![Corona Vaccine Registration At The Post Office - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/31/11.jpg.webp?itok=YtFFP_Sa)
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ టీకా తీసుకోవా లనుకునేవారు తమ పేరును ఇక పోస్టాఫీసు నుంచి కూడా నమోదు చేసుకోవచ్చు. తపాలా శాఖ తాజాగా ఈ సేవలు ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవడంలో కొందరికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సేవను ప్రారంభించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం తెలియనివారు, నిరక్షరాస్యులు సులభంగా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
తమ ఆధార్ కార్డు, ఫోన్ తీసుకుని పోస్టాఫీసుకు వెళ్లి వివరాలు చెబితే అక్కడి సిబ్బంది కోవిన్ పోర్టల్లో పేర్లు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారా జరిగేది అయినందున, తమ వెంట కచ్చితంగా మొబైల్ ఫోన్ తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే 36 హెడ్ పోస్టాఫీసులు, 643 సబ్ పోస్టాఫీసులు, 10 బ్రాంచి పోస్టాఫీసుల్లో ఈ సేవ ప్రారంభించామని, త్వరలో 800 ఇతర బ్రాంచి పోస్టాఫీసుల్లో కూడా ప్రారంభిస్తామని తపాలా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇది ఉచితంగా అందించే సేవ అని, ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment