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు కలిసి వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించాలని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు వారంలో 70 గంటలు పనిచేయాలంటూ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సిందేనని కుండ బద్ధలుకొట్టారు. లేకుంటే పేదరికం నుంచి ఎలా బయటపడగలమని? ప్రశ్నించారు. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. Infosys CEO Narayana Murthy warns of urban overload due to climate change pic.twitter.com/85EwbchiOD— NDTV (@ndtv) December 22, 2024 -
పెను విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి.. వీడియో
క్రికెట్ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ ఆటగాడు మృతి చెందాడు. పూణేలోని ఛత్రపతి సంభాజి నగర్లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఇమ్రాన్ పటేల్ అనే ఆటగాడు కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్గా బరిలోకి దిగిన ఇమ్రాన్ పటేల్.. కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన అనంతరం ఛాతీ నొప్పి వస్తుందని అంపైర్లకు చెప్పాడు. పెవిలియన్కు వెళ్లే క్రమంలో ఇమ్రాన్ కుప్పకూలిపోయాడు. A young man, Imran Sikandar Patel, died of a #heartattack while playing cricket in the Chhatrapati Sambhaji Nagar district of Maharashtra.https://t.co/aCciWMuz8Y pic.twitter.com/pwybSRKSsa— Dee (@DeeEternalOpt) November 28, 2024హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఇమ్రాన్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. పైపెచ్చు ఎప్పుడూ ఫిట్గా ఉండేవాడని తోటి క్రికెటర్లు చెప్పారు. ఇమ్రాన్కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు నాలుగు నెలల పసి గుడ్డు. ఇమ్రాన్ అంత్యక్రియలకు జనం తండోపతండాలుగా వచ్చారు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన ఇమ్రాన్ పటేల్కు ఓ క్రికెట్ టీమ్ ఉంది. జీవనోపాధి కోసం అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు జ్యూస్ షాప్ నడిపే వాడు. ఇమ్రాన్ మృతి స్థానికంగా విషాద ఛాయలు నింపింది. అచ్చం ఇమ్రాన్లాగే రెండు నెలల క్రితం ఇదే పూణేలో మరో స్థానిక క్రికెటర్ కూడా మృతి చెందాడు. హబీబ్ షేక్ అనే క్రికెటర్ మ్యాచ్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు.సెప్డెంబర్ 7న ఈ ఘటన జరిగింది. మృతుడు షుగర్ పేషంట్ అని తెలిసింది. -
సికింద్రాబాద్–పుణే మధ్య వందే భారత్ రైలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్–పుణే మధ్య త్వరలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలోనే ఈ మార్గాన్ని రైల్వేబోర్డు నోటిఫై చేసినా.. రైల్ రేక్ సిద్ధంగా లేకపోవటంతో ప్రారంభించలేదు. ఈ క్రమంలో త్వరలో ఈ రైలును పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. అది ముగిశాక ప్రారంభించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శతాబ్ది సర్వీసు కొనసాగుతోంది. అది రోజూ మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుంది. వందే భారత్ను ఉదయమే బయలుదేరేలా నడిపే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెప్తున్నాయి.స్లీపర్ కేటగిరీపై పరిశీలన!వందే భారత్ రైళ్లలో స్లీపర్ కేటగిరీ త్వరలో పట్టాలెక్కబోతోంది. ఇటీవలే నమూనా రైలు సిద్ధమైంది. ఆ రైలు రేక్స్ తయారవుతున్నాయి. ట్రయల్రన్ తర్వాత వాటిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 16 రూట్లను ఈ రైళ్లకోసం ఖరారు చేశారు. మరిన్ని మార్గాలను కూడా ఎంపిక చేయనున్నారు. సికింద్రాబాద్–పుణే మధ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ను నడిపే అంశాన్ని కూడా రైల్వే బోర్డు పరిశీలిస్తోంది.ఈ నగరాల మధ్య ప్రస్తుతమున్న పుణే శతాబ్ది రైలు సికింద్రాబాద్లో మధ్యాహ్న సమయంలో ప్రారంభమవుతోంది. కానీ రాత్రివేళ సర్వీసు పెట్టాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఈ క్రమంలో రాత్రివేళ వందే భారత్ స్లీపర్ సర్వీసును ప్రారంభించి.. ఆ తర్వాత సాధారణ వందే భారత్ను శతాబ్ది స్థానంలో ప్రవేశపెట్టాలన్నది రైల్వే యోచన అని సమాచారం.నాగ్పూర్ సర్వీసు విఫలంతో..సికింద్రాబాద్–నాగ్పూర్ మధ్య 20 కోచ్లతో వందే భారత్ రైలు సేవలు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు నగరాల మధ్య నిత్యం నాలుగు రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో వందే భారత్కు డిమాండ్ లేకుండా పోయింది. ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం కూడా ఉండటం లేదు. నెల గడుస్తున్నా దీనికి ఆదరణ పెరగకపోవటంతో కోచ్ల సంఖ్యను తగ్గించి.. ఎనిమిది కోచ్లకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పుణే సర్వీసు ఎలా ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.సికింద్రాబాద్–పుణే మధ్య సర్వీసులు తక్కువ. పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న నగరాలు కావడం, ప్రయాణికుల డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో.. ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ సర్వీసు విఫలమయ్యే చాన్స్ లేదని ప్రాథమికంగా తేల్చారు. వందే భారత్ను పట్టాలెక్కించాలనే నిర్ణయానికి వచ్చారు. సాధారణ వందే భారత్ సర్వీసా? స్లీపర్ సర్వీసా? అన్నదానిపై మహారాష్ట్ర ఎన్నికల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కివీస్తో రెండో టెస్ట్.. నెట్స్లో చెమటోడుస్తున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే
న్యూజిలాండ్తో సిరీస్ను పరాజయంతో ప్రారంభించిన టీమిండియా.. రెండో టెస్టులో విజయానికి గురిపెట్టింది. పుణెలో గెలుపొంది సిరీస్ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. భారత్- కివీస్ జట్ల మధ్య గురువారం నుంచి మొదలుకానున్న ఈ మ్యాచ్కు ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా శుబ్మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. గిల్ కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరిని తప్పిస్తారని విలేకరులు అడుగగా.. ‘‘శుబ్మన్ గిల్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. బెంగళూరులో నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు. ఇక తుదిజట్టులో ఎవరు ఉండాలన్న అంశంపై పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంటాం.జట్టులో ఒకరికి చోటు నిరాకరించడం అనేది ఉండదు. సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులో అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్ కాస్త నిరాపరిచిన మాట వాస్తవమే. అయితే, తను ఎన్ని బంతులు మిస్ చేశాడని అడిగినపుడు అందుకు బదులుగా ఒక్కటి కూడా మిస్ చేయలేదనే సమాధానమే వచ్చింది.ఒక్కోసారి ఇలాగే జరుగుతుంది. బాగా ఆడినా పరుగులు రాబట్టలేకపోవచ్చు. కాబట్టి కేఎల్ రాహుల్ గురించి ఆందోళన అక్కర్లేదు. తను మానసికంగానూ ఏమాత్రం అలసటకు గురికాలేదు. అయితే, అందుబాటులో ఉన్న ఆరు స్థానాల్లో ఏడుగురిని ఇరికించడం కుదరదు. కాబట్టి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్నే ఎంచుకుంటాం.ఇప్పటికైతే కేఎల్ రాహుల్ ఫామ గురించి మాకెలాంటి బెంగా లేదు. అతడి ఆట తీరుపై పూర్తి నమ్మకం ఉంది. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా గౌతీ(హెడ్కోచ్ గౌతం గంభీర్) తనకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్.. అతడు బెంగళూరులో 150 పరుగులు చేశాడు. ఇరానీ కప్ ఫైనల్లో డబుల్ సెంచరీ చేశాడు. కాబట్టి మిడిలార్డర్లో చోటు కోసం ఇద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంది’’ అని టెన్ డష్కాటే తెలిపాడు.ఇక రిషభ్ పంత్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని పుణెలో జరుగనున్న రెండో టెస్టులో అతడే వికెట్ కీపింగ్ చేస్తాడని ఈ సందర్భంగా డష్కాటే సంకేతాలు ఇచ్చాడు. కాగా మెడనొప్పి కారణంగా శుబ్మన్ గిల్ బెంగళూరలో జరిగిన తొలి టెస్టుకు దూరం కాగా.. వన్డౌన్లో అతడి స్థానంలో విరాట్ కోహ్లి వచ్చాడు. కోహ్లి ఆడే నాలుగో స్థానంలో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ 0, 12 పరుగులు చేశాడు. -
మహారాష్ట్ర: రూ. 5 కోట్ల నగదు పట్టివేత
పూణె: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. ఇంతలో పూణె సమీపంలో ఓ కారులో భారీగా నగదు పోలీసులకు పట్టుబడింది. ఖేడ్ శివ్పూర్ టోల్ ప్లాజా సమీపంలో ఓ వాహనంలో రూ. 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నారనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇన్నోవా వాహనంలో భారీగా డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై, ఖేడ్ శివపూర్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో ఒక ఇన్నోవా కారులో తనిఖీలు చేసినప్పుడు భారీగా నగదు బయటపడింది. విషయం తెలుసుకున్న ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు నోట్లను లెక్కించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘చియోంగ్చియాన్’పై అధ్యయనం -
పూణె మెట్రో స్టేషన్లో మంటలు
పూణె: మహారాష్ట్రలోని పూణెలోని ఒక మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం ఘటనా స్థలికి చేరుకుని, మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని మెట్రో అధికారులు తెలిపారు.పూణెలోని మండై మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మెట్రో స్టేషన్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫోమ్ మెటీరియల్లో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన మెట్రో అధికారులు వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.ఐదు అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని, ఐదు నిమిషాల వ్యవధిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. మెట్రో స్టేషన్లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ఒక ట్వీట్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. మెట్రో స్టేషన్లో పరిస్థితులు చక్కబడ్డాయని, మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. पुणे के मेट्रो स्टेशन में लगी आगमहाराष्ट्र के पुणे में मंडई मेट्रो स्टेशन के ग्राउंड फ्लोर पर रविवार आधी रात को आग लग गई, हालांकि घटना में कोई घायल नहीं हुआ. फायर विभाग के मुताबिक, वेल्डिंग के दौरान फोम में आग लगने से यह घटना घटी.#Maharashtra | #pune | #fireaccident | #fire pic.twitter.com/V8lBA4hdTV— NDTV India (@ndtvindia) October 21, 2024ఇది కూడా చదవండి: పిరమిడ్పై పక్షుల వేట -
సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్దిఖీని కాల్చిచంపడానికి పుణెలో కుట్ర జరిగిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. íసిద్దిఖీని గుర్తించడానికి వీలుగా ఆయన ఫొటో, చిత్రం ముద్రించిన ఫ్లెక్సీని షూటర్లకు అందజేశారు. ఈ హత్యలో పుణెకు చెందిన సోదరులు ప్రవీణ్ లోంకర్, శుభమ్ లోంకర్ల పాత్ర ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. నిందితులు దొరకితే హత్యకు కారణాలు తెలుస్తాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. లోంకర్ సోదరులే హత్యకు పాల్పడిన షూటర్లకు రూ.50 వేల చొప్పున అడ్వాన్సు అందించారని, నిందితుల మధ్య సమావేశాలను ఏర్పాటు చేశారని, హత్యకు కావాల్సిన ఏర్పాట్లను చూశారని చెప్పారు. శుభమ్కు చెందిన డైరీలో ప్రవీణ్ పనిచేస్తున్నాడని.. అక్కడే షూటర్లు శివకుమార్ గౌతమ్, ధర్మరాజ్ కశ్యప్లను హత్య కోసం నియమించుకున్నారని తెలిపారు. అడ్వాన్సుగా అందిన మొత్తం నుంచి నిందితులు ఒక మోటార్సైకిల్ను కొనుగోలు చేసి.. దాని పైనే సిద్దిఖీ నివాసం, ఆఫీసుల వద్ద, ఆయన దినచర్య పైనా రెక్కీ నిర్వహించారని వివరించారు. గుర్మైల్ బల్జీత్సింగ్ (హరియాణా), ధర్మరాజ్ కశ్యప్ (ఉత్తరప్రదేశ్), ప్రవీణ్ లోంకర్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులకు దిశానిర్దేశం చేసిన మొహమ్మద్ యాసిన్ అక్తర్ కోసం. సిద్దిఖీని కాల్చిచంపిన గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
టక్ చేయలేదని చితక్కొట్టిన టీచర్
టక్ చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఎడమ చెవిపై గట్టిగా కొట్టడంతో కర్ణభేరి పగిలింది. దాంతో ఆ చెవి శాశ్వతంగా వినికిడి సామర్థ్యం కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజీతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో టీచర్పై పిల్లాడి తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. నిర్లక్ష్యంగా సమాధానమిచి్చన టీచర్ను తల్లిదండ్రులు పోలీసుల ఎదుట చితక్కొట్టారు. కంప్యూటర్ సబ్జెక్ట్ బోధించే సందేశ్ బోసాలే సెప్టెంబర్ 27న ఆరో తరగతి గదిలో ఓ విద్యార్థి టక్ చేసుకోకపోవడం గమనించి కోపంతో కొట్టాడు. మెడ పట్టి క్లాసు నుంచి గెంటేశాడు. దెబ్బలకు బాలుని ముక్కు, ఎడమ చెవి నుంచి రక్తం కారింది. ఇంటికెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఎడమ చెవి కర్ణభేరి పగిలిందని వైద్యుడు చెప్పాడు. కుటుంబసభ్యులు స్కూలు యాజమాన్యాన్ని నిలదీసినా తమకు సంబంధం లేదన్నారు. దాంతో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన సలహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి ఇరు వర్గాలను స్కూలుకు పిలిపించారు. అప్పటికే కోపంతో ఉన్న కుటుంబసభ్యులు, నవనిర్మాణ్ సేన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే టీచర్ను చితకబాదారు. महाराष्ट्र के पुणे में पहले टीचर ने छात्र को पीटा, फिर मनसे और छात्र के परिजनों ने टीचर को पीटा! केस दर्ज छात्र का शर्ट इन नहीं था pic.twitter.com/NZ5fwgTX8R— Avinash Tiwari (@TaviJournalist) October 6, 2024 -
గుండె పగిలింది: టీమిండియా మాజీ క్రికెటర్ భావోద్వేగం
టీమిండియా మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి తల్లి మాలా అశోక్ అంకోలా(77) అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. పుణెలోని తన ఫ్లాట్లో గొంతు కోసి ఉన్న స్థితిలో శవమై కనిపించారు.మానసిక సమస్యలతో సతమతంఈ నేపథ్యంలో ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. అనంతరం డీఎస్పీ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. ‘‘మాలా ఇంట్లో పనిచేసే వ్యక్తి ఫ్లాట్కి వచ్చి డోర్ కొట్టగా ఎవరూ తలుపుతీయలేదు. దీంతో సమీపంలో నివసించే బంధువులకు సమాచారం ఇచ్చింది.తలుపు తెరిచి చూడగా మాలా విగతజీవిగా కనిపించారు. ఆమె గొంతు కోసి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ గాయాలు తనకు తాను గానే చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. కాగా మాలా అశోక్ అంకోలా గత కొన్నిరోజులుగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గిల్ ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతో తనకు తానుగానే గాయపరచుకున్నారా అన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. అమ్మా.. హృదయం ముక్కలైందికాగా సలీల్ అంకోలా అంతర్జాతీయ క్రికెట్లో 1989- 1997 మధ్య భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. ఒక టెస్టు, 20 వన్డేలు ఆడాడు. అనంతరం ఈ ఫాస్ట్బౌలర్ పలు హిందీ సినిమాలతో పాటు టీవీ షోలలో నటించాడు. కాగా తల్లి మరణాన్ని ధ్రువీకరిస్తూ.. ‘అమ్మా’ అంటూ గుండె పగిలినట్లుగా ఉన్న ఎమోజీతో ఆమె ఫొటోను సలీల్ అంకోలా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Salil Ankola (@salilankola) -
పుణెలో కూలిన హెలికాప్టర్..ముగ్గురు మృతి
పుణె: మహారాష్ట్రలోని పుణెలో బుధవారం(అక్టోబర్2) తెల్లవారుజామున హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు ఒక ఇంజినీర్ దుర్మరణం పాలయ్యారు. పుణెజిల్లాలోని బవ్ధాన్ కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బవ్ధాన్ పరిసర ప్రాంతంలోని గోల్ఫ్కోర్స్లో ఉన్న హెలిప్యాడ్ నుంచి గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ముంబై వెళ్లాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలియనప్పటికీ దట్టమైన పొగమంచు వల్లే హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కుప్పకూలిన హెలికాప్టర్ పుణెలోని హెరిటేజ్ ఏవియేషన్కు చెందినదిగా తేల్చారు. కాగా, ముంబై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ హెలికాప్టర్ పుణె సమీపంలో ఇటీవలే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లోని నలుగురు గాయపడ్డారు.#WATCH | A #helicopter with three people onboard crashed in the Bavdhan area in #Pune. According to the police, two people have died in the incident.More details here: https://t.co/34QkwGCcvh pic.twitter.com/v6tQTKz2K1— Hindustan Times (@htTweets) October 2, 2024 ఇదీ చదవండి: పెరోల్పై డేరా బాబా విడుదల -
భారీ వర్షాల ప్రభావం: ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ తన పూణె పర్యటనను రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు నగరాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రోడ్లపైకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాని మోదీ ఈరోజు (గురువారం) పుణె మెట్రో రైలు ప్రారంభోత్సవంతో పాటు రూ.22,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షాల దృష్ట్యా ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.భారీ వర్షాల కారణంగా పూణె, పింప్రీ చించ్వాడ్లలో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కుండపోత వర్షాల కారణంగా గోవండి-మాన్ఖుర్ద్ మధ్య నడిచే ముంబై లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుణె జిల్లాకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పౌరులు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.జాతీయ సూపర్కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) కింద సుమారు రూ. 130 కోట్లతో అభివృద్ధి చేసిన మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో నేడు ప్రధాని పాల్గొనాల్సి ఉంది. అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూపొందించిన హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్పీసీ)సిస్టమ్ను కూడా ప్రధాని ప్రారంభించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్కు రూ. 850 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాలన్నీ నేడు రద్దయ్యాయి.ఇది కూడా చదవండి: ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు -
ఇంట్లోనే అబార్షన్.. గర్భిణీ మృతి
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణికి ఇంట్లోనే అబార్షన్ చేయడం వల్ల 24 ఏళ్ల మహిళ మృతిచెందింది. ఈ కేసులో ఆమె భర్త, మామలను పోలీసులు అరెస్ట్ చేయగా.. అత్తపై కూడా కేసు నమోదు చేశారు. ఇక అబార్షన్ చేసేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకొచి విచారిస్తున్నారు. నాలుగు నెలల పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టినట్లు తేలింది.వివరాలు.. 2017లో యువతికి వివాహం జరిగింది. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు( ఒక బాలిక, బాలుడు) ఉన్నారు. ఇటీవల ఆమె మూడోసారి గర్భం దాల్చింది. అయితే కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. మహిళకు ఇంట్లోనే అబార్షన్ చేయాని ప్లాన్ చేశారు. ఇందుకు ఓ వైద్యుడిని కూడా పిలిపించారు. నాలుగు నెలల గర్బిణీకి ఇంట్లోనే అబార్షన్ చేయించారు. పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టారు. అనంతరం అధిక రక్తస్రావం కారణంగా మహిళ పరిస్థితి విషమంగా మారింది. మరుసటి రోజు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మరణించింది.మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి ఆమె భర్త, మామలను అరెస్ట్ చేశారు. పొలం నుంచి పిండాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అబార్షన్ చేసేందుకు పిలిచిన ఓ ప్రైవేట్ వైద్యుడిని కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఇందాపూర్ పోలీసులు పేర్కొన్నారు. -
EY ఉద్యోగి మృతి ఘటన: పుణె ఆఫీసులో తనిఖీలు
పుణె: యర్నెస్ట్ అండ్ యంగ్ (EY) కంపెనీ సీఏ అన్నా సెబాస్టియన్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికమైన అని ఒత్తిడి కారణంగానే మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయ అధికారులు పూణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. మృతికి సంబంధించి ఆధారాల సేకరణ కోసం అధికారులు ఆఫీసు, పరిసరాల్లో సోదాలు నిర్వహించారు. ‘‘తనిఖీలో మా అధికారులు ఆఫీసు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో లభించిన ఆధారాలపై స్పందించేందుకు కంపెనీకి ఏడు రోజుల గడువు ఇచ్చాం. జూలైలో పెరయిల్ మరణం చుట్టూ చోటుచేసుకున్న అంశాల నివేదికను సిద్ధం చేసి ఒక వారంలో రాష్ట్ర కార్మిక కమిషనర్కు సమర్పించాలని ఆదేశించాం. అనంతరం ఆ పరిశీలన కొనుకొన్న ఆధారాలపై నివేదికను కేంద్రానికి పంపుతాం. ఈ ఘటనపై కేంద్రం విచారణ జరపనుంది’ అని పేర్కొన్నారు.మరోవైపు.. పని ఒత్తిడి కారణంగా ఆమె మృతిచెందినట్లు వస్తున్న ఆరోపణలపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ తీవ్రంగా ఖండించింది. ఆమె మరణానికి, కంపెనీ పనిభారానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కంపెనీ ఉద్యోగుల సంక్షేమానికి పటిష్టమైన నియమాలు, పద్దతుల అమలు తాము ఎప్పటినుంచో కట్టుబడి ఉన్నామని పేర్కొంది.చదవండి: EY మహిళా ఉద్యోగి మృతి : నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల దుమారం -
తనను వ్యతిరేకించే వారి మాట కూడా వినేవాడే పాలకుడు: గడ్కరీ
ముంబై: ప్రజాస్వామ్యం, పాలకుల వ్యవహార తీరుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వ్యతిరేకించే వారి మాటను పాలకుడు వినడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్షగా పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను స్వీకరించి, దానిపై ఆత్మపరిశీలన చేసుకుంటాడని చెప్పారు. రచయితలు, మేధావులు, కవులు నిర్భయంగా తమ భావాలను వ్యక్తీకరించాలని తెలిపారు.పుణెలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పరీక్ష ఏంటంటే.. ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని అందించినా దాన్ని పాలకుడు సహించవలసి ఉంటుందన్నారు. ఆ ఆలోచనలను పరిగణలోకి తీసుకొని నడుచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.దేశంలో విమర్శకుల అభిప్రాయ బేధాల్లో సమస్య లేదు కానీ.. అభిప్రాయాలను వెల్లడించడంలోనే సమస్య ఉంది. మనం రైటిస్టులు, లెఫ్టిస్టులం కాదు. మనం అవకాశవాదులం. రచయితలు, మేధావులు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరుతున్నాం. ఒకరి లోపాలను గుర్తించేందుకు ఎప్పుడూ విమర్శకులు చుట్టుముట్టాల్సిన అవసరం ఉంది. అంటరానితనం, సామాజిక న్యూనత భావం, ఆధిపత్యం కొనసాగినంత కాలం దేశం అభివృద్ధి చెందదని అన్నారు. -
పని.. ప్రాణం మీదకు, ‘అన్నా’ మృతిపై ఎవరేమన్నారంటే!
‘ల్యాప్టాప్ అనేది నా శరీరంలో ఒక భాగం అయింది’ ఇచట, అచట అనే తేడా లేకుండా ఎప్పుడూ ఆఫీసు పనిలో తలమునకలయ్యే ఉద్యోగి మాట ఇది. ‘మాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు’ అని కవి అన్నట్లు పనిభారంతో ఒత్తిడికి గురవుతున్న చాలామంది ఉద్యోగులకు జీవితం లేకుండాపోతోంది. పని కోసం జీవితాన్నే పణంగా పెట్టాల్సి వస్తోంది.26 ఏళ్ల తన కుమార్తె మరణానికి ‘అధిక పనిభారం’ కారణం అని ఆరోపిస్తూ ఆమె తల్లి ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ చైర్మన్కు రాసిన లేఖ ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది. విషపూరిత పని సంస్కృతిని ఎత్తి చూపేలా ఉన్న ఈ లేఖపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది...కొచ్చికి చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ కొన్ని నెలల క్రితం పుణెలోని ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ కంపెనీలో చేరింది. అధిక పనిభారం కారణంగా అన్నా సెబాస్టియన్ ఆరోగ్యం త్వరగా క్షీణించిందని ఆమె తల్లి అనితా అగస్టీన్ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ హెడ్ రాజీవ్ మెమానికి రాసిన లేఖలో ఆరోపించింది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడంతో అన్నా సెబాస్టియన్ చాలా సంతోషించింది. అయితే ఆ సంతోషం కొద్ది నెలల్లోనే ఆవిరై΄ోయింది. ‘అధిక పని వల్ల రాత్రి ΄÷ద్దు΄ోయే వరకు, వారాంతాల్లో కూడా పనిచేసేది. ఎప్పుడూ అలిసి΄ోయి కనిపించేది’ అని కుమార్తె గురించి రాసింది అనిత అగస్టీన్.‘నా బిడ్డ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లిస్తుందని అనుకోలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అయింది అనిత. ‘ఎక్స్’లో ఆమె రాసిన లేఖకు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.అనిత అగస్టీన్ లేఖ నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో, అన్నా మృతికి సంతాపం తెలుపుతూ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించడానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చింది.అయితే వారి హామీ నెటిజనుల ఆగ్రహాన్ని తగ్గించలేదు.‘కంపెనీ నుండి ఎవరూ నా కుమార్తె అంత్యక్రియలకు హాజరు కాలేదు’ అంటూ అనిత వెల్లడించిన తరువాత నెటిజనుల కోపం మరింత ఎక్కువ అయింది. ‘కంటి తుడుపు మాటలు కాదు కార్యాచరణ ముఖ్యం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అనితా అగస్టీన్ లేఖపై కళాకారులు, రచయితలు స్పందించారు. ‘చిన్న వయసులోనే కూతురుని కోల్పోయిన అనితను చూస్తుంటే, ఆమె రాసిన లేఖ చదువుతుంటే కన్నీళ్లు ఆపుకోవడం కష్టంగా మారింది. ఆమె అంత్యక్రియలకు హాజరు కావాలనే కనీస మర్యాద లేని యజమానులు ఉండడం సిగ్గు చేటు. కార్పొరేటు శక్తుల కోసం మీ ఆరోగ్యాన్ని, మీ జీవితాన్ని బలి చేసుకోవద్దు’ అని స్పందించింది రచయిత్రి నందితా అయ్యర్. ఒకానొక సమయంలో రోజుకు 14 గంటలకు పైగా పనిచేసిన సింగర్ పౌశాలి సాహు తన గతాన్ని గుర్తు తెచ్చుకుంది.‘అన్నా సెబాస్టియన్ గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు భారం అవుతోంది. నా గత కాలం గుర్తుకు వస్తుంది. తీరిగ్గా కూర్చోలేని పని ఒత్తిడి... చివరికి వీకెండ్స్లో కూడా పనిచేయాల్సి వచ్చేది. అప్పటి పనిభారం ఇప్పటికీ ఏదో రూపంలో నాపై ప్రభావం చూపుతూనే ఉంది’ అంటూ స్పందించింది పౌశాలి సాహు.‘మన దేశంలో పని భారం భయంకరంగా ఉంది. వేతనం నిరాశాజనకంగా ఉంది. నిత్యం కార్మికులను వేధిస్తున్న యజమానులలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అని ఒక యూజర్ స్పందించాడు. అన్నా సెబాస్టియన్ మరణం హాస్టల్ కల్చర్, విషపూరిత పని ప్రదేశాల ప్రమాదాల గురించి కూడా చర్చను రేకెత్తించింది. -
ట్యాంకర్ను మింగేసిన భారీ గుంత.. చూస్తుండగానే ఒక్కసారిగా..
రోడ్డుపైన గుంతల్లో వాహనాలు కూరుకుపోయిన దృశ్యాలు చాలానే చూసుంటారు. కానీ ఏకంగా వాహనం వాహనమే గుంతలో కూరుకుపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు చెందిన ట్యాంకర్ వెళ్తుండగా రోడ్డుపై పెద్ద గుంత పడింది. మొదట ట్యాంకర్ వెనక టైర్లు కుంగగా.. ఆ తర్వాత క్రమంగా ఆ ట్యాంకర్ వెనక నుంచి అందులో పడిపోయింది. అందరూ చూస్తుండగానే వాహనం గుంతలోకి చేరిపోయింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ కావడంతో వైరల్గా మారింది. మహారాష్ట్రలోని పూణె నగరంలో జరిగింది ఈ వింత ఘటన. బుద్వార్ పెత్ ప్రాంతంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ప్రాంగణంలో డ్రైనేజ్ క్లీనింగ్ వర్క్ నిమిత్తం ట్యాంకర్ వచ్చింది.గుంతలో ట్యాంకర్ కూరుకుపోవడానికి కొన్ని క్షణాల ముందే అక్కడ నుంచి కొంత మంది నడుచుకుంటూ వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తోంది. అకస్మాత్తుగా భారీ గొయ్యి ఏర్పడటం, ట్యాంకర్ అందులో కూరుకుపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ గొయ్యిలో మురుగు నీరు ఉండగా.. దాదాపుగా ట్యాంకర్ క్యాబిన్ వరకు ఆ మురుగు నీటిలో మునిగిపోయింది.అయితే అది గమనించిన ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి.. బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఓ వ్యక్తి సాహసోపేతంగా గొయ్యి వద్దకు వెళ్లి, డ్రైవర్కు సాయం అందించాడు. ట్యాంకర్ క్యాబిన్ భాగం మునగిపోకపోవడంతోనే డ్రైవర్ సురక్షితంగా బయటపడగలిగాడు. అయితే, అక్కడ ఫ్లోర్ ఒక్కసారిగా ఎందుకు కుంగిపోయింది అని ఆరా తీయగా.. గతంలో అక్కడ బావి ఉండేదని ఓ అధికారి వెల్లడించారు. పాత బావికి స్లాబ్ వేసి.. దానిపై పేవర్ బ్లాక్స్ వేశారని చెప్పారు. రెండు క్రేన్ల సాయంతో ట్యాంకర్ను బయటికి తీశామని తెలిపారు.Pune Municipal Corporation truck fell into a pothole on the road at Samadhan Chowk in Pune. pic.twitter.com/jJbpovSsMY— Mohammed Zubair (@zoo_bear) September 20, 2024 -
ఆమెకు మరణశాసనం రాసింది ఎవరు?
-
Puja Khedkar: పూజా ఖేద్కర్కు బిగ్ షాక్
న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆమెకు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఆమెపై వేటు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గత జూన్లో ఖేద్కర్పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పటింది. అక్కడి నుంచి పూజా అక్రమాల చిట్టా బయటపడింది.సివిల్ సర్వీసెస్కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. -
ఫుడ్ ఇవ్వలేదని.. ఏకంగా హోటల్పైకి ట్రక్కుతో దూసుకెళ్లిన డ్రైవర్
ముంబై: మహారాష్ట్రలో ఓ ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. అతడికి ఆహారం ఇవ్వలేదనే కోపంతో ఏకంగా హోటల్పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పుణెలోని ఇంద్రాపూర్ హింగాన్గావ్లో చోటుచేసుకుంది.కంటైనర్తో ట్రక్కు తో ఓ వ్యక్తి షోలాపూర్ నుంచి పుణె వెళ్తు మధ్యలో హోటల్ గోకుల్ వద్ద ఆగాడు. తర్వాత లోపలికి వెళ్లి ఆహారం అడిగాడు.కారణం తెలీదు కానీ హోటల్ యజమాని అతనికి ఫుడ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కోపోద్రిక్తుడై తన ట్రక్కులో కూర్చుని హోటల్ భవనంపైకి పోనిచ్చాడు. అంతటితో ఆగకుండా హోటల్ బయట ఆగి ఉన్న కారును కూడా ఢీకొట్టాడు.ఇంతలో డ్రైవర్ను ఆపేందుకు కొందరు వ్యక్తులు ట్రక్కుపై రాళ్లు రువ్వడం చేశారు. చివరికి ట్రక్కు చక్రాలుకింద రాళ్లు పడటంతో అవి ముందుకు కదల్లేక ఆగిపోయాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ హోటల్ తీవ్రంగా దెబ్బతింది సమాచారం అందుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది తమ ఫోన్లలో రికార్డు చేయడంతో..సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది.VIDEO | Maharashtra: A truck driver rammed his vehicle into a hotel building in #Pune after he was reportedly denied food. The truck driver was allegedly drunk. The incident took place on Friday night.#PuneNews #maharashtranews (Source: Third Party)(Full video available on… pic.twitter.com/TrPEF1ZxrA— Press Trust of India (@PTI_News) September 7, 2024 -
కొంపముంచిన వడాపావ్.. వీడియో వైరల్
పుణె: పూణెలో జరిగిన పట్టపగలు దోపిడీలో వృద్ధ దంపతులు రూ. 5 లక్షల విలువైన నగలను పోగొట్టుకున్నారు. భార్యాభర్తలు బ్యాంకు నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఓ దుకాణంలో వడాపావ్ తినేందుకు ఆగారు. ఆ దంపతులు స్కూటర్ను రోడ్డు పక్కన నిలిపారు. ఆ వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ కోసం షాపులోకి వెళ్లగా, ఆ మహిళ స్కూటర్ దగ్గర వేచి ఉంది. కాసేపటి తర్వాత, బైక్పై ముఖానికి మాస్క్తో ఒక వ్యక్తి స్కూటర్ దగ్గర ఆపాడు, రోడ్డుపై ఏదో పడిపోయినట్లుగా ఆ మహిళ దృష్టి మళ్లించి అక్కడ నుంచి వెళ్లిపోయాడుదానికోసం వంగి వెతుకుతుండగా.. స్కూటర్ ముందు భాగంలో ఉన్న బ్యాగ్ను తీసుకొని మరో వ్యక్తి పరారయ్యాడు. దీన్ని గమనించిన ఆ మహిళ కేకలు వేస్తూ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వెనకే పరుగులు తీసింది.ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ బ్యాగులో రూ. 5 లక్షల విలువైన ఆభరణాలు, సెల్ఫోన్లు కూడా అందులోనే ఉన్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.In Pune, a couple’s gold jewellery valued at ₹4.95 lakh was stolen while they paused to buy vada pav after retrieving it from a bank. The theft occurred on Thursday outside Rohit Vadewale's shop in ShewalewadiReported by: Laxman MoreVideo Editor: Dhiraj Powar#PuneTheft… pic.twitter.com/JfXj1uuiU7— Pune Mirror (@ThePuneMirror) August 30, 2024 -
సీఎం చంద్రబాబు కోసం రప్పిస్తున్న హెలికాప్టర్ క్రాష్
సాక్షి, అమరావతి: ముంబై నుంచి బయల్దేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ పుణేలోని పౌద్ సమీపంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై నుంచి విజయవాడ వస్తుండగా హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. అయితే, హెలికాప్టర్ కూలిన అనంతరం కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే హెలికాప్టర్ను ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల రోజుల నుంచి మెయింటెన్స్లో ఉన్న హెలికాప్టర్ను ఆగమేఘాల మీద విజయవాడకు రప్పించే యత్నం చేశారు అధికారులు.ఏవియేషన్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడితోనే హెలికాప్టర్ విజయవాడకు బయలుదేరినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాప్టర్ను రప్పించే యత్నాలు చేసినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ క్రాష్ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హెలికాప్టర్ క్రాష్పై పోలీసులు, ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నాయి. -
ముంబైలో కూలిన ప్రైవేటు హెలికాప్టర్..
ముంబై: మహారాష్ట్రలో ప్రమాదం చోటుచేసుకుంది. పుణెలోని పౌద్ సమీపంలో శనివారం ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్లో పైలట్, ముగ్గురు ప్రయాణికులున్నట్లు తేలింది. పైలట్తో సహా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.పుణెలో కురుస్తున్న భారీ వర్షాలతో వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలినట్ల పూణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్ వెల్లడించారు. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. -
టీచర్ కాస్త రేసర్గా..ఏకంగా నేషనల్ కారు రేసింగ్ ఛాంపియన్షిప్..!
మనకు నచ్చిన అభిరుచి వైపు అకుంఠిత దీక్షతో సాగితే ఉన్నత విజయ శిఖరాలను అందుకోవడం ఖాయం. అలా ఎందరో గొప్ప గొప్ప విజయాలను అందుకుని స్ఫూర్తిగా నిలచారు కూడా. అలాంటి కోవకు చెందిందే డయానా పుండోల్. ఇంతకీ ఎవరీమె? ఏం సాధించిందంటే..పూణేకు చెందిన 28 ఏళ్ల డయానా పుండోల్ పురుషులే ఎక్కువగా ఇష్టపడే రేసింగ్ల వైపుకు అడుగులు వేసింది. రేసింగ్ అనేది పురుషాధిక్య కాంపీటీషన్ అనే చెప్పాలి. సాధారణంగా మహిళలు ఇటువైపు రావడం. అదీగాక ఎక్కువగా పురుషులే ఈ కారు రేసింగ్లో ఛాంపియన్ షిప్లు గెలుచుకుంటారు. ఇంతవరకు వాళ్లే ఈ రంగంలో అధిక్యంలో ఉన్నారు. అలాంటి సాహసకృత్యంతో కూడిన రేసింగ్ని డయానా ఎంచుకుంది. పైగా ఆమె తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అని చెబుతుండటం విశేషం. ఎంతో అంకితభావంతో రేసింగ్లో శిక్షణ తీసుకుని ఏకంగా నేషల్ కారు రేసింగ్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. అంతేగాదు ఇలాంటి ఘనత సాధించిన తొలి మహిళా రేసర్గా చరిత్ర సృష్టించింది. ఆమె టీచర్గా పనిచేస్తూ వీకెండ్లలో రేసింగ్ ప్రాక్టీస్ చేసి మరీ విజయం సాధించడం విశేషం. ఇన్నాళ్లుగా మహిళలు సాహస క్రీడల్లో పాల్గొనడం అంటే మాటలు కాదు అనే వాళ్ల నోళ్లు మూయించేలా విజయఢంకా మోగించింది డయానా. మహిళలు తలుచుకుంటే ప్రతి రంగంలో ధైర్యంగా దూసుకుపోగలరని తన గెలుపుతో చాటి చెప్పింది. అంతేగాదు పురుషలకు ఏ విషయంలోనూ మహిళలు తీసిపోరని నర్మగర్భంగా చెప్పింది. కాగా, ఆమె ఇలాంటి పలు ఇతర ప్రతిష్టాత్మకమైన రేసింగ్లలో పాల్గొంది కూడా. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రసిద్ధ రేసింగ్ కాంపిటీషన్ అన్నింటిల్లోనూ పాల్గొంది. ముఖ్యంగా దుబాయ్ ఆటోడ్రోమ్, యూరప్, యూఏఈలోని హాకెన్హైమ్రింగ్, బెల్జియంలోని F1 సర్క్యూట్ డి స్పా వంటి రేసింగ్లలో కూడా పాల్గొంది. పైగా రానున్న జనరేషన్ ధైర్యంగా ఇలాంటి వాటిల్లోకి వచ్చేలా ప్రేరణగా నిలిచింది. ధైర్యం, ఆత్మవిశ్వాసానికి నైపుణ్యం తోడైతే ఎలాంటి ఛాలెంజింగ్ క్రీడల్లో అయినా విజయం సాధించొచ్చని డయానాని చూస్తే తెలుస్తోంది కదూ..!. View this post on Instagram A post shared by Diana (@diana.pundole) (చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!) -
విమానంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై మహిళ దాడి
ముంబై: విమానంలో ఓ మహిళ.. తోటి ఇద్దరు ప్రయాణికులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగపడ్డారు. ఈ ఘటన శనివారం పుణెలోని లోహెగావ్ ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. ఉదయం 7. 45 గంటలకు పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరే.. ఓ ప్రైవేటు విమానంలో బోర్డింగ్ ప్రాసెస్ సమయంలో ఓ మహిళ దాడికి తెడపడ్డారు. మొదట ఆ మహిళ ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విమాన సిబ్బంది, సీఐఎస్ఎఫ్ కానిస్టెబుల్స్ ఆమె వద్దకు వచ్చారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడి చేసింది. అనంతరం ఆ మహిళను, ఆమె భర్తను విమానం నుంచి దింపేశారు. ఆ మహిళను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేశారు.సీనియర్ ఇన్స్పెక్టర్ అజయ్ సంకేశ్వరి మాట్లాడుతూ.. విచారణ కోసం సదరు మహిళకు నోటీసు ఇచ్చి విడిచిపెట్టాం. ఎయిర్లైన్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది,సహ ప్రయాణీకులు వాంగ్మూలాలను రికార్డు చేశాం’ అని చెప్పారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన బాధలో ఉన్నట్లు గమనించామని, అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారని ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు. -
రూ.30 వేలకోట్ల ప్రాజెక్ట్లకు కేబినెట్ ఆమోదం
దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బెంగళూరు, థానే, పుణెల్లోని మెట్రో ప్రాజెక్ట్ల కోసం రూ.30,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాజెక్ట్లను 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతోపాటు బగ్ద్గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయాల పరిసరాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా మంత్రివర్గం ఆమోదం లభించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘బెంగళూరు , థానే , పుణెల్లో దాదాపు రూ.30,000 కోట్ల విలువైన మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్లను 2029లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటు బగ్ద్గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలు విస్తరించేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా అనుమతులు వచ్చాయి. ఈ కీలక ప్రాజెక్టులు ఆయా నగరాల వృద్ధికి దోహదపడుతాయి. 2014కి ముందు దేశంలో కేవలం ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైలు ఉండేది. కానీ ప్రస్తుతం 21 నగరాలకు మెట్రో విస్తరించింది. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2 లక్షల కోట్ల ఖర్చు చేసేలా ఆమోదం లభించింది’ అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. సమస్య పరిష్కారానికి చర్చలు‘బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-3లో రెండు కారిడార్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.15,611 కోట్ల భారం పడబోతోంది. ఈ ఫేజ్-3 ప్రాజెక్ట్ 44.65 కిలోమీటర్లతో 31 స్టేషన్లను అనుసంధానం చేస్తుంది. మెట్రో విస్తరణలో భాగంగా మూడో దశ పనులు పూర్తయిన తర్వాత బెంగళూరు నగరంలో 220.20 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ ఉంటుంది. థానేలో కొత్తగా 22 స్టేషన్లతో ఏర్పాటు చేసే 29 కిమీ కారిడార్ కోసం రూ.12,200 కోట్లు ఖర్చు అవుతుంది. మహారాష్ట్రలో మంత్రివర్గం ఆమోదించిన మరో ప్రాజెక్ట్ కోసం రూ.2,954.53 కోట్లు ఖర్చు అవుతాయి’ అని మంత్రి వివరించారు. -
World Elephant Day 2024: గజరాజుల గమ్మతులు..
మనుషులకు మాలిమి అయిన జంతువుల్లో ఏనుగులు ప్రత్యేకమైనవి. రాచరికాలు వర్ధిల్లిన కాలంలో రాజ్య రక్షణ కోసం ఉపయోగపడే చతురంగ బలాల్లో గజబలం కీలకమైనది. భావోద్వేగాలను అనుభూతి చెందడంలోను, వాటిని ప్రకటించడంలోను ఏనుగుల ప్రవర్తన దాదాపుగా మనుషులను పోలి ఉంటుంది. సాటి ఏనుగుల పట్లనే కాదు, తమను మాలిమి చేసుకునే మనుషుల పట్ల కూడా ఏనుగులు భావోద్వేగాలను వ్యక్తం చేస్తాయి.ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. తమకు నేస్తాలుగా ఉన్న ఏనుగులను చూసినప్పుడు సంతోషంగా చెవులు విప్పార్చడం, తోక ఊపడం, శరీరాన్ని కదిలించడం వంటి చర్యల ద్వారా పలకరిస్తాయి. చాలాకాలం తర్వాత కనిపించినట్లయితే, పట్టరాని సంతోషంతో ఘీంకారనాదం చేస్తాయి.నేస్తాలైన ఏనుగులు ఎదురెదురుగా తారసపడినప్పుడు ఒకదానికొకటి తొండాలను పెనవేసుకుని తమ ఆత్మీయతను వ్యక్తం చేస్తాయి. వేర్వేరు దారుల్లో వెళుతున్న మగ ఏనుగులు తమ నేస్తాలను శరీరాన్ని తాకించుకుని పలకరించుకుంటాయి.ఏనుగులు ఒకదానితో మరొకటి సంభాషించుకుంటాయి. ఆకలి వేసినప్పుడు గున్న ఏనుగులు తమ చేష్టల ద్వారా తల్లులకు ఆ సంగతి చెబుతాయి. అల్లరిని వారించినప్పుడు అలుగుతాయి. గున్నటేనుగులు అలిగినప్పుడు ఎక్కడివక్కడే ఆగిపోయి, ఘీంకారంతో పిలిచే తల్లుల వెంట వెంటనే వెళ్లకుండా హఠం చేస్తాయి. తల్లి ఏనుగు మెల్లగా బుజ్జగిస్తేనే అవి మళ్లీ దారిలోకి వస్తాయి.ఈడొచ్చిన మగ ఏనుగులు తాము జతకట్టదలచుకున్న ఆడ ఏనుగులను ఆకర్షించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాయి. వాటితో సల్లాపాలడతాయి. ఏనుగులు జత కట్టిన తర్వాత కుటుంబాన్ని ఏర్పరచుకుంటాయి. కుటుంబాన్ని కాపాడుకునేందుకు గుంపుగా సంచరిస్తుంటాయి.వివిధ సందర్భాల్లో ఏనుగులు వ్యక్తం చేసే భావోద్వేగాలకు సంబంధించిన ప్రవర్తనలను తెలుసుకోవడానికి వియన్నా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రత్యేక అధ్యయనం చేపట్టారు. ఆఫ్రికా అడవుల్లో చేపట్టిన ఈ అధ్యయనంలో వారు ఏనుగుల భావోద్వేగ ప్రకటనలకు సంబంధించి 1,282 రకాల ప్రవర్తనలను గుర్తించారు.ఏనుగులు కూడా మనుషుల మాదిరిగానే ఆత్మీయులను కోల్పోయినప్పుడు దుఃఖిస్తాయి. ఏనుగులు తమ ఆత్మీయులను ఒక పట్టాన మరచిపోలేవు. మరణించిన ఏనుగు కళేబరం చుట్టూ చేరి మిగిలిన ఏనుగులు కన్నీరు కారుస్తూ రోదిస్తాయి. కళేబరాన్ని క్రూరజంతువులు పీక్కు తినకుండా కాపలాగా ఉంటాయి. చుట్టూ మట్టి ఉన్నట్లయితే, మరణించిన ఏనుగు కళేబరాన్ని మిగిలిన ఏనుగులు పూడ్చి పెడతాయని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు చెప్పుకొనే కథలు వాస్తవమేనని పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు తేల్చారు. -
పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్.. ఆమె తండ్రిపై కేసు ఫైల్
ముంబై: దేశంలోనే వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా పూజా తండ్రి దిలీప్ ఖేద్కర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పూణే కలెక్టరేట్లో ఓ ఉద్యోగి ఫిర్యాదు మేరకు దిలీప్ ఖేద్కర్పై నమోదైంది.వివరాల ప్రకారం.. ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్కు కలెక్టర్గా పోస్టింగ్ వచ్చిన సమయంలో ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ హంగామా క్రియేట్ చేశారు. పూణేలోకి కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన ఆయన.. అక్కడి పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. ఆఫీసులో ఉన్న సిబ్బందిని బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా తన కూతరు పూజా ఖేద్కర్కు క్యాబిన్ కేటాయించాలని డిమాండ్ చేసినట్టు కలెక్టరేట్కు చెందిన తహసీల్దార్ దీపక్ అకాడే తెలిపారు. ఇక, ఈ విషయమై అకాడే పోలీసులకు దిలీప్ ఖేద్కర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.Maharashtra | A case has been registered against Dilip Khedkar - father of former IAS trainee officer Puja Khedkar under IPC sections 186, 504 and 506 at Bundgarden Police station last night: DCP Smarthna Patil, Pune PoliceWhile Puja Khedkar was posted at the Pune Collector's…— ANI (@ANI) August 9, 2024మరోవైపు.. ఇప్పటికే పూజా ఖేద్కర్ పేరెంట్స్ పలు వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఓ భూవివాదం వ్యవహారంలో పూజ తల్లి మనోరమ కొందరిని గన్తో బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో ఆమెపైనా పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. తాజాగా ఆమె తండ్రిపై కేసు నమోదైంది.ఇదిలా ఉండగా.. పూణే ఖేద్కర్ ఎపిసోడ్లో తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం పలు మలుపులు తిరిగింది. చివరకు ఆమె తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందినట్టు తేలడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూజా ఖేద్కర్ ఎంపికను రద్దు చేసిన విషయం విధితమే. -
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీక్.. 17 మందికి అస్వస్థత
పుణె: అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో మహారాష్ట్ర పుణె జిల్లాలోని ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లోని 17 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భంద్గావ్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఓ యూనిట్లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఈ యూనిట్ను నిత్యం 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను ఉంచడానికి అమ్మోనియా గ్యాస్ను ఉపయోగించాల్సి ఉంటుంది. అది ప్రమాదవశాత్తూ లీకైంది.ప్రమాద సమయంలో యూనిట్లో 25 మంది పనిచేస్తున్నారని.. వీరిలో చాలా మంది మహిళలేనని పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణ్ దేశ్ముఖ్ తెలిపారు. లీకైన తర్వాత అమ్మోనియా రెగ్యులేటర్ను వెంటనే ఆఫ్ చేసినట్లు వివరించారు. బాధిత కార్మికులను వేగంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించామని.. అక్కడ వారు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.అయితే గ్యాస్ లీక్ పాయింట్కు దగ్గరగా ఉన్న ఓ మహిళకు మాత్రం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని.. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు ధ్రువీకరించారని దేశ్ముఖ్ వెల్లడించారు. -
పుణె నగరానికి వరద ముప్పు.. ‘ఐఎండీ’ హెచ్చరిక
ముంబయి: మహారాష్ట్రలోని పుణె నగరానికి వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరించింది. భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నందున పుణెకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో రెండు టీమ్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పుణె, చించ్వాడ్,బలివాడిలో సిద్ధంగా ఉంచారు.పుణె, పింప్రి చించ్వాడ్ నగరాల్లోని పౌరులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఆయా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కోరారు. రెండు నగరాల్లోని డ్యాముల నుంచి నీటిని కిందకు వదులుతుండటంతో వరదలు పోటెత్తే అవకాశముంది.డిప్యూటీ సీఎం అజిత్పవార్ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ముంబైలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో నగరానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ముంబైలో దట్టమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
వీడియో: సెల్ఫీ తెచ్చిన తంటా.. యువతి పరిస్థితి విషమం!
ముంబై: సెల్ఫోన్లలో సెల్ఫీలు తీసుకునే సందర్భంగా ఎన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ కొందరు మాత్రం మారడం లేదు. సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేందుకు తమ ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. తాజాగా ఓ యువతి సెల్ఫీ తీసుకునే క్రమంలో లోయలో పడిపోయింది. దీంతో, అతి కష్టం మీద ఆమెను కాపాడారు.కాగా, పూణేకు చెందిన ఒక టీమ్ థోస్గర్ జలపాతాన్ని చూసేందుకు అక్కడకి చేరుకున్నారు. ఈ క్రమంలో వారిలో ఒక్కరైన నస్రీన్ అమీర్ ఖురేషీ(29) సెల్ఫీ దిగుతున్నారు. ఈ క్రమంలో కొండ చివరన సెల్ఫీ దిగే ప్రయత్నం చేయడంతో ఆమె 60 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. దీంతో, అప్రమత్తమైన హోంగార్డ్, స్థానికులు ఆమెను రక్షించారు. ఇక, నస్రీన్ లోయలో పడిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కింద నుంచి ఆమెను పైనకి తీసుకువస్తున్న సమయంతో గాయాల కారణంగా పెద్దగా అరుస్తూ కన్నీరుపెట్టుకుంది.#Pune girl taking #selfie falls into 60-foot gorge. The girl was rescued with the help of the Home Guard and local residents. The incident occurred amidst #heavyrain in the region. The girl was successfully pulled out of the gorge & immediately admitted to hospital in #Satara. pic.twitter.com/DSde9iMLJX— E Global news (@eglobalnews23) August 4, 2024 ఆమెకు గాయాలు కావడంతో సతారాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా సతారా జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, థేఘర్ సహా జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, తాజా ప్రమాదం సందర్బంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పర్యాటక ప్రాంతాలు, జలపాతాలను కొద్దిరోజులు మూసివేయాలని జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి ఆదేశించారు. -
పూజా ఖేద్కర్కు యూపీఎస్సీ షాక్.. అన్ని పరీక్షల నుంచి శాశ్వత డిబార్
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ప్రొవిజినల్ అభ్యర్ధిత్వాన్ని యూపీఎస్సీ కమిషన్ రద్దు చేసింది. అదే విధంగా భవిష్యత్తులోనూ కమిషన్ నిర్వహించే ఏ ఇతర పరీక్షలకు హాజరు అవ్వకుండా ఆమెపై నిషేధం విధించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్ఈ) నిబంధనలను ఉల్లంఘించినందుకు పూజా దోషిగా తేలినట్లు నిర్ధారించిన కమిషన్ ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.కాగా పూజా ఖేద్కర్కు 18 జూలైగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జూలై 25 లోపు సమాధానం చెప్పాలని కోరింది. అయితే ఆమె ఆగస్టు 4 వరకు సమయం కావాలని కోరగా.. యూపీఎస్సీ జూలై 30 వరకు డెడ్లైన్ విధించింది. ఇదే చివరి అవకాశం అని కూడా స్పష్టం చేసింది. గడువులోగా స్పందన రాకపోతే చర్యలు తీసుకునే విషయంపై కూడా యూపీఎస్సీ ఆమెకు వెల్లడించింది. ఇక నిర్ణీత సమయంలో వివరణ ఇవ్వడంతో పూజా విఫలమవ్వడంతో ఆమె ప్రొవిజినల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.యూపీఎస్సీ పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ అవకాశాలు వాడుకొని ఆమె నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించామని గతంలో కమిషన్ పేర్కొంది. సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత పొందడం కోసం తప్పుడు పత్రాల సమర్పణ, అంగ వైకల్యం, మానసిక వైకల్యాల గురించి అబద్దాలు చెప్పడమే కాకుండా సాధారణ కేటగిరీలో అనుమతించిన ఆరు కంటే ఎక్కువ సార్లు పరీక్ష రాసినట్లు తెలిపింది. .తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటోగ్రాఫ్/సంతకం, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, చిరునామాకు సంబంధించిన పత్రాలన్నీ మార్చడం ద్వారా మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడినట్లు వివరించింది. పుణెలో అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సర్కార్ ఆమెను మరో చోటుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆమె వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తుంది. యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సమర్పించడం, మెడికల్ టెస్టులకు హాజరు కాకపోవడం బయటపడింది. దీంతో పూజా ఐఏఎస్ ఎంపికను రద్దు చేస్తూ యూపీఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఖేద్కర్ తండ్రి ప్రభుత్వ మాజీ అధికారి దిలీప్ ఖేద్కర్పై పలు అవినీతి ఆరోపణల కేసులు నమోదయ్యాయి. ఖేద్కర్ తల్లి మనోరమ కూడా భూ వివాదం కేసులో రైతలను తుపాకీతో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవ్వడంతో ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు ఫీసర్ పూజా ఖేద్కర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. -
పూజా కేద్కర్ కేసు: రిపోర్టు సమర్పించిన ఏకసభ్య కమిటీ
ఢిల్లీ: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా కేద్కర్ అధికార దుర్వినియోగం, యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్లు సమర్పించటం వంటి ఆరోపణలపై దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. తాజాగా ఆ కమిటీ దర్యాప్తు నివేదికను డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ)కు అందజేసింది. డీఓపీటీ అడిషనల్ సెక్రటరీ మనోజ్ ద్వివేది ఈ కేసులోని అన్ని కోణాల్లో విచారణ జరిపారు. అయితే ఈ రిపోర్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.చదవండి: యూపీఎస్సీపై మరక తొలగేదెలా?ట్రైనీ అయినాసరే జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకూ అధికారిక సదుపాయాలు, వసతులు కల్పించాలని డిమాండ్చేయడంతో పూజ వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీస్ను కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్చేయడంతోపాటు సొంత ఖరీదైన కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని తిరిగారు. దీంతో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిమ్ జిల్లాలో సూపర్న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది.మరోవైపు.. ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్లో ఆలిండియా 821వ ర్యాంక్ సాధించారని మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో యూపీఎస్సీకి ఆమె సమర్పించిన వైకల్యం సర్టీఫికెట్లు, అఫిడవిట్ల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ విషయంలో నిజానిజాలను నిగ్గుతేల్చాలని కేంద్రప్రభుత్వ ఏకసభ్య కమిటీని నియమించింది.చదవండి: పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ -
జలదిగ్బంధంలో ముంబై, పూణే.. స్కూల్స్ బంద్
ముంబై: మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడం, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇక, పూణే, థానే, పాల్ఘర్ నగరాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నేడు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు, ముంబై, పూణే, సహ పింప్రి, చించ్విడ్ నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాల కారణంగా ముంబైకు పలు విమాన సర్వీసులు రద్దు అయినట్టు తెలుస్తోంది. Railway tracks on Vikhroli station. Travel only if there's an emergency. #MumbaiRains#MumbaiRains pic.twitter.com/9ZlnrC3QRW— Shakib (@MohdShakib98513) July 25, 2024 మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు. This is the Indrayani river overflowing at Alandi today.Crazy, scary videos being shared from all across Pune by people!Hope the rains mellow down soon. pic.twitter.com/ixv3UYv1WD— Urrmi (@Urrmi_) July 25, 2024 జలదిగ్భంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలో శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించట్లేదు. దీంతో 11 విమానాలను రద్దుచేశారు. కొన్నింటిని వేరే నగరాలకు దారి మళ్లించారు. This is how it looks like in our locality.. #PuneRains #Pune pic.twitter.com/wEpiRj8a1t— 🎼🎵🌝 𝒟𝒾𝓋𝓎𝒶 𝒮 🇮🇳 🌝🎵🎼 (@_MyInspirationz) July 25, 2024 -
‘మహా’వృష్టి
ముంబై: మహారాష్ట్రలోని పలు జిల్లాలపై వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ముంబై మహానగరంసహా థానె, పుణె, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయందాకా ఎడతెగని వానలతో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భీకరవర్షాలకు ఆయా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు. జలదిగ్భంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలోనూ వానలు ముంచెత్తాయి. సిటీ లోని శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించట్లేదు. దీంతో 11 విమానాలను రద్దుచేశారు. కొన్నింటిని వేరే నగరాలకు దారి మళ్లించారు. -
Heavy Rains: ‘రెడ్ అలెర్ట్’లో ముంబై.. కరెంట్ షాక్తో ముగ్గురి మృతి
మహారాష్ట్రను భారీ వర్షాలు బెంబేలెతిస్తున్నాయ్. రాష్ట్ర రాజధాని ముంబైతోపాటు, పుణె, థానె, కొల్హాపూర్ వంటి మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలుచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబై, పుణె వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ జీవితం స్తంభించిపోయింది. స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. పుణె పింప్రి-చించ్వాడ ప్రాంతంలో అనేక అపార్ట్మెంట్లోకి వరద నీరు చేసింది. కాగా డెక్కన్ జింఖానా ప్రాంతంలో నీటితో నిండిన వీధుల్లో వీధిలో నడుస్తుండగా ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అభిషేక్ ఘనేకర్, ఆకాష్ మానే, శివ పరిహార్ వీధి వ్యాపారులు ప్రాణాలు కోల్పోయారు.This city needs prayers today 🙏#MumbaiRains pic.twitter.com/1XRK582CRr— Nikita Dutta (@nikifyinglife) July 25, 2024> ముంబై, థానే వంటి పొరుగు ప్రాంతాలు కూడా భారీ వర్షాల కారణంగా అల్లాడిపోతున్నాయి. అంధేరి, సియోన్, చెంబూర్, కుర్లా, థానేలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబయిలోని అంధేరి సబ్వే వరద నీరు కారణంగా మూతపడింది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో విహార్ సరస్సు, మోదక్ సాగర్ సరస్సు నేడు తెల్లవారుజామున పొంగిపొర్లుతున్నాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. రంగంలోకి దిగిన జాతీయ విపత్తు ప్రదిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) మూడు బృందాలతో సహాయక చర్యల్లో పాల్గొంది.కుండపోత వర్షాలతోనీటి మట్టం పెగిఠా నదిపై ఉన్న బాబా భిడే వంతెన నీటిలో మునిగిపోయింది. అదే విధంగా ఖడక్వాస్లా డ్యాం పూర్తి స్థాయికి చేరుకుంది. ముఠా నది ఒడ్డున నివసించే ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొల్లాపూర్లో పంచగంగ నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నదికి సమీపంలోని ప్రాంతాల ప్రజలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సహాయం చేస్తోంది.🌧️ 𝗣𝘂𝗻𝗲 𝗪𝗲𝗮𝘁𝗵𝗲𝗿 𝗔𝗹𝗲𝗿𝘁 🌧️ •Schools, private offices, tourist places shut down, 4 dead in rain-related incidents.•It's been raining continuously in pune for the last 12 hours.🌧️⛈️#PuneRains #MumbaiRains pic.twitter.com/Iw3ZPWFZHd— RAJA👑 (@SWAPNIL_2211) July 25, 2024 ముంబైలో కూడా పరిస్థితి భయంకరంగా మారింది. 150 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇది జూలైలో రెండవ అత్యంత ఎక్కవగా రికార్డైంది. శుక్రవారం ఉదయం వరకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లనుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. భారీ వర్షాల మధ్య ముంబైకి వెళ్లే కొన్ని విమానాలు ఆలస్యం కానున్నాయని, కొన్నింటిని దారి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు తెలియజేసింది. This is how #MumbaiRains look from a flight! 😻 https://t.co/QrPE5X9lGO pic.twitter.com/FvnIGjjTC0— WabiSabi (@Geeky_Foodie) July 20, 2024రాష్ట్రంలో పరిస్థితిపై ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సమీక్ష చేపట్టారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాలను 48 గంటల పాటు మూసివేయాలని పుణె కలెక్టర్ సుహాస్ దివాసే ఆదేశించారు. మునిగిపోయే ప్రమాదం ఉన్న వంతెనలపై ట్రాఫిక్ను నిషేధిస్తామని చెప్పారు. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని కోరారు. -
మాయమైన తండ్రి.. ప్రభుత్వ ప్రకటనలో కనిపించగానే..
అది 2021 డిసెంబర్ నాటి ఘటన. మహారాష్టలోని పూణేలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. 63 ఏళ్ల దత్తాత్రేయ విష్ణు తాంబే ఇంటికి దూరమయ్యాడు. అతను ఎక్కడకు వెళ్లాడనే విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదు. అతనికోసం తెలిసిన అన్నిచోట్లా గాలించారు. విసిగివేసారి ఏదోఒక రోజు అతనే ఇంటికి తిరిగి వస్తాడని భావిస్తూ, కుటుంబసభ్యులు కాలం గడుపుతున్నారు.అయితే తాజాగా విష్ణు తాంబే కుటుంబ సభ్యులకు ఆనందం కలిగించే వార్త వినిపించింది. దత్తాత్రేయ విష్ణు తాంబే అధికార శివసేన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని ఒక ప్రకటనలో కనిపించడం అతని కుటుంబ సభ్యులకు ఆనందం కలిగింది. శివసేన ఇన్స్టా ఖాతాలోని ప్రకటనలో కనిపిస్తున్నది దత్తాత్రేయ విష్ణు తాంబే అని అతని కుటుంబం తెలిపింది.వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ‘మహాయుతి’ ప్రభుత్వం ఇటీవల ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలకు వెళ్లేందుకు సీనియర్ సిటిజన్లకు రూ.30,000 వరకు సబ్సిడీ అందించనున్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంపై జోరుగా ప్రచారం సాగిస్తోంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం దత్తాత్రేయ విష్ణు తాంబే కుమారుడు భరత్ ఇటీవల శివసేన ప్రకటనను చూసి షాక్ అయ్యాడు. దానిని ఒక స్నేహితుడు తనకు వాట్సాప్లో పంపాడని తెలిపారు. షిక్రాపూర్లో తినుబండారాల దుకాణం నడుపుతున్న భరత్ మాట్లాడుతూ ‘ఆ స్క్రీన్షాట్ చూశాను. నేను వెంటనే నమ్మలేకపోయాను. ప్రభుత్వ తీర్థ దర్శన్ పథకం ప్రకటనలో మా నాన్న కనిపించారు’ అని అన్నారు.కాగా తమ తండ్రిని తమను కలపాలని భరత్ సీఎం షిండేను కోరారు. తమ తండ్రి సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నాడని తెలుసుకుని తామంతా సంతోషపడుతున్నామన్నారు. షిక్రాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దీపారాతన్ గైక్వాడ్ మాట్లాడుతూ భరత్ తమను సంప్రదించి, తన తండ్రి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారన్నారు. డీఎస్పీ ప్రశాంత్ ధోలే మాట్లాడుతూ తాము దత్తాత్రేయ విష్ణు తాంబే కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు, వారు గతంలో చాలాసార్లు దత్తాత్రేయ విష్ణు తాంబే తమకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయేవాడని, తరువాత తనంతట తానే తిరివచ్చేవారని పేర్కొన్నారన్నారు. దత్తాత్రేయ విష్ణు తాంబే చివరిసారిగా 2021, డిసెంబర్లో కరోనా సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయాడు. అతను ఏదో ఒకరోజు తిరిగివస్తాడని భావించి కుటుంబ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. -
రెండున్నర కిలోమీటర్లు.. మహిళను వెంబడించి..
పూణే : ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సరదాగా గడిపేందుకు స్కూటీ మీద ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నారు. అయితే జాతీయ రహదారి మీద వెళ్తున్న ఆమె స్కూటీని ఓ కారు సుమారు రెండున్న కిలోమీటర్లు వెంబడించింది. తన కారు వెళ్లేందుకు దారి ఇవ్వలేదనే నెపంతో స్కూటీని అడ్డుకున్నారు. అనంతరం కారులో నుంచి దిగిన భార్య, భర్తలు సదరు మహిళపై దాడికి దిగారు. పిడుగుద్దులు గుద్దుతూ దూర్బుషలాడారు. అక్కడి నుంచి పరారయ్యారు.పూణే పోలీసుల కథనం ప్రకారం.. పూణేలో నివాసం ఉండే జెర్లిన్ డిసిల్వా కంటెంట్ క్రియేటర్గా, మార్కెటింగ్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో శనివారం తన ఇద్దరు పిల్లలతో స్కూటీ మీద పాషన్-బానర్ లింక్ రోడ్డు మీద వెళ్తున్నారు. ఆ సమయంలో డిసిల్వా స్కూటీని కారు యజమాని స్వప్నిల్ కేకరేలు రెండున్న కిలోమీరట్లు వెంబడించారు. స్కూటీని ఆపేశారు. View this post on Instagram A post shared by Jerllyyn || Pune Content Creator (@jerlyndsilva) అనంతరం కారులో నుంచి దిగిన స్వప్నిల్ కేకరే దంపతులు డిసిల్వాను జుట్టు పట్టుకుని ఈడ్చారు. పిల్లలు ఎదురుగా ఉన్న పట్టించుకోకుండా భర్త బాధితురాలిపై పిడుగులు గుద్దారు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.ముక్కు నుంచి రక్తం దారాళంగా కారుతుండగా డిసిల్వా తనపై జరిగిన దాడిని వివరిస్తూ వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డిసిల్వా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నెంబర్ ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా డిసిల్వా మాట్లాడుతూ.. జాగ్రత్తగా ఉండండి. ఈ నగరం ఎంత సురక్షితంగా ఉందో చూడండి? ప్రజలు ఉన్మాదుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అని ప్రశ్నించారు. డిసిల్వా మేనమామ విశాల్ సంఘటన జరిగిన తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి కారణం లేకుండా నిందితుడు తనపై దాడి చేశాడని చెప్పారు.తన మేనకోడలు స్కూటీ ఆ కారును ఢీకొట్టలేదు. అయినా కారణం లేకుండా దాడి చేశాడు. తానెంత శక్తివంతుడినో చూపించడానికి అతను అలా చేసి ఉండవచ్చు. స్వప్నిల్కేకరే’తోపాటు ఆయన భార్య ఉంది. కానీ ఆమె దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పూజా ఖేద్కర్ ఇంటిపై బుల్డోజర్ చర్య
ట్రైయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. అధికార దుర్వినియోగం, అధికారులపై బెదిరింపులు, సివిల్స్ ఎంపిక విషయంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించడం, వయసు వ్యత్యాసం, ఫేక్ అడ్రస్.. ఇలా ప్రతిచోటా అధికారులను మభ్యపెట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.తాజాగా పూజా ఖేద్కర్ కుటుంబానికి చెందిన పుణెలోని నివాసంపై అధికారులు బల్డోజర్ చర్య పేపట్టారు. ఆమె నివాసం ఇంటికి ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాలను పుణె మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్తో కూల్చేసింది. ఇంటి ముందున్న ఫుట్పాత్ను ఆక్రమించి చెట్లు, పూల మొక్కలు పెంచారు. దీనిపై దీనికి సంబంధించి పీఎంసీ ఇప్పటికే నోటీసులు ఇచ్చినా ఆ కుటుంబం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అధికారులు వెల్లడించారు. #WATCH | Maharashtra: Action being taken against illegal encroachment at IAS trainee Pooja Khedkar's Pune residence. pic.twitter.com/xvBQhxxtIO— ANI (@ANI) July 17, 2024 కాగా పుణెలో అదనపు కలెక్టర్గా శిక్షణా విధులు నిర్వర్తిస్తున్న పూజా ఖేద్కర్ బ్యూరోక్రాట్గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రొబేషన్లో రెండేళ్లపాటు ఉండే ఐఏఎస్లకు ఈ సౌకర్యాలు ఉండవు. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసిమ్కు బదిలీ చేసింది. మరోవైపు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022 ఏప్రిల్లో తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు తప్పించుకు వచ్చారు. చివరికి ఆరోసారి పిలవగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది.ఇక తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పూజా ఖేడ్కర్ ఎంబీబీఎస్లో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. నాన్ క్రిమీలేయర్ ఓబీసీ ధ్రువీకరణపత్రంతో పుణెలోని ఓ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందారని తెలిసింది. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. దీనిని మెడికల్ కాలేజీ కూడా ధ్రువీకరించింది.పూజాపై వివాదాలు ముదరడంతో ప్రభుత్వం ఆమెపై చర్యలు మొదలుపెట్టింది. ఆమెను శిక్షణ విధుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
మరో మలుపు తిరిగిన పూజా ఖేద్కర్ వ్యవహారం
ముంబై: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పుణే జిల్లా కలెక్టర్ సుహార్ దివాసే తనను వేధించారంటూ వాశిం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఓ అధికారి ధృవీకరించారు. మహిళా పోలీసులు సోమవారం వాశింలోని ఖేద్కర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమె పుణే కలెక్టర్ సుహాస్ దివాసేపై ఫిర్యాదు చేశారు అని ఆ అధికారి తెలిపారు. అయితే.. గత రాత్రి 11 గం. సమయంలో ముగ్గురు మహిళా పోలీస్ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి 1గం. టైంలో వెళ్లిపోయారు. పోలీసులు ఎందుకు వచ్చారనే దానిపై నిన్న మీడియా ముందు పూజా ఖేద్కర్ మరోలా స్పందించారు. తనకు పని ఉండి మహిళా పోలీసులను తానే పిలిచానని ఆమె చెప్పారు. అయితే ఆ పని ఏంటన్నది మాత్రం ఆమె చెప్పలేదు. ట్రెయినింగ్లో ఉంటూనే పూజా ఖేద్కర్ గొంతెమ్మ కోర్కెలు కోరడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ఆరోపణలపై ఆమెను వాశింకు బదిలీ చేసింది కలెక్టర్ సుహార్ దివాసే. మరోవైపు ఆమె శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ.. రీకాల్ ఆదేశాలు జారీ చేసింది ముస్సోరీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. తక్షణమే ఆమెను వెనక్కి రావాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఆమెపై చర్యల కోసమే ఆ ఉత్తర్వులు వెలువడి ఉంటాయనే చర్చ నడుస్తోంది. -
అలా నన్ను దోషిగా తేల్చడం తప్పు!: పూజా ఖేద్కర్
ముంబై: తన వివాదాలు ముసురుకుంటున్న వేళ.. ట్రెయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ మీడియా ముందు పెదవి విప్పారు. దోషిగా నిరూపితం అయ్యేంత వరకు అందరూ నిర్దోషులేనని, కేవలం మీడియా కథనాల ఆధారంగా తనను దోషిగా తేల్చేయడం తప్పని అన్నారామె. శిక్షణలోనే ఉండగానే గొంతెమ్మ కోర్కెల ద్వారా బదిలీ ఉత్తర్వులతో వార్తల్లోకి ఎక్కిన 34ఏళ్ల ఈ ఐఏఎస్.. చివరకు తప్పుడు సర్టిఫికెట్లతో, అక్రమ మార్గంలో సివిల్ సర్వీస్లో చేరారంటూ సంచలన అభియోగాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వ్యవహారంపై కేంద్రం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిటీ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు పూజతో పాటు ఆమె కుటుంబ సభ్యుల భాగోతాలంటూ అక్కడి మీడియా ఛానెల్స్ రోజుకో కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ ఆమె మీడియాతో తొలిసారి ముఖాముఖి మాట్లాడారు. ఒక వ్యక్తి దోషిగా తేలేంతవరకు నిర్దోషినే. అలా అని మన రాజ్యాంగమే చెప్పింది. కేవలం మీడియా తన కథనాల ద్వారా నన్ను దోషిగా చూపించడం సరికాదు. అవి ఆరోపణలు అని మీరు చెప్పొచ్చు. కానీ, ఇలా నన్ను దోషిగా చూపించడం మాత్రం ముమ్మాటికీ తప్పు అని అన్నారామె. #WATCH | Maharashtra: Trainee IAS officer Puja Khedkar says "I will testify in front of the expert committee and we will accept the decision of the committee...I do not have the right to tell you whatever investigation is going on. Whatever submission I have, will become public… pic.twitter.com/vsGISCyRho— ANI (@ANI) July 15, 2024నిపుణుల కమిటీ ముందు వాంగ్మూలం ఇస్తాను. ఏం విచారణ జరుగుతోందో బహిరంగంగా వెల్లడించే హక్కు నాకు లేదు. కానీ, కమిటీ తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారామె. తనపై వస్తున్న ఆరోపణలపై ఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థకు వాట్సాప్ సందేశాల ద్వారా స్పందించిన ఆమె.. తర్వాత నేరుగా మీడియా ముందుకే వచ్చి స్పందిస్తున్నారు. -
పూజా ఖేద్కర్ తల్లిదండ్రులపై కేసు నమోదు
ముంబై: భూమి విషయంలో ఓ రైతును గన్తో బెదిరించిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లింద్రులపై కేసు నమోదు చేసినట్లు పుణె పోలీసులు తెలిపారు. పూజా ఖేద్కర్ తల్లిదండ్రులతో సహా 7 మందిపై కేసు ఫైల్ చేశామని తెలిపారు. పూజా తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని, వారి ఫోన్లు కూడా స్విచ్ఆఫ్ వస్తున్నాయని పేర్కొన్నారు.‘‘నిందితులు పరారీలో ఉన్నారు. వారి కాంటాక్ట్ కోసం ప్రయత్నించాం. కానీ, ఫోన్లను స్విచ్ఆఫ్ చేసుకున్నారు. వారి ఇంటి దగ్గరకి వెళ్లినా అక్కడ కూడా వారు లేరు. పోలీసుల బృందాలు పూజా ఖేద్కర్ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నాం. ట్రైనీ ఐఏఎస్ పూజా తల్లిదండ్రుల కోసం పలు పోలీసు టీంలు, లోకల్ క్రైం బ్రాంచ్ అధికారులు పుణెతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు. వారిని పట్టుకున్న తర్వాత విచారించి, చర్యలు తీసుకుంటాం’ అని ’అని పుణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్ తెలిపారు.తనకు ప్రాణహానీ ఉందని స్థానిక రైతు ఫిర్యాదు చేయటంతో పూజా ఖేద్కర్ తల్లిదండ్రులు మనోరమ, దిలీప్ ఖేద్కర్తో సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ముల్షి తాలుకాలోని ఓ గ్రామంలో ఒక రైతుపై గన్తో బెదిరింపులకు దిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ఈ ఘటన జూన్, 2023న చోటు చేసుకోగా.. తాజాగా ఆయుధ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూజా తల్లి మనోహర కేవలం ప్రాణరక్షణ కోసమే గన్ పట్టుకున్నారని వారి తరఫున న్యాయవాది తెలిపారు. ఆమె వద్ద ఉన్న గన్కు లైసెన్స్ కూడా ఉందని చెప్పారు. -
పూజా ఖేద్కర్ ఎపిసోడ్: ‘నా కూతురు ఏ తప్పూ చేయలేదు’
ముంబై: ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారనే ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. ఆమెపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్రం ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించి పలు వివాదాస్పద విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు.. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. తాజాగా శనివారం పూజా ఖేద్కర్పై వచ్చిన ఆరోపణలపై ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ మీడియా ముందుకు వచ్చి ఖండిచారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తన కూతురిని వేధింపులకు గురిచేయడానికే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒక మహిళా అధికారిణిగా ఆఫీసులో కూర్చుకోవడానికి స్థలం ఇవ్వాలని కోరటం తప్పుకాదని తన కూతురు వ్యవహారించిన తీరును సమర్థించారు. ‘నా కూతురు ( ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్) ఎటువంటి తప్పు చేయలేదు. ఒక మహిళగా ఆఫీసులో కూర్చుకోవడానికి స్థలం ఇవ్వాలని కోరటం తప్పా?. ఈవ్యవహారంపై విచారణ జరుగుతోంది. విచారణకు సంబంధించి పూర్తి తీర్పు వెలువడేవరకు వేచిచూద్దాం. నేను మాత్ర ఒక్కటి చెప్పగలను. నా కూతురు పూజా ఖేద్కర్ను వేధింపులకు గురిచేయటం కోసమే ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు’ అని దిలీప్ ఖేద్కర్ అన్నారు. అయితే పూజా ఖేద్కర్పై ఎవరు కావాలని ఆరోపణలు చేస్తున్నారన్న వారి పేర్లు మాత్రం ఆయన బయటపెట్టకపోవటం గమనార్హం. గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కింది. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్ప్లేటు ఏర్పాటుచేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్తో అధికారిక ఛాంబర్ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్ప్లేట్ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్గా వినియోగించుకొన్నారు. వాస్తవానికి ప్రొబేషన్లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.వాస్తవానికి ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా తాజాగా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు. అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెను పుణె నుంచి వాసిమ్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు. -
పూజా ఖేద్కర్పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..
ముంబై: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కెరియర్ చిక్కుల్లో పడింది. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉంది.డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేదీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. రెండు వారాల్లో ఆయన ఆమె వ్యవహారంపై ఓ నివేదిక ఇవ్వనున్నారు. ఒకవేళ ఆ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా నిజాలు దాచిపెట్టి, తప్పుడు మార్గంలో ఉద్యోగంలో చేరినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని తెలిపాయి. మరోవైపు.. తాజాగా ఆమెపై మరో ఆరోపణ వెలుగులోకి వచ్చింది. తన విచారణలో మనోజ్ ద్వివేదీ, నవీ ముంబై పోలీసుల నుంచి ఓ నివేదిక తీసుకున్నారు. ఓ దొంగతనం కేసులో నిందితుడ్ని విడిచిపెట్టాలంటూ ఆమె పోలీసులకు హుకుం జారీ చేశారామె. మే 18వ తేదీన నవీ ముంబై డీసీపీకి ఫోన్ చేసిన ఖేద్కర్.. తాను ఫలానా అని పరిచయం చేసుకున్నారు. ఇనుప సామాన్లు దొంగిలించిన కేసులో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని విడుదల చేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆ నిందితుడు అమాయకుడని, పైగా అతనిపై ఆరోపణలు తీవ్ర స్థాయివేం కాదని ఆమె ఫోన్లో చెప్పారు. అయినప్పటికీ ఆ పోలీసులు ఆ కాల్ను పట్టించుకోలేదు. అయితే ఆ ఫోన్ కాల్ పూజా ఖేద్కర్ నుంచే వచ్చిందా? లేదంటే ఆమె పేరుతో ఎవరైనా అలా చేశారా? అనేది ద్వివేదీ కమిటీ నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే..పుణేలో సహాయ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసిమ్కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం.. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, సెటిల్మెంట్లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటీ బయటపడ్డాయి. చివరికి ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు రేకెత్తాయి. తనకు కంటితో పాటు మానసిక సమస్యలు ఉన్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్లో ఖేద్కర్ పేర్కొన్నారు. 2022 ఏప్రిల్లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరుకాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరు కాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణ పత్రాలపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదికను బట్టే ఖేద్కర్పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
Pooja khedkar: కూతురే కాదు తల్లి కూడా అదే దందా.. వీడియో వైరల్
ముంబై: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రొహిబిషన్ సమయంలో పూర్తి స్థాయి అధికారిగా హల్చల్ చేసిన ఆమె.. ఉన్నతస్థాయి అధికారుల ఆగ్రహానికి గురైన బదిలీ వేటు పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంచలనంగా మారిన ఈమె వ్యవహారంలో మరో రచ్చ మొదలైంది. కూతురే కాదు.. ఆమె తండ్రి, తల్లి చేసిన అరాచకాలు కూడా బయటపడుతున్నాయి.తాజాగా పూజా ఖేద్కర్ తల్లికి చెందిన ఓ వీడియో వివాదస్పదంగా మారింది. అయితే ఇది పాత వీడియోనే అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దిలీప్ ఖేద్కర్... కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. పుణే జిల్లాలోనే ముల్షీ తాలుకాలో ఓ 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు.అయితే పక్కనే ఉన్న రైతుల భూముల్నీ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ స్థలం వద్దే పెద్ద గొడవైంది. రైతులు వ్యతిరేకించడంతో ఎమ్మెల్యే ఖేద్కర్ తల్లి మనోరమా ఖేద్కర్ తన సెక్యూరిటీ గార్డులతో అక్కడకు చేరుకున్నారు. చేతిలో తుపాకీ తీసుకొచ్చిఇ రైతులను బెదిరించారు.గన్ చూపిస్తూ "ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కుడున్నాయో చూపించు" అని బెదిరించింది. అందుకు ఆ వ్యక్తి తన పేరుపైనే ల్యాండ్ రిజిస్టర్ అయ్యుందని, ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని చెప్పాడు. "కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో చూసుకో...నాకే రూల్స్ చెప్పకు" అని తుపాకీతో అతడికి వార్నింగ్ ఇచ్చింది.IAS officer Pooja Khedkar's father, Dilip Khedkar, has allegedly amassed wealth and bought 25 acres in Mulshi tehsil, Pune. The family reportedly tried to encroach on neighboring land, and Pooja's mother, Manorama Khedkar, allegedly threatened farmers with a pistol. Attempts… pic.twitter.com/KlETPBXBmb— Sneha Mordani (@snehamordani) July 12, 2024కాగా ఈ కుటుంబానికి వ్యతిరేకంగా పోలీస్ కేసు పెడదామని చూసినా ఎవరూ సహకరించలేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు పూజే ఖేడ్కర్కి 5 ప్లాట్లున్నాయి. వీటితో పాటు మహారాష్ట్రలో రెండు అపార్ట్మెంట్లు ఉన్నట్లు తేలలింది. వీటి విలువ రూ.22కోట్లు. అహ్మద్నగర్లో రూ.45 లక్షల విలువ చేసే అపార్ట్మెంట్ ఉంది.నింగ్లో ఉండగానే గొంతెమ్మ కోరికలు కోరి వివాదాస్పదమయ్యారు. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె వినియోగించే ఖరీదైన ఆడీ కారుపై ఉన్న 21 చలాన్లు కట్టకుండా పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.26,000. అమె రిక్రూట్మెంట్పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శారీరకంగా, మానసికంగా లోపం ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ చూపించినట్టు తేలింది. మెడికల్ టెస్ట్లు జరగకుండా మేనేజ్ చేసి రిక్రూట్ అయింది. -
పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్
ఢిల్లీ: వివాదాస్పదంగా మారిన ట్రెయినీ ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్కు ఝలక్ తగిలింది. తప్పుడు ధ్రువీకరణలు సమర్పించిందని ఆమెపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏకపక్ష సభ్య కమిటీని నియమించింది. ఆమె ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్ ఇచ్చిందని, కానీ, వాటిని నిర్ధారించేందుకు తప్పనిసరి వైద్య పరీక్షలకు మాత్రం ఆమె డుమ్మా కొట్టినట్లు కథనాలు వచ్చాయి. దీంతో.. నిజనిర్ధారణ కోసం కేంద్రం సింగిల్ మెంబర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు జరిపి.. రెండు వారాల్లో నివేదిక ఇస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) పేర్కొంది. వివాదం ఇదే..గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కింది. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్ప్లేటు ఏర్పాటుచేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్తో అధికారిక ఛాంబర్ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్ప్లేట్ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్గా వినియోగించుకొన్నారు. వాస్తవానికి ప్రొబేషన్లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు. వాస్తవానికి ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా తాజాగా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు. అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెను పుణె నుంచి వాసిమ్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు.నియామకమే వివాదం.. 2022 ఏప్రిల్లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకొన్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకొంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. నాకు అనుమతి లేదు.. వివాదాల నేపథ్యంలో.. ఐఏఎస్ పూజా ఖేద్కర్ తొలిసారి మీడియా వద్ద స్పందించారు. ‘‘నాకు ఈ అంశంపై మాట్లాడటానికి ప్రభుత్వ అనుమతి లేదు. నిబంధనలు అనుమతించవు క్షమించండి. మహారాష్ట్రలోని వాసిమ్లో కొత్త పాత్ర పోషించడం సంతోషంగానే ఉంది’’ అని పేర్కొన్నారు. -
ట్రెయినీ ఐఏఎస్ పూజ వ్యవహారంపై పీఎంవో ఆరా
పుణెలో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా ఖేడ్కర్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. మహారాష్ట్ర కేడర్కు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు నకిలీ అంగవైకల్యం, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)సర్టిఫికేట్లను సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగా.. పూజా ఖేడ్కర్ నియామకం గురించి ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఆరా తీస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.పూజా ఖేడ్కర్ పూణే కలెక్టర్ కార్యాయంలో అధికారిక హోదా కోసం ప్రయత్నించి వార్తల్లో నిలిచారు. ఉన్నతాధికారుల అనుమతిలేకుండా ప్రైవేట్ ఆడి కారును రెడ్ బ్లూ బెకన్ లైట్, వీఐపీ నెంబర్ ప్లేట్ను ఉపయోగించడం, అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఆయన ఛాంబర్ను వినియోగించడంతో వివాదం తలెత్తింది. ఆమె తీరుపై పూణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం ఆమెను పుణె నుంచి వాశిమ్ జిల్లాకు బదిలీ చేసింది. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్గా వ్యవహరించనున్నారుఈ క్రమంలో బుధవారం పీఎంవో కార్యాలయం అధికారులు పూజా ఖేడ్కర్ గురించి పూణే కలెక్టర్ సుహాస్ నుంచి నివేదికను కోరడం మరింత చర్చాంశనీయంగా మారింది. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LSBNAA) లో ఆమె గురించి ఆరా తీసింది. ఆమె పూణె నుంచి వాశిమ్ జిల్లాకు బదిలీ చేయడంపై నివేదిక కోరింది. పూర్తి నివేదికను ఎల్ఎస్బీఎన్ఏఏ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపనుంది.మహరాష్ట్ర చీఫ్ సెక్రటరీ (సీఎస్) సుజాత సౌనిక్ ఆమోదం తర్వాత నివేదిక పంపాలని ఎల్ఎస్బీఎన్ఏఏ డిప్యూటీ డైరెక్టర్ శైలేష్ నావల్ సంబంధిత పరిపాలన విభాగానికి విజ్ఞప్తి చేశారు. -
ట్రైనింగ్లోనే వీఐపీ డిమాండ్లు.. మహిళా ఐఏఎస్ అధికారి బాగోతం ఇది
ఓ మహిళ ట్రైనీ ఐఏఎస్ అధికారిపై మహారాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది.ప్రొబేషనరీ సమయంలోనే సదరు మహిళా అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఆమెను మరో చోటుకు బదిలీ చేసింది.ఆమెనె.. 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా ఖేద్కర్. పుణె నుంచి వాషిమ్కు బదిలీ అయ్యారు. ఇక మిగిలిన శిక్షణ పదవీకాలాన్ని అక్కడే పూర్తి చేయనున్నారు. జూలై 30, 2025 వరకు అక్కడ "సూపర్న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్"గా పనిచేస్తుందని ప్రభుత్వం తమ ఉత్వర్వుల్లో పేర్కొంది. కాగా పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే సీఎస్కు లేఖ రాసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.అసలు ఆమె ఏం చేసిందంటేట్రైనీ అధికారి అయిన ఖేద్కర్.. పుణె కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో అనేక అనుచిత ప్రవర్తనలు పాల్పడినట్లు తేలింది. ఆమె తన ప్రైవేట్ వాహనాన్ని ఉపయోగిస్తూ దానిపై వీఐపీ నంబర్ ప్లేట్ను పెట్టుకుంది. జిల్లా అదనపు కలెక్టర్ అజయ్ మోరే అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయాన్ని కూడా ఆమె ఆక్రమించుకున్నట్లు సమాచారం. ఆయన లేని సమయంలో తన ఛాంబర్ డోర్ మీద పేరుతో బోర్డు ఉంచి ఆ స్థలాన్ని తన స్వంత కార్యాలయ గదిగా మార్చుకుందిఖేద్కర్ అధికారులపై అనేక డిమాండ్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీఐపీ నంబర్ ప్లేట్ కలిగిన అధికారిక కారు, వసతి, తగినంత సిబ్బందితో అధికారిక ఛాంబర్, ఓ కానిస్టేబుల్ కావాలని కోరినట్లు సమాచారం. అయితే నిబంధనల ప్రకారం ట్రైనీకి పైన పేర్కొన్న సౌకర్యాలేవి ఉండవు.అయినా ఖేద్కర్ ఇంతటితో ఆగలేదు. అదనపు కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా కుర్చీలు, సోఫాలు, టేబుల్లతో సహా అన్ని మెటీరియల్లను కార్యాలయం నుంచి తొలగించారు. అనంతరం ఆమె పేరు మీద లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్ప్లేట్, రాజముద్ర, ఇంటర్కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్ను ఆదేశించారు.ఇదిలా ఉండగా యూపీఎస్సీ పరీక్షలో 841 ఆల్ ఇండియా ర్యాంక్) సాధించిన ఖేద్కర,.. రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి కూతురు. తండ్రి కూడా మాజీ ఐఏఎస్ కావడంతో తన కూతురు డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఆయన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కూతురికి ఏదైనా లోటు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించినట్లు సమాచారం -
పోలీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో కుప్పకూలి.. యువకుడు మృతి
ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. పుణెలో జరిగిన పోలీసు రిక్రూట్మెంట్ డ్రైవ్లో కుప్పకూలి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మృతుడిని 27 ఏళ్ల తుషార్ బాబన్గా గుర్తించారు.శివాజీనగర్ ఏరియాలోని పోలీస్ గ్రౌండ్లో శనివారం పోలీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. ఫిజికల్ టెస్ట్లలో భాగమైన పరుగు పందెంలో పరుగెత్తుతూ అహ్మద్ నగర్లోని సంగమ్నేర్కు చెందిన తుషార్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడువెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ప్రాథమిక విచారణలో యువకుడికి గుండెపోటు వచ్చినట్లు తేలిందని, దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. -
జికా వైరస్ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
మహారాష్ట్రలో జికా వైరస్ కేసులో ఆందోళన రేపుతున్నాయి. పుణెలో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారిలో ఇద్దరు గర్బిణీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రలో జికా వైరస్ కేసుల పెరుగుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది. నిరంతరం వైరస్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. జికా వైరస్ పాజిటివ్గా పరీక్షించిన తల్లుల పిండాల పెరుగుదలను పర్యవేక్షించడం ద్వారా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది.బాధిత గర్భిణీ స్త్రీ పిండంలో జికా మైక్రోసెఫాలీ నాడీ సంబంధిత పరిణామాలతో సంబంధం కలిగి ఉన్నందున, పర్యవేక్షణ కోసం వైద్యులను అప్రమత్తం చేయాలని సూచించింది. ఇంటి ఆవరణలో ఏడిస్ దోమలు లేకుండా చూసేందుకు నోడల్ అధికారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది. నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు, ఆరోగ్య సౌకర్యాల్లో కీటకాలు లేకుండా నిఘా పెంచాలని, నియంత్రణ కార్యకలాపాలను తీవ్రతరం చేయాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది.ప్రజల్లో భయాందోళనలను తగ్గించడానికి సోషల్ మీడియా, ఇతర ఫ్లాట్ఫారమ్లలో ముందు జాగ్రత్తగా సందేశాలు పంపి అవగాహన కల్పించాలని రాష్ట్రాలు కోరింది. కాగా జులై 1న పూణెలో ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి జికా వైరస్ పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. అరంద్వానే ప్రాంతంలో నాలుగు, ముండ్వా ప్రాంతంలో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వైరస్ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలతోసహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. -
పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకులు మృతి
సాక్షి,సంగారెడ్డిజిల్లా: మహారాష్ట్రలోని పుణె నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు యువకులు అజ్మీర్ దర్గా సందర్శన కోసం వెళ్లారు. దర్గా సందర్శించుకుని తిరిగి వస్తుండగా పుణె శివారులోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, ఖురేషి, రఫిక్, ఫిరోజ్ కురేషి, మజీద్ పటేల్ ప్రమాద స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ అమర్ను పుణెలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. -
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం
మహారాష్ట్రలోని పూణెలో ఆరు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులున్నారు. జికా వైరస్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో రాష్ట్ర ఆరోగ్యవిభాగం అప్రమత్తమయ్యింది. పూణె మున్సిపల్ అధికారులు వైరస్ నివారణకు చర్యలు ప్రారంభించారు. జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు.రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంద్వానేలోని 46 ఏళ్ల డాక్టర్ జికా వైరస్ బారిపడ్డారు. ఇది రాష్ట్రంలో జికా వైరస్ తొలికేసుగా గుర్తించారు. అనంతరం ఆ వైద్యుని కుమార్తె(15)కు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిద్దిరితోపాటు ముండ్వాకు చెందిన ఇద్దరి రిపోర్టులు పాజిటివ్గా వచ్చాయి. ఈ నాలుగు కేసులు నమోదైన దరిమిలా అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే జికా వైరస్ సోకిన వీరందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. కాగా వైరస్ సోకిన ఎడెస్ దోమ కాటు కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినప్పుడు బాధితునిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ను తొలిసారిగా 1947లో ఉగాండాలో కనుగొన్నారు. -
విహార యాత్రలో విషాదం
-
ఆవురా... ఎంత క్రమశిక్షణ!
క్రమశిక్షణ తప్పిన వారిని ‘పశువులా ప్రవర్తించకు’ అంటాం. ఈ వైరల్ వీడియోను చూస్తే మాత్రం ‘పశువును చూసి నేర్చుకో’ అంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్ను పట్టించుకోకుండా ఎడా పెడా దూసుకుపోయేవాళ్లు ఈ వీడియోను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పుణెలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు వచ్చిన ఒక ఆవు ఎరుపురంగు ట్రాఫిక్ లైట్ను చూసి అడుగు ముందుకు వెయ్యలేదు. ట్రాఫిక్ లైట్ ఆకుపచ్చ రంగులో మారే వరకు ఓపికగా ఎదురు చూసింది. ఆ తరువాతే ముందుకు కదిలింది. మ్యూజిక్ జోడించి ఈ వీడియోను పుణె పోలీసులు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. రోడ్డు భద్రత గురించి ప్రచారం చేయడానికి ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు. ఆవు క్రమశిక్షణకు ముచ్చటపడిన నెటిజనులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
పుణె పోర్షే కారు ఘటన.. మైనర్ను వెంటనే విడుదల చేయండి: హైకోర్టు
ముంబై: పుణె పోర్షే ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు యువ ఇంజనీర్ల మరణానికి కారణమైన నిందితుడు మైనర్ బాలుడిని నిర్బంధం నుంచి వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు మంగళవారం ఆదేశించింది.ప్రభుత్వ అబ్జర్వేషన్ హోమ్ నుంచి విడుదల చేయాలంటూ బాలుడి అత్త వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై జస్టిస్ భారతి, జస్టిస్ మజుషా దేశ్పాండే ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. బాలుడి రిమాండ్ ఆర్డర్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ దానిని కోర్టు పక్కన పెట్టింది.కేసును కప్పిపుచ్చుకునేందుకు బాలుడి తల్లిదండ్రులు, తాత ప్రయత్నించి అరెస్టు అయిన నేపథ్యంలో మైనర్ ప్రస్తుతం అతని అత్త సంరక్షణలో ఉంటాడని ధర్మాసనం పేర్కొంది. కాగా ఈ కేసులో నిందితుడికి త్వరితగతిన బెయిల్ మంజూరు చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో జువైనల్ జస్టిస్ బోర్డు బాలుడికి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.అసలేం జరిగిందంటే..కాగా మహారాష్ట్రలోని పుణెలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు(17 ఏళ్లు).. 12వ తరగతి ఫలితాలు రావడంతో మే 18న రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగి పార్టీ చేసుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మత్తులో తూలుతూనే ఇద్దరు మిత్రులను తీసుకొని తన తండ్రికి చెందిన రూ. 2.5 కోట్ల ఖరీదైన పోర్షె కారులో ఇంటికి బయల్దేరాడు.అదే సమయంలోసాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన అనీష్, అశ్విని అనే ఇద్దరు యువతీ, యువకుడు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో టెక్కీలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోర్షె కారు నడుపుతున్న మైనర్.. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ప్రమాద తీవ్రతకు అనీష్, అశ్విని కొన్ని అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయారు.అయితే ప్రమాదానికి కారణమైన బాలుడిని రక్షించేందుకు పోలీస్స్టేషన్ నుంచి జువైనల్ జస్టిస్ బోర్డు వరకూ అడుగడుగునా ప్రయత్నాలు జరిగాయి. ప్రమాదం జరిగిన మర్నాడు నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చగా.. అక్కడ న్యాయమూర్తి ఎల్ఎన్ దన్వాడే నిందితుడికి తక్షణమే బెయిల్ మంజూరు చేశారు. రోడ్డు ప్రమాదాలు-పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయమన్నారు. 15 రోజులు ట్రాఫిక్ పోలీసుల వద్ద పనిచేయడం వంటి నిబంధనలు విధించారు ఈ బెయిల్ నిబంధనలు చూసి జనాలు నివ్వెరపోయారు. 15 గంటల్లోనే బెయిల్ మంజూరుచేయడం తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. నిందితుడికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడికి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. తక్షణమే నిందితుడి తండ్రి, మద్యం విక్రయించిన రెస్టారంట్ల యజమానులపై రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. 22వ తేదీన బాలుడి బెయిల్ను రద్దు చేసి అబ్జర్వేషన్ హోమ్కు తరలించారు.పరారైన నిందితుడి తండ్రిని ఔరంగాబాద్లో అరెస్టు చేశారు. మరోవైపు డ్రైవర్ను ఈ కేసులో బలవంతంగా ఇరికించేందుకు యత్నించాడన్న ఆరోపణలపై నిందితుడి తాతను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఏకంగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. -
Pune Drug Case: వీడియో బహిర్గతంతో 14 మంది అరెస్ట్
మహారాష్ట్రలోని పూణెలో ఓ పబ్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్లో కూర్చుని కొందరు డ్రగ్స్ తీసుకోవడం దానిలో కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.అక్రమ పబ్లపై వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించని పబ్లపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూణెలోని ఫెర్గూసన్ రోడ్డులోని ఒక పబ్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కలకలం చెలరేగింది.పబ్లోని వాష్రూమ్లో ఇద్దరు యువకులు డ్రగ్స్ తీసుకోవడం వీడియోలో కనిపిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలలో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు వెయిటర్లతో మొత్తం ఎనిమిదిమంది ఉన్నారు. ఈ కేసులో నలుగురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన ఎనిమిది మందిని జూన్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు.పుణె పోలీసులు పబ్ యజమాని సంతోష్ విఠల్ కమ్తే, సచిన్ కమ్తేతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. పబ్లోని ప్రధాన గేటును మూసివేసి, మరో గేటు ద్వారా పబ్లో కూర్చున్నవారికి వెయిటర్లు మత్తు పదార్థాలు అందించారని పోలీసులు గుర్తించారు. విషయం బయటకు పొక్కడంతో వెంటనే చర్యలు చేపట్టిన పోలీసులు పబ్కు సీల్ వేసి, డ్రగ్స్ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. -
Viral: రీల్స్ మోజులో యువతి పిచ్చి స్టంట్.. చేయి జారిందా అంతే!
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రజలంతా ఫోన్లపైనే రోజంతా గడిపేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విటర్.. ఇలా అన్నింట్లోనూ అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. మరికొందరు. ఈ సామాజిక మాద్యమాల ద్వారా ఫేమస్ అయిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చేయకూడని పనులు చేసి నలుగురిలో నవ్వులపాలు అవ్వడమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అవ్వాలనే ఉద్ధేశంతో సాహసాలకు తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే పుణెలో వెలుగు చేసింది. గా రీల్స్ మోజులో పడిన కొంతమంది యువతీ, యువకులు.. వ్యూస్ కోసండేంజరస్ స్టంట్లు చేశారు.పుణె లోని స్వామి నారాయణ్ ఆలయం సమీపపంలోని ఎత్తయిన భవనం నుంచి ఓ యువతి కిందకు వేలాడుతూ ఉండడం వీడియోలో కనిపిస్తోంది. మరో యువకుడు పైనుంచి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. కిందనున్న హైవేపై భారీ వాహనాలు వెళుతున్నాయి. ఏ మాత్రం పట్టు జారినా యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ తతంగాన్ని వారి స్నేహితులు కెమెరాల్లో చిత్రీకరించారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. టీనేజర్ల చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై సరైన చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.#Pune: For Creating Reels and checking the strength, Youngsters risk their lives by doing stunt on an abandoned building near Swaminarayan Mandir, Jambhulwadi Pune@TikamShekhawat pic.twitter.com/a5xsLjfGYi— Punekar News (@punekarnews) June 20, 2024 -
పోర్షే కారు కేసు: ‘నిందితుడిని మేజర్గా పరిగణించండి’
ముంబై: పుణెలో సంచలనం రేపిన పోర్షే కారు రోడ్డు ప్రమాదం ఘటన పూర్తి నివేదికను పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు(జేజేబీ)కి అందజేశారు. పూర్తిగా విచారించేందుకు నిందితుడిని మేజర్గా పరిగణించాలని పోలీసులు గతంలో జేజేబీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ అభ్యర్థనకు మద్దతుగా కేసులోని పూర్తి వివరాలు, సాక్ష్యాధారాల నివేదికను క్రైం బ్రాంచ్ పోలీసులు జేజేబీకి అందజేశారు. చదవండి: రీల్ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!‘‘ రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను జేజేబీకి సమర్పించాం. ఈ రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడే కీలకంగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు( మే 19) సాయంత్రం నుంచి ప్రమాదం జరిగే సమయంలో అన్ని సాక్ష్యాలు సేకరించాం. ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యుల వద్ద స్టేట్మెంట్ తీసుకున్నాం. మైనర్ బాలుడు కారు నడిపినట్లు ప్రత్యక్ష సాక్షి చూశాడు. విచారణ సమయంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాం. కోసీ రెస్టారెంట్, బ్లాక్ క్లబ్ రెస్టారెంట్లో మద్యం సేవించినట్లు గుర్తించాము. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణానికి కారణం మైనర్ బాలుడే. ఇలా.. మైనర్ బాలుడికి సంబంధించి పూర్తి వివరాలు జేజేబీకి అందించాం’’ అని క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇప్పటికైనా మేజర్గా పరిగణించి విచారించేందుకు సహకరిచాలని జేజేబీని క్రైం బ్రాంచ్ అధికారి కోరారు.ఈ కేసులో మైనర్ బాలుడి బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయడానికి అతని తల్లిదండ్రులు, సాసూన్ హాస్పిటల్ డాక్టర్ల సాయం తీసుకున్నారు. దీంలో విచారణలో వారి నిర్వాకం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేయగా జైలులో ఉన్నారు. బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయడానికి ప్రయత్నించిన మైనర్ బాలుడి తండ్రికి, డాక్టర్లకు మధ్యవర్తులుగా పనిచేసిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: పుణె పోర్షే కేసు: ‘ నాకేం గుర్తు లేదు.. అప్పడు తాగి ఉన్నా..!’ -
పుణే పోర్షే కేసు: మకందర్కు ఫోన్ చేసిందెవరు?
ముంబై: పుణేలో సంచలనం రేపిన పోర్షే కారు ప్రమాదం దర్యాప్తులో పోలీసులు మరో కీలక విషయం బయటపెట్టారు. బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయాలని నిందితుడు (మైనర్ బాలుడు) తండ్రి డాక్టర్లకు రూ. 3 లక్షల లంచం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ లంచం జువైనల్ జస్టిస్ బోర్డు ఆవరణంలో డాక్టర్ల సూచనతో హాస్పిటల్ వార్డు బాయ్కి అందజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్.. బ్లడ్ శాంపిళ్లను తన భార్య బ్లడ్ శాంపిళ్లతో తారుమారు చేయాలని సూసాన్ ఆస్పత్రి వార్డు బాయ్ అతుల్ ఘట్కాంబ్లేకు లంచం ఇచ్చినట్లు తెలిపారు. ఆ లంచాన్ని విశాల్ అగర్వాల్ ఏకంగా జువైనల్ జస్టిస్ బోర్టు ఆవరణంలో ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. సూసాన్ ఆస్పత్రి ఫొరెన్సిక్ విభాగం హెడ్ డా.అజయ్ తవారే, డా.శ్రీహరి హాల్కర్ (చీఫ్ మెడికల్ ఆఫీసర్) సూచన మేరకు వార్డుబాయ్ అతుల్ ఘట్కాంబ్లే లంచం తీసుకోవడానికి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.చదవండి: పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ప్రయోగంమొదట బాలుడి బ్లడ్ శాంపిల్ నెగటివ్ వచ్చింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు మరోసారి పరీక్ష నిర్వహించగా రెండు వేర్వేరు వ్యక్తుల రిపోర్టులు వచ్చినట్లు తేలింది. బాలుడి బ్లడ్ శాంపిల్ను అతని తల్లి శాంపిల్తో డాక్టర్లు తారుమారు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అష్ఫాక్ మకందర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మకందర్.. డాక్టర్లకు, బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్కు మధ్యవర్తిగా పనిచేశాడని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.చదవండి: పూణే ప్రమాదంలో కీలక పరిణామం!.. తెరపైకి ఎమ్మెల్యే కుమారుడుమే 20న మకందర్ సాసూన్ ఆస్పత్రికి చేరుకునే ముందు ‘విశాల్ అగర్వాల్కు సాయం చేయండి’ అని అతనికి ఒకఫోన్ కాల్ వచ్చింది. తర్వాత మకందర్, డాక్టర్ తవారే మధ్య సంభాషణ జరిగింది. అయితే మకందర్ కాల్ చేసి.. విశాల్కు సాయం చేయాలన్నది ఎవరూ? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మకందర్ ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు. మే 19 ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీల్ టింగ్రేతో పాటు ఎరవాడ పోలీసు స్టేషన్ వద్ద మకందర్ ఉండటం గమనార్హం. మే19న మైనర్ బాలుడు చేసిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ పుణేలో సంచలనం రేపుతోంది. -
వాన నీటిలో ‘పరుపు’ ప్రయాణం.. వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్రలోని పుణేలో శుక్రవారం భారీగా వాన కురిసింది. భారీ వానకు ఓ రోడ్డుపై నీరు నిలిచింది. దీంతో ఒక వ్యక్తి పరుపుపై వాన నీటిలో తేలియాడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీటితో నిండిన రోడ్డుపై ఒక వ్యక్తి పరుపుపై తేలుతూ ముందుకు వెళ్లాడు. అయితే అతని పక్కనే కొన్ని వాహనాలు కూడా వెళ్లటం ఆ వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు భిన్నంగా స్పందింస్తున్నారు. పలువురు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.Turning Disaster into an opportunity! आपदा को अवसर में बदलना koi inse sikhe. Visuals from Pune waterlogged street. Matter of days when this will be daily life of Mumbaikars for next 4 months 🎥 #MumbaiRains #PuneRains pic.twitter.com/slhY36U5E3— Mumbai Nowcast (@MumbaiNowcast) June 7, 2024 ‘నీటిలో పరుపు బైక్ రైడ్ బాగుంది’,‘నీటిలో ఆ వ్యక్తి పరుపుతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు’అని కామెంట్లు చేస్తున్నారు. అలా వెళ్లటం చాలా ప్రమాదకరం అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక.. మరికొందరు మాత్రం వాన పడినప్పుడు రోడ్లు ఇలా మారితే పరిస్థితి ఏంటని పశ్నిస్తున్నారు. -
పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
ముంబై: పుణె పోర్షే కారు రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా నిందితుడు మైనర్ బాలుడి కుటుంబానికి సంబంధించిన ఓ రిసార్ట్లో అక్రమ కట్టడాలను శనివారం అధికారులు కూల్చి వేశారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ మల్కంపేట్ ప్రాంతంలో మైనర్ బాలుడి ఫ్యామిలీకి ‘ఎంపీజీ క్లబ్’ అనే పేరుతో ఓ రిసార్ట్ ఉంది. దానిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులకు సమాచారం అందింది.The administration in Maharashtra's Satara district on June 9 demolished illegal structures in a resort in Mahabaleshwar owned by the family of the 17-year-old boy allegedly involved in the Pune Porsche crash, an official said.https://t.co/l9Hdui9pH1— The Hindu (@the_hindu) June 8, 2024 ఈ వ్యవహారంపై గతవారం సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. నిందితుడి ఫ్యామిలీ రిసార్ట్లో ఉన్న కట్టడాలు అక్రమమని తేలితే చర్యలు తీసుకోవాలని సతారా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఈ క్రమంలోనే గతవారం రిసార్ట్ను అధికారులు సీల్ చేశారు. తర్వాత వాటిపై విచారణ చేపట్టగా.. ఆ కట్టడాలు అక్రమంగా నిర్మించినట్లు నిర్ధారణ అయింది. దీంతో శనివారం ఎంపీజీ క్లబ్ వద్దకు బుల్డోజర్ను తీసుకువెళ్లిన అధికారులు అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు.మే 19 తెల్లవారుజామున మైనర్ బాలుడు మద్యం మత్తులో వేగంగా పోర్షేకారు నడిపి బైక్ను ఢీకొట్టాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. ఈ కేసులో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో రోజుకో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: పుణె పోర్షే కేసు: ఇవేం ట్విస్టులు బాబోయ్! -
పక్షులను స్వేచ్ఛగా ఎగరనిద్దాం..
మనలో చాలా మంది పక్షులను పెంచుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువశాతం తమ ఆహ్లాదం కోసమే. నిజానికి పక్షులను ఆదరించాల్సింది మన ఆహ్లాదం కోసం కాదు, వాటి ఆనందం కోసం దగ్గరకు తీయాలి. వాటి రెక్కలు విరిచి పంజరంలో పెట్టి మనం చూస్తూ ఆనందించడం హేయమైన చర్య. స్వేచ్ఛగా ఎగరడం వాటి సహజ లక్షణం. అది వాటికి ప్రకృతి ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం మనకు లేదు... అంటున్నారు మహారాష్ట్ర, పుణేలో నివసిస్తున్న రాధికా సోనావానే. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్న రాధిక పక్షి సంరక్షకురాలిగా మారిన క్రమాన్ని ఆమె చాలా ఇష్టంగా వివరిస్తారు.‘‘ప్రస్తుతం నా ఉద్యోగరీత్యా పూనాలో ఉన్నాం. మా స్వస్థలం ఔరంగాబాద్. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ సలీం అలీ బర్డ్ సాంక్చురీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్కచెప్పలేను. పక్షుల మీద మమకారం ఏర్పడింది. నేను బర్డ్ లవర్ని బర్డ్ వాచర్ని మాత్రమే అనుకున్నాను. కానీ ఏ మాత్రం ముందస్తు ప్రణాళికలు లేకుండా అనుకోకుండా పక్షి సంరక్షకురాలినయ్యాను. పెళ్లి తర్వాత నా నివాసం ఔరంగాబాద్లోనే ఒక ఫ్లాట్లోకి మారింది.మా పొరుగింట్లో ఓ పెద్దాయన బాల్కనీలో బర్డ్ ఫీడర్, ఒక గిన్నెలో నీరు పెట్టడం చూసిన తర్వాత నాకూ ఆలాగే చేయాలనిపించింది. పుణేకి బదిలీ అయిన తర్వాత కూడా కొనసాగింది. ఇప్పుడు మా ఇంటి గార్డెన్ పక్షుల విహార కేంద్రమైంది. నాకు తోచిన గింజలు పెట్టి సరిపెట్టకుండా ఏ పక్షికి ఏమిఇష్టమో తెలుసుకోవడానికి పక్షుల జీవనశైలిని అధ్యయనం చేశాను. రామ చిలుకలకు వేరుశనగ పప్పులు ఇష్టం. గోరువంకలు అరటి పండు తింటాయి. రామ చిలుక ముక్కు పెద్దది.గోరువంక, పిచ్చుకల ముక్కులు చిన్నవి. ఆ సంగతి దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్సులు డిజైన్ చేయించాను. నేను పెట్టిన ఆహారాన్ని అవి ఇష్టంగా తింటున్నాయా లేదా, నేను చదివింది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి బాల్కనీలో కూర్చుని శ్రద్ధగా గమనించేదాన్ని. అరటి పండు ముక్కలను చూడగానే గోరువంకలు సంతోషంగా పాటలు పాడడం మొదలుపెడతాయి. పాట పూర్తయిన తర్వాత తింటాయి. టైయిలర్ బర్డ్ అయితే పత్తి దూదిని చూడగానే రాగాలు మొదలుపెడుతుంది.గూడు కట్టుకోవడానికి పత్తి కనిపిస్తే దాని ఆనందానికి అవధులు ఉండవు. మనం సాధారణంగా కాకులను ఇష్టపడం. కానీ అవి చాలా హుందాగా వ్యవహరిస్తాయి. కాకులు, పిచుకలు, చిలుకలు, గోరువంకలు ఇతరులకు హాని కలిగించవు. పావురాలు అలా కాదు. వాటి ఆహారపు అలవాట్లు కూడా అంత సున్నితంగా ఏమీ ఉండవు. తమ ఆహారంలో ఇతరులను ముక్కు పెట్టనివ్వవు, ఇతరుల ఆహారాన్ని కూడా తామే తినేయాలన్నంత అత్యాశ వాటిది. పక్షి స్వేచ్ఛాజీవి..పెట్ డాగ్లాగా యజమానితో అనుబంధం పెంచుకోవడం పక్షుల్లో ఉండదు. స్వేచ్ఛగా విహరిస్తూ అనేక ప్రదేశాలకు వెళ్తుంటాయి. ఒక ప్రదేశంతో కానీ వ్యక్తితో కానీ అనుబంధం పెంచుకోవు. మా ఇంటికి వచ్చే నా అతిథుల్లో చిలుకలే ఎక్కువ. అలెగ్జాండ్రియన్ ΄్యారట్, ఇండియన్ రింగ్నెక్ ΄్యారట్లు తరచూ కనిపిస్తుంటాయి. సన్బర్డ్, వీవర్ బర్డ్ కూడా వస్తుంటాయి. కాలం మారేకొద్దీ అవి అప్పటి వరకు ఉన్న ప్రదేశాలను వదిలి తమకు అనువైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటాయి.వాయు కాలుష్యం, వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా పక్షుల వలసలకు కారణమే. సెల్ ఫోన్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా పక్షులు కంటి చూపును కోల్పోతున్నాయి. దాంతో అవి తమకు సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ ఎటుపోతున్నాయో తెలియడం లేదు. కరవు, అధిక వర్షాలు, యాసిడ్ వర్షాలు, అడవులలో చెట్లు నరకడం, మంటలు వ్యాప్తించడం... వాటికి ఎదురయ్యే ప్రమాదాలు. పక్షులు అడవిలో జీవించినంత ధైర్యంగా మనుషుల మధ్య జీవించలేవు.వాటికి మనుషులంటే భయం. ఆ భయాన్ని వదిలించి మచ్చిక చేసుకోవాలంటే వాటికి ఆహారాన్ని అందుబాటులో ఉంచడం ఒక్కటే మార్గం. ఆహారం కోసం ధైర్యం చేస్తాయి, క్రమంగా మన మీద నమ్మకం కలిగిన తర్వాత మన ఇంటిని తమ ఇంటిలాగా భావిస్తాయి. మా గార్డెన్కి రోజూ నలభై నుంచి యాభై పక్షుల వరకు వస్తుంటాయి. వాటి కోసం ఇంట్లో వంటగది, హాలు, బాల్కనీల్లో పక్షుల కోసం నీటి పాత్రలు పెట్టాను. దాహం వేసినప్పుడు నేరుగా దగ్గరలో ఉన్న నీటి పాత్ర దగ్గరకు వెళ్లిపోతాయి. పక్షులు మనతో మాట్లాడతాయి.రోజూ మా ఇంటి ఆవరణలో వినిపించే కిచకిచలన్నీ అవి నాకు చెప్పే కబుర్లే. కరోనా సమయంలో నా టైమ్ అంతా వీటి కోసమే కేటాయించాను. నన్ను నిత్య చైతన్యంగా ఉంచాయవి. నిజానికి పక్షి ప్రేమికులెవ్వరూ పక్షులను పంజరంలో బంధించరు. తమ సంతోషం కోసం పక్షులను పెంచే స్వార్థజీవులే ఆ పని చేస్తారు. దయచేసి పక్షులను బంధించవద్దు. వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. చేతనైతే రోజుకు గుప్పెడు గింజలు, ఒక పండు పెట్టండి’’ అంటూ పక్షుల గురించి ఆసక్తికరమైన విషయాలెన్నో చెబుతారు రాధిక.ఇవి చదవండి: ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్' టాపర్గా..! -
పుణె పోర్షే కేసు: ‘నాకేం గుర్తు లేదు.. అప్పుడు తాగి ఉన్నా..!’
ముంబై: పుణె పోర్షే కారు రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. మైనర్ బాలుడు తాను మద్యం తాగి కారు నడిపినట్లు అంగీకరించాడని తెలిపారు. మద్యం తాగటం వల్ల తనకు ఏం గుర్తులేదని చెప్పినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు.‘మైనర్ బాలుడిని దర్యాప్తులో భాగంగా ప్రమాదానికి ముందు అతను ఉన్న లోకేషన్?, బ్లాక్ అండ్ కోసీ పబ్సుల్లో ఉన్నారా?, కారు డ్రైవింగ్ చేశారా? ప్రమాదానికి సంబంధించి వివరాలు, సాక్ష్యాలు, బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయటం.. ఇలా పలు ప్రశ్నలు అడిగాం. అయితే ఏది అడిగినా ఒకే సమాధానం చెప్పాడు. నాకు ఏం గుర్తు లేదు. నేను అప్పడు తాగి ఉన్నా అని చెప్పాడు’ అని క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.ప్రాథమిక దర్యాప్తులోనే మైనర్ బాలుడు, అతని స్నేహితులు రెండ్లు పబ్బుల్లో రూ. 48 వేలు ఖర్చుపెట్టి మరీ మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇక.. శనివారం మైనర్ తల్లిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పుణె సీపీ అమితేష్ కుమార్ తెలిపారు. తన కుమారుడి బ్లడ్ శాంపిళ్లకు బదులు ఆమె బ్లడ్ శాంపిళ్లు ఇచ్చినందుకు ఆమెను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. సాసూన్ హాస్పిటల్ డాక్టర్లే ఆమెచేత ఈ పని చేయించారని అన్నారు. ఈ కేసులో అరెస్టైన మైనర్ బాలుడి తల్లిదండ్రులను జూన్ 5 వరకు పుణె కోర్టు ఆదివారం పోలీసు కస్టడీకి ఆదేశించింది. -
పుణే ఘటనలో అదిరిపోయే ట్విస్ట్
ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరి మృతికి కారణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ.. రోజుకొక అరెస్ట్తో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా టీనేజర్ను తప్పించేందుకు అతని కుటుంబం చేసిన ప్రయత్నాలు విస్తుగొల్పుతున్నాయి. తాజాగా ఈ కేసులో టీనేజర్ తల్లిని కూడా అరెస్ట్ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. విచారణ కోసం పిలిచిన ఆమెను.. శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు పోలీసులు. బ్లడ్ టెస్ట్ సమయంలో నిందితుడి రక్త నమూనాలు బదులుగా తనవి ఇచ్చినందుకే ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ప్రమాదం సమయంలో తన కుమారుడు తాగలేదని నిరూపించేందుకు ఆమె తన రక్తనమూనాలు ఇచ్చినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ తావ్డే, నిందితుడి తండ్రి ఫోన్లో మాట్లాడుకున్నారని.. నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు భారీ నగదుతో డీల్ కుదిరిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ క్రమంలోనే టీనేజర్ తల్లి శాంపిళ్లను బ్లడ్ టెస్ట్కు ఇచ్చినట్లు తేలింది. రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత ఆమె ఆచూకీ లేకుండా పోయారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఒక వీడియో సందేశం విడుదల చేసిన ఆమె.. తన కుమారుడిని రక్షించాలంటూ కన్నీరుపెట్టుకోవడం గమనార్హం. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, శాంపిల్స్ను మార్చిన ఆరోపణలపై ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు. పుణే పోర్షే కారు కేసులో ఇప్పటికే నిందితుడి తండ్రి, తాత కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసును తనమీద వేసుకోమని తమ డ్రైవర్ను ఒప్పించేందుకు యత్నించారని, అతడు అంగీకరించకపోవడంతో కిడ్నాప్ చేసి ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలు వారిద్దరి అరెస్టుకు కారణమయ్యాయి. నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆ కుటుంబం పలువురు అధికారుల్ని ప్రలోభపెట్టేందుకు యత్నించడమూ దర్యాప్తులో వెలుగు చూసింది. -
పుణె పోర్షే ఘటన.. ఇన్నేసి ట్విస్ట్లా?
పుణె పోర్షే కారు ప్రమాదం.. ట్విస్ట్ల మీద ట్వి స్ట్లతో థ్రిల్లర్ కథను తలపిస్తోంది. రోజురోజుకీ కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తప్ప తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు మరణించడానికి కారణమైంది 17 ఏళ్ల మైనర్ అయితే.. అతన్ని కాపాడటానికి మైనర్ తండ్రి, తల్లి, తాత, పోలీసులు, డాక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరు పైసాకు కొమ్ముకాసి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించడం చూస్తుంటే విస్మయానికి గురికాక తప్పదు.పుణెలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు(17 ఏళ్లు).. 12వ తరగతి ఫలితాలు రావడంతో మే 18న రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగి పార్టీ చేసుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మత్తులో తూలుతూనే ఇద్దరు మిత్రులను తీసుకొని తన తండ్రికి చెందిన రూ. 2.5 కోట్ల ఖరీదైన పోర్షె కారులో ఇంటికి బయల్దేరాడు.అదే సమయంలోసాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన అనీష్, అశ్విని అనే ఇద్దరు యువతీ, యువకుడు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో టెక్కీలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోర్షె కారు నడుపుతున్న మైనర్.. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ప్రమాద తీవ్రతకు అనీష్, అశ్విని కొన్ని అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయారు. ఆ మార్గంలో వెళ్తున్న పలువురు వ్యక్తులు కారులోని యువకులను పట్టుకున్నారు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని యర్వాడ పోలీస్ స్టేషన్కు తరలించారు.బాలుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రోటోకాల్ పాటించలేదు. ప్రమాదానికి కారణమైన మైనర్ను పోలీస్ స్టేషన్లో ఏసీపీ కుర్చీలో కూర్చొబెట్టి రాచమర్యాదలు చేయడం చూసి అక్కడే ఉన్న కొందరు ఆశ్చర్యపోయారు. పిజ్జాలను తెప్పించి నిందితులకు ఇచ్చారు. నిందితుడి ఆల్కాహాల్ శాతాన్ని పరీక్షించేందుకు సమయానికి రక్త పరీక్ష చేయడంలో పోలీసులు జాప్యం వహించారు. అనంతరం ప్రభుత్వ ఆధ్యర్యంలో నడిచే సాసూన్ ఆసుపత్రిలోనూ మైనర్ బ్లడ్ శాంపిల్సను తారుమారు చేశారు. మైనర్ తండ్రి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకొని రక్త నమూనాలను మార్చేశాురు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా బాలుడికి తాగడానికి నీరు ఇచ్చారు. ఇది ఆల్కహాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఈ కేసు విషయంలో ఏదో జరుగుతోందని అనుమానించిన ఉన్నతాధికారులు బాలుడి రక్తనమూనాలు మరోసారి సేకరించి జిల్లా ఆస్పత్రికి పంపారు. ఈ ఫలితాల ఆధారంగానే సాసూన్ ఆస్పత్రిలో జరిగిన మోసం బయటపడింది. దీంతో ఇద్దరు వైద్యులు, వార్డ్బాయ్ను కూడా సస్పెండ్ చేశారు. అలాగే రక్తనామూనాలను తర్వగా సేకరించడంలో జాప్యం వహించిన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాలుడికి తక్షణమే బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి దన్వాడేపై విచారణ మొదలైంది.ప్రమాదానికి కారణమైన బాలుడిని రక్షించేందుకు పోలీస్స్టేషన్ నుంచి జువైనల్ జస్టిస్ బోర్డు వరకూ అడుగడుగునా ప్రయత్నాలు జరిగాయి. ప్రమాదం జరిగిన మర్నాడు నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చగా.. అక్కడ న్యాయమూర్తి ఎల్ఎన్ దన్వాడే నిందితుడికి తక్షణమే బెయిల్ మంజూరు చేశారు. రోడ్డు ప్రమాదాలు-పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయమన్నారు. 15 రోజులు ట్రాఫిక్ పోలీసుల వద్ద పనిచేయడం వంటి నిబంధనలు విధించారు ఈ బెయిల్ నిబంధనలు చూసి జనాలు నివ్వెరపోయారు. నిందితుడికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడికి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. తక్షణమే నిందితుడి తండ్రి, మద్యం విక్రయించిన రెస్టారంట్ల యజమానులపై రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. 22వ తేదీన బాలుడి బెయిల్ను రద్దు చేసి అబ్జర్వేషన్ హోమ్కు తరలించారు. పరారైన నిందితుడి తండ్రిని ఔరంగాబాద్లో అరెస్టు చేశారు. మరోవైపు డ్రైవర్ను ఈ కేసులో బలవంతంగా ఇరికించేందుకు యత్నించాడన్న ఆరోపణలపై నిందితుడి తాతను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఏకంగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. -
పూణె పోర్షే కేసు: ఆస్పత్రి డీన్ ఎక్కడ?
ముంబై: పుణే పోర్షే కారు రోడ్డు ప్రమాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడికి సంబంధించి బ్లడ్ శాంపిళ్ల తారుమారు విషయంలో ఓ రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్మే డాక్టర్లపై ఒత్తిడి చేశారని సాసూన్ హాస్పిటల్ డీన్ తెలిపారు. బుధవారం హాస్పిటల్ డీన్ వినాయక్ కాలే మీడియాతో మాట్లాడారు.‘‘మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రి హసన్ ముష్రిఫ్, ఎమ్మెల్యే సునీల్ తింగ్రే.. మెడికల్ సూపరింటెండెంట్గా డాక్టర్ అజయ్ తవాడేను నియమించారు. వీరు అధికారపార్టీ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు. వారు బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయించటం కోసం సోరెన్సిక్ డాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు’’ అని డీన్ తెలిపారు. శాంపిళ్ల తారుమారుపై ఓ కమిటీని ఏర్పాటు చేసిన మంగళవారం ఈ వ్యవహారంపై రోజంతా విచారణ జరిపించామని హాస్పిటల్ డీన్ వినాయక్ కాలే తెలిపారు. తను కూడా ఈ విషయంపై పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.హాస్పిటల్ డీన్ మీడియా సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం సెలవుపై పంపటం గమనార్హం. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు, సరైన నిర్ణయం తీసుకోనందుకే ఆయన్ను ప్రభుత్వం సెలవుపై పంపినట్లు తెలుస్తోంది.ఇక.. మైనర్ బాలుడి బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయటం కోసం ఇద్దరు డాక్టర్లు అజయ్ తవాడే, శ్రీహరి హర్నర్.. మధ్యవర్తి హాస్పిటల్ ప్యూన్ ద్వారా నిందితుడి కుటుంబ సభ్యుల వద్ద రూ.3 లక్షల లంచం తీసున్నారని తెలియటంతో వారిని పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఇక.. బ్లడ్ శాంపిళ్ల తారుమారుపై మహారాష్ట్ర ప్రభుత్వం సైతం దర్యాప్తుకు డాక్టర్ పల్లవి సపాలే నేతృత్వంలో ఓ కమిటి ఏర్పాటు చేసింది. ఈ కమిటిలో గ్రాంట్ మెడికల్ కాలేజీ, జేజే గ్రూప్ హాస్పిటల్ డీన్లు సభ్యులుగా ఉన్నారు.ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడికి సంబంధం ఉందని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోల్ ఆరోపణలు చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఎమ్మెల్యే.. పోలీసులతో టచ్లోకి వెళ్లారు. బ్లడ్ శాంపిళ్లను మార్చటం కోసం డాక్టర్లు కూడా ఫోన్ చేశారని పటోల్ ఆరోపణలు చేశారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక.. ప్రముఖ బిల్డర్ అయన మైనర్ తండ్రి కూడా బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయించాలని డాక్టర్ తవాడేకు 14 సార్లు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.ఇక.. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం స్పందించారు. ‘ప్రమాదం జరిగినప్పటి నుంచి పుణే పోలీసు కమిషనర్తో నేను టచ్లో ఉన్నా. ఈ కేసులో ఎంతటివారు ఉన్నా చర్యలు తీసుకుంటాం. చట్టం ముందు అందరూ సమానులే. ఎవ్వరినీ వదిలిపెట్టం. నేను ఇప్పటికే ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చాను’ అని తెలిపారు. -
పూణే ప్రమాదంలో కీలక పరిణామం!.. తెరపైకి ఎమ్మెల్యే కుమారుడు
పూణే: పూణే పోర్షే కారు ప్రమాదం కేసులో ఇప్పటికే పలు సంచనాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో తాజాగా మరో ఆరోపణ తెరపైకి వచ్చింది. ఈ కారు ప్రమాదంలో నిందితులను తప్పించే అంశంలో ఓ ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం కూడా ఉందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత ఆరోపించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.కాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నానా పటోలే తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పూణే పోర్షే కారు ప్రమాదంలో ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం కూడా ఉంది. ఆయనే తెర వెనుక చక్రం తిప్పారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. ఇదంతా సదరు ఎమ్మెల్యే ద్వారానే జరిగిందంటూ కామెంట్స్ చేశారు. ఇక, పబ్లో నిందితుడు మద్యం సేవిస్తున్నప్పుడు అతడిలో మరో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన వివరాలను కూడా బయటకు వెల్లడించాలన్నారు. వారికి ఏదైనా పొలిటికల్ సపోర్టు ఉందా? అని ప్రశ్నించారు. ఇక, ఈ కేసు విషయంలో ప్రభుత్వ తీరును తీవ్ర తప్పుబడుతూ సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కూడా కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. పుణెలో కారు ప్రమాదంలో మరో విషయం బయటకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరో అంశాన్ని గుర్తించారు. ఈ కేసులో భాగంగా రూ.3 లక్షలకు కక్కుర్తిపడి వైద్యులే నిందితుడి రక్తం నమూనాలు మార్చేశారని గుర్తించారు. ఈ మొత్తాన్ని తెచ్చిన ఆసుపత్రి ప్యూన్ను అరెస్టు చేశారు.అయితే, ప్రమాదం జరిగిన రోజు డాక్టర్ తావ్రే, నిందితుడి తండ్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి రక్తనమూనాలను మార్చేస్తే భారీ మొత్తం ఇచ్చేలా డీల్ కుదిరిందని పోలీసులు నిర్ధారించారు. నిందితుడైన బాలుడి రక్త నమూనాలకు బదులు వేరే నమూనాలను ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ మేరకు వారి డీల్ కుదిరింది. కాగా, వైద్య పరీక్షల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు బయటపడకూడదనే ఇలా చేశారని పోలీసులు తెలిపారు.ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది..కాగా, పటోలే వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆసిఫ్ భామ్లా స్పందించారు. ఈ సందర్భంగా భామ్లా మాట్లాడుతూ.. ఈ కేసులో వైద్యులు ఏదైనా అవకతవకలకు పాల్పడినా లేక ఏదైనా తప్పు జరిగినా ఎవరినీ విడిచిపెట్టేది లేదు. ఒక ఎమ్యేల్యే పోలీసు స్టేషన్కు వెళ్లినంత మాత్రాన ఏదో జరిగిపోయిందని ప్రతిపక్షాలు తప్పడు ప్రచారం చేస్తున్నాయి. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. ఎవరూ ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పుణే ఘటన: లంచాల మోజు.. పోలీసుల అక్రమాలు వెలుగులోకి!
రెండు నిండు ప్రాణాల్ని బలిగొన్న పుణే పోర్షే హిట్ అండ్ రన్ కేసు.. రకరకాల కోణాల్లో చర్చకు దారి తీసింది. వాహనం నడిపింది ఓ మైనర్ కావడంతో పేరెంటింగ్ కోణంలో ప్రధాన చర్చ నడిచింది. మైనర్ బాలుడి తండ్రి తన పలుకుబడి ఉపయోగించి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం.. ఆ ప్రయత్నంలో నిర్లక్ష్యం ధోరణి ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్యలు, రక్త నమూనాలు తారుమారు చేయటంతో డాక్టర్ల అరెస్టు.. తండ్రి, తాతల అరెస్ట్.. పోర్షే కథలు రోజుకొకటి వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ కేసు కారణంగానే.. నగరంలో అర్ధరాత్రుల దాకా అనుమతులు లేకుండా బార్లు, పబ్ల నిర్వహణ, వాటిల్లో డ్రగ్స్ వాడకం.. ఆ మొత్తం వెనుక అధికారుల అవినీతి బాగోతం బయటపడింది ఇప్పుడు.. పుణేలో అర్ధరాత్రి దాకా అక్రమంగా కార్యకలాపాలు నిర్వహించే పబ్లు, బార్లు.. పైగా డ్రగ్స్ కోణాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు ఓ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్.. ఈ హిట్ అండ్ రన్ కేసుపై ఇదివరకే నిరసన వ్యక్తం చేశారు. పబ్లు, బార్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన యెరవాడ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆయన ఇప్పుడు మరో సంచలన చర్చకు దారితీశారు.చదవండి: Pune Porsche Case: రీల్ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!లంచాల మోజుతో పోలీసులు అక్రమంగా నిర్వహిస్తున్న పబ్ యజమానులు, డ్రగ్స్ ట్రేడర్ల వద్ద నెలకు లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారని రవీంద్ర ధంగేకర్ ఆరోపణులు చేశారు. పుణె ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రతినెలా లంచాలు తీసుకుంటున్నారని, లంచాల సేకరణకు కానిస్టేబుళ్లు, ప్రైవేట్ వ్యక్తులను ఉపయోగించుకున్నారని తెలిపారు.#Pune #Porsche Case: Ravindra Dhangekar Discloses Names Of Persons Involved In ' HAFTA 'From Pubs, Clubs and Liquor Shops In a major crackdown, the Kasba Peth MLA Ravindra Dhangekar revealed that police are collecting monthly bribes amounting to lakhs of rupees from the owners… pic.twitter.com/5ehtFFSuW8— Pune Pulse (@pulse_pune) May 27, 2024 విమాన్ నగర్, కోరేగావ్ పార్క్, కళ్యాణి నగర్, భుగావ్ భూకుమ్, బానేర్, హింజవాడి, పింప్రి చించ్వాడ్, లోనావాలా ప్రాంతాల్లో ఉండే అర్ధరాత్రి, రూఫ్టాప్లో నిర్వహించినే హోటళ్ల వద్ద లంచాలు తీసుకొని చూసిచూడనట్లు వ్యవహరిస్తారని అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పోలీసు నెలకు వసూలు చేసే మొత్తం దాదాపు రూ. 78 లక్షలు ఉంటుందని లెక్కలతో సహా మీడియాకు తెలిపారు. లంచాలు తీసుకునే ప్రాంతాలు, వాటిని వసూలు చేసే పోలీసు కానిస్టేబుల్స్ పేర్లను ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టారు.కస్బా పేట్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టిన ఈ వివరాలు ప్రస్తుతం మహారాష్ట్రలో సంచలనంగా మారాయి. అదేవిధంగా పుణె పోలీసు డిపార్టుమెంట్లో ఎప్పటి నుంచో ఉన్న అవినీతి వ్యవహారం తాజాగా బట్టబయలు అయింది. పుణె సిటీ కల్చర్, చట్టాల అమలుపై తీవ్ర చర్చ జరుగుతోంది. -
పుణె పోర్షే కేసు: ఇవేం ట్విస్టులు బాబోయ్!
గుద్దింది ఎవరు?.. మైనరేనా? డ్రైవరా?పోయింది మాత్రం రెండు ప్రాణాలుప్రమాదానికి కారణం ఆ మైనరే!పైగా మద్యం సేవించి ఉన్నాడుతండ్రి బిల్డర్.. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తిఅందుకే కేసును తారుమారు చేసే ప్రయత్నాలుఈ క్రమంలోనే రోజుకొక ట్విస్ట్ తెరపైకి పుణె పోర్షే కారు ప్రమాదం.. రోజుకో ట్విస్ట్తో థ్రిల్లర్ కథను తలపిస్తోంది. తాజాగా నిందితుడైన మైనర్ రక్త నమూనాల రిపోర్టులను తారుమారు చేసినందుకు పోలీసులు ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. సాసూన్ ఆస్పత్రిలోని డా. అజయ్ తావ్రే, డా. శ్రీహరి హార్నర్ పుణె క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎందుకంటే..ప్రభుత్వ ఆస్పత్రిలో డా. అజయ్ తావ్రే ఫొరెన్సిక్ హెడ్గా పనిచేస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటన రోజు నిందిత మైనర్ బాలుడు తన స్నేహతులతో మద్యం చేవించినట్లు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కన్పించిన విషయం తెలిసిందే. అయితే మైనర్ బాలుడి రక్త పరీక్షలో మాత్రం మద్యం సేవించనట్లుగా లేకపోవటం, ఆ రిపోర్టు నెగిటివ్ రావటం గమనార్హం. దీంతో రక్త నమూనాలను తారుమారు చేసిన ఇద్దరు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.అంతకు ముందు పుణె పోలిసు కమిషనర్ అమితోష్ కుమారు మాట్లాడారు. ‘మద్యం మత్తులో కారు నడపటం వల్ల జరిగిన ప్రమాదం కాదు. మైనర్ బాలుడికి తన ప్రవర్తనపై పూర్తి అవగాహన ఉంది. మైనర్,అతని స్నేహితులు కలిసి రెండు బార్లలో పార్టీ చేసుకున్నారు. తర్వాత ఇరుకైన వీధిలో నంబర్ ప్లేట్ లేని కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. అందుకే మేము దీనిపై దృష్టి పెట్టాము. అతను పూర్తిగా అవగాహనతో ఉన్నాడు. తన చర్యల వల్ల ఎదుటువారి ప్రాణాలు పోతాయని తెలుసు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు వేర్వేరు సమయాల్లో బ్లడ్ను పరీక్ష చేయించాము. రెండు ఒకేలా కచ్చితంగా ఉన్నాయి’అని అమితోష్ కుమారు తెలిపారు.పోలిసులు వివరాల ప్రకారం.. మొదటి రక్త నమూనాలో మద్యం తాగినట్లు రాలేదు. రెండో నమూనాలో మద్యం సేవించినట్లు పాజిటివ్ రావటం గమనార్హం. దీంతో డీఎన్ఏ టెస్ట్ చేయించారు. డీఎన్ఏ టెస్ట్లో సాంపిళ్లు వేరుగా ఉన్నాయి. మైనర్ రక్త నమూనా మరోక వ్యక్తి రక్త నమూనాతో తారుమారు అయింది.దీంతో మైనర్ రిపోర్టులో నెగటివ్ వచ్చింది.ఆదివారం (మే 26): ప్రమాదం జరిగిన సమయంలో తానే కారు నడిపినట్లుగా డ్రైవర్ అంగీకరించేందుకు డ్రైవర్ కుటుంబానికి.. మైనర్ తాత పెద్దమొత్తంలో డబ్బు, బహుమతులు ఆశ చూపించారని పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. తాము చెప్పినట్లే నడుచుకోవాలని అతడిని బెదిరించారని తెలిపారు. బాలుడి తాతపై ఉన్న ఇతర కేసుల వివరాలు కూడా పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బాలుడి తాతకి ఈనెల 28 వరకు రిమాండు విధించింది.శనివారం( మే 25):రోడ్డు ప్రమాదం ఘటనకు కారకుడైన టీనేజర్ తాత సురేంద్ర అగర్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ గంగారాంను ఇరికించే ప్రయత్నం సురేంద్ర చేసిందేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. గంగారాంను బెదిరించి.. ప్రమాద సమయంలో కారు తానే నడిపినట్లు పోలీసుల వద్ద చెప్పాలని ఒత్తిడి చేసింది సురేంద్ర అని విచారణలో తేలింది. దీంతో.. కొత్త కేసు నమోదు చేసుకున్న పుణే క్రైమ్ బ్రాంచ్.. ఇవాళ వేకువ ఝామున 3గం. టైంలో సురేంద్రను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది. అలా ఈ కేసులో మూడో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.శుక్రవారం( మే 24): ప్రమాదం గురించి వైర్లైస్ కంట్రోల్రూమ్కు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.#PorscheAccident: #Pune Police Obtain CCTV Showing Teenager Frequently Drove Cars#Pune Police have acquired #CCTV footage revealing that a teenager involved in a recent Porsche accident often drove cars. pic.twitter.com/SO2qoALTzA— Punekar News (@punekarnews) May 27, 2024గురువారం( మే 23): పోర్షే కారు ప్రమాద ఘటన జరిగినప్పుడు కారును నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే, కేసు నుంచి మైనర్ను తప్పించేందుకే డ్రైవర్ను ఇరికిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.బుధవారం( మే 22): రోడ్డు ప్రమాదానికి ముందు ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ బాలుడు కేవలం 90 నిమిషాలకు పబ్బులో రూ. 48 వేలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు.మంగళవారం( మే 21): రోడ్డు ప్రమాదం కేసులో పోర్షే కారు నడిపిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్టు కింద ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సోమవారం( మే 20): తన ర్యాష్ డ్రైవింగ్తో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందుతుడైన మైనర్కు 15 గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతులు చర్చనీయాంశంగా మారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ట్రాఫిక్ పోలీసుతో 15 రోజులు పని చేయాలి. మానసిక పరివర్తనకు సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి. ‘రోడ్డు ప్రమాదాలు, వాటి పరిష్కార మార్గాలు’అనే టాపిక్ మీద 300 పదాలలో వ్యాసం రాయాలి. డి- అడిక్షన్ సెంటర్లో పునరాసం కోరాలి. ట్రాఫిక్ రూల్స్ చదవి జువైనల్ జస్టిస్ బోర్డుకు ప్రజంటేషన్ ఇవ్వాలి. రోడ్డు ప్రమాద బాధితులకు భవిష్యత్తులో అండగా ఉండాలి’అని జువైనల్ కోర్టు మైనర్ బాలుడికి షరతులు విధించింది.ఆదివారం(మే 19): ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ ఆదివారం ఉదయం కోరేగావ్ పార్క్ వద్ద వేగంగా పోర్షే కారును నడుతూ.. ఓ బైక్ను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో అనిస్ దుధియా ,అశ్విని కోస్టా అనే ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
పుణె పోర్షే కేసు : తాత అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర పుణె కారు ప్రమాదం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. ఘటనకు కారకుడైన టీనేజర్ తాత సురేంద్ర అగర్వాల్ను అత్యంత నాటకీయ పరిణామాల నడుమ పోలీసులు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కోసం సురేంద్రను విచారణకు పిలిచారు పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. రాత్రి వరకు ప్రశ్నించారు. అయితే.. డ్రైవర్ గంగారాంను ఇరికించే ప్రయత్నం సురేంద్ర చేసిందేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. గంగారాంను బెదిరించి.. ప్రమాద సమయంలో కారు తానే నడిపినట్లు పోలీసుల వద్ద చెప్పాలని ఒత్తిడి చేసింది సురేంద్ర అని విచారణలో తేలింది. దీంతో.. కొత్త కేసు నమోదు చేసుకున్న పుణే క్రైమ్ బ్రాంచ్.. ఇవాళ వేకువ ఝామున 3గం. టైంలో సురేంద్రను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది. కాగా, ఈ కేసులో ఇది మూడో ఎఫ్ఐఆర్.ఓ టీనేజర్(17) ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మే 19వ తేదీన జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో కీలక నిందితుడైన మైనర్కు 15 గంటల్లోనే జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో పోలీసులు మరోసారి జువైనల్ జస్టిస్ బోర్డును ఆశ్రయించి, ఆదేశాలను పునఃపరిశీంచాలని కోరారు. ఈ క్రమంలోనే బెయిల్ రద్దు చేసిన న్యాయస్థానం అతడిని వచ్చే నెల 5 వరకు అబ్జర్వేషన్ హోంలో ఉంచాలని ఆదేశించింది. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లి మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బండిపై ఉన్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితుడి తండ్రి, రెండు బార్ల యజమానులను సైతం పోలీసులు అరెస్టు చేశారు.అయితే ఈ కేసులో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగాలపై ఇద్దరు అధికారులపైనా సస్పెన్షన్ వేటు పడింది. ప్రొటోకాల్ ప్రకారం ప్రమాదం విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాతే కేసును పుణె క్రైం బ్రాంచ్కు బదిలీ చేశారు. మరోవైపు రాజకీయంగానూ ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. -
పుణె పోర్షే కారు ప్రమాదం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
పుణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే కారు ప్రమాద ఘటనలో శుక్రవారం(మే24) ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ప్రమాదం గురించి వైర్లైస్ కంట్రోల్రూమ్కు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.కారును రియల్టర్ విశాల్ అగర్వాల్ కుమారుడు నడపలేదన్నట్లుగా చిత్రీకరించేందుకు సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నం జరిగిందని పుణె పోలీసు కమిషనర్ చెప్పారు. ‘మా వద్ద సీసీ టీవీ ఫుటేజ్ ఉంది. కారు నడిపిన మైనర్ ప్రమాదానికి ముందు మందుతాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసులో సెక్షన్ 304 వర్తిస్తుందనడానికి కావాల్సిన అన్ని ఆధారాలున్నాయి’అని తెలిపారు. పోర్షే కారు ప్రమాదంలో అనీష్, అశ్వినీ అనే ఇద్దరు 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్లు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. -
పుణే ఘటన! ఎవరిది ఈ పాపం? ఇది పేరెంటింగ్ వైఫల్యమేనా..?
పుణెలో మైనర్ బాలుడి డ్రైవింగ్ కారణంగా ఇద్దరు యువ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు. కారుని గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేగాదు ఈ ప్రమాదానికి ముందు పంబ్లో సంబరాలు చేసుకోవడమే గాక ఏకంగా రూ. రూ. 48 వేలు ఖర్చు పెట్టి మరీ మందు తాగినట్లు తేలింది. నిజానికి మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం సేవించేందుకు అనుమతి ఉంది. ఇక్కడ నిందితుడికి కొద్ది గంట్లలోనే షరతులతో కూడిన బెయిల్ రావడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు నిందుతుడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ దిగ్బ్రాంతికర ఘటన యావత్తు దేశాన్ని ఒక్కసారిగా ఉలక్కిపడేలా చేసింది. ఇక్కడ సరిగాలేని చట్టాలది తప్పా? లేక నిందితుడిని అలా పెంచిన తల్లిదండ్రులది తప్పా? దీనికి ఎవరు బాధ్యులు? ఎవరదీ ఈ పాపం..?యావత్తు దృష్టిని ఆకర్షించిన ఈ ప్రమాదం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో జరిగిన భయానక దిగ్బ్రాంతికర ఘటనగా చెప్పొచ్చు. 17 ఏళ్లు మైనర్ రూపంలో మృత్యువు ఎన్నోకలలతో ఉన్న ఇద్దరు యువతీయుకుల జీవితాలను బలితీసుకుంది. రెండు కుంటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంత ఘోరానికి పాల్పడ్డ నిందితుడు కొద్ది గంటల్లోనే బెయిల్పై రావడమే గాక మేజర్ కాదు కాబట్టి శిక్షార్హడు అని కోర్టు పేర్కోనడమే అత్యంత కలిచివేసే విషయం. ఇక్కడ మైనర్ ఎంత పెద్ద నేరం చేసిన శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నందుకు బాధపడాలో లేక తల్లిదండ్రుల పెంపకానికి రెండు నిండు జీవితాలు బలైనందుకు కలత చెందాలో తెలియని స్థితి. ఈ ఘటన ఒక్క విషయం చెప్పకనే చెప్పింది. తల్లిదండ్రుల పెంపక వైఫల్యతకు నిదర్శనమే ఈ ఘటన అని చెంపదెబ్బ కొట్టినట్లు చెప్పకనే చెబుతోంది. మేజర్ కానివాడికి విలావంతమైన కారు ఇవ్వడం ఒక తప్పు అయితే..ఖర్చుపెట్టుకోమని అంతంత డబ్బు ఇస్తున్నారంటే..తల్లిదండ్రులుగా వాళ్లకు ఏం చెబుతున్నారో అర్థమవుతోంది. ఇక్కడ తల్లిదండ్రులు మేము ఒళ్లు గుల్ల చేసుకుని డబ్బులు సంపాదించేస్తాం..మీరు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి తాగితందనాలు ఆడి బీభత్సం సృష్టించమని చెబుతున్నారా? అని అనలా. ఏదైనా మొక్కగా ఉన్నప్పుడే సరిచేయాలి. విలాసవంతమైన వస్తువులు కొనివ్వగలిగే స్తోమత ఉన్న తల్లిదండ్రులు రెండు విషయాలు తప్పక గుర్తించుకోవాలి. కొన్నింటికి నో చెప్పడం ముఖ్యం..ఒకటి దీనివల్ల వాడికి ప్రయోజనం ఉంటుందా లేదా గ్రహించాలి. రెండు ఎంత వరకు ఆ లగ్జరియస్ వస్తువు పిల్లలకు అవసరం అనేది కూడా గమనించాలి. స్నేహితుల ప్రభావంతో స్టేటస్ ఆఫ్ సింబల్గా విలాస వస్తువులు కావాలనుకుంటున్నారా? అన్నది కూడా తల్లిదండ్రులుగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. ప్రతి తల్లిదండ్రులు స్తోమత ఉన్నా లేకపోయినా విలావంతమైన వస్తువులకు 'నో' చెప్పాలి. అంతేగాదు తల్లిదండ్రులుగా ప్రతిదానికి 'ఎస్' అని చెప్పడం కాదు నో అని చెప్పి కట్టడి చేయడం వంటివి కూడా చేయాలి. ఒక వస్తువు కొనేందుకు ఖర్చు అవుతున్న డబ్బులు అందుకోసం మీరు పడుతున్న కష్టం గురించి విడమరిచి చెప్పాలి. చాలామంది చేసే ప్రధానమైన తప్పు ఏంటంటే..ప్రతీది కాదంటే వారు నొచ్చుకుంటారు,స్నేహితుల ముందు చిన్నబోతారని భావిస్తుంటారు. పైగా పిల్లలు కదా..!పోనీలే అనే భావన కూడా అస్సలు వద్దు. మీ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఎంత ఖరీదైనదేనా కొనిచ్చేస్తారు..ఆ తర్వాత ఏంటీ..? అనేది అతిపెద్ద ప్రశ్న..?. అనేది గుర్తుపెట్టుకోండి.. పిల్లల భవిష్యత్తు భద్రమైన వస్తువులు కొనివ్వండి. గారాభంగా పెంచడం తప్పుకాదు. ముద్దుగా, గారాభంగా పెంచుతూనే బాధ్యతలను, విలువలను నేర్పించాలి. ముఖ్యంగా ప్రయోజకులుగా మారకపోయిన పర్లేదు గానీ ఇతరులకు హాని తలపెట్టే వారిగా, అందరూ అసహ్యించుకునేవారిలా మాత్రం తయారవ్వనివ్వకండి. (చదవండి: ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు!) -
పూణే కారు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్
పూణే: పుణేలో విలాసవంతమైన పోర్షే కారు ప్రమాదం కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఊహించని ట్విస్ట్ బయటకు వచ్చింది. కారు ప్రమాదానికి గురైన సమయంలో కారు నడిపింది తన కొడుకు కాదని.. కారును నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో, ఈ కేసు మరో మలుపు తిరిగింది.కాగా, పూణేలో ఓ మైనర్ మద్యం మత్తులో ఫుల్ స్పీడ్లో పోర్షే కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఓ బైక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. కాగా, పోర్శే కారును మైనర్(17) నడిపాడని ఇప్పటివరకు పోలీసులు భావించారు. అతడిపైనే కేసు నమోదైంది. ప్రస్తుతం జువైనైల్ సెంటర్కు మైనర్ను తరలించారు. కాగా, ఈ ప్రమాదం జరిగినప్పుడు కారును నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. #Pune Porsche Car accident case: Accused Vishal patil, pub owner and driver shifted to jail after interrogation #porsche #porschecaraccidentinpune #pune #punecity #punenews #agrwal #kalyaninagar #accidentcase #accused #news #theupdatejuntionhttps://t.co/jGhBOiql24 pic.twitter.com/ep6fpeE5I2— The Update Junction (@TUJunction) May 23, 2024 ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న మైనర్ బాలుడి స్నేహితులు ఇద్దరు కూడా కారును డ్రైవరే నడిపాడని తెలిపారు. ప్రమాద సమయంలో తానే కారును నడిపానని డ్రైవర్ కూడా పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే, కేసు నుంచి మైనర్ను తప్పించేందుకే డ్రైవర్ను ఇరికిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. నిందితుడు వేదాంత్ అగర్వాల్ కన్నీరు పెడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నిందితుడి తల్లి శివానీ అగర్వాల్ స్పందించారు. ఈ సందర్భంగా తన కుమారుడిని రక్షించాలని కన్నీరుపెట్టుకున్నారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఇది ఫేక్ వీడియో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. PUNE PORSCHE CAR ACCIDENT A FAKE RAP VIDEO has been circulating online, claiming to be accused minor Vedant AggarwalNow, his mother, Shivani Aggarwal, has put out a clarification video seeking protection for her son(Use headphones - very strong language) pic.twitter.com/8iLh2Cq0Ku— Arnaz Hathiram (@ArnazHathiram) May 24, 2024 ఇక, ఈ ఘటనపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే మాట్లాడుతూ.. మైనర్కు మద్యం సరఫరా చేయడంతో పుణేలో డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. డ్రగ్స్ స్వాధీనం, మైనర్లకు మద్యం సరఫరాలు, డ్రంకెన్ డ్రైవ్ జరుగుతుంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. పోలీసులపై ఒత్తిడి తెస్తున్నది ఎవరు?. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలను, కుటుంబాలను చీల్చడంలో నిమగ్నమైందని విమర్శించారు. పుణే ఘటనకు బాధ్యులు ఎవరని ఏక్నాథ్ షిండే సర్కార్ను ఆమె ప్రశ్నించారు. దీంతో, ఆ ఘటన రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారింది. -
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
మైనర్లను డ్రైవింగ్కు ఎందుకు అనుమతించకూడదనేదానికి పూణె పోర్షే ప్రమాదం కొందరికి విషాదకరమైన ఉదాహరణ. తప్పతాగి, పోర్స్చే కారును 200 కి.మీ వేగంతో నడిపిన యువకుడు రెండు కుటుంబాల్లో అంతు లేని అగాధాన్ని మిగిల్చాడు. చెట్టంత ఎదిగిన బిడ్డలు తిరిగి రాని లోకాలకువెళ్లిపోయారన్న షాక్నుంచి తేరుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. పుణేలో ఆదివారం తెల్లవారుజామున హై-ఎండ్ కారు పోర్సే కారుమితిమీరిన వేగంతో దూసుకొచ్చి ముందు ఉన్న బైక్ను వేగంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొనడంతో బైక్పై ఉన్న ఇద్దరు ఎగిరిపడి స్పాట్లోనే చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంలో చనిపోయిన వారిని మధ్యప్రదేశ్కు చెందిన అనిష్ అవధియా , అశ్విని కోస్తా అనే ఇద్దరు 24 ఏళ్ల ఇంజనీర్లుగా గుర్తించారు.అశ్విని 20 అడుగుల ఎత్తుకు ఎగిరి బలంగా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.జబల్పూర్లో నివసించే అశ్విని తల్లి మమత ఇప్పటికీ షాక్లో ఉన్నారు. ‘‘కూతురికి పెళ్లి చేసి పల్లకీలో అత్తారింటికి పంపించాలను కున్నాం.. ఇలా పాడె ఎక్కించాల్సివస్తుందని ఊహించలేదు’’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.మా పాప అశ్వినికి న్యాయం జరగాలి. మైనర్ , అతని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలి. వారు అతన్ని సరిగ్గా పెంచలేదు. వారు అతనికి కారు ఇవ్వకూడదు," అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు జువెనైల్ జస్టిస్ బోర్డ్ విధించిన శిక్షపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. (300 పదాల వ్యాసం రాయడం, 15 రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలను అధ్యయనం చేయడం మద్యపానం అలవాటుపై మానసిక చికిత్స కోసం కౌన్సెలింగ్కు హాజరు కావడం వంటి షరతులు)"ఇది ఒక జోక్? అతను ఏ వ్యాసం వ్రాస్తాడు? అశ్విని చాలా టాలెంటెడ్ గర్ల్.. కోటిమందిలో ఒకరు ఆమెకు. చాలా కలలు కనింది’’ అంటూ" కన్నీళ్లు పెట్టుకున్నారు. తను చాలా స్మార్ట్, ఇండిపెండెంట్, అన్ని రంగాల్లో ముందుండేది..వచ్చే నెలలో మా నాన్నగారి పుట్టినరోజుకి రావాలని ప్లాన్ చేశాం.. ఆయనకు రిటైర్మెంట్ పార్టీ కూడా ఆమె ప్లాన్ చేసిందంటూ అశ్విని సోదరుడు సంప్రీత్ వాపోయాడు.“నా కొడుకుని చంపేసాడు.. ఇప్పుడు నా కొడుకుని ఎప్పటికీ కలవలేను.. ఆ అబ్బాయి హత్యచేశాడు. వాణ్ని సరిగ్గా పెంచి ఉంటే ఈ రోజు నా కొడుకు జీవించి ఉండేవాడు” అనిష్ అవధియా తల్లి సవితా అవధియా గర్భశోకమిది. అనీష్ ఎంబీఏ చేయాలనుకుంటున్నాడని, చాలా హ్యపీ, సరదాగాఉండే వాడంటూ కొడుకును తలచుకుని గుండెపగిలేలా రోదించారామె. ఇటీవల యానివర్సరీకి ఇంటికొచ్చాడు. మళ్లీ వస్తాను..గిప్ట్ తెస్తా అన్నాడు అంటూ గుర్తు చేసుకున్నారు.“అపరాధికి శిక్ష పడుతుంది.. కానీ ఇప్పుడు మా బిడ్డను ఎలా తిరిగి తీసుకొస్తారు, ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందు తన తల్లితో మాట్లాడి, త్వరలో వస్తానని చెప్పాడు. కుటుంబానికి పెద్ద ఆసరాగా ఉన్నాడు. పూణేలో ఉన్న నా చిన్న కొడుకును ఇప్పుడు ఎవరు చూసుకుంటారు?" కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకునే బాధ్యతాయుతమైన కొడుకు దూరమైపోయాడంటూ అనీష్ తండ్రి ఓం అవధియా కంట తడిపెట్టారు. -
పోర్షే కారు ప్రమాదం: ‘పబ్లో భారీ ఖర్చు’.. వెల్లడించిన పోలీసులు
ముంబై: పుణె రోడ్డు ప్రమాదం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన విషయాలను పుణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదానికి ముందు ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ బాలుడు కేవలం 90 నిమిషాలకు పబ్బులో రూ. 48 వేలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలను అమితేష్ కుమార్ తెలిపారు.‘‘శనివారం 10.40కి మైనర్ నిందితుడు తన స్నేహితులతో కలిసి కోసీ రెస్టారెంట్(పబ్)కు వెళ్లారు. అక్కడ వారు భారీ బిల్లును చెల్లించారు. స్నేహితులతకు మైనర్ బాలుడు రూ. 48 వేలతో మద్యం తాగారు. కోసీ రెస్టారెంట్ మూసిన తర్వాత.. అక్కడి నుంచి వారు రెండో పబ్ బాలక్ మారియట్కు అర్థరాత్రి 12.10 గంటలకు వెళ్లారు. బాలుడిని అదుపులోకి తీసుకున్న వెంటనే ఆదివారం మెడికల్ టెస్ట్ పంపి.. అతని రక్త నమూనాలను ఫొరెన్సిక్ విభాగానికి పంపించాము. మద్యం తాగి మూలమలుపు రోడ్డుపై పోర్షే కారుకు నంబర్ ప్లేట్ లేకుండా నడిపాడు. రోడ్డు ప్రమాదానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది’అని అమితేష్ కుమార్ తెలిపారు.‘‘మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదానికి ముందు పబ్లో మద్యం సేవించారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిర్థారణకు వచ్చాం. ఫొరెన్సిక్ విభాగానికి పంపిన రక్త నమూనాల రిపోర్టు కోసం వేచి చేస్తున్నాం’’ అని అసిస్టెంట్ పోలీసుల కమిషనర్ మనోజ్ పాలిట్ తెలిపారు.ఈ కేసులలో మైనర్ బాలుడి తండ్రిని పుణె పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మైనర్ బాలుడికి మద్యం సర్వ్ చేసిన రెండు హోటళ్లకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీఎం ఏక్నాథ్ షిండే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చాలా సీరియస్ అయ్యారు. దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సీపీ అమితేష్ కుమార్ తెలిపారు.ఆదివారం తెల్లవారుజామున మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి ఖరీదైన పోర్షే కారుతో ఓ బైక్ను దారుణంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్పై ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు ఐటీ ఫ్రొపెషనల్స్ మరణించారు. ఈ ఘటన కల్యాణి నగన్ జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో నిందిత బాలుడుని జువైనల్ జస్టిస్ కోర్టులో ప్రవేశపెట్టగా కఠినమైన షరతులతో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ మంజురూకు విధించి షరతులు కూడా చర్చనీయాంశం అయ్యాయి. -
పుణె మైనర్ ర్యాష్ డ్రైవింగ్ ఘటన .. ‘ఇది ప్రమాదం కాదు హత్యే’
మహారాష్ట్రలోని పుణెలో నిర్లక్ష్యంగా పోర్షే కారు నడిపి.. ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో మైనర్కు 15 గంటల్లోనే బెయిల్ లభించగా.. బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా పుణెలో ఆదివారం తెల్లవారు జామున 17 ఏళ్ల బాలుడు తాగిన మైకంలో పోర్స్చే కారుతో ఓ బైక్ను ఢీకొట్టిన సంగతి తెలిపిందే. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనీశ్, అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటన సమయంలో మైనర్ 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి బైక్ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాగా మైనర్ ర్యాష్ డ్రైవింగ్ రెండు కుంటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మరణించిన ఇద్దరి మృతదేహాలు మంగళవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. అనీశ్ అవదీయా మృతదేహాన్ని మధ్యప్రదేశ్ ఉమారియా జిల్లాలోని బిర్సింగ్పూర్కు తరలించారు. యువకుడి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బంధువులు ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మైనర్ డ్రైవర్కు బెయిల్ ఇవ్వకూడదని అనీశ్ కుటుంబ సభ్యులు, బంధువులు అన్నారు. ‘ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఇది ప్రమాదం కాదని హత్య మైనర్ తాగి గంటకు 240 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేస్తున్నాడు, అతడి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేదు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.ఈ దుర్ఘటన జరిగిన 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారు? అతడికి మంజూరైన బెయిల్ను రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు.గత రాత్రి అశ్విని కోష్ట మృతదేహం జబల్పూర్లోని ఆమె ఇంటికి చేరుకుంది. నిందితులకు బెయిల్ మంజూరు చేయడంపై వారి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. న్యాయ కోసం చివరి వరకు పోరాడతామని తెలిపింది. ‘మేము షాక్లో ఉన్నాము. నిందితుడికి 15 గంటల్లో బెయిల్ ఎలా ఇస్తారు. మైనర్తోపాటు అతడి తల్లిదండ్రులను విచారించాలి. అశ్విని తన కెరీర్పై ఎన్నో కలలు కంది. తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలని కోరుకుంది. మా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాం. అశ్విని అంత్యక్రియలు ముగిసిన తర్వాత మేము ఈ విషయాన్ని చర్చిస్తాం’ అని పేర్కొంది.కాాగా, ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ బాలుడికి కోర్టు 14 గంటల్లోనే జువైనల్ కోర్టు బెయిలు మంజూరు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 17 ఏళ్ల మైనర్కు జువెనైల్ కోర్టు బెయిలు మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది. రోడ్డు ప్రమాదాల ప్రభావాలు, వాటికి పరిష్కారాలను తెలియజేస్తూ 300 పదాలతో ఓ వ్యాసాన్ని రాయడం, 15 రోజులపాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయడం, మానసిక పరిస్థితిపై పరీక్ష చేయించుకుని, చికిత్స పొందడం వంటి షరతులను విధించింది. ప్రమాద తీవ్రతను ఆధారంగా నిందితులను మేజర్గా పరిగణించి విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పుణె పోలీసులు కోరగా కోర్టు తిరస్కరించింది. తాజాగా పోలీసులు సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. -
Pune Porsche Crash: మైనర్ తప్పిదం.. తండ్రి అరెస్ట్
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం కేసులో పోర్షే కారు నడిపిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్టు కింద ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సదరు మైనర్ బాలుడు ఆదివారం మద్యం మైకంతో పోర్షే కారుతో ఓ బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన మైనర్ బాలుడి తండ్రి పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు పలు బృందాలకు ఏర్పాడి మంగళవారం ఉదయం ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో అరెస్ట్ చేశారు.ప్రమాద సమయంలో 17 మైనర్ బాలుడు 200 కిలోమిట్లర్లు వేగంతో కారు నడిపి బైక్ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక.. పుణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘12వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత నిందిత బాలుడు స్థానిక పబ్లో సంబరాలు చేసుకున్నాడు. కారు ప్రమాదానికి ముందు అతను మద్యం సేవించి ఉన్నాడు. మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం తాగే చట్టపరమైన అనుమతి ఉంది. చట్టవ్యతిరేకంగా మైనరకు మద్యం ఇచ్చిన బార్ ఓనర్లుపై చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.రోడ్డు ప్రమాదం జరిగిన 15 గంటల లోపే మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. ఇక.. అతనికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు పలు షరతులు విధించింది. వాటన్నింటిని తప్పకుండా పాటించాలని ఆదేశించింది. తీవ్రమైన నిర్లక్ష్యంతో ఈ ఘటనకు పాల్పడిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్పై కూడా జువైనల్ జస్టిస్ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రముఖ బిల్డర్ అయిన విశాల్ అగర్వాల్ పరారీలో వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు సెర్చ్ చేసిన మంగళవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. -
కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
తన ర్యాష్ డ్రైవింగ్తో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందుతుడైన మైనర్కు 15 గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆశ్చర్యకర ఘటన మహారాష్ట్రలోని పుణెలో వెలుగుచూసింది.వివరాలు.. పుణెలో మైనర్ బాలుడి డ్రైవింగ్ కారణంగా ఇద్దరి ప్రాణాలు కోల్పోయారు. పుణెలో ఆదివారం తెల్లవారుజామున పోర్స్చే కారును అతివేగంగా నడిపిన 17 ఏళ్ల బాలుడు బైక్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనీష్ అవధియా, అశ్విని కోష్ట ఎగిరి పడ్డారు. కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో కారు గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.అయితే బాలుడు అరెస్టైన 15 గంటల్లోనే కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు మైనర్ అవ్వడం వల్ల కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని అతని తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ చెప్పారు. బాలుడు 15 రోజుల పాటు ఎరవాడలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని, ప్రమాదాలపై వ్యాసం రాయాలని కోర్టు తెలిపింది. మద్యపానం సేవించకుండా ఉండేందుకు చికిత్స చేయించుకోవాలని, అలాగే కౌన్సెలింగ్ సెషన్లు తీసుకోవాలని తెలిపింది. కాగా నిందితుడు పుణెకు చెందిన ప్రముఖ రియల్టర్ కుమారుడు కావడం గమనార్హం. -
Pune: బెయిల్ ఇస్తున్నాం.. ఈ షరతులు పాటించాల్సిందే
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనర్ బాలుడు పోర్షే కారుతో బైక్ను ఢికొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎరవాడ పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన మైనర్పై కేసు నమోదు చేసి జువెనైల్లో కోర్టులో ప్రవేశపెట్టారు. 17 ఏళ్ల ఆ బాలుడి తరఫు న్యాయవాది బెయిల్ కోరగా.. పలు షురతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాము విధించే షరతులను తప్పనిసరిగా పాటించాలని కోర్టు ఆదేశించింది.కోర్టు విధించిన షరతులు.. ‘ట్రాఫిక్ పోలీసుతో 15 రోజులు పని చేయాలి. మానసిక పరివర్తనకు సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి. ‘రోడ్డు ప్రమాదాలు, వాటి పరిష్కార మార్గాలు’అనే టాపిక్ మీద 300 పదాలలో వ్యాసం రాయాలి. డి- అడిక్షన్ సెంటర్లో పునరాసం కోరాలి. ట్రాఫిక్ రూల్స్ చదవి జువైనల్ జస్టిస్ బోర్డుకు ప్రజంటేషన్ ఇవ్వాలి. రోడ్డు ప్రమాద బాధితులకు భవిష్యత్తులో అండగా ఉండాలి’అని జువైనల్ కోర్టు మైనర్ బాలుడికి షరతులు విధించింది.ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ ఆదివారం ఉదయం కోరేగావ్ పార్క్ వద్ద వేగంగా పోర్షే కారును నడుతూ.. బైక్ను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో అనిస్ దుధియా ,అశ్విని కోస్టా మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!
అసాధారణమైన దృశ్యాలు కానీ.. శాస్త్రం తేల్చలేని సంఘటనలు కానీ.. ఎప్పటికీ మిస్టరీలుగానే మిగులుతాయి.మహారాష్ట్ర, శివపురిలోని హజ్రత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గాలో కూడా అలాంటి మిస్టరీనే దాగి ఉంది. ఆ దర్గాలో ఉన్న ఓ 90 కేజీల రాయి.. కేవలం పదకొండు మంది చూపుడు వేళ్ల మీద నిలబడిపోతుంది. ఆ తర్వాత గాల్లోకి తేలుతుంది.‘దర్వేష్ అలీ సాహెబ్’ అనే ఒక ముస్లిం సాధువు.. ఎక్కడి నుంచో ఆ ప్రదేశానికి వచ్చి.. కొంత కాలం అక్కడే జీవించి, అక్కడే సజీవ సమాధి అయ్యారనేది స్థానికుల కథనం. నిజానికి ఆ దర్గాను ముస్లిమ్ల కంటే హిందువులే ఎక్కువగా ఆరాధిస్తుండటం విశేషం. మరీ ముఖ్యంగా హిందువుల్లో కురుమ, యాదవులు తమ పెంపుడు జీవులైన గొర్రె జాతి వృద్ధి చెందాలని, అందుకు దర్వేష్ స్వామి ఆశీస్సులు ఉండాలని.. మొక్కుబడులు కట్టి, స్వామి పేరిట ప్రతి ఏడాది ఒక పొట్టేలును విడిచిపెడతారు. సంవత్సరం పాటు దాన్ని మేపి, ఉర్సు సందర్భంగా ఆ మొక్కు చెల్లించుకుంటారు. ఈ దర్గాను ‘దర్శెల్లి’ అని కూడా పిలుస్తారట. స్థానిక హిందువులు ఎంతో భక్తితో ఈ దర్గా స్వామి పేర్లను తమ పిల్లలకు పెట్టుకుంటారు. అందుకే అక్కడ ఎక్కువగా దర్శం,దర్శెల్లి అనే పేర్లు వినిపిస్తుంటాయి. ఈ అనవాయితీ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మొక్కితే కోరిన కోరికలు తీరతాయని నమ్ముతారు చాలామంది.ఇక ఆ రాయి విషయానికి వస్తే.. అది చూడటానికి సాధారణంగానే కనిపిస్తుంది. కానీ చేతి వేళ్ల సాయంతో ఆ బండ ఎలా గాల్లోకి లేస్తుంది? అనేది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. కండలు తిరిగిన ఆజానుబాహులు కొందరు ఆ బండను బలవంతంగా లేపి.. తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా పదకొండు మంది కలసి.. ‘దర్వేష్ అలీ బాబా’ నామాన్ని భక్తితో జపిస్తూ ఆ బండరాయిని లేపితే.. కేవలం వేళ్లపైనే.. అది తేలికగా పైకి లేస్తుంది. ఇది ఎలా సాధ్యమో నేటికీ మిస్టరీనే!సంహిత నిమ్మన (చదవండి: -
వడాపావ్ మంత్రం: పద్మాసని విజయరహస్యం
ఇంటి పనులతోనే సమయం సరిపోవడం లేదనే కంప్లైంట్ గృహిణుల నోట తరచూ వినిపిస్తుంటుంది. కొందరు మాత్రం కొద్దిపాటి ఖాళీ సమయాన్ని కూడాసద్వినియోగం చేసుకుంటూ తమని తాము తీర్చిదిద్దుకుంటారు. అలాంటి కొందరిలో పద్మాసని దరూరి ఒకరు. హైదరాబాద్ మాదాపూర్లో ఉంటున్న 53 ఏళ్ల పద్మాసని దరూరి గృహిణిగా ఉంటూ సంస్కృతంతో పాటు అనేక భాషల మీద పట్టు సాధించారు.భర్త ఉద్యోగరీత్యా పుణెలో ఉండటంతో అక్కడి స్థానిక వంటకాలను నేర్చుకున్నారు. పిల్లలు ఉద్యోగాలు చేసే సమయానికి వచ్చేసరికి నగరవాసులకు ‘పావ్ మంత్ర’ పేరుతో మహారాష్ట్రియన్ వంటకాలను పరిచయం చేస్తూ ఎంట్రప్రెన్యూర్గా ఎదిగారు. లోనూ ‘పంచసత్వ’ పేరుతో సౌత్ ఇండియన్ క్యుజిన్ను ్రపారంభిస్తున్నారు.గృహిణిగా ఉంటూనే వ్యాపారవేత్తగా ఎదిగిన పద్మాసని దరూరిని పలకరిస్తే ఇలా ఎన్నో కబుర్లు మన ముందుంచారు.‘‘మనలో అభిరుచి ఉండాలే గానీ ఎక్కడ ఉన్నా దానిని వృద్ధిలోకి తీసుకురావచ్చు. మా వారి ఉద్యోగ రీత్యా పుణేలో ఉండేవాళ్లం. గృహిణిగా ఇల్లు, పిల్లల పనులు ఎప్పుడూ ఉండేవే. పిల్లలు హై స్కూల్కి వచ్చాక నేను వేదాంత అకాడమీలో చేరి మూడు నెలల్లో సంస్కృతాన్ని నేర్చుకున్నాను. మన పురాణేతిహాసాలు చదువుతూ సబ్జెక్ట్పై పట్టు సాధించగలిగాను. కార్పొరేట్ కంపెనీలలో పని చేసేవారి ఆసక్తిని బట్టి, అక్కడకు వెళ్లి సంస్కృతం క్లాసులు తీసుకునేదాన్ని. రామాయణ, మహా భారతాల గురించి క్షుణ్ణంగా వివరించేదాన్ని. వేదాంత అకాడమీలో నేర్చుకున్న విషయాలను ఇంటికి వచ్చి పిల్లలకు చెబుతుండేదాన్ని. దీంతో వారు స్కూల్లో చదువుకున్న విషయాలే కాకుండా మన వేదాల గురించి, పురాణాల గురించీ కూడా తెలుసుకోగలిగారు.వివిధ రకాల భాషలుసంస్కృతంతో పాటు హిందీ, ఇంగ్లిష్, మరాఠీ.. ఇలా రకరకాల భాషలను ఆసక్తితో నేర్చుకున్నాను. వీటితోపాటు దేశంలోని అన్ని రకాల ్రపాచీన సంస్కృతుల గురించి తెలుసుకోవడం, వాటిని ఆచరించడం చేస్తుండేదాన్ని. ఈ క్రమంలో అన్ని రకాల వంటకాల తయారీని ఇష్టంగా చేసేదాన్ని. వాటిని మా ఇంట్లో వారికే కాదు మా చుట్టుపక్కల వారికీ రుచి చూపించేదాన్ని. అందరూ మెచ్చుకునేవారు. మా అబ్బాయిలిద్దరూ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తయ్యాక నాకు మరింత వెసులుబాటు దొరికింది. నా వంటకాల రుచితో బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది. రుచిగా.. పావ్ మంత్రతరచూ ఇంట్లో బిజినెస్ ఆలోచనల గురించి చర్చ జరుగుతున్నప్పుడు నేను, మా పెద్దబ్బాయి కలిసి ఒక ఫుడ్ స్టార్టప్ ్రపారంభించాలనుకున్నాం. మా స్టార్టప్కి వాత్సల్య అనే పేరు అనుకున్నాం. పుణెలో స్థానిక ఫుడ్ వడాపావ్. అక్కడ స్ట్రీట్ఫుడ్గా దీనికి పేరుంది. హైదరాబాద్ వాసులకు ఈ వడాపావ్ రుచిని కొత్తగా అందించాలనుకున్నాను. పుణెలో వడాపావ్ టేస్ట్, మన దగ్గర టేస్ట్కి భిన్నంగా ఉంటుంది. ఏ పనైనా ఒకసారి మొదలుపెడితే దాంట్లో నూటికి నూరు శాతం దృష్టి పెట్టాల్సిందే అనుకొని వ్యాపారంలోకి దిగాను. పావ్కి విభిన్నమైన రుచిని తెప్పించడం కోసం రకరకాల ప్రయోగాలు చేసి, విజయవంతమయ్యాం. మా పిల్లలు వామన్, కేశవ్ లు తమ పూర్తి సహకారాన్ని నాకు అందించారు. దాంతో ‘పావ్మంత్ర’ పేరుతో ఫుడ్ బిజినెస్ను కరోనా సెకండ్ వేవ్లో మాదాపూర్లో ్రపారంభించాం. మా స్టార్టప్కి మహారాష్ట్ర, ఫార్సీ ఆంబియన్స్ వచ్చేలా ΄్లాన్ చేశాం. కొద్ది రోజుల్లోనే నోటి మాట ద్వారానే అందరికీ తెలియడంతో మంచి పేరు వచ్చింది. నేను కన్న కల రెండున్నరేళ్లలోనే సాకారం అయ్యింది. ఈ నెలలో పుణెలో ‘పంచసత్వ’ పేరుతో సౌత్ ఇండియన్ క్యుజిన్ను అందించబోతున్నాను. గృహిణిగా ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ ఉన్న నేను 53 ఏళ్ల వయసులో ఇలా బిజినెస్ ఉమెన్గా ఎదుగుతానని అస్సలు ఊహించలేదు. నా అభిరుచికి మేరకు ఒక్కో ప్రయత్నం చేస్తూ ప్రయాణిస్తున్నాను. ఈ ప్రయాణంలో నా పిల్లలు తోడయ్యారు. తొంభై ఏళ్ల వయసున్న నా తల్లిదండ్రులూ నా ఆసక్తిని, అభిరుచిని గౌరవిస్తూ తమ ఆశీస్సులను అందిస్తున్నారు. అమ్మనాన్నలను చూసుకుంటూ, భర్త, పిల్లల బాగోగులను గమనిస్తూ, నన్ను నేనుగా మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నం ఎప్పుడూ నాకు మంచి ఫలితాలను ఇస్తూ వచ్చింది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింతగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ వివరించారు పద్మాసని. – నిర్మలారెడ్డి -
ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
పుణె: ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ప్రదీప్ వసంత్ నాయక్ సతీమణి ఓటు గల్లంతయింది. ఓటర్ల జాబితా నుంచి తన భార్య మధుబాల పేరు తొలగించడంపై ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రదీప్ వసంత్ నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.సోమవారం ఉదయం పుణెలోని సాప్లింగ్ స్కూల్ బ్యానర్ రోడ్లోని పోలింగ్ బూత్ నంబరు26లో ఓటింగ్ ప్రారంభమైన వెంటనే ఏసీఎం నాయక్, తన భార్య, కుమారుడు వినీత్తో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. అయితే తన భార్య పేరు ఓటరు జాబితాలో కనిపించలేదు. విషయాన్ని అక్కడి అధికారి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు, ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారని ఏసీఎం నాయక్ పీటీఐకి చెప్పారు.“మేము పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పుడు స్థానిక కార్పొరేటర్ ఇచ్చిన ఓటరు స్లిప్పులు మా వద్ద ఉన్నాయి. కానీ నా భార్య పేరు జాబితాలో లేదు”అని ఎయిర్స్ ఫోర్స్ మాజీ చీఫ్ వాపోయారు. పుణె సిట్టింగ్ ఎంపీ గిరీష్ బాపట్ మరణం తర్వాత బీజేపీ మాజీ మేయర్ మురళీధర్ మోహోల్ను పుణె లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. గత ఏడాది జరిగిన కస్బా అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీని ఓడించిన రవీంద్ర ధంగేకర్ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. -
Viral Video: జాబ్ మానేసి.. మేనేజర్ ముందు తీన్మార్ డ్యాన్స్లు
ఈ రోజుల్లో ఉద్యోగం రావడం అంటే చాలా కష్టం.. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నా.. దానిని నిలబెట్టుకోవాలంటే కత్తిమీద సాము లాంటిది. ఉద్యోగంలో ఒత్తిడి, సరిపోని జీతం, సమయ వేళలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని భరించలేక ఉద్యోగం మానేస్తుంటారు. ఉన్న ఉద్యోగం పోయినప్పుడు చాలా మంది బాధపడుతుంటారు. కానీ మహారాష్ట్రలో ఓ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి జాబ్ మానేసి, ఆఫీసు ఎదుట డ్యాన్స్ చేసి మరి ఎంజాయి చేశాడు. ఈ ఆశ్యర్యకర ఘటన పుణెలో వెలుగుచూసింది. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ వ్యక్తి తన మాజీ మేనేజర్కు విచిత్రంగా విడ్కోలు పలికారు. బ్యాండ్ను ఆఫీస్ వద్దకు పిలిపించి బాస్ ముందు తీన్మార్ స్టెప్పులు వేశారు. తోటి ఉద్యోగులకు విచిత్రంగా తన రాజీనామా విషయాన్ని తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టుచేయగా వైరల్గా మారింది. పూణేకు చెందిన అనికేత్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా ఓ కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అయితే ఆ జాబ్లో ఒత్తిడి, సీనియర్ల నుంచి వచ్చే వేధింపులు, సరిపడని జీతంతో తీవ్రంగా సతమతం అయ్యాడు. చివరికి ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇక తన చివరి వర్కింగ్ డే రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించాలనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాడు.ఆఫీస్ వద్దకే బ్యాండ్ను తీసుకువచ్చి.. డ్యాన్స్ చేశాడు. మేనేజర్ బయటకు వచ్చే దాకా అక్కడే ఉండి, అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘సారీ సర్ బాయ్ బాయ్’ అంటూ ఆనందంగా స్టెప్పులేశాడు. ఊహించని పరిణామానికి ఆ కంపెనీ మేనేజర్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో వైరలవ్వడంతో చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. తాము కూడా ఉద్యోగంలో ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. అనికేత్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఉద్యోగం మానేసిన అనికేత్ జిమ్ ట్రైనర్ కావాలని ప్రయత్నిస్తున్నట్లు అతని స్నేహితుడు భగత్ తెలిపారు. View this post on Instagram A post shared by Anish Bhagat (@anishbhagatt) -
Vijay prakash kondekar: పట్టువదలని విక్రమార్కుడు
విజయ ప్రకాశ్ కొండేకర్. తెల్లగడ్డం, తెల్లని దోతీ, భుజంపై కండువా, ఒంటిపై అంగి కూడా లేకుండా కనిపిస్తాడు. కానీ పట్టు వదలని విక్రమార్కుడనే పదబంధానికి నిలువెత్తు రూపం. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఈయన స్థానిక సంస్థల నుంచి లోక్సభ దాకా ఇప్పటికి ఏకంగా 25 సార్లు పోటీ చేశారు. దశాబ్దాలుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి 1980ల్లో రిటైరయ్యారు. ‘బూటు గుర్తునే గెలిపించండి’ అని రాసున్న ప్లకార్డును ఓ బండిపై పెట్టుకుని కాలినడకన ప్రచారం చేస్తుంటారు. నగర వీధుల్లో అతడిని కొందరు పట్టించుకోకుండా వెళ్తే మరి కొందరు సెలీ్ఫలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో ఉచితంగా ప్రచారం దొరికిందంటూ సంతోషిస్తారాయన. గెలిచే అవకాశం లేదని తెలిసినా ప్రచారం కోసం పూరీ్వకుల భూమి, ఇల్లు అమ్మేశాడు. ఎప్పటికైనా ప్రధాని కావాలన్నది ఆయన కలట. దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్ని సార్లైనా పోటీ చేస్తూనే ఉంటానంటారు కొండేకర్. ఆయన కంటే ఘనుడు మరొకరున్నారు. ఆయనే కె.పద్మరాజన్. గిన్నిస్ రికార్డు కోసం 170 కంటే ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్గాంధీపైనే బరిలో దిగారు! అలాగే యూపీలోని ఆగ్రా జిల్లాకు చెందిన 78 ఏళ్ల హస్నురామ్ అంబేద్కరి ఇప్పటిదాకా ఏకంగా 98సార్లు ఎన్నికల్లో తలపడ్డారు. ఈసారి కూడా ఆగ్రా, ఫతేపుర్సిక్రీ స్థానాల్లో నామినేషన్ వేస్తున్నారు. ఆ రెండింట్లోనూ ఓడి సెంచరీ కొడతారట! ‘నీ భార్యే నీకు ఓటేయదు. ఇతరులెలా వేస్తారు’ అంటూ ఓ బీఎస్పీ నేత అవమానించడంతో విజయం కోసం కాకుండా ఓట్ల కోసం ఆయన ఇలా పోటీ చేస్తూనే ఉన్నారు!! -
Ananya Tripathi: కోడర్ టు రియల్ ఎస్టేట్ క్వీన్
రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల పేర్లు అరుదుగా వినిపిస్తాయి. కోడర్, స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, సీయీవోగా మంచి పేరు తెచ్చుకున్న 39 సంవత్సరాల అనన్య త్రిపాఠి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టి విజయం సాధించింది. ‘రియల్ ఎస్టేట్ క్వీన్’గా పేరు తెచ్చుకుంది... ఆర్మీ ఆఫీసర్ కూతురు అయిన అనన్య త్రిపాఠి తరచుగా ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కు మారుతూ ఉండేది. ‘రకరకాల ప్రాంతాలలో చదువుకోవడం వల్ల ఎన్నో సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం, అదృష్టం దొరికింది’ అంటుంది అనన్య. పుణెలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ పూర్తిగా చేసిన అనన్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ‘టీసీఎస్’ తొలి ఉద్యోగం చేసింది. కోడర్గా మంచి పేరు వచ్చినా తన దృష్టి వ్యాపారంగంపై మళ్లింది. అలా కోళికోద్ – ఐఐఎంలో ఎంబీఏ చేసింది. క్యాంపస్ సెలెక్షన్లో ‘మెకిన్సీ’కి ఎంపికైన ఏకైక స్టూడెంట్ అనన్య. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెకిన్సీ’లో ఏడు సంవత్సరాల ప్రయాణం తనకు ఎన్నో పాఠాలు నేర్పింది. మార్గదర్శకులలాంటి వ్యక్తులతో పరిచయం జరిగింది. విశ్లేషణాత్మకంగా ఉండడంతో పాటు స్ట్రక్చర్డ్ డాటా తాలూకు సమస్యలను పరిష్కారించడానికి సంబంధించిన జ్ఞానాన్ని మెకిన్సీలో సొంతం చేసుకుంది. అయితే ఫ్యాషన్ ఇ–కామర్స్ కంపెనీ ‘మింత్రా’ నుంచి వచ్చిన అవకాశం అనన్య కెరీర్ను మార్చి వేసింది. ఇ–కామర్స్ గురించి ఎన్నో సందేహాలు ఉన్న ఆ కాలంలో ‘మింత్రా’ నుంచి వచ్చిన ఆఫర్కు వెంటనే ఓకే చెప్పడం కష్టమే. అయినప్పటికీ సందేహాలను పక్కన పెట్టి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ హోదాలో ‘మింత్రా’లో చేరింది అనన్య. మూడున్నరేళ్లలో ‘మింత్రా’ లాభాలను పెంచింది. ఆ తరువాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ‘కేకేఆర్ కేప్స్టోన్’ నుంచి కొత్త కెరీర్ ఆపర్చునిటీ వెదుక్కుంటూ వచ్చింది. ‘కేకేఆర్’లో మాక్స్ హెల్త్కేర్, వినీ కాస్మెటిక్స్లాంటి కంపెనీలతో కలిసి పనిచేసింది. అనన్య మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ గ్రూప్ ‘బ్రూక్ఫీల్డ్’ నుండి పిలుపు వచ్చింది. మామూలుగానైతే మెటర్నిటీ బ్రేక్లో ఉన్నప్పుడు సెలవు కాలం పూర్తయ్యేంత వరకు చాలా కంపెనీలు వేచి చూడవు. అయితే బ్రూక్ఫీల్డ్ మాత్రం అనన్య ప్రతిభాసామర్థ్యాలపై నమ్మకంతో ఓపిగ్గా వేచి చూసింది. వారి నమ్మకాన్ని అనన్య వమ్ము చేయలేదు. ‘పలు పరిశ్రమలకు సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్లలో అనన్యకు అపారమైన అనుభవం ఉంది. స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా ఆమె ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది’ అంటాడు బ్రూక్ఫీల్డ్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ పార్టనర్ అంకుర్ గుప్తా. బ్రూక్ఫీల్డ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్గా మరోసారి గెలుపు జెండా ఎగరేసిన అనన్య త్రిపాఠి నుంచి వినిపించే సక్సెస్మంత్రా ‘కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి’. -
Pune:హోటల్లో దారుణం.. పాయింట్ బ్లాంక్లో కాల్చి హత్య
పుణె: మహారాష్ట్రలోని పుణె సమీపంలో దారుణం జరిగింది. పుణె-సోలాపూర్ నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక రెస్టారెంట్లో అవినాష్ దాన్వే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి కస్టమర్లలా వచ్చిన ఇద్దరు వ్యక్తులు నేరుగా స్నేహితులతో కూర్చున్న దాన్వే వద్దకు వెళ్లి తలపై పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి కాల్చారు. తలపై కాల్చగానే దాన్వే కిందపడిపోయాడు. అతని స్నేహితులు రెస్టారెంట్ నుంచి పారిపోయారు. ఇంతటితో ఆగకుండా మరో నలుగురైదుగురు దుండగులు రెస్టారెంట్ లోపలికి వచ్చి కాల్పులకు గురై పడిపోయిన దాన్వేను కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. ఈ దారుణ హత్య హోటల్ సీసీ టీవీ కెమెరాల్లో నమోదైంది. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి.. గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి -
రూ.2,500 కోట్ల విలువైన ‘మ్యావ్ మ్యావ్’ పట్టివేత.. ఏంటిది?
న్యూఢిల్లీ, పుణె: దేశ రాజధాని ఢిల్లీ, పుణెలో నిర్వహించిన భారీ ఆపరేషన్లో దాదాపు 1,100 కిలోల నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్(ఎండీ)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా మ్యావ్ మ్యావ్ అని పిలువబడే దీని విలువ రూ. 2,500 కోట్లు ఉంటుందని పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. పుణెలో ముగ్గురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 700 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకోవడంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నిందితుల విచారణ అనంతరం ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో దాడులు నిర్వహించి 400 కిలోల సింథటిక్ ఉద్దీపనను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పుణెలోని కుర్కుంభ ఎమ్ఐడీసీ ప్రాంతంలో ని ఓ ఫార్మాస్యూటికల్ ప్లాంట్లో 700 కిలోల డ్రగ్ను సీజ్ చేశారు. కాగా మహారాష్ట్రలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి. అంతేగాక దేశంలోనే అత్యంత ముఖ్యమైన డ్రగ్స్ బస్ట్లలో ఒకటి. ఈ ఘటనపై పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్కు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. వీరిలో ముగ్గురు కొరియర్ బాయ్స్తోపాటు మరో ఇద్దరు ప్రస్తుతం విచారణలో ఉన్నట్లు తెలిపారు. ఫార్మా ప్లాంట్ ఓనర్ను అరెస్టు చేశామని, భీంజీ అలియాస్ అనిల్ పరశురాం, కెమికల్ ఇంజినీర్ యువరాజ్ బబన్ భుజ్భాయ్కు దీంతో సంబంధం ఉందని పేర్కొన్నారు. పుణె బృందం ఢిల్లీ వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో అక్కడ దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ రాకెట్లో కొందరు విదేశీయులు, విదేశాల్లోని భారతీయుల హస్తం కూడా ఉన్నట్లు తాము గుర్తించామని చెప్పారు. డగ్స్ను ప్యాక్ చేయడానికి నిందితులు ఉప్పు గోదాములను వినియోగించినట్లు పేర్కొన్నారు. ఇక మెఫెడ్రిన్ తయారీ, విక్రయంపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. దీనిని ఉల్లంఘిస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చు. -
పుణెలో గూగుల్ కొత్త ఆఫీస్.. ఎలా ఉందో చూడండి..
Google New Office In Pune : భారత్లో విస్తరణను కొనసాగిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్ ( Google ) ఇటీవల పుణెలోని కోరేగావ్ పార్క్ అనెక్స్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయం ద్వారా గ్లోబల్ ఇంజినీరింగ్ బృందాల సహకారంతో అధునాతన ఎంటర్ప్రైజ్ క్లౌడ్ టెక్నాలజీల రూపకల్పన, రియల్ టైమ్లో సాంకేతిక సలహాలను అందించడం, ప్రొడక్ట్ ఇంప్లిమెంటేషన్ నైపుణ్యాలను అందిస్తారు. ఇక్కడ 1,300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తారని అంచనా. పుణెలోని గూగుల్ కొత్త ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అర్ష్ గోయల్.. అక్కడ ఉద్యోగుల కోసం అందుబాటులో ఉన్న పలు సౌకర్యాల గురించి తెలియజేశారు. దీనికి సంబంధించి తీసిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. విశాలమైన ఆఫీస్లో అందమైన ఇంటీరియర్స్ తోపాటు నోరూరించే ఆహారంతో కేఫ్, గేమ్ జోన్, రిక్రియేషన్ రూమ్ వంటి ఆకట్టుకునే సౌకర్యాలు ఉన్నాయి. ''పుణెలో కొత్తగా ప్రారంభించిన గూగుల్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రోజు ఎలా ఉంటుందో చూడండి'' అంటూ తన ఫోలోవర్లతో వీడియోను పంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి 4,70,000 కుపైగా వీవ్స్, 18,000 కుపైగా లైక్లను పొందింది. చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు గూగుల్ కొత్త ఆఫీస్ ఇష్టపడ్డారు.అక్కడ పని చేయడానికి తాము ఇష్టపడుతున్నట్లు కామెంట్లు పెట్టారు. పుణెలో ఏర్పాటైన ఈ కొత్త ఆఫీస్తో గూగుల్కి ఇప్పుడు భారత్లో హైదరాబాద్లోని తన దేశ ప్రధాన కార్యాలయంతో సహా ఐదు కార్యాలయాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Arsh Goyal (@arshgoyalyt) -
పుణె హోటల్లో దారుణం.. సాఫ్ట్వేర్ యువతిని కాల్చిచంపిన ప్రియుడు
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ప్రియుడి చేతితో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రియురాలి క్యారెక్టర్పై అనుమానం పెంచుకున్న ప్రియుడు.. ఆమెను పుణెలోని హోటల్కు తీసుకెళ్లి తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన పింప్రి చించ్వాడ్లోని హింజవాడిలో ఓయో టౌన్ హౌజ్లో ఆదివారం వెలుగుచూసింది. నిందితుడిని రిషబ్ నిగమ్గా గుర్తించిన పోలీసులు ముంబైలో అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన వందన ద్వివేది అనే యువతి హింజావడిలోని ప్రముఖ ఐటీసంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పనిచేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన రిషబ్ నిగమ్కు.. వందనకు పదేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వందనను కలిసేందుకు రిషబ్ పుణె వచ్చాడు. ఇద్దరు కలిసి హింజవడిలో హోటల్లో గదితీసుకొని జనవరి 25 నుంచి అక్కడే ఉంటున్నారు. అయితే శనివారం రాత్రి వందనను తుపాకీ కాల్చి చంపిన రిషబ్.. అనంతరం హోటల్ నుంచి పరారయ్యాడు. ఆదివారం హోటల్ సిబ్బందికి గదిలో వందన మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వందనపై అనుమానం పెంచుకుని, ఆమెను చంపేయాలన్న ఆలోచనతోనే పుణె వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వందనను కాల్చి చంపిన తరువాత శనివారం రాత్రి 10 గంటలకు ఒక్కడే గది నుంచి బయటకు రావడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. హత్య అనంతరం నిందితుడు ముంబైకు పారిపోవడంతో అక్కడే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇతర విషయాలపై దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి మృతి -
బిడ్డ కోసం మెట్రో ట్రాక్పై దూకిన తల్లి! అంతలోనే..
Real Hero Video: సమయస్ఫూర్తి.. ఒక్కోసారి దీని వల్ల పెను ముప్పులు తప్పుతుంటాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించడం వల్లే ఓ తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచాయి. అందుకే అంతా ఆయన్ని హీరోగా అభినందిస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి మూడేళ్ల పిల్లాడు మెట్రో టాక్ మీద పడిపోగా..ఆ వెంటనే అతని రక్షించేందుకు అతని తల్లి దూకేసింది. ఇది గమనించిన కొందరు అక్కడికి చేరుకుని వాళ్లను పైకి లాగే యత్నం చేశారు. ఈలోపు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ సకాలంలో స్పందించకుండా ఉంటే.. ఘోరమే జరిగేది. Heroic #PuneMetro Guard Saves 3-Year-Old's Life with Quick Thinking Read More: https://t.co/dQMGU1PHAe pic.twitter.com/YW4Q6f1wAx — Punekar News (@punekarnews) January 19, 2024 పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆయన అక్కడున్న ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. దీంతో స్టేషన్కు మరికొద్ది క్షణాల్లో చేరాల్సిన రైలు.. 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఈలోపు ట్రాక్ మీద నుంచి ఆ తల్లీబిడ్డలిద్దరినీ పైకి లాగారు అక్కడున్న జనాలు. వాళ్లిద్దరికీ చిన్నపాటి గాయం కూడా కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు పేరు వికాస్ బంగర్. పుణే సివిల్ కోర్టు మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇలాంటి చోట్ల పిల్లలతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. -
పుణే ఉప ఎన్నికపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: పుణే ఎంపీ గిరీశ్ బాపత్ మృతితో తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న ఆ ఎంపీ స్థానానికి వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఈసీని ఆదేశిస్తూ బాంబే హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ప్రస్తుత లోక్సభ కాలపరిమితి జూన్ 16వ తేదీతో ముగుస్తున్న కారణంగా ఆ ఒక్క స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణ వృథా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. ‘‘ ఈ స్థానం ఖాళీగా ఉంటే ఈసీ ఇన్ని రోజులు ఈసీ ఏం చేస్తున్నట్లు?. ఇలాంటి సందర్భాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాటించాల్సిన విధివిధానాలపై మార్గదర్శకాలను త్వరలో వెలువరిస్తాం’ అని బెంచ్ పేర్కొంది. గత ఏడాది మార్చి 29వ తేదీన ఇక్కడి బీజేపీ ఎంపీ గిరీశ్ బాపత్ కన్నుమూశారు. ఈ స్థానానికి ఉపఎన్నికలు ఉండవని ఈసీ చెప్పడంతో పుణేకు చెందినన సుఘోష్ జోషి గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పుణే స్థానం ఖాళీ అయినప్పటి నుంచీ పలు అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించింది. పుణే విషయంలో ఈసీ గతంలో ఇచ్చిన వివరణ హేతుబద్ధంగా లేదు. అందుకే అక్కడ తక్షణం ఉప ఎన్నిక నిర్వహించండి’’ అంటూ ఈసీని బాంబే హైకోర్టు ఆదేశించింది. వాటిని ఈసీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. -
పెళ్లి రోజే.. సొంత ముఠా చేతిలో గ్యాంగ్స్టర్ హతం..
పుణె: గ్యాంగ్స్టర్ శరద్ మోహోల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆర్ధిక వివాదాల నేపథ్యంలో సొంత ముఠా సభ్యులే ఆయన్ను కాల్చి చంపారు. ఈ ఘటన పుణెలో శుక్రవారం చోటుచేసుకుంది. హత్య దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వివరాలు.. గ్యాంగ్స్టర్ శరద్ మోహల్ (40)కు, అతడి గ్యాంగ్ సభ్యులకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో శరద్ మోహోల్, అతని గ్యాంగ్ పుణెలోని కొత్రుడ్ రోడ్డుపై నడస్తూ వస్తున్నారు. చిన్న సందులోకి వెళ్లిన తర్వాత శరద్పై తన ముఠా సభ్యులు తుపాకీతో కాల్పులు జరిపారు. గఅతని ఛాతీకి ఒక బుల్లెట్, భుజానికి రెండు బుల్లెట్లు తగిలి కిందపడిపోయాడు. నిందితులు వెంటనే అతన్ని పక్కకు లాక్కెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న శరద్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు . కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు తుపాకులు, మూడు మ్యగజైన్లు, అయిదు రౌండ్ల బుల్లెట్లను ను స్వాధీనం చేసుకున్నారు. శరద్ మోహల్పై ఎన్నో దోపీడి, హత్య కేసులు ఉన్నాయి. డబ్బు, భూ వివాదాల కారణంగానే అతడిని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. .దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో స్పందిస్తూ.. మొహోల్ను అతని అనుచరులే చంపారని ఇది గ్యాంగ్ వార్ కాదన్నారు. -
D Y Chandrachud: మాట వినే లక్షణమేదీ?
ముంబై: నేటి సమాజంలో ఇతరులు చెప్పేది వినే లక్షణం లోపిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. ఎవరికి వారు తమ వైఖరే గొప్ప అనుకుంటూ ఒక చట్రానికి పరిమితమై బతుకుతున్నారన్నారు. ‘‘ఈ ధోరణిని బద్దలు కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇతరులు చెప్పేది వినడం గొప్ప కళ. దాని ద్వారా అవగాహన పరిధి ఎంతగానో పెరుగుతుంది. ప్రపంచాన్ని సరికొత్తగా అర్థం చేసుకోగలం’’అని హితవు పలికారు. శనివారం ఆయన పుణెలోని సింబయాసిస్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. వ్యక్తిగత వృత్తిగత జీవితంలో ఆగ్రహావేశాలు, హింస, ఇతరులను అగౌరవపరడం వంటివాటితో నష్టాలే తప్ప సాధించేదేమీ ఉండదని విద్యార్థులు అర్థం చేసుకోవాలన్నారు. వినయ విధేయతలు, ధైర్యం, సమగ్రతలే ఆయుధంగా ముందుకు సాగాలని హితవు పలికారు. నేటి యువత ప్రశ్నించేందుకు అస్సలు వెనకాడకపోవడం మంచి పరిణామమన్నారు. సమాజంలో విభజనవాదం నానాటికీ పెరిగిపోతోందని ముంబైలో జమునాలాల్ బజాజ్ అవార్డుల ప్రదానోత్సవంలో సీజేఐ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘సోషల్ మీడియాలో కన్పిస్తున్న ధోరణులు, అసహనం దీనికి సంకేతాలే. భారత్ కూడా ఇందుకు అతీతం కాదు’’ అని అభిప్రాయపడ్డారు. -
రైలులో కలుషిత ఆహారం.. 40 మందికి అనారోగ్యం
మహారాష్ట్రలోని పూణె రైల్వే స్టేషన్లో కలకలం చెలరేగింది. చెన్నై నుంచి పుణెకు వస్తున్న భారత్ గౌరవ్ రైలులో 40 మంది ప్రయాణికుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. రైలు పూణె చేరుకోగానే ప్రయాణికులకు వైద్య చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రైలు పూణే చేరుకోగానే 80 మంది ప్రయాణికుల అనారోగ్యానికి గురైనట్లు తమకు ఫిర్యాదు అందిందని పూణే రైల్వే అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఆ తర్వాత వారికి రైల్వేస్టేషన్లోనే ప్రథమ చికిత్స అందించి, ఆ తరువాత బాధితులను ససూన్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైలులో ఉన్న కొందరు యువకులు రైలులోనివారికి కలుషిత ఆహారం ఇచ్చారు. రైల్వేశాఖ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. ఇది కూడా చదవండి: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే.. Bharat Gaurav Train Food Poisoning: 40 Passengers Fall Sick After Eating Food on Chennai-Pune Train (Watch Video)#BharatGauravTrain #FoodPoisoning #ChennaiPuneTrain #ViralVideo #Chennai #Punehttps://t.co/0Y63ZBmPVL — LatestLY (@latestly) November 29, 2023 -
బర్త్డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తను గుద్ది చంపేసింది
పుణె: తన పుట్టినరోజును పురస్కరించుకుని దుబాయ్కు తీసుకెళ్లి వేడుక చేయలేదనే వీరావేశంతో భర్తను భార్య పిడిగుద్దులు కురిపించి చంపేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుణెకు చెందిన 38 ఏళ్ల నిఖిల్ ఖన్నా వాన్వాడియా ప్రాంతంలో వ్యాపారం చేస్తుండేవారు. అతనికి 36 ఏళ్ల భార్య రేణుక ఉంది. ఆమె పుట్టినరోజు సెప్టెంబర్ 18. అదే రోజున తనను దుబాయ్కు తీసుకెళ్లి పుట్టినరోజు వేడుక జరపాలని పట్టుబట్టింది. అందుకు భర్త ససేమిరా అన్నాడు. ఈ నెల ఐదో తేదీన వీరి వివాహ వార్షికోత్సం జరిగింది. ఆ రోజూ తనకేమైనా ప్రత్యేక బహుమతులు ఇస్తాడేమో అని ఆశపడి భంగపడింది. ఢిల్లీలోని తన బంధువుల వేడుకలకూ వెళ్లాలని భావించినా అదీ నెరవేరలేదు. ఒకదాని వెంట మరోటి ఏ ఒక్క ఆశ తీరకపోవడంతో నవంబర్ 24వ తేదీన భర్తతో వాగ్వాదానికి దిగింది. తీవ్ర వాదులాట సందర్భంగా వీరావేశంతో భర్త ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో ముక్కు నుంచి రక్తం కారుతూ అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భార్యభర్త ఘర్షణ పడుతున్న విషయం తెల్సి ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి భర్తను వెంటనే దగ్గర్లోని ససూన్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ఆయన ప్రాణం పోయిందని వైద్యులు ధృవీకరించారు. -
బర్త్డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తపై భార్య దాడి, మృతి
ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు దుబాయ్కు తీసుకెళ్లలేదని ఆగ్రహించిన భార్య.. భర్తపై దాడికి దిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విచిత్ర ఉదంతం పుణెలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు.. వానావ్డీ ప్రాంతంలోని రెసిడెన్షియల్ సొసైటీలోని ఓ ఆపార్ట్మెంట్లో 36 ఏళ్ల నిఖిల్ ఖన్నా, తన భార్య రేణుక(33)తో కలిసి జీవిస్తున్నాడు. వీరు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా.. నిఖిల్ నిర్మాణ రంగంలో వ్యాపారిగా పనిచేస్తున్నారు. ఇటీవల రేణుక బర్త్డే జరగ్గా.. ఆ వేడుకలను జరుపుకునేందుకు దుబాయ్ వెళ్దామని శుక్రవారం మధ్యహ్నాం తన భర్త నిఖిల్ను అడిగింది. ఇందుకు అతడు నిరాకరించాడు. పుట్టినరోజు, పెళ్లి రోజు నిఖిల్ తన భార్యకు ఖరీదైన బహుమతులు ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెందింది. కనీసం కొంతమంది బంధువులతో అయినా ఢిల్లీ వెళ్లి సెలబ్రేట్ చేసుకుందని తన భర్తను కోరినప్పటికీ అతని నుంచి ఎలాంటి స్పందర రాలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణ ఆవేశంలో నిఖిల్ ముఖంపై రేణుక గట్టిగా కొట్టింది. దీంతో నిఖిల్ ముక్కుకు గాయమైంది, అతని పళ్లు కూడా కొన్ని విరిగిపోయాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రేణుకను అదుపులికి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: పెళ్లై 11 ఏళ్లు, పిల్లలు లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణం -
సర్జరీ చేసేందుకని వెళ్తుండగా ప్రమాదం బారిన వైద్యుడు..ఐతే ..
కొంతమంది విధి నిర్వహణలో చూపించే నిబద్ధత చూసి సెల్యూట్ చేయకుండా ఉండలేం. ఎవ్వరైనా కొంతమేరు సాయం చేయగలరు. కానీ తానే దారుణమైన ఇబ్బుందుల్లో ఉండి అవతలి వాళ్ల మంచి కోసం ఆలోచించడం అందరికీ సాధ్యం కాదు. అంత విశాల హృదయం ఉండటం అనేది అత్యంత అరుదు. అలాంటి కోవకే చెందినవాడు ముంబైకి చెందిన డాక్టర్ సంజీవ్ జాదవ్. వివరాల్లోకెళ్తే..డాక్టర్ సంజీవ్ జాదవ్ చెన్నైలోని 26 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తుల ఆపరేషన్ చేసేందుకని తన వైద్య బృందంతో సేకరించిన ఊపిరితిత్తుల అవయవంతో అంబులెన్స్లో వెళ్తున్నాడు. ఆయన పూణె నుంచి చెన్నై వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్తుండగా అనూహ్యంగా వారి అంబులన్స్కి యాక్సిడెంట్ అవుతుంది. ఈ ఘటనలో జాదవ్ చాలా తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్స్ ముందుబాగం దారుణంగా నుజ్జునుజ్జు అయిపోయింది. నడిపిన డ్రైవర్కి కూడా దారుణంగా గాయాలయ్యాయి. దీంతో డాక్టర్ జాదవ్ బృందం ఆ డ్రైవర్ని సమీపంలోని ఆస్ప్రతికి తరలించి వాళ్లంతా మరో వాహనంలో ఎయిర్పోర్టుకి వెళ్లారు. అక్కడ నుంచి విమానంలో చెన్నైకి చేరుకుని సదరు వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి చేశాడు. నిజానికి వైద్యుడు జాదవ్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి అయినప్పటికీ పేషంట్ని కాపడటమే తన కర్తవ్యంగా భావించి ఆ బాధను ఓర్చుకుని మరీ క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించడం విశేషం. ఈ మేరకు జాదవ్ మాట్లాడుతూ..తాము పాటిల్ ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన19 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తులను స్వాధీనం చేసుకున్నారం. ఈ అవయవాన్ని తమిళనాడులోని 26 ఏళ్ల పేషంట్కి మార్పిడి చేయాల్సి ఉంది. అయితే తమ వైద్య బృందం అంబులెన్స్లో బయలుదేరుతుండగా..తమ అండులన్స్ వెనుక టైర్ పేలడంతో యాక్సిడెంట్ అయ్యిందన్నారు. ఈ ఘటనలో డ్రైవర్కి, తమకి తీవ్ర గాయలయ్యాయని చెప్పుకొచ్చారు. ఐతే తాము సేకరించిన అవయవం కేవలం ఆరుగంటల్లోపు మార్పిడి చేస్తేనే పనిచేస్తుందని చెప్పారు. అందువల్లే తాను గాయాలైన సరే లెక్కచేయకుండా చెన్నై చేరుకుని ఆ పేషెంట్కి ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ చేశానని చెప్పుకొచ్చారు. నిజంగా జాదవ్ వైద్యో నారాయణ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు కదా!. డాక్టర్లంతా ఇలా డ్యూటీ పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తే ఎంతోమంది రోగుల ప్రాణాలు నిలుస్తాయని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహారణ. (చదవండి: గొంతు, నోటి క్యాన్సర్లను గుర్తించే ఏఐ ఆధారిత పరికరం! లాలాజలంతోనే..) -
Sheetal Mahajan: ఎవరెస్ట్ జంప్
41 ఏళ్ల భారతీయ మహిళా స్కై డైవర్ శీతల్ మహాజన్ ఎవరెస్ట్ ఎదుట పక్షిలా ఎగిరారు. హెలికాప్టర్లో ఎవరెస్ట్ ఒడిలో 21,500 అడుగుల ఎత్తు నుంచి దూకి ఊపిరి బిగపట్టి చూసే జంప్ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. నవంబర్ 13న ఆమె ఈ ఘనత సాధించారు. ఆ సాహసం వెనుక కథనం. ‘స్కై డైవింగ్ చేసి కాళ్లూ చేతులూ విరిగితే నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు’ అని ఇంటివాళ్ల చేత చివాట్లు తిన్న అమ్మాయి రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ ఇంటివారినే కాదు ప్రపంచాన్ని కూడా నివ్వెర పరుస్తూనే ఉంది. 41 ఏళ్ల శీతల్ మహాజన్ ఎవరెస్ట్ చెంత సముద్ర మట్టానికి 21,500 అడుగుల ఎత్తున హెలికాప్టర్లో నుంచి జంప్ చేసి 17,444 అడుగుల ఎత్తు మీదున్న కాలాపత్థర్ అనే చోట సేఫ్గా ల్యాండ్ అయ్యింది. ఊపిరి బిగ పట్టి చూడాల్సిన సాహసం ఇది. గడ్డ కట్టే చలిలో, ఆక్సిజన్ అందని ఎత్తు నుంచి, ఎవరెస్ట్ సానువుల వంటి ప్రమాదకరమైన చోట ఒక మహిళ ఇలా జంప్ చేయడం ప్రపంచ రికార్డు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ మహిళా ఇంత ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేయకపోవడం మరో రికార్డు. ఫ్రాన్స్కు చెందిన దిగ్గజ స్కై డైవర్ పౌల్ హెన్రీ ఇందుకు గైడ్గా వ్యవహరిస్తే నీతా అంబానీ, అనంత్ అంబానీ తదితరులు స్పాన్సరర్స్గా వ్యవహరించారు. స్త్రీలు ఎందుకు చేయలేరు? శీతల్ మహాజన్ది పూణె. తండ్రి కమలాకర్ మహాజన్ టాటా మోటార్స్లో ఇంజినీర్గా చేసేవాడు. ఇంటర్ చదువుతూ ఉండగా ‘నీ చదువుతో నువ్వు హ్యాపీగా ఉన్నావా?’ అని తండ్రి అడిగిన ప్రశ్న ఆమెలో సంచలనం రేపింది. ‘సైన్స్ చదవాలనుకుని చేరాను. కాని ఇలా చదవడం కాకుండా ఇంకేదో చేయాలి. ఎవరూ చేయనిది చేయాలి. అదే నాకు సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాను’ అంటుంది శీతల్. ఆ తర్వాత ఆమె గూగుల్ చేయడం మొదలెట్టింది– భారతీయ స్త్రీలు ఎక్కువగా లేని రంగంలో ఏదైనా సాధించాలని. అలా తారసపడినదే స్కై డైవింగ్. ‘అప్పటికి మన దేశంలో స్కై డైవింగ్లో రేచల్ థామస్ వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువమంది స్త్రీలు లేరు. నేనెందుకు చేయకూడదు అనుకున్నాను. 22 ఏళ్ల వయసులో నార్త్పోల్లో మొదటి స్కై డైవింగ్ చేశాను. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ స్త్రీని నేనే’ అంటుంది రేచల్. 15 లక్షల ఖర్చుతో 2004లో శీతల్ తండ్రి జీతం 18 వేలు. కాని ఆ సంవత్సరం శీతల్ నార్త్ పోల్లో స్కై డైవింగ్ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అందుకు అయ్యే ఖర్చు 15 లక్షలు. దాని కంటే ముందు ‘నువ్వు ఆడపిల్లవు. ఇలాంటి వాటికి పనికిరావు’ అన్నారు అంతా. ‘నన్ను ఆ మాటలే ఛాలెంజ్ చేశాయి’ అంటుంది శీతల్. అప్పటివరకూ శీతల్ విమానం కూడా ఎక్కలేదు. పారాచూట్ జంప్ అసలే తెలియదు. ఏ ట్రైనింగ్ లేదు. అయినా సరే స్పాన్సరర్లను వెతికి నార్త్పోల్కు వెళ్లింది. అయితే అక్కడి ఇన్స్ట్రక్టర్లు ఆమెను వెనక్కు వెళ్లమన్నారు. ‘ఇంతకుముందు ఒక మహిళ ఇలాగే నార్త్పోల్కు వచ్చి జంప్ చేయబోయి మరణించింది. అందుకని వారు అంగీకరించలేదు. నేను పట్టువదలక వారంపాటు అక్కడే ఉండి మళ్లీ సంప్రదించాను. ఈసారి అంగీకరించారు’ అంది శీతల్. 2004 ఏప్రిల్ 18న నార్త్పోల్లో మైనస్ 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో తన మొదటి జంప్ చేసింది. అలా లోకానికి సాహసిగా పరిచయమైంది. ఎన్నో రికార్డులు ఆ తర్వాతి నుంచి శీతల్ స్కై డైవింగ్లో రికార్డులు సాధిస్తూనే ఉంది. ఆ వెంటనే ఆమె అంటార్కిటికాలో స్కై డైవింగ్ చేసింది. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎదుట స్కై డైవింగ్ చేయడంతో భూమ్మీద ఉన్న రెండు ధ్రువాలతో పాటు మూడో ధ్రువం వంటి ఎవరెస్ట్ దగ్గర కూడా జంప్ చేసిన ఏకైక మహిళగా రికార్డు స్థాపించింది. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన వైభవ్ రాణెను హాట్ ఎయిర్ బెలూన్లో 5,800 అడుగుల ఎత్తులో వివాహం చేసుకుని అందరినీ హాశ్చర్యపరిచింది. శీతల్కు కవల అబ్బాయిలు. ‘పెళ్లయ్యి పిల్లలు పుట్టాక మహిళ జీవితం కెరీర్ పరంగా అంతమైనట్టేనని అందరూ అనుకుంటారు. నేను కూడా ఆగిపోతానని కొందరు ఆశపడ్డారు. నేను ఆ తరహా కాదు. పిల్లల్ని తల్లిదండ్రులు కలిసి పెంచాలి. తల్లి మాత్రమే కాదు. నేను నా పిల్లల్ని పెంచుతాను... అలాగే నా కెరీర్ని కూడా కొనసాగిస్తాను. నిజానికి పెళ్లయ్యాకే అమెరికా వెళ్లి స్కై డైవింగ్లో ఉత్తమ శ్రేణి ట్రైనింగ్ తీసుకున్నాను’ అంటుందామె. ఇప్పుడు పూణెలో స్కై డైవింగ్ అకాడెమీ తెరిచి స్కై డైవింగ్లో శిక్షణ ఇస్తోంది.బయటకు రండి స్త్రీలు నాలుగ్గోడల నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడాలి... తమలోని సామర్థ్యాలను తెలుసుకుని వాటిని సానబట్టుకోవాలి... విజయం సాధించాలి... భారతీయ స్త్రీలు సాధించలేనిది లేదు... వారికి కావాల్సింది అవకాశమే అంటున్న శీతల్ కచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తి. -
ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆశపడితే మొదటికే మోసం! బ్యాంక్ మేనేజర్కి జరిగింది ఇదే..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్, సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. సామాన్యులే కాకుండా బ్యాంక్ మేనేజర్ వంటి అవగాహన ఉన్న ఉన్నత ఉద్యోగులు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారు. రూ.లక్షల్లో డబ్బును పోగొట్టుకుంటున్నారు. పుణేలో ఓ బ్యాంక్ మేనేజర్ ఇలాగే ఆన్లైన్ టాస్క్ల మోసానికి గురయ్యారు. మొదట ఫారమ్లను నింపడం, వీడియోలను చూడటం వంటి చిన్న చిన్న టాస్క్లను ఇచ్చిన మోసగాళ్లు పూర్తయిన తర్వాత వెంటనే అతని బ్యాంక్ ఖాతాకు డబ్బును జమ చేశారు. బాధితుడు వారిని విశ్వసించడం ప్రారంభించిన తర్వాత "టాస్క్ యాక్టివేషన్ ఫీజు" అడగడం ప్రారంభించారు. ఇలా రూ. 15 లక్షలకు పైగా అతని నుంచి రాబట్టారు. బాధితుడు ఆన్లైన్ వారిచ్చిన 27 టాస్క్లను పూర్తి చేసినా వాటికి డబ్బు మాత్రం చెల్లించలేదు. పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో ఎర టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో స్కామర్లు బ్యాంక్ మేనేజర్కు ఎర వేశారు. ఈ మేరకు బాధితుడి ఫోన్కు మెసేజ్ పంపించారు. ఇది నిజమేనని నమ్మిన బ్యాంక్ మేనేజర్ స్కామర్లను సంప్రదించాడు. ఖాళీ సమయంలో ఇంటి నుంచి పని చేయడం ద్వారా అద్భుతమైన రాబడి వస్తుందని వారు ఆయన్ను నమ్మించారు. తర్వాత ఒక గ్రూపులో నమోదు చేసుకోవాలని చెప్పి టాస్క్లు ఇవ్వడం ప్రారంభించారు. మొదట్లో కొన్ని టాస్క్లు పూర్తి చేసిన కొంత డబ్బు వచ్చింది. ఆ తర్వాత టాస్క్లను యాక్టివ్ చేయడానికి బాధితుడి నుంచి డబ్బు తీసుకోవడం ప్రారంభించారు. మొదట్లో వెంటనే డబ్బు అలా ఒక టాస్క్లో భాగంగా అతన్ని 27 విమాన టిక్కెట్లు బుక్ చేయమని అడిగారు. ఈ టాస్క్ను యాక్టివేట్ చేయడానికి రూ. 10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ డబ్బును డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేసిన బాధితుడి బ్యాంకు ఖాతాలో రూ. 16,321 జమయ్యాయి. దీని తరువాత టాస్క్ల యాక్టివేషన్ కోసం బ్యాంక్ మేనేజర్ వారికి డబ్బు పంపడం ప్రారంభించాడు. వారిచ్చిన 27 టాస్క్లు పూర్తి చేశాడు. వాటి మీద వచ్చిన సొమ్మును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా మరో మూడు టాస్క్లు పూర్తి చేయాల్సి ఉంటుందని స్కామర్లు అతనికి చెప్పారు. అంతే కాదు వాటిని యాక్టివేట్ చేసేందుకు మరో రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని కోరారు. దీంతో మోసపోయానని గ్రహించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు. -
నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు - వైరల్ వీడియో
ఎలక్ట్రిక్ వెహికల్స్లో అకారణంగా మంటలు చెలరేగడం, తద్వారా అనుకోని ప్రమాదాలు సంభవించడం గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పూణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో పూణే మిర్రర్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి పొగలు రావడం గమనించవచ్చు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలంలో తగిన చర్యలు తీసుకుంటున్నారు. పూణే మిర్రర్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఉదయం 8:30 గంటల ప్రాంతంలో స్కూటర్లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు, కానీ ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఓలా ఎలక్ట్రిక్ విచారణ చేపట్టనుంది. బాధితునికి కొత్త స్కూటర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీకి మరో మెయిల్! అడిగింది ఇవ్వకుంటే చంపేస్తామంటూ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో చెలరేగే మంటలపై సంబంధిత కంపెనీలు సమగ్ర వివరణ ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ ఈ పరిశోధన చేపట్టి కొన్ని బ్యాటరీ ప్యాక్లు, మాడ్యూల్స్ డిజైన్లతో సహా బ్యాటరీలలో కొన్ని లోపాలను నివేదించింది. One more incident of an Ola electric scooter catching fire has been reported near the parking lot of D.Y Patil College in Pimpri Chinchwad. This alarming event occurred near the Institute's parking area, igniting at approximately 8:30 in the morning. Upon receiving the report,… pic.twitter.com/tr0K3yn9pp — Pune Mirror (@ThePuneMirror) October 28, 2023 -
Viral video: ఖరీదైన అపార్ట్మెంట్ల కోసం ఎగబడిన కస్టమర్లు.. 8 గంటలు క్యూలో నిలబడి మరీ!
పైన ఫొటోలో మీరు చూస్తున్న జనం ఏవో ఉచిత పథకాల వచ్చినవారు కాదు. సుమారు రూ.2 కోట్ల విలువైన అపార్ట్మెంట్లు కొనేందుకు వచ్చారు. నమ్మలేకపోతున్నారా? ఖరీదైన అపార్ట్మెంట్లను లోపలికి వెళ్లి చూసేందుకు ఇలా ఎనిమిది గంటలపాటు క్యూలో నిలబడి మరీ నిరీక్షించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్గా మారింది. దేశంలోని కొన్ని ప్రముఖ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఖరీదైన ఇళ్లకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అధిక నాణ్యమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడే చాలా మంది ఖరీదైన అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల పుణేలో రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల విలువైన అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లోపలి వెళ్లి అపార్ట్మెంట్లలో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఎనిమిది గంటల పాటు క్యూలో నిల్చున్నారు. ప్రధాన నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకాడ్ ప్రాంతంలో పొడవైన లైన్లు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేయగా వైరల్గా మారింది. దీనిపై యూజర్ల నుంచి మిశ్రమ కామెంట్స్ వచ్చాయి. చాలా మంది ఇది నమ్మశక్యంగా లేదన్నారు. అంత ఖరీదైన అపార్ట్మెంట్లను కొనేవారు అలా క్యూలో నిలబడరని ఓ యూజర్ కామెంట్ చేశారు. కొంతమంది కిరాయి వ్యక్తులతో బిల్డర్ చేసిన మార్కెటింగ్ వ్యూహం కావచ్చని మరో యూజర్ అనుమానం వ్యక్తం చేశారు. Guys, will you stand in a queue for 8 hours if you are spending 1.5cr-2cr to buy an apartment???? pic.twitter.com/4OtNw9DtmE — Ekant | ek 🐜 (@Ayeits_Ekant) October 23, 2023 -
ఢిల్లీ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ముంబై: పుణె నుంచి ఢిల్లీ వెళ్తున్న అకాశ ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాలు.. ఆకాశ ఎయిర్ సంస్థకు విమానం(QP 1148) 185 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో శుక్రవారం అర్థరాత్రి 12 గంటలకు తెల్లవారుజామున పుణె నుంచి బయల్దేరింది. టేకాఫ్ అయిన 40 నిమిషాలల తర్వాత ఓ ప్రయాణికుడు తన వద్దనున్న బ్యాగ్లో బాంబ్ ఉందని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ముంబైకి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ బృందం, పోలీసులు విమానం అంతా తనిఖీలు చేపట్టారు. అయితే తమ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు చేసిన ప్రయాణికుడు ఛాతీలో నొప్పి వస్తుందని కూడా చెప్పడంతో విమానం ల్యాండైన వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతనికి వైద్యం అందించి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు లేదని తేలడంతో శనివారం ఉదయం 6 గంటలకు విమానం మళ్లీ ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. చదవండి: ఘోర ప్రమాదం.. చిన్నారి సహా అయిదుగురు మృత్యువాత -
డ్రీమ్ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్న ఎస్ఐ సస్పెన్షన్.. ఎందుకంటే..?
ముంబయి: డ్రీమ్ 11లో రూ.1.5 కోట్ల రూపాయలు గెలుచుకున్న ఓ ఎస్ఐకి అధికారులు షాక్ ఇచ్చారు. పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ సదరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారి ఆన్లైన్ గేమింగ్లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. మహారాష్ట్ర పింప్రి చించ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ సోమనాథ్ ఆన్లైన్ గేమింగ్లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ఆయన తనకున్న జ్ఞానంతో టీంను ఎంచుకుని డ్రీమ్ 11లో పాల్గొన్నారు. అదృష్టం కలిసివచ్చి రూ.1.5 గెలుచుకున్నారు. దీంతో ఆయన తన కుటుంబానికి మిఠాయిలు తినిపిస్తూ ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లడంతో విషయం పెద్దదైంది. ఆన్లైన్ గేమింగ్లో పాల్గొని పోలీసు శాఖ పరువు తీస్తున్నారంటూ ఉన్నతాధికారులు ఎస్ఐ సోమనాథ్పై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారాన్ని స్థానిక డీసీపీకి అప్పగించారు. గత మూడు నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్లో ఎస్ఐ సోమనాథ్ పాల్గొంటున్నారని నిర్దారించారు. ఈ వ్యవహారంలో సోమనాథ్పై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో రూ.1.5 గెలుచుకున్న ఆనందం ఆవిరైపోయింది. ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి నియామకం -
పుణెలో దారుణం.. ఇంటివద్ద ఆడుకుంటున్న బాలుడిని లాక్కెళ్లిన చిరుత
ముంబై: మహారాష్ట్రలో పుణెలో దారుణం చోటుచేసుకుంది. చిరుతపులి దాడిలో నాలుగేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘోరం జున్నార్ తాలుకాలోని ఆలే గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. వ్యవసాయ పనులు చేసుకునే అమోల్ కుమారుడు నాలుగేళ్ల శివాన్ష్ బుజ్పాల్ ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా అక్కడికి వచ్చిన చిరుత.. చిన్నారిని నోట కరుచుకొని పక్కనే ఉన్న చెరుకు తోటలోకి లాకెళ్లింది. పక్కనే ఉన్న పొలంలో పనులు చేస్తున్న బాలుడి తాత..పిల్లాడి కేకలు విని అక్కడికి పరుగుతెత్తుకొచ్చాడు. బాలుడిని రక్షించేందుకు పొరుగున ఉన్న కొందరు సైతం కర్రలతో చెరుకు పొలాల్లోకి వెళ్లారు. అయితే అప్పటికేచిరుత బాలుడిని చాలా దూరం ఈడ్చుకెళ్లి.. కింద పడేయడంతో తల, మెడ, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా చిరుత పులులను పట్టుకునేందుకు అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు ఆ ప్రాంతంలో నిరసనకు దిగారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ను ముమ్మరం చేశామని, ట్రాప్ కేజ్లను ఏర్పాటు చేసే పనిలో ఉన్నామని అటవీ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా జున్నార్ అటవీ డివిజన్లో చిరుత దాడి చేయడం ఈ ఏడాది మూడోసారి. అంతేగాక పుణె జిల్లాలో జనవరి, ఏప్రిల్ మధ్య వేర్వేరు ప్రదేశాలలో ఇలాంటి సంఘటనలు నాలుగు చోటుచేసుకున్నాయి. -
దేశంలో తొలి సామూహిక గణేశ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అంతకుముందు ఏం జరిగింది?
మన దేశంలో ప్రస్తుతం అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే దేశంలో తొలిసారి గణేష్ ఉత్సవాల బహిరంగ వేడుకలు ఎప్పుడు జరిగాయి. ఎక్కడ జరిగాయి? ఆ ఉత్సవాలకు ఎవరు సారధ్యం వహించారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో తొలిసారిగా 1893లో మహారాష్ట్రలోని పూణేలో గణేశ్ ఉత్సవాలు బహిరంగంగా ప్రారంభమయ్యాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. నాటి నుండి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇది మతపరమైన పండుగే అయినా నాటికాలంలో స్వాతంత్ర్య పోరాట బలాన్ని పెంచడానికి, స్వాతంత్ర్యంపై అవగాహనను పెంపొందించడానికి, కులతత్వం, అంటరానితనాన్ని రూపుమాపడానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడింది. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు కూడా గణేశ్ ఉత్సవాల నిర్వహణకు హిందువులకు మద్దతుగా నిలుస్తుంటారు. 1893వ సంవత్సరానికి ముందు గణేష్ ఉత్సవాలను ప్రైవేట్గా లేదా చిన్న స్థాయిలో జరుపుకునేవారు. బ్రిటీష్ బానిసత్వం, మొఘల్లతో సహా ఇతర విదేశీ ఆక్రమణదారుల అణచివేత మొదలైనవి దీని వెనుకగల కారణాలని చెబుతుంటారు. హిందువులు నాటిరోజుల్లో తమ ఇళ్లలోనే గణపతిని పూజించేవారు. స్వాతంత్య్ర పోరాట విప్లవ నాయకుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ దేశప్రజల ఐక్యతను, సామూహిక స్ఫూర్తిని పెంపొందించేందుకు గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందడుగు వేశారు. నిమజ్జనం సందర్భంగా గణపతి పందాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి తిలక్ శాంతియుత ఆయుధంగా మలచుకున్నారు. నాటి రోజుల్లో స్వరాజ్యం కోసం లోకమాన్య తిలక్ ఐక్యతా సందేశాన్ని ప్రజలకు తెలియజేయాలనుకున్నారు. ఇందుకోసం ఆయన గణపతి ఉత్సవాలను ప్రజా వేదికగా ఎంచుకున్నారు. తిలక్ ప్రారంభించిన గణేశ్ ఉత్సవాలు గజాననుని జాతీయ సమైక్యతకు చిహ్నంగా మార్చివేశాయి. పూణే తర్వాత మహారాష్ట్ర అంతటా జరిగిన గణేశ్ ఉత్సవాలు ఆ తర్వాత దేశ విదేశాలకు సైతం వ్యాపించాయి. స్వాతంత్ర్య పోరాటంలో ప్రజా ఐక్యతకు గణేశ్ ఉత్సవాలు దోహదపడ్డాయి. ఇది కూడా చదవండి: ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? అమెరికా అసలు ప్లాన్ ఏమిటి? -
ట్రంప్ టవర్స్లోకి రణబీర్ అండ్ అలియా: అద్దె ఎంతో తెలిస్తే షాక్వుతారు
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ అలియా భట్ పూణెలోని ఒక లగ్జరీ అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నారన్న వార్తలు మీడియాలో సందడి చేస్తున్నాయి. పూణేలోని ట్రంప్ టవర్స్లోని దాదాపు 7,000 చదరపు అడుగుల అపార్ట్మెంట్కు వార్షిక అద్దెగా రూ. 48 లక్షలకు లీజుకు తీసుకున్నారని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్తో కలిసి ఇటీవల న్యూయార్క్ నుండి తిరిగి వచ్చిన రణబీర్ ఈ అపార్ట్మెంట్ లీజ్కు తీసుకోవడం వార్తల్లో నిలిచింది. (ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!) పూణేలోని కళ్యాణి నగర్లోని ట్రంప్ టవర్స్లోని 10వ అంతస్థులో ఉన్న రెసిడెన్షియల్ యూనిట్ని మూడు సంవత్సరాల పాటు నెలవారీ అద్దెకు రూ. 4 లక్షలు చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం, అపార్ట్మెంట్ను పూణేకు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ అండ్ వెహికల్ కాంపోనెంట్ పరిశ్రమలోని ప్రముఖ తయారీదారు డ్యూరోషాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అద్దెకు తీసుకున్నారు. లీజు అండ్ లైసెన్స్ ఒప్పందంపై సెప్టెంబర్ 15, 2023న సంతకం చేసినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా రూ. 24 లక్షల రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్కూడా చెల్లించారు. మొదటి ఏడాది రూ.4 లక్షలు, రెండో ఏడాది రూ.4.2 లక్షలు, మూడో ఏడాది నెలకు రూ.4.41 లక్షలు నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. (పరిణీతి-రాఘవ్ చద్దా వెడ్డింగ్: ఒక్క నైట్కి హోటల్ సూట్ ఖర్చు ఎంతంటే?) మరోవైపు రణబీర్ అప్కమింగ్ మూవీ యానిమల్ డిసెంబరు 1న రిలీజ్కు సిద్ధంగా ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెండు విభిన్నమైన లుక్స్లో కనిపించనున్నారు రణబీర్. ఈ సినిమాలో రష్మిక మందన్న, బాబీ డియోల్ , అనిల్ కపూర్ కూడా నటించారు. గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న రణబీర్ ,అలియా భట్ రాహా అనే కుమార్తె ఉంది. కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ముంబైలోని బాంద్రా వెస్ట్లో నెలకు దాదాపు రూ. 1.5 లక్షల అద్దెకు మూడేళ్లపాటు ఒక ఫ్లాట్ను లీజుకు తీసుకున్నాడు. పూణేలోని ఈ జంట టవర్లు ఇండియాలో తొలి ట్రంప్ టవర్స్. 23 అంతస్తుల ఈ ట్రంప్ టవర్లను అతుల్ చోర్డియా నేతృత్వంలోని పంచశిల్ రియాల్టీ అభివృద్ధి చేసింది. -
ఇలాంటి ఆలయం దేశంలో మరెక్కడా లేదు.. దీని విశిష్టత ఇదే
ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్ గణపతిని చూడాలంటే మనం పూణెలో ఉన్న సోమ్వర్ పేట్ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్ గణపతి దేవాలయం. భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కతంలో ఉంటే మూడోది పెర్షియన్ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయంప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి. ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం కింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలనులాంటిది కట్టారు. ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు. ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందిట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా. ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పకర్లెద్దు. తొమ్మిది రోజులు పూణె చుట్టుపక్కల ఉన్న ఊరుల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఒక ట్రస్ట్ నడిపిస్తోంది. -
Dr. Sonam Kapse: వడ్డించేవారు మనవారే
డౌన్ సిండ్రోమ్, ఆటిజమ్, మూగ, బధిర... వీరిని ‘మనలో ఒకరు’ అని అందరూ అనుకోరు. వీరికి ఉద్యోగం ఇవ్వాలంటే ‘వాళ్లేం చేయగలరు’ అని విడిగా చూస్తారు. కాని ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో అంతర్భాగమే అంటుంది డాక్టర్ సోనమ్ కాప్సే. కేవలం దివ్యాంగులనే స్టాఫ్గా చేసుకుని ఆమె నడుపుతున్న రెస్టరెంట్ పూణెలో విజయవంతంగా నడుస్తోంది. ‘ఇక్కడంతా వడ్డించేవారు మనవారే’ అంటుంది సోనమ్. పుణెలో ఆంకాలజిస్ట్గా, కేన్సర్ స్పెషలిస్ట్గా పని చేస్తున్న సోనమ్ కాప్సేకు బాల్యం నుంచి రకరకాల వంట పదార్థాలను రుచి చూడటం ఇష్టం. ‘మా అమ్మానాన్నలతో విదేశాలకు వెళ్లినప్పుడు హోటళ్ల లో రకరకాల ఫుడ్ తినేదాన్ని. మంచి రెస్టరెంట్ ఎప్పటికైనా నడపాలని నా మనసులో ఉండేది’ అంటుంది సోనమ్. అయితే ఆ కల వెంటనే నెరవేరలేదు. కేన్సర్ స్పెషలిస్ట్గా బిజీగా ఉంటూ ఆమె ఆ విషయాన్నే మర్చిపోయింది. యూరప్లో చూసి ‘నేను ట్రావెలింగ్ని ఇష్టపడతాను. యూరప్కు వెళ్లినప్పుడు ఒక బిస్ట్రో (కాకా హోటల్ లాంటిది)లో ఏదైనా తిందామని వెళ్లాను. ఆశ్చర్యంగా అక్కడ సర్వ్ చేస్తున్నవాళ్లంతా స్పెషల్ వ్యక్తులే. అంటే బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, అంగ వైకల్యం, మూగ... ఇలాంటి వాళ్లు. వాళ్లంతా సైన్ లాంగ్వేజ్లో ఆర్డర్ తీసుకుంటున్నారు. కస్టమర్లు వారికి ఎంతో సహకరిస్తున్నారు. ఇటువంటి వారి జీవితం మర్యాదకరంగా గడవాలంటే వారిని ఉపాధి రంగంలో అంతర్భాగం చేయడం సరైన మార్గం అని తెలిసొచ్చింది. మన దేశంలో సహజంగానే ఇలాంటివారికి పని ఇవ్వరు. అందుకే మన దేశంలో కూడా ఇలాంటి రెస్టరెంట్లు విరివిగా ఉండాలనుకున్నాను. ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి కానీ, నేను కూడా ఇలాంటి రెస్టరెంట్ ఒకటి ఎందుకు మొదలు పెట్టకూడదు... అని ఆలోచించాను. అలా పుట్టినదే ‘టెర్రసిన్’ రెస్టరెంట్. టెర్రసిన్ అంటే భూమి రుచులు అని అర్థం. పొలం నుంచి నేరుగా వంటశాలకు చేర్చి వండటం అన్నమాట’ అందామె. 2021లో ప్రారంభం పూణెలో బిజీగా ఉండే ఎఫ్.సి.రోడ్లో స్పెషల్ వ్యక్తులే సిబ్బందిగా 2021లో కోటిన్నర రూపాయల ఖర్చుతో ‘టెర్రసిన్’ పేరుతో రెస్టరెంట్ ప్రారంభించింది సోనమ్. ఇందు కోసం స్పెషల్ వ్యక్తులను ఎంపిక చేసి వారికి ట్రయినింగ్ ఇచ్చింది. ‘వారితో మాట్లాడటానికి మొదట నేను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయడం వంటి విషయాల్లో ట్రయినింగ్ ఇచ్చాం. కస్టమర్లు సైన్ లాంగ్వేజ్లో ఆర్డర్ చెప్పొచ్చు లేదా మెనూలో తాము ఎంచుకున్న ఫుడ్ను వేలితో చూపించడం ద్వారా చెప్పొచ్చు. అయితే ఆటిజమ్ వంటి బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లను ఉద్యోగంలోకి పంపడానికి కుటుంబ సభ్యులు మొదట జంకారు. వారిని ఒప్పించడం కష్టమైంది. ఒకసారి వారు పనిలోకి దిగాక ఆ కుటుంబ సభ్యులే చూసి సంతోషించారు. మా హోటల్ను బిజీ సెంటర్లో పెట్టడానికి కారణం మా సిబ్బంది నలుగురి కళ్లల్లో పడి ఇలాంటివారికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఇతరులకు రావడానికే. మా హోటల్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు ఆదాయంలో ఉంది. త్వరలో దేశంలో మరో ఐదుచోట్ల ఇలాంటి హోటల్స్ పెట్టాలనుకుంటున్నాను’ అని తెలిపింది సోనమ్. వారూ మనవారే సమాజ ఫలాలకు అందరూ హక్కుదారులే. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం, ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలి. ఇలాంటి ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. కొందరు పదిలో రెండు ఉద్యోగాలైనా ఇలాంటివారికి ఇస్తున్నారు. సోనమ్ లాంటి వారు పూర్తి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ రంగంలో ఇంకా ఎంతో జరగాల్సి ఉంది. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం... వారిని ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలనే ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. రెస్టరెంట్లో సైన్ లాంగ్వేజ్లో ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్ -
వరుసగా మృతిచెందుతున్న పైలట్లు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: మియామి నుండి చిలీ ప్రయాణిస్తున్న విమానంలో పైలెట్ బాత్రూమ్లో కుప్పకూలి మృతి చెందిన సంఘటన మరువక ముందే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ పైలట్లు రెండు వేర్వేరు సంఘటనల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించారు. మృతి చెందినవారిలో ఒకరు ఇండిగో ఎయిర్ లైన్స్ కెప్టెన్ కాగా మరో పైలట్ ఖతార్ ఎయిర్ లైన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండిగో కెప్టెన్ ఈరోజు నాగ్పూర్ నుండి పూణే విమాన సర్వీసు నడిపించాల్సి ఉండగా నాగ్పూర్ బోర్డింగ్ గేటు వద్దే స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించాయి ఆసుపత్రి వర్గాలు. ఈయన రెండు సెక్టార్లు ఆపరేట్ చేశారని ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు ట్రివేండ్రం నుండి పూణే మీదుగా నాగ్పూర్ చేరుకున్నారని అనంతరం 27 గంటల విరామం తర్వాత ఈరోజు నాలుగు సెక్టార్లు ఆపరేట్ చేయాల్సి ఉందని సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది. కానీ అంతలోనే ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు నాగ్పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేటు వద్ద కుప్పకూలి మృతి చెందారు. ఖతార్ ఎయిర్ లైన్స్ పైలట్ మాత్రం నిన్న అదనపు సిబ్బందిగా ఢిల్లీ దోహా ఫ్లైట్లో పాసింజర్ క్యాబిన్ లో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. అంతకు ముందు ఈయన స్పైస్ జెట్, అలయన్స్ ఎయిర్, సహారా ఎయిర్ లైన్స్ కు పనిచేశారు. ఇలా వరుస రోజుల్లో పైలట్లు గుండెపోటుతో మృతి చెందడంతో సివిల్ ఏవియేషన్ వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు.. -
ఈ గౌరవం జాతికి అంకితం.. ప్రధాని మోదీ
పూణే: భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో గౌరవం దక్కింది. స్వాతంత్ర సమరయోధుడు బాలాగంగాధర్ తిలక్ పేరిట నెలకొల్పిన లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పుణేలో అందుకున్నారాయన. ఈ సందర్భంగా ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. స్వాతంత్ర సమరంలో తిలక్ పాత్ర మరువలేనిది. ఎనలేని సేవలు అందించారాయన. అలాంటి వ్యక్తి గురించి కొంతే మాట్లాడి తక్కువ చేయలేం. తిలక్కు.. అలాగే అన్నా బాహూ సాథేలకు నా గౌరవ వందనాలు అంటూ పేర్కొన్నాయాన. VIDEO | PM Modi receives Lokmanya Tilak National Award in Pune, on the 103rd death anniversary of freedom fighter Bal Gangadhar Tilak. (Source: Third Party) pic.twitter.com/2KKNgqrCJW — Press Trust of India (@PTI_News) August 1, 2023 బాలాగంగాధర్ తిలక్ 103వ వర్ధంతి సందర్భంగా.. లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును ఇవాళ పుణేలో నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. నాయకత్వ పటిమ, పౌరుల్లో దేశభక్తి పెంపొందించినందుకుగానూ ఈ ఏడాది ఆ పురస్కారాన్ని మోదీకి ‘ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్’’ అందించింది. మెమెంటోతో పాటు లక్ష రూపాయల ప్రైజ్ మనీ అందించారు. ఆ ప్రైజ్మనీని నమామీ గంగ ప్రాజెక్టుకు ఇచ్చేశారాయన. ప్రతీ ఏడాది ఆగష్టు 1వ తేదీన ఆయన వర్థంతి సందర్భంగా ఈ అవార్డును బహుకరిస్తారు. 1983 నుంచి ఈ అవార్డును అందిస్తున్నారు. దేశ పురోగతి, అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేయబడుతుంది. ఇప్పటివరకు 40 మంది ఈ పురస్కారం అందుకోగా.. ప్రధాని మోదీ 41వ వ్యక్తి. పవార్తో ఆప్యాయ పలకరింపు ఇదిలా ఉంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరుకాగా.. ప్రధానిమోదీ ఆప్యాయంగా పలకరించారు. ఇండియా కూటమి తరపున విపక్షాలు.. ముఖ్యంగా థాక్రే శివసేన వర్గం ఆయన్ని కార్యక్రమానికి హాజరు కాకూడదని కోరిన సంగతి తెలిసిందే. #WATCH | Maharashtra | Prime Minister Narendra Modi holds a candid conversation with NCP chief Sharad Pawar in Pune. (Source: Maharashtra Dy CM Devendra Fadnavis YouTube) pic.twitter.com/JPowJFgVWT — ANI (@ANI) August 1, 2023 పలు ప్రాజెక్టులు సైతం.. మెట్రో రైళ్ల ప్రారంభంతో పాటు పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటనలో శంకుస్థాపన చేశారు. -
పూణే దగ్దుసేథ్ గణపతి ఆలయంలో మోదీ పూజలు
-
అర్ధరాత్రి భార్య, మేనల్లుడిని చంపి.. గన్తో కాల్చుకున్న ఏసీపీ.. ఏం జరిగింది?
పూణే: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి.. తన భార్య, మేనల్లుడిని సర్వీస్ రివాల్వర్తో కాల్చి.. అనంతరం తనను తాను కాల్చకుని చనిపోయాడు. ఈ ఘటన పూణేలో చోటుచేసుసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. అమరావతి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భరత్ గైక్వాడ్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నారు. అంతకంటే ముందు తన భార్య మోని (44), మేనల్లుడు దీపక్ (35)లను తుపాకీతో కాల్చి చంపాడు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, గైక్వాడ్ భార్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్నారు. గైక్వాడ్ అమరావతి ఏసీపీగా విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన తర్వాతే ఇలా జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి.. ఆ ముగ్గురినీ జూపిటర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, కాల్పులపై కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Tragic Murder-Suicide in Pune: Senior Cop Kills Wife and Nephew before taking own Life; Motive not disclosed.#feedmile #BharatGaikwad #ACP #maharashtra #pune #shot #wife #nephew #gun #shooting #breakingnews pic.twitter.com/o8Bb13i3y3 — Feedmile (@feedmileapp) July 24, 2023 ఇది కూడా చదవండి: ప్రియుడు మరో యువతితో తిరుగుతున్నాడని... -
400 కిలోల టమాటాలు చోరీ
పుణే: టమాటాల ధర ఆకాశాన్నంటుతున్న వేళ ఈ కూరగాయ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ రైతు ఇంట్లో ఉంచిన నాలుగు క్వింటాళ్ల టమాటాలను దొంగలు ఎత్తుకుపోయారు. ఈ మేరకు షిరూర్ తహశీల్కు చెందిన రైతు అరుణ్ ధోమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తన పొలంలో పండించిన 400 కిలోల టమాటాలను కోసి 20 క్రేట్లలో ఇంటికి తీసుకువచ్చాడు. తెల్లారాక చూస్తే అవి కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం టమాటా కిలో ధర రూ.100 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. ఇటీవలి పుణేకే చెందిన ఓ రైతు తను పండించిన 18 వేల క్రేట్ల టమాటాలను రూ.3 కోట్లకు అమ్మి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. -
పూల బామ్మ పులకించిన వేళ
సంచలనాలు, అద్భుతాలు మాత్రమే ‘వైరల్’కి అర్హం కాదని నిరూపించిన వీడియో ఇది... పుణెలో ఒక బామ్మ తన పూలదుకాణంలో కూర్చొని పూలు అల్లుతుంది. నిజానికి ఇదొక సాధారణ దృశ్యం. అయితే ఈ దృశ్యంలో ఆర్టిస్ట్ చైతన్యకు శ్రమజీవన సౌందర్యం కనిపించింది. తన స్కెచ్బుక్ తీసి బామ్మను స్కెచ్ వేయడం ప్రారంభించాడు. స్కెచ్ పూర్తయిన తరువాత బామ్మకు చూపిస్తే... ఆమె కళ్లలో ఎంత సంతోషమో! బామ్మకు ఆ స్కెచ్ ఎంతగానో నచ్చేసింది. ‘ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందంటే... చుట్టుపక్కల ఎన్ని శబ్దాలు వినిపిస్తున్నా బామ్మ దృష్టి పూలమీద మాత్రమే ఉంది. పూల అల్లికలో అపారమైన ఆనందాన్ని పొందుతుంది’ అని రాశాడు చైతన్య. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో 2.4 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ‘ఇష్టమైన పనిలోనే అంతులేని సంతోషం దొరుకుతుంది అని చెప్పే వీడియో ఇది’ అని కామెంట్ సెక్షన్లో స్పందించిన వారు ఎందరో. -
హెచ్ఐవీ బాధితులా? డోంట్ వర్రీ.. సంబంధం చూసి పెడతారు
కొన్ని రకాల ఆరోగ్య సమస్యల పేరు పలకడానికి సైతం కొంతమంది సిగ్గుపడుతుంటారు. అలాంటిది ఆ రోగంతో బాధపడుతోన్న రోగికి మరో రోగి భాగస్వామి అయితే ఆ జంట మరికొంతకాలం సంతోషంగా జీవిస్తారని భావించిన అనిల్ వాలివ్ అలాంటి వారికి దగ్గరుండి మరీ పెళ్లి సంబంధాలు కుదురుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నాడు. పుణేకు చెందిన యాభైఏళ్ల అనిల్ వాలివ్ ప్రస్తుతం డిప్యూటీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి (ముంబై)గా పనిచేస్తున్నాడు. అది 2005... అనిల్కు ఎంతో ఇష్టమైన స్నేహితుడు హెచ్ఐవీ సోకి తన కళ్లముందే చనిపోవడం. అతని కొడుకుకి కూడా హెచ్ఐవీ సోకడం అనిల్ను ఎంతో బాధించింది. తన స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక... ‘‘హెచ్ఐవీ వచ్చినంత మాత్రాన అంతటితో జీవితం అయిపోదు. వాళ్లకు భాగస్వామి ఉంటే జీవితం మరికొన్నాళ్లపాటు బావుంటుంది’’ అన్న ఉద్దేశ్యంతో 2005లో పాజిటివ్ సాథి వెబ్సైట్ను ప్రారంభించాడు. ప్రారంభంలో తన పైఅధికారులు కూడా ప్రోత్సహించడంతో వెబ్సైట్తోపాటు.. వివాహ వేదికలూ నిర్వహించేవాడు. అలా మొదలైన పాజిటివ్ సాథీ డాట్కామ్ క్రమంగా విస్తరించి నేడు వేలమంది పాజిటివ్ రోగుల పెళ్లిళ్లకు వారధిగా నిలుస్తోంది. బ్రెయిన్ సర్జరీ అయినప్పటికీ.. ఒకపక్క ఉద్యోగం... మరోపక్క సామాజిక సేవచేస్తోన్న అనిల్కు 2015లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సర్జరీ చేయించుకున్నాడు. పూర్తిగా కోలుకున్న తరువాత కూడా సామాజిక సేవలో మరింత మునిగి పోయాడు. తాను చేసే సాయం సమాజం మెరుగుపడడానికి ఉపయోగపడాలని నిర్ణయించుకుని హెచ్ఐవీ రోగులకు పెళ్లి సంబంధాలు కుదర్చడాన్ని మరింత సీరియస్గా తీసుకున్నాడు. హెచ్వీ రోగికి మరో హెచ్ఐవీ జతను జోడిస్తూ ఇప్పటిదాకా వేలమంది పెళ్లిళ్లకు సాయపడుతూనే ఉన్నాడు. అంటరానివారిగా చూస్తుండడంతో... ఆర్టీవో అధికారిగా అనేకమందిని కలుస్తుంటాడు అనిల్. ఒకరోజు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాల గురించి వస్తువులు రవాణా చేసే డ్రైవర్లకు ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ట్రక్కు డ్రైవర్లలో దాదాపు అందరు హెచ్ఐవీ సోకిన వారే అని తెలిసింది. హెచ్ఐవీ అని తెలియగానే..కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితులు అంటరానివారుగా చూస్తూ, తమని వదిలేశారని అనిల్కు కన్నీటితో తమ బాధను వెళ్లబోసుకున్నారు డ్రైవర్లు. ముందునుంచి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తులపై ఉన్న సానుభూతితో...హెచ్ఐవీ సోకిన డ్రైవర్ల జాబితా తీసుకుని డాక్టర్ల దగ్గరకు వెళ్లి వారికి ట్రీట్మెంట్ అందించాలని కోరాడు. కొంతమంది ముందుకు రావడంతో వాళ్లతో డ్రైవర్లకు వైద్యం అందిస్తూ సామాజిక కౌన్సెలింగ్ను అందిస్తున్నాడు. వీరిలో ఆసక్తి ఉన్నవారికి జతను వెదికిపెడుతున్నాడు. ఎన్నిసైట్లు వెతికినా... పాజిటివ్ అమ్మాయిలకోసం ఎన్ని మ్యాట్రిమొనీ సైట్లు వెతికినా ఎక్కడా హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నవారికి సంబంధాలు చూసే సైటు ఒక్కటీ కనిపించలేదు. దీంతో తనే స్వయంగా సైటుని ప్రారంభించాలనుకున్నాడు. ఇందుకోసం ఆసుపత్రులలోని హెచ్ఐవీ రోగుల డేటాను సేకరించాడు. వారి అనుమతితోనే positivesaathiను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సైట్లో కొన్ని వేలమంది తమ జతకోసం రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. ఇప్పటిదాకా మూడు వేలమందికిపైగా ఈ సైట్ ద్వారా వివాహం చేసుకున్నారు. అర్ధంతరంగా పోకుండా.. సైట్ నిర్వహణ అంత సులభంగా లేదు. కొంతమంది నకిలీ ప్రొఫైల్స్ తో రిజిస్టరు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లన్నీ సరిచూసుకోవడం కష్టం. ఎక్కువమంది తమ కులానికి చెందిన వారిని మాత్రమే పెళ్లిచేసుకోవాలనుకుంటున్నారు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ పాజిటివ్ రోగులకు జతను వెతికే పనిలో నేను బిజీగా ఉన్నాను. ఇలా పెళ్లిళ్లు జరిగితే హెచ్ఐవీ వ్యాప్తి కొంతవరకైనా నిరోధించవచ్చవచ్చు. వాళ్లు అంటరాని వాళ్లలా అర్ధంతరంగా చనిపోకుండా, కొంతకాలం అయినా తోడుతో ఆనందంగా జీవిస్తారు. – అనిల్ వాల్వి -
మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు
ముంబై: శనివారం తెల్లవారు జామున సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ హైవే మీద ఒక ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో మొతం 33 మంది ప్రయాణిస్తుండగా వారిలో 26 మంది మృతి చెందగా 7 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. హైవే మీద వెళ్తుండగా అకస్మాత్తుగా బస్సు టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు బుల్దానా ఎస్పీ సునీల్ కందసానే. గాయపడిన వారిని బుల్దానాలోని సివిల్ హాస్పిటల్కు తరలించినట్టు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యావత్మాల్ నుండి పూణే వెళ్తున్న బస్సు బుల్దానా జిల్లాలోకి ప్రవేశించగానే భారీ శబ్దం చేస్తూ బస్సు టైర్ ఒకటి పేలిపోయింది. దాంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి పక్కకు పడిపోయింది. వెంటనే డీజిల్ ట్యాంక్ నుండి అగ్నికీలలు ఎగసి క్షణాల్లో బస్సు మొత్తాన్ని ఆవహించేశాయి. ప్రయాణికులంతా గాఢమైన నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో వారికి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. బుల్దానాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులుబాధితులకు సాధ్యమైన సహాయాన్ని అందిస్తోందన్నారు. ప్రమాదంలో మరణించవారి కుటుంబ సభ్యులకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు అందించనున్నట్లు తెలిపారు. Deeply saddened by the devastating bus mishap in Buldhana, Maharashtra. My thoughts and prayers are with the families of those who lost their lives. May the injured recover soon. The local administration is providing all possible assistance to the affected: PM @narendramodi — PMO India (@PMOIndia) July 1, 2023 అయితే తెల్లవారుతూనే వెలుగులోకి వచ్చిన ఈ వార్త గురించి తెలియగానే రహదారి నిర్మాణంపైనా, భద్రత పైనా చర్చ లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలకు స్పందిస్తూ.. ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం నాణ్యత గురించి ప్రస్తావించడానికి ఇది సందర్భం కాదు. మృతుల కుటుంబాలను ఆదుకోవడమే తమ తక్షణ కర్తవ్యమని అన్నారు. ఈ ప్రమాదంలో 26 మంది చనిపోయారు, ఏడుగురు గాయపడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, మృతుల వివరాలు తెలియకుంటే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. డెప్యూటీ సీఎం. ప్రమాదం మానవతప్పిదం వలన జరిగిందా? లేక సాంకేతిక లోపం వలన జరిగిందా అన్నది విచారణలో తెలుస్తుందన్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని, వీలయితే స్మార్ట్ సిస్టమ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు ఫడ్నవీస్. కేంద్రం కూడా ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది కూడా చదవండి: రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి.. -
పట్టపగలే దారుణం.. యువతిని నడిరోడ్డుపై వెంబడించి మరీ..
ఆధునిక యుగంలోనూ రోజురోజుకీ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. హత్యలు, అత్యాచార ఘటనలు, లైంగిక దాడులు, పైశాచికదాడులు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. పాత చట్టాలకు తోడుగా నిర్భయ, గృహహింస వంటి చట్టాలను తీసుకువచ్చినా మృగాళ్ల ఆగడాలకు కళ్లెం పడడం లేదు. అతివలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి తాజాగా మహారాష్ట్ర పట్టపగలే దారుణం వెలుగు చూసింది. ప్రేమను ఒప్పుకోవడం లేదనే కారణంతో యువతిని బహిరంగంగా రోడ్డుపై వెంబడించి మరీ దాడి చేశాడో యువకుడు. ఈ ఘటన పుణెలోని సదాశివ్ పేట్ ప్రాంతంలో జరిగింది. రద్దీగా ఉన్న రోడ్డు మీద టూ వీలర్పై వెళ్తున్న 20 ఏళ్ల యువతిని యువకుడు అడ్డగించాడు. వెంటనే తన వద్ద ఉన్న పదునైన కత్తి వంటి ఆయుధాన్ని తీసి యువతిపై దాడికి యత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు స్కూటీ వదిలేసి యువతి వీధుల్లో పరుగెత్తింది. యువకుడు ఆమె వెంటే పరుగెత్తాడు. ఈ క్రమంలో ఆమె వీపుపై దాడి చేయడంతో కింద పడింది. మళ్లీ లేచి పరుగెత్తుండగా.. ఆ వ్యక్తి ఆమెపై దాడి చేస్తూనే ఉన్నాడు. ఇంతలో రోడ్డుపై వెళుతున్న కొంతమంది అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానికులు యువకుడిపై రళ్లు రువ్వారు. ఎట్టకేలకు యువతిని రక్షించి, దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వీడియో కోసం క్లిక్ చేయండి దాడికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. పంజాబీ డ్రెస్, ముఖానికి స్కార్ఫ్ ధరించిన యువతి భుజంపై బ్యాగ్తో రోడ్డుపై పరుగెత్తడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వైట్ షార్ట్, ప్యాంట్ వేసుకున్న యువకుడు ఆమె వెనకాల వెంబడించడం కూడా తెలుస్తోంది. కాగా నిందితుడిని అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పుణె డీసీపీ సందీప్ సింగ్ తెలిపారు. నిందితుడిని శాంతను లక్ష్మణ్ జాదవ్గా గుర్తించారు. యువతిని 20 ఏళ్ల ప్రీతి రామచంద్రగా పోలీసులు పేర్కొన్నారు. అయితే నిందితుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నట్లు ఆమె తల్లి ఆరోపించారు. ఈ విషయంపై యువకుడి తండ్రికి కూడా ఫిర్యాదు చేశామని అయినా ఈ రోజు తన కూతురిని చంపడానికి ప్రయత్నించాడని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారడంతో యువతిని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు. Dear Delhites, watch and learn: How we save the honor of women in the land of Shivaji Maharaj 🚩 A man, armed with a machete, attacked a girl student in Pune injuring her. A few bravehearts in the area caught the man and handed him over to the Police.🫡 pic.twitter.com/jnZzKfVn36 — Pune City Life (@PuneCityLife) June 27, 2023 -
జీ–20లో ఆకట్టుకున్న ‘ఏపీ ఫౌండేషనల్ స్కూల్’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జాతీయ నూతన విద్యావిధానం–2020లో భాగంగా అమలు చేస్తున్న ‘ఏపీ ఫౌండేషనల్ స్కూల్’ స్టాల్ జీ–20 సదస్సులో ఆకర్షణగా నిలిచింది. కేంద్రంతోపాటు, విదేశీ ప్రతినిధులను సైతం ఆకట్టుకుంది. జీ–20 సదస్సుల్లో భాగంగా పూణెలో ‘జన్ భాగీదారి’ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో ఏపీ పాఠశాల విద్యాశాఖ ‘ఫౌండేషనల్ స్కూల్’ నమూనాను ఏర్పాటు చేసింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్ మాట్లాడుతూ.. ‘ఫౌండేషనల్ లెర్నింగ్, డిజిటల్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్’ పేరిట ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించామని, వివిధ రాష్ట్రాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, సమగ్ర శిక్షా ఎస్పీడీలు ఏపీ స్టాళ్లను సందర్శించి ప్రశంసించారని తెలిపారు. ‘నిపుణ్ ఆంధ్ర గీతం’ వీడియో ప్రదర్శనకు అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులు కితాబిచ్చారన్నారు. 7వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, తరగతి గదిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీల ఏర్పాటు, బైజూస్, ఎస్సీఈఆర్టీ రూపొందించిన ఈ–కంటెంట్ గురించి అడిగి తెలుసుకున్నారన్నారు. ‘పునాది విద్య సాధన కోసం డిజిటల్, తరగతి గది మాధ్యమం’ అంశంపై చర్చించామన్నారు. వివిధ రాష్ట్రాలతోపాటు 29 దేశాలకు చెందిన విద్యాశాఖ మంత్రులు, విద్యా నిపుణులు ఏపీలో అమలు చేస్తున్న విద్యావిధానాలపై హర్షం వ్యక్తం చేశారన్నారు. అంతేకాకుండా మన పాఠశాలలను సందర్శించేందుకు ఆసక్తి చూపినట్టు చెప్పారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలపై రూపొందించిన వీడియోను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఏపీని ప్రశంసిస్తూ పోస్ట్ చేసిందన్నారు. జీ–20లో రాష్ట్రం తరఫున పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్తో పాటు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు నేతృత్వం వహించారు. -
శరద్ పవార్ కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు
ముంబై: ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు విషయమై ఆయన కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ చేపట్టిన ముంబై పోలీసులు ఈ చర్యకు పాల్పడింది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సాగర్ బర్వేగా గుర్తించి సోమవారం అతడిని అరెస్టు చేశారు. అదే గతి పడుతుంది.. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను చంపేస్తామంటూ ఒక వార్నింగ్ ప్రత్యక్షమైంది. ఆ బెదిరింపులో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్ కు ఎదురైన పరిస్థితి అతి త్వరలో శరద్ పవార్ కు కూడా ఎదురవుతుందని, 2013లో నరేంద్ర దభోల్కర్ ను ఇద్దరు ఆగంతకులు బైక్ మీద వచ్చి కాల్చి చంపినట్టే ఈయనను కూడా చంపుతామని పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ పోస్ట్ చేసిన వ్యక్తిని కనుగొనేందుకు విచారణ చేపట్టారు. ఆమెతో పాటు ఎన్సీపీ కార్యకర్త ఒకరు లోకమాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఎలా పట్టుకున్నారంటే.. ఈ వార్నింగ్ ఏ ఐపీ అడ్రస్ నుండి వచ్చిందన్న కోణంలో ఎంక్వైరీ చేయగా ఆ ఐపీ అడ్రస్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సాగర్ బర్వేకు చెందినదని గుర్తించారు పోలీసులు. సాగర్ ఓ ప్రయివేటు కంపెనీలో డేటా ఫీడింగ్ అండ్ అనలిటిక్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. నిందితుడి వివరాలు తెలిసిందే తడవు వెంటనే సాగర్ బర్వేను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి రిమాండుకు తరలించారు పోలీసులు. శరద్ పవార్ ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆయన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను ప్రకటించిన విషయం తెలిసిందే. నాయకత్వం చేతులు మారి పార్టీ కార్యాచరణ ముమ్మరం చేస్తున్న ఇదే సమయంలో ఆయనను చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఆందోళనలో ఉన్నాయి పార్టీ వర్గాలు. ఎట్టకేలకు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి అరెస్టుతో ఎన్సీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇది కూడా చదవండి: అలిగిన అజిత్ పవార్.. మరోసారి అసంతృప్తి? -
పుణెలో భారీ షూటింగ్ సెట్.. ఆ స్టార్ హీరో కోసమే!
అజిత్ చిత్రం ఇంతకుముందు నటించిన తుణివు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ తరువాత ఆయన చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం ఆయన అభిమానులను నిరాశపరిచే విషయమే. అజిత్ తాజా చిత్రానికి విడా ముయర్చి అనే టైటిల్ను ఖరారు చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆది నుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. (ఇది చదవండి: మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్.. సూర్య రిపీట్ చేస్తాడా?) ముందుగా నయనతార భర్త విఘ్నేష్శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆయన రాసిన స్క్రీన్ప్లే నచ్చలేదన్న కారణంతో చిత్రం నుంచి తొలగించారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత అజిత్ భూటాన్, నేపాల్ దేశాల్లో బైక్ పర్యన చేసొచ్చారు. కాగా విడా ముయర్చి చిత్రానికి మగిళ్ తిరుమేణిని ఫిక్స్ చేశారు. దీంతో అజిత్ దర్శకుడు మగిళ్ తిరుమేణి కలిసి కథా చర్చలకోసం ఇటీవల లండన్లో మకాం పెట్టారు. కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్కు ముహుర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెలాఖరులో పూణేలో విడా ముయర్చి చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇందుకోసం అక్కడ భారీ సెట్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఇందులో అజిత్ సరసన త్రిష నటిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా నటుడు అర్జున్దాస్ ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. (ఇది చదవండి: తమన్నాకు రజినీకాంత్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) -
నిద్రిస్తుండగా వేటకొచ్చిన చిరుత..ఆ వీధి కుక్క అతడిని బతికిచ్చింది
ఓ వ్యక్తి నిద్రిస్తుండగా సడెన్గా ఓ చిరుత వచ్చింది. ఇక ఆ వ్యక్తి వద్దకు వచ్చి అటాక్ చేస్తుందేమో అన్న సమయంలో సమీపంలో ఓ వీధి కుక్క కనిపించింది. అంతే సడెన్గా చిరుత దృష్టి దానిపై పడింది. దీంతో నేరుగా ఆ కుక్క వద్దకు వచ్చి దాడి చేసి ఈడ్చుకెళ్లిపోయింది. ఈ అలికిడికి మెలుకువ వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారిగా బిక్కచచిపోతాడు. ఆ కుక్క గనుక అక్కడ లేకపోతే ఆ చిరుత నోట అతను ఉండేవాడు. అదృష్టం బావుంది కాబట్టి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఆ వ్యక్తి. ఈ షాకింగ్ ఘటన పుణేలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నంద సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. అటవీ ప్రాంతాలను అభివృద్ధి పేరుతో నాశనం చేయడంతో ఇలా వన్యమృగాలు మానవ ఆవాసాల్లోకి చొరబడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు పలువురు చెబుతున్నారు . (చదవండి: ఇలా కూడా బరువు తగ్గొచ్చా! విమానంలో వెళ్లాలని..ట్వీట్ వైరల్) -
బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ!
Satyajith Mittal: చిన్న పిల్లల బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు మిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ గ్రాడ్యుయేట్ సత్యజిత్ మిట్టల్. చిన్నప్పుడు తాను పడిన ఇబ్బంది వేరే పిల్లలు పడకూడదన్న ఉద్దేశంతో వినూత్న షూ రూపొందించి విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న పిల్లల పాదాలకు అనుగుణంగా విస్తరించగలిగే వినూత్న బూట్ల శ్రేణి మ్యాజిక్ షూను అభివృద్ధి చేసింది ఆయన స్థాపించిన షూ కంపెనీ అరెట్టో (Aretto). ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! చిన్నప్పుడు పడిన ఇబ్బందే.. మ్యాజిక్ షూ ఆవిష్కరణ కోసం సత్యజిత్కు తన చిన్ననాటి అనుభవం ప్రేరణనిచ్చింది. చిన్నప్పుడు తన అన్నయ వాడిన బూట్లను సత్యజిత్కు ఇచ్చేవారు. అయితే ఆ బూట్లు సత్యజిత్కు చాలా వదులు అయ్యేవి. దాంతో నడవడానికి ఆయన చాలా ఇబ్బంది పడేవారు. అప్పటి నుంచి మంచి నాణ్యత గల బూట్లు ధరించాలని ఎప్పుడూ కలలు కనేవాడు. ఆ సమయంలో భారతదేశంలో అవి చాలా తక్కువగా ఉండేవి. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ చిన్నతనంలో ఏదో ఒక సమయంలో తమకు సరిపోని సైజు షూ ధరించి ఇబ్బందులు పడినవాళ్లు ఉంటారు. పిల్లలు పెరిగేకొద్దీ వారి పాదాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు కొన్ని రోజులకే ఎక్కువ జతల బూట్లు కొనాల్సి వస్తోంది. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నారు సత్యజిత్. పెరుగుతున్న పాదాల సైజ్కు అనుగుణంగా విస్తరించే మ్యాజిక్ షూను రూపొందించారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు తల్లిదండ్రులకు మేలు కలిగిస్తోంది. ఇవి కొంటే పదే పదే కొత్త బూట్లు కొనాల్సిన అవసరం ఉండదు. నిరంతర పరిశోధనలు, పోడియాట్రిస్ట్ (పాదాలకు సంబంధించిన వైద్య నిపుణులు)లతో సంప్రదింపుల ద్వారా సత్యజిత్ పిల్లల పాదాల అనాటమీ గురించి లోతైన అవగాహన పొందాడు. వారి పాదాలు పెద్దలకు భిన్నంగా ఉంటాయని, వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బూట్లు అవసరమని గ్రహించాడు. ఈ జ్ఞానంతో రెండేళ్ల పాటు కష్టపడి మ్యాజిక్ షూను రూపొందించాడు. ఈ ఘనతను సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి బ్రాండ్ అరెట్టో. దీనికి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ను పొందింది ఆ కంపెనీ. అలాగే యూకే, యూఎస్ఏ, జపాన్తో సహా 20 కంటే ఎక్కువ దేశాల్లోనూ పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఎనిమిది నెలల్లో రూ.80 లక్షలకుపైగా గతేడాది ఆయన ప్రారంభించిన ఫుట్వేర్ బ్రాండ్ అరెట్టో కేవలం ఎనిమిది నెలల్లోనే 6,000 యూనిట్లకు పైగా విక్రయించి రూ.80 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. తమ బ్రాండ్ షూ తయారీకి థర్మోప్లాస్టిక్ రబ్బర్ రీసైకిల్ మెటీరియల్, స్థానికంగా లభించే త్రీడీ అల్లికల మెటీరియల్ని ఉపయోగిస్తున్నారు. సత్యజిత్ పుణెలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి చెందిన చిన్ననాటి స్నేహితురాలు, క్లాస్మేట్ అయిన కృతిక లాల్ను సహ వ్యవస్థాపకురాలిగా చేర్చుకున్నారు. అరెట్టో 0-2, 5-7, 5-9 సంవత్సరాల వయసు పిల్లలకు బూట్లను అందిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లో విక్రయిస్తున్నప్పటికీ, త్వరలో ఆఫ్లైన్ స్టోర్లను ప్రారంభించాడానికి కంపెనీ కసరత్తు చేస్తోంది. ఈ బ్రాండ్ షూలు తొమ్మిది స్టైల్స్, ఐదు సైజులు, నాలుగు కేటగిరీల్లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్ను బట్టి ధరలు రూ.1,699 నుంచి రూ.2,899 వరకు ఉంటాయి. ఈ బ్రాండ్ బూట్లు 18 మిల్లీ మీటర్ల వరకు విస్తరించవచ్చు. వారి అమ్మకాలలో ఎక్కువ భాగం వారి వెబ్సైట్ ద్వారా వస్తాయి. వారు ఇటీవల నైకాలో కూడా అమ్మడం ప్రారంభించారు. ఇవికాక పిల్లల కార్నివాల్లు, పిల్లల షూ ప్రదర్శనలు, పాఠశాల, ఇతర పాప్-అప్ ఈవెంట్లలో పాల్గొంటారు. అరెట్టో కంటే ముందు, సత్యజిత్ స్క్వాట్ ఈజ్ అనే బ్రాండ్ను స్థాపించారు. ఇది భారతీయ టాయిలెట్లను సులభంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఈ వెంచర్ అతనికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. -
ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!
మహారాష్ట్రలోని పుణె పోలీసులు భారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. పుణేలోని వాకాడ్ ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్లో నిర్వహిస్తున్న భారీ వ్యభిచార రాకెట్ను ఛేదించారు. ఈ దాడుల్లో భోజ్పురి నటితో సహా ఓ మోడల్, ఏజెంట్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (ఇది చదవండి: అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక) వ్యభిచార ముఠా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం హోటల్పై దాడులు నిర్వహించారు. వారిలో ఒకరు మోడల్, మరొకరు భోజ్పురి నటిగా పోలీసులు గుర్తించారు. వీరు మహిళలను మభ్యపెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పింప్రీ, చించ్వాడ్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర చవాన్ వార్నింగ్ ఇచ్చారు. (ఇది చదవండి: సితార.. నీ హృదయంతో చేయి.. నమ్రత పోస్ట్ వైరల్!) ఇన్స్పెక్టర్ దేవేంద్ర మాట్లాడుతూ..' ఫైవ్ స్టార్ హోటల్లో ఏజెంట్తో కలిసి భోజ్పురి నటి, మోడల్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. మేం వెంటనే ఓ డమ్మీ కస్టమర్ను అక్కడికి పంపాం. ఏజెంట్ను ఆన్లైన్ ద్వారా సంప్రదించాం. ఏజెంట్.. డమ్మీ కస్టమర్ని ఫైవ్ స్టార్ హోటల్లో గదిని బుక్ చేయమని చెప్పాడు. నటి, మోడల్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. అన్ని నిర్ధారించుకున్న తర్వాతే అటాక్ చేశాం.' అని వెల్లడించారు. -
ఎవరెస్ట్ పర్వతాన చిన్నారి పాదాలు
ఆరేళ్ల పాప కారిడార్లో ఆడుతుంటేనే చిన్న భయం ఉంటుంది. 17,500 అడుగుల ఎత్తు ఉండే ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకోవాలనుకుంటే? పూణెకు చెందిన ఆరేళ్ల ఆరిష్క లడ్డా ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకున్న అత్యంత చిన్నారిగా రికార్డు స్థాపించింది. తల్లితో కలిసి పదిహేను రోజులపాటు ఆరోహణ చేసి ఈ సాహసకార్యం పూర్తి చేసింది. కొంతమంది చిన్నారులు పుట్టుకతో చిరుతలు అని పాడుకోవాలి ఇలాంటి పిల్లలను చూస్తే. ఆరేళ్ల ఐదు నెలల వయసు ఉన్న ఆరిష్కా లడ్డాకు నిజంగా తానేం ఘనకార్యం చేసిందో తెలియదు. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం బేస్ క్యాంప్కు చేరుకోవడం అంత చిన్న వయసులో అసాధ్యమైనా సాధ్యం చేసిందనీ తెలియదు. తల్లి చేయి పట్టుకుని ఎంత దూరమైనా సాగగలను అనే నమ్మకమే ఆరిష్కాను సముద్ర మట్టానికి 17,500 ఎత్తు ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేర్చింది. ఫూణెలో ఇప్పుడు ఆ పాప నివాసం ఉంటున్న కొత్రుడ్ ఏరియా, చదువుతున్న స్కూలు, బంధువులు అందరూ గర్వపడుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు తీసుకెళ్లరు. ఎందుకంటే పర్వతారోహణ సమయంలో తమ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు వస్తున్నదో చిన్న వయసు పిల్లలు స్పష్టంగా చెప్పలేరు. అలా చెప్పకపోతే ప్రమాదం వస్తుంది. మేము రిజిస్టర్ చేసుకున్న సంస్థను నడిపే భగవాన్ చావ్లే మా పూణెకు చెందిన పర్వతారోహకుడు. మూడుసార్లు ఎవరెస్ట్ ఎక్కాడాయన. పర్వతారోహణలో విశేష అనుభవం ఉంది. ఆయన మార్గదర్శకత్వంలో నేను ఆరిష్కాతో పాటుగా ఎవరెస్ట్ బేస్క్యాంప్కు వెళ్లాలనుకున్నప్పుడు– మీ సొంత రిస్క్ మీద తీసుకువెళతాను. కాని పాప ఆరోగ్యంలో ఏ మాత్రం మార్పు వచ్చినా వెంటనే వెనక్కు పంపిస్తాను అని చెప్పాడు. నేను అంగీకరించాను. ఎందుకంటే నా కూతురు సాధించగలదన్న నమ్మకం ఉంది’ అంది ఆరిష్కా తల్లి డింపుల్ లడ్డా. ప్రాథమిక శిక్షణ ఆరిష్కా పూణెలో వారాంతంలో చుట్టుపక్కల కోటలను, కొండలను ట్రెక్ చేసేది. గత సంవత్సరం వైష్ణోదేవికి వెళ్లినప్పుడు కూడా హుషారుగా నడిచింది. ‘అది గమనించాకే బేస్క్యాంప్కు నడవగలదు అన్న నమ్మకం కుదిరింది’ అంది డింపుల్. ఏప్రిల్ మొదటివారంలో మొదలైన వీరి ఆరోహణ పోను 65 కిలోమీటర్లు రాను 65 కిలోమీటర్లు మొత్తం 130 కిలోమీటర్ల పొడవునా కాలినడకన సాగింది. అంత దూరమూ ఆరిష్కా తల్లికి సహకరిస్తూ హుషారుగా నడవగలిగింది. ఖర్జూరాలు, డ్రైఫ్రూట్ లడ్డూలు పర్వతారోహణ చేయాలంటే చాలా శక్తి కావాలి. అందుకు మంచి ఆహారం ఉండాలి. ‘మేము శాకాహారులం. పర్వతారోహణలో మాకు పప్పన్నం మాత్రమే శాకాహారంగా దొరికింది. అయితే పాపకు నేను ఖర్జూరాలు, డ్రైఫ్రూట్ లడ్డూలు ఎక్కువగా పెట్టాను. వేణ్ణీళ్లు ఎక్కువగా తాగేలా చూశాను. చలి నుంచి కాపాడటానికి 7 దొంతరల బట్టలు తొడిగి జాగ్రత్త తీసుకున్నాను. ఆ దారిలో మైనస్ 3 నుంచి మైనస్ 16 వరకు ఉష్ణోగ్రతలు ఉండేవి. ఒక్కోసారి పాప తలనొప్పి, చెవుల నొప్పి అని కంప్లయింట్ చేసేది. అయితే అదృష్టవశాత్తూ కొద్దిపాటి మందులతో కుదుట పడింది’ అని తెలిపింది డింపుల్. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర చెయ్యూపుతూ నిలబడటంతో మన దేశం నుంచి అత్యంత చిన్న వయసులో అక్కడివరకూ చేరిన చిన్నారిగా ఆరిష్కా రికార్డు సాధించింది. ‘ఇక ఆమెను మరింత ప్రొఫెషనల్గా తీర్చిదిద్దుతాను. ఎవరెస్ట్ ఎక్కేలా చేస్తాను. తోడుగా కావాలంటే నేనూ ఎక్కుతాను’ అని తెలిపింది డింపుల్. తండ్రి కౌస్తుభ్ ‘నా కూతురిని చూసి గర్వపడుతున్నాను. ఈ ఘనత అంతా తల్లీకూతుళ్లదే. నేను కేవలం సపోర్టింగ్ యాక్టర్ని’ అని నవ్వాడు. ఆరిష్కాకు అభినందనలు. పాపను చలి నుంచి కాపాడటానికి 7 దొంతరల బట్టలు తొడిగి జాగ్రత్త తీసుకున్నాను. ఆ దారిలో మైనస్ 3 నుంచి మైనస్ 16 వరకు ఉష్ణోగ్రతలు ఉండేవి. – డింపుల్, అరిష్కా తల్లి -
వివాహేతర సంబంధం..పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి కుమారుడ్ని దారుణంగా
ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ వ్యక్తి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమారుడ్ని దారణంగా హత్య చేశాడు. చిన్నారి అని కూడా చూడకుండా వేడి వేడి నీళ్లున్న బకెట్లో బాలుడ్ని ముంచాడు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. 15 రోజులు మృత్యుతో పోరాడి చనిపోయాడు. నిందితుడి పేరు విక్రమ్ శరద్ కోలేకర్. ఖేడ్లో నివసిస్తున్నాడు. భర్త నుంచి విడిపోయిన ఓ మహిళతో చాలా కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె కూడా ఖేడ్లోనే ఉంటోంది. అయితే ఏప్రిల్ 6న ఉదయం మహిళ ఇంటికెళ్లాడు విక్రమ్. పిల్లాడిని ఇతనికి అప్పగించి ఆమె బయటకు వెళ్లింది. ఈ సమయంలో చిన్నారిని వేడి నీటిలో ముంచాడు. ఇంటికొచ్చి చూసిన తల్లి కాలిన గాయాలున్న కుమారుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. 15 రోజులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. విక్రమ్ తనను పెళ్లి చేసుకోమని చాలా రోజులుగా అడుగుతున్నాడని, అందుకు తాను ఒప్పుకోలేదనే కోపంతోనే తన కుమారుడ్ని చంపాడని మహిళ ఆరోపించింది. పోలీస్ స్టేషన్కు వెళ్లి అతనిపై కేసు పెట్టింది. దీంతో విక్రమ్ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. చదవండి: అతీక్ అహ్మద్ కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు..ఎవరిని హత్య చేశారు? -
బీ అలర్ట్: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే..అందులోనూ ఎండాకాలంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయనే భయం ఈ మధ్య కాలంలో కస్టమర్లను పట్టిపీడిస్తోంది. ఈ క్రమంలో టాటా మోటార్స్ కు చెందిన పాపులర్ కారు,అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు టా టా నెక్సాన్లో మంటలు చెలరేగడం ఆందోళన రేపింది. టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగుతున్న వీడియో వైరల్ కావడం ఎలక్ట్రిక్ వాహన ప్రియుల్లో కలవరం రేపింది. పూణేలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మంటల్లో కారు కాలి పోయింది. అయితే అధికారులు మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. దీనిపై టాటా మోటార్స అధికారిక ప్రకటన విడుదల చేసింది. టాటా మోటార్స్ అధికారిక ప్రకటన టాటా నెక్సాన్ ఈవీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదానికి కారణం అనధికార సర్వీస్ సెంటర్లో లెప్ట్ హెడ్ల్యాంప్ను సరిగ్గా మార్చకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. సంబంధిత వర్క్షాప్లో ఫిట్మెంట్, రిపేర్లో లోపాలున్నాయని, హెడ్ల్యాంప్ ఏరియాలో విద్యుత్ లోపం కారణంగా థర్మల్ సంఘటనకు దారితీసిందని వివరించింది. బాధిత కస్టమర్కు అన్ని రకాలుగా సాయం చేస్తున్నట్టు తెలిపింది. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) ఆటోమోటివ్ మార్కెట్ నిరంతరం కొత్త టెక్నాలజీ, ఆధునిక ఎలక్ట్రానిక్ భాగాలతో అభివృద్ధి చెందుతోంది, ICE కార్లు, EVలలో శిక్షణ పొందిన నైపుణ్యం అవసరం. వినియోగదారుల భద్రత దృష్ట్యా, అటువంటి సంఘటనలు జరగకుండా అధీకృత టాటా మోటార్స్ వర్క్షాప్లలో మాత్రమే తమవాహనాలకు ఆన్-స్పెక్ కాంపోనెంట్స్, యాక్సెసరీస్, స్పేర్ పార్ట్లను అమర్చుకోవాలని కస్టమర్లను కోరుతున్నామని విజ్ఞప్తి చేసింది. ఇదే మొదటిసారి కాదు 2022 జూన్లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని రెస్టారెంట్ వెలుపల నిలిపి ఉంచిన టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఆందోళనలు తలెత్తాయి. -
అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ
న్యూఢిల్లీ: జీవితం ఎపుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియదు. ఒకానొక క్షణంలో ఏదో ఒక పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. అదే కొత్త ఆవిష్కారానికి బీజం వేస్తుంది. గ్లోబల్ సాప్ట్వేర్ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఎండీ ఆనంద్ దేశ్పాండే సక్సెస్స్టోరీ అలాంటిదే. గ్లోబల్ బిజినెస్తో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థకు ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్గా, దేశ్పాండే రూ. 10,600 కోట్ల నికర విలువకు చేరుకున్నారు. మహారాష్ట్రలోని అకోలాలో ఆనంద్ దేశ్పాండే జన్మించారు. కానీ మధ్యప్రదేశ్లోని భోపాల్లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) టౌన్షిప్లో పెరిగారు. పాఠశాల విద్య తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. దీంతోఆటు ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్షలో కూడా పాస్ కావడంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్లో చేరాడు. ఐఐటీ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుని నిర్ణయించారు. (Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్) అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తైన తరువాత ముఖ టెక్నాలజీ కంపెనీ హ్యూలెట్ ప్యాకర్డ్ (HP)లో తన ఉద్యోగంలో చేరాడు. ఇదే యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ హోల్డర్ కూడా. ఇక్కడే దేశ్పాండే జీవితం కీలక మలుపు తిరిగింది. వర్క్ వీసా లేదా గ్రీన్ కార్డ్ పొందాలా లేదంటే ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఇండియా తిరిగి వచ్యేయ్యాలి అనే రెండేరెండు ఆప్షన్స్ ఉన్నాయి. చివరికి ఆరునెలల తర్వాత ఇండియాకు తిరిగి రావాలనేనిర్ణయించుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి అమెరికాకు గుడ్బై చెప్పేశారు. అలా 1990లో పూణేలో తన సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ప్రారంభించాడు. అయితే ఇలా కంపెనీ అంత ఈజీగా ఏమీ సాధ్య పడ లేదు. తన దగ్గరున్న సొమ్ముతోపాటు, స్నేహితులు,కుటుంబ సభ్యుల దగ్గర అప్పు తీసుకున్నాడు. చివరికి రూ.2 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన కంపెనీ స్థాపించాడు. ఆరోజు దేశ్ పాండే చేసిన రిస్క్ అతన్ని బిలియనీర్ను చేసింది. ప్రస్తుతం పెర్సిస్టెంట్ సిస్టమ్స్ మార్కెట్ క్యాప్ రూ.36,000 కోట్లకు పైగా ఉందంటే అతని కృషిని పట్టుదల అర్థం చేసుకోవచ్చు.(బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్: కీవే బైక్స్పై భారీ ఆఫర్) లాంచ్ చేసిన పదేళ్లకు తొలిసారిగా దేశ్పాండే కంపెనీ 2000లో ఇంటెల్ క్యాపిటల్ ద్వారా ఒక మిలియన్ల డాలర్ల భారీ నిధులను సేకరించింది. అనంతరం 2005లో నార్వెస్ట్ వెంచర్ పార్టనర్లు, గాబ్రియేల్ వెంచర్ పార్టనర్లు దేశ్పాండే సంస్థలో 20 మిలియన్లు పెట్టుబడి పెట్టాయి ఇక ఆ తరువాత 2010లో ఐపీవోను విజయవంతంగా పూర్తి చేశారు. దేశ్పాండే మంచి పరోపకారి కూడా. తన కుటుంబంతో కలిసి దేఆస్రా అనే ఫౌండేషన్ను కూడా నిర్వహిస్తుండటం విశేషం. దీని ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తున్నారు. 2012లో IIT ఖరగ్పూర్ విశిష్ట పూర్వవిద్యార్థిగా గుర్తింపు, 2007లో ఇండియానా యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ ద్వారా కెరీర్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. 1.1 బిలియన్ డాలర్లు సంపద ఉన్నపుడే ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల డేటాలో ఆనంద్ దేశ్పాండే బిలియనీర్ల ఎలైట్ క్లబ్లో చేరారు. -
ఇన్స్టాల్మెంట్లో మామిడి పండ్లు కొనుక్కోవచ్చని మీకు తెలుసా!
ఇంతవరకు ఈఎంఐలో కేవలం ప్రిజ్లు, వాషింగ్ మెషిన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుక్కోవడమే తెలుసు. కానీ ఇక నుంచి పండ్లు కూడా ఈఎంఐలో కొనుక్కునే వెసులు బాటు వచ్చేస్తోంది. దీంతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కావాల్సిన పండ్లు కొనేయొచ్చు, తినేయొచ్చు. వివరాల్లోకెళ్తే.. మామిడి పళ్లలో రారాజుగా అల్ఫోన్సో మామిడి పళ్లను పిలుస్తారు. వీటి ధర కూడా చాలా ఎక్కువ. రిటైల్ మార్కెట్లోనే వీటి ధర డజను రూ. 800 నుంచి రూ. 1300 వరకు పలుకుతుంది. దీంతో బాగా ధనవంతులు తప్ప కామన్మెన్ దీని జోలికే పోనేపోడు. అందుకని అందరు కొనేలా సులభమైన రీతిలో వెసులుబాటు కల్పించాలని ఈ సరికొత్త ఆలోచనకు నాంది పలికాడు పూణెకి చెందిన గౌరవ్సనస్. తన పళ్ల ఉత్పత్తులకు సంబంధించిన గురుకృపా ట్రేడర్స్తో ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువుల మాదిరిగానే ఈఎంఐలో కొనేయొచ్చు అని చెబుతున్నాడు గౌరవ్. అందుకోసం కస్టమర్ క్రెడిట్ కార్డు ఉపయోగించాలి. ఈ ఈఎంఐని మూడు, ఆరు లేదా 12 నెలల్లో కట్టేయాలి. ఇప్పటి వరకు ఈ విధానంలో నలుగురు వినయోగదారులు ఆ మామిడిపళ్లను కొనుగోలు చేసినట్లు గౌరవ్ తెలిపారు. (చదవండి: సుఖోయ్ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) -
90 శాతం పెరిగిన ఫ్యామిలీ టూర్లు.. టాప్ 4లో హైదరాబాద్!
సాక్షి, హైదరాబాద్: సకుటుంబ సపరివార సమేతంగా చేసే ప్రయాణాలు దేశంలో మళ్లీ ఊపందుకున్నాయి. కోవిడ్ నేపథ్యంలో గణనీయంగా పడిపోయిన ఫ్యామిలీ ట్రావెల్ గతేడాది 90 శాతం పెరిగింది. పరివార్తో కలిసి సందర్శించేందుకు ఎంపిక చేసుకునే నగరాల్లో టాప్–4లో హైదరాబాద్ నిలిచింది. పర్యాటకులకు వసతి సౌకర్యాలకు పేరొందిన ప్రముఖ సంస్థ ఎయిర్ బీఎన్బీ అధ్యయనం ఈ విశేషాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ బీఎన్బీ వేదికగా కుటుంబ ప్రయాణం గతేడాది 90 శాతం పెరిగిందని (ప్రపంచవ్యాప్త పెరుగుదలతో పోలిస్తే 30శాతం అధికం) దాదాపు 90,000 గమ్యస్థానాల్లో 15 మిలియన్లకు పైగా చెక్–ఇన్లు చోటుచేసుకున్నాయని ఈ స్టడీ తేల్చింది. గత ఏడాది కుటుంబ సమేతంగా టూర్లు వెళ్లడం పెరగడంతో పాటు తమ పెట్స్ను సైతం తమతో తీసుకువెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపించారు. అందుకు అనుగుణంగా తగిన వసతి సౌకర్యాల కోసం అన్వేషించారని అధ్యయనం వెల్లడించింది. అంతకు ముందుతో పోలిస్తే అత్యధికంగా పెంపుడు జంతువులు గతేడాది 5 మిలియన్ల పైగానే ప్రయాణాల్లో భాగం పంచుకున్నాయి. టాప్ 10 నగరాలివే శవ్యాప్తంగా ప్రజలు కుటుంబాలతో కలిసి తమకు ఇష్టమైన పలు ప్రాంతాలకు ప్రయాణించారు. అలా చేసిన ప్రయాణాల్లో అత్యధికులు ఎంచుకున్న గమ్యస్థానాల్లో గోవా తొలి స్థానంలో నిలువగా ఆ తర్వాత స్థానంలో బెంగళూర్ పూణె, మన హైదరాబాద్, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ వరుసగా టాప్–5లో చోటు దక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్తాన్లోని జైపూర్, మహారాష్ట్రలోని రాయ్ఘర్, కేరళలోని ఎర్నాకులం, న్యూఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని నైనిటాల్ వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.