vaccination
-
వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్కు నష్టం?
అమెరికా అధ్యక్షపీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిరోహించనున్నారు. ఇప్పటికే తన వద్ద పనిచేసే మంత్రులను నియమిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్ను నియమించనున్నట్లు ప్రకటించారు. అయితే ఇందుకు సెనెట్లో ఆమోదం లభించాల్సి ఉంటుంది. అమెరికాకు అత్యధికంగా భారత ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ తరుణంలో కెనెడీ నియామకం పట్ల భారత కంపెనీలు కొంత ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్లో పోస్ట్ చేశారు.2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 7.55 బిలియన్ డాలర్లు (రూ.62,615 కోట్లు) విలువ చేసే ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. యాంటిసెరా, వ్యాక్సిన్లు, టాక్సిన్లు, గ్రంథులు.. వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. అమెరికాకు ఎగుమతి చేసే దేశీయ కంపెనీల్లో ప్రధానంగా సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లుపిన్ లిమిటెడ్.. వంటి కంపెనీలున్నాయి. వీటితోపాటు ప్రధానంగా కరోనా సమయం నుంచి ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా దేశీయంగా తయారైన కొవాక్సిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేకిగా ఉన్న కెనెడీ నియామకం ఫార్మా కంపెనీల్లో కొంత ఆందోళన కలిగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: హైదరాబాద్లో రియల్టీ జోరు!‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని ట్రంప్ విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, నిబంధనల ప్రకారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ ఎఫ్డీఏ) ధ్రువపరిచిన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి ఎలాంటి ఢోకా లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. -
వ్యాక్సిన్స్ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి, దారుణంగా! వీడియో వైరల్
అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక యువతి చికిత్స తీసుకుందామని వెళ్లి ఇపుడు మరింత ప్రమాదంలో పడిపోయింది. చికిత్సలో భాగంగా ఆమె తీసుకున్న వ్యాక్సీన్లు వికటించడంతో మృత్యువుతో పోరాడుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఖర్చులు భారీగా ఉండటంతో వైద్య నిధుల సమీకరణకు నానా బాధలుపడుతోంది. విషయం ఏమిటంటే..ఫ్లోరిడాకు చెందిన 23 ఏళ్ల అలెక్సిస్ లోరెంజ్ పరోక్సిస్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబినూరియా (PNH)తో భాపడుతోంది. దీనికి చికిత్స కోసం కాలిఫోర్నియాలోని UCI మెడికల్ సెంటర్లో చేరింది.నివేదికల ప్రకారం, ఆమె చికిత్సను కొనసాగించే ముందు టెటనస్, మెనింజైటిస్ ,న్యుమోనియాకు టీకాలు వేయించుకోవాలిన ఆసుపత్రి వైద్యులు కోరారు. అయితే టీకాలు ఏకకాలంలో ఇవ్వడంతో భయంకరమైన రియాక్షన్ వచ్చింది. టీకాలు వేసిన పది నిమిషాల్లోనే ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించింది. తాత్కాలిక అంధత్వం,దవడలు బిగుసుకుపోయాయి. ఒళ్లంతా రక్తం పేరుకుపోయిన మచ్చలు. ఒక దశలో తల పగిలిపోతుందా అన్నంత బాధ. దీనికి తోడు వాంతులతో ఇబ్బంది పడుతోంది. ఫలితంగా ఆమెను ప్రత్యేక చికిత్స కోసం లాస్ ఏంజిల్స్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. లోరెంజ్కి కాలిఫోర్నియాలో ఆరోగ్య బీమా లేకపోవడం నిధులను సేకరించే పనిలో ఉన్నారు ఆమె బంధువులు, స్నేహితులు. Alexis Lorenze suffering reactions from 3 vaccines administered to her: meningitis, pneumonia, and tetanus at UCI Medical Center (Anaheim California). I'd give this woman a lot of C to begin with. #VaccineSideEffects https://t.co/whOja2HeGs pic.twitter.com/Hwy1wVuVir— Robert, C.N., Pharm Tech. (@Robertvegan7) September 17, 2024తన పరిస్థితిపై లోరెంజ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మె మొదట రక్త రుగ్మత కోసం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. రక్త మార్పిడి చేయించుకుంది. రక్తమార్పిడి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, పూర్తిగా తగ్గలేదని ఆమె వాపోయింది. టీకాలు వేసుకోవాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారని, బలవంతంగా తీసుకున్న మూడు వ్యాక్సిన్ల కారణంగా తన పరిస్థితి దారుణంగా తయారైందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు టీకాలు తీసుకున్న తర్వాత, ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించటానికి దారితీసిందనికుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం లోరెంజ్ నెమ్మదిగాకోలుకుంటోందని ఆమెకోసం కేటాయించిన స్పెషల్ నర్సు వెల్లడించారు. -
డెంగీకి రెండేళ్లలో టీకా!
సాక్షి, హైదరాబాద్: సీజన్ మారిందంటే ప్రజలను బెంబేలెత్తించే డెంగీ వ్యాధికి చెక్ పడే అవకాశం కన్పిస్తోంది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పాన్ ఆసియా బయోటెక్ కంపెనీలు కలిసికట్టుగా తయారు చేస్తున్న టీకా ‘డెంగీఆల్’ కీలకమైన మూడో దశ ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ దశలోనూ ఆశించిన ఫలితాలు వస్తే టీకా అందుబాటులోకి రావడమే తరువాయి అవుతుంది. ఈ టీకా తయారీ ప్రక్రియ యావత్తూ దేశీయంగానే జరిగిందని, డెంగీపై పోరాటంలో టీకా అభివృద్ధి కీలక మలుపు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం: నడ్డాఏదైనా వ్యాధి నివారణకు అభివృద్ధి చేసే టీకా మూడు దశల ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పాన్ ఆసియా బయోటెక్ డెంగీఆల్పై ఇప్పటివరకు రెండు దశల ప్రయోగాలను పూర్తి చేసింది. తాజాగా బుధవారం హరియాణాలోని రోహతక్లో ఉన్న పండిట్ భగవత్ దయాళ్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మూడో దశ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. డెంగీఆల్ మూడో దశకు చేరుకోవడం ప్రజారోగ్య సంరక్షణపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీల సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేయడం ఆరోగ్య రంగంలో ఆత్మ నిర్భర్ భారత్కు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.కోవిడ్కు ముందే రెండు దశలు పూర్తిడెంగీ వ్యాధికి ప్రస్తుతం ఎలాటి టీకా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కనీసం నాలుగు రకాల డెంగీ వైరస్లను నియంత్రించే లక్ష్యంతో టీకా తయారీ ప్రయత్నాలు మొదలయ్యాయి. అమెరికా లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అభివృద్ధి చేసిన ఒక టెట్రా వేలంట్ టీకా ప్రపంచ వ్యాప్తంగా ప్రీ క్లినికల్, క్లినికల్ ట్రయల్స్లో ప్రభావశీలంగా కనిపించింది.అయితే దేశంలోని పాన్ ఆసియా బయోటెక్కు కూడా ఇది అందుబాటులోకి రావడంతో ఆ కంపెనీ ఐసీఎంఆర్తో కలిసి ప్రయోగాలు మొదలుపెట్టింది. తొలి, మలి దశ ప్రయోగాలు కోవిడ్కు ముందు 2018 – 19లోనే పూర్తి చేసింది. మూడో దశ ప్రయోగాల కోసం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 కేంద్రాలను ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 10,335 మందిపై జరిగే మూడో దశ ప్రయోగాల్లో భాగంగా టీకాలు తీసుకున్న వారిని రెండేళ్ల పాటు పరిశీలించనున్నారు. -
పిల్లల భవిష్యత్ కోసం.. అబ్ ఇండియా బనేగా 7-స్టార్
పిల్లలకు వచ్చే వ్యాధులను దూరం చేయడానికి.. వారి భవిష్యత్తకు మద్దతుగా నిలబడటానికి జీఎస్కే (GSK) 'అబ్ ఇండియా బనేగా 7-స్టార్' అనే కార్యక్రమం ప్రారంభించింది. భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఈ ప్రచారం ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తోంది.అబ్ ఇండియా బనేగా 7-స్టార్ ద్వారా పోలియో, చికెన్పాక్స్, హెపటైటిస్ A, హెపటైటిస్ బి, మెనింజైటిస్, మీజిల్స్, గవదబిళ్లలు, రుబెల్లా, న్యుమోనియా, ఇన్ఫ్లుఎంజా, డిఫ్తీరియా, టెటానస్, పెర్టుసిస్, హైబి ఇన్ఫెక్షన్ వంటి 14 వ్యాధులకు వ్యతిరేఖంగా 7 టీకాలు పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతామని జీఎస్కే వెల్లడించింది. ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వయసున్న పిల్లలకు ఈ 7 టీకాలను వేయాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) సిఫార్సు చేస్తోంది.పిల్లల మొదటి పుట్టిన రోజు నుంచి.. కొన్ని వ్యాధులను నివారించడానికి టీకాలు చాలా అవసరమని జీఎస్కే మెడికల్ డైరెక్టర్ డాక్టర్ షాలినీ మీనన్ వెల్లడించారు. టీకాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చని.. ఈ విషయాలను తల్లితండ్రులకు తెలియజేయడానికి ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.జీఎస్కే ప్రారంభించిన ఈ కార్యక్రమం గురించి టీవీ, రేడియో, సోషల్ మీడియా, ఓటీటీ వంటి మల్టిపుల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రచారం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా షెడ్యూల్ గురించి తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించాలి లేదా 'మైవ్యాక్సినేషన్ హబ్.ఇన్' వంటి సైట్లను సందర్సించాల్సి ఉంటుంది. -
వ్యాక్సిన్ ఇప్పిద్దాం...మహిళల ప్రాణాలు కాపాడదాం
రాజ్యసభ సభ్యురాలిగా మొదటిసారి సమావేశాల్లో పాల్గొన్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి భారతీయ పేద మహిళల్లో ఇటీవల అత్యధికంగా చోటు చేసుకుంటున్న సర్వైకల్ క్యాన్సర్ మరణాల గురించి మాట్లాడారు. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం వేక్సిన్ ఇవ్వాల్సిన ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేశారు. నిజమే. సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇది చైతన్యం కలిగించాల్సిన సమయం. ప్రభుత్వం పూనుకోవాల్సిన సమయం.కొన్ని అధ్యయనాల ప్రకారం మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్కు కారణమయ్యే హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాప్తి 7% నుంచి 27% మందిలో కనిపిస్తోంది. ఇవన్నీ క్యాన్సర్గా మారనప్పటికీ, చాలా కేసుల్లో క్యాన్సర్ ముప్పు మాత్రం ఉంటుంది. పద్ధెనిమిదేళ్ల తర్వాత పెళ్లయ్యే యువతులతో పోలిస్తే అంతకంటే ముందుగానే వివాహమయ్యేవారిలో ఇది ఆరు శాతం ఎక్కువ. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతి ఏడాది 1,23,907 మంది మహిళల్లో దీన్ని కనుగొంటుండగా... ఏటా 77,348 మంది మరణిస్తున్నట్లు అంచనా. గణాంకాల ప్రకారం సంఖ్యాపరంగా పదిహేనో ఏటి నుంచి 44 ఏళ్ల మహిళల్లో వస్తూ, వారిని మృత్యుముఖానికి నెట్టే క్యాన్సర్లలో ఇది రెండో అతి పెద్దది.ఏమిటీ సర్వైకల్ క్యాన్సర్? మహిళల్లో యోని (వెజైనా) తర్వాత వచ్చే భాగమే సర్విక్స్. ఇది గర్భాశయానికి కింద ఉంటుంది. అంటే ఇది యోనికీ, గర్భాశయానికీ (యుటెరస్)కూ మధ్యన సన్నటి దారిలా ఉండే సర్విక్స్ గర్భాశయానికి ముఖద్వారంలా ఉంటుంది కాబట్టే దీన్ని ‘గర్భాశయ ముఖద్వారం’ అనీ, దీనికి వచ్చే క్యాన్సర్ను ‘సర్వైకల్ క్యాన్సర్’ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) అని అంటారు. నిజానికి మిగతా క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం మంచి పరిష్కారం. దీని చికిత్స కూడా చాలా సులభం. ఎంత ముందుగా గుర్తిస్తే దీనికి అంత సమర్థంగా, తేలిగ్గానూ చికిత్స అందించవచ్చు. సాధారణంగా పల్లెల్లో కంటే పట్టణాల్లో, నగరాల్లో వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఈ క్యాన్సర్ విషయానికి వస్తే ఇది గ్రామీణ ప్రాంతాల స్త్రీలలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. చాలా చిన్నవయసులోనే అందునా పద్ధెనిమిదేళ్ల వయసు కంటే చాలా తక్కువ వయసులోనే అక్కడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ ఉండటం ఇందుకు ఒక కారణమని కొంతమంది పరిశీలకుల విశ్లేషణ. అయితే ఇంతటి తీవ్రమైన వ్యాప్తిలోనూ అదృష్టం ఏమిటంటే... ఈ క్యాన్సర్ రావడానికి ముందర కనీసం 10 ఏళ్ల ముందుగానే కనుగొనగలిగేలా దీనికి చాలా ఎక్కువ వ్యవధిగల ప్రీ–క్యాన్సరస్ దశ ఉంటుంది. ఈ సమయంలో కనుగొనగలిగితే దాన్ని దాదాపు పూర్తిగా నయం చేయడానికి అవకాశముంటుంది.ప్రధాన రకాలు... సర్వైకల్ క్యాన్సర్లలో రెండు ప్రధాన రకాలుంటాయి. మొదటిది తరచుగా కనిపించే ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అనే రకం. రెండోది ‘అడెనోకార్సినోమా’ తరహాకు చెందినదైతే, ఆపరేషన్ ద్వారా తొలగించగల దశలో ఉంటే, సర్జరీ ద్వారా ఆ భాగాన్ని తొలగించవచ్చు. ఇది కాస్త అరుదు. రిస్క్ ఫాక్టర్లు...హెచ్పీవీ వైరస్ సోకడం అనేది సర్వైకల్ క్యాన్సర్కు ఓ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్. చాలామందిలో ఈ హెచ్పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్యాన్సర్కు దారితీసే ప్రమాదమముంది. అలాగే పొగ తాగడం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్కు దారితీసే రిస్క్ఫ్యాక్టర్లలో కొన్ని.చికిత్స ప్రక్రియలు... ఈ క్యాన్సర్ల మొదటి, రెండో దశల్లో శస్త్రచికిత్స అయినా, రేడియోథెరపీ, కీమోథెరపీ... ఈ మూడూ బాగానే పనిచేస్తాయి. అయితే ఈ అన్ని చికిత్సా ప్రక్రియలకు వాటివాటి ప్రయోజనాలూ, దుష్ప్రభావాలూ రెండూ ఉంటాయి. చికిత్సకు ముందు ఈ రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకొని చికిత్స ప్రక్రియను డాక్టర్లు నిర్ణయిస్తారు. సర్జరీతో సాధారణ జీవితానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. సర్జరీ తర్వాత వారం లేదా పది రోజుల్లోనే సాధారణ జీవితం గడిపేలా బాధితులు కోలుకోగలరు. సర్జరీ విజయావకాశాలు 75% నుంచి 90% వరకు ఉంటాయి. పైగా చిన్నవయసులోనే దీని బారిన పడ్డవారికి డాక్టర్లు సాధారణంగా శస్త్రచికిత్సనే సూచిస్తుంటారు. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. ఇక సర్జరీతో వచ్చే దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువే. ఇది ఎంతమాత్రమూ ప్రాణాంతకం కాదు. ఇక కొద్దిమందిలో సర్జరీ తర్వాత కాంప్లికేషన్లు వస్తే / సర్జరీ అంటే భయపడేవారికి డాక్టర్లు ‘రాడికల్ రేడియోథెరపీ’ అనే చికిత్స చేస్తారు. హెచ్పీవీతో సమర్థమైన నివారణమామూలుగా శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ ను తయారుచేస్తుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్ను తెచ్చిపెట్టే హెచ్పీవీ వైరస్ విషయంలో మాత్రం మహిళల దేహం ఎలాంటి యాంటీబాడీస్లనూ తయారు చేయదు. అందువల్ల ఒకసారి హెచ్పీవీ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం శరీరంలో ఉండిపోయి సర్వైకల్ క్యాన్సర్కు దారితీయవచ్చు. అదే హెచ్పీవీ వ్యాక్సిన్ను మహిళకు తొమ్మిది నుంచి 26 ఏళ్ల వయసు లోగా ఇప్పిస్తే యాంటీబాడీస్ను తయారుచేసి, సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కేవలం బాలికలు, యువతులకే కాకుండా బాలురు, యువకులకూ కూడా ఇచ్చే అత్యాధునిక వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే పురుషులు క్యారియర్లుగా మారి దీన్ని మహిళలకు వ్యాప్తి చేస్తారు కాబట్టి మగవాళ్లకూ ఇచ్చే వ్యాక్సిన్లు రూపొందాయి. ఇవి ఒకటి రెండు రకాలకే గాక... మరిన్ని రకాల సర్వైకల్ క్యాన్సర్లను నివారిస్తాయి. 9 నుంచి 14 ఏళ్ల మగపిల్లల్లో రెండు డోసులూ, పధ్నాలుగేళ్లు దాటిన వారికి 0, 2, 6 నెలల్లో వరసగా ఇవ్వాలి. కారణాలుసర్విక్స్ మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన కారణంగా క్యాన్సర్కు గురయ్యే అవకాశాలెక్కువ. సర్వైకల్ క్యాన్సర్కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) ప్రధానం. ఈ వైరస్ లైంగికంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్పీవీ వైరస్ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే క్యాన్సర్ను కలగజేస్తుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ తో సెక్స్లో పాల్గొనేవారికీ హెచ్పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ.నివారణ... సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్స్మియర్ మంచి పరీక్ష. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, లైంగిక జీవితం ప్రారంభమై మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ విషయంలో మరో వెసులుబాటు ఏమిటంటే ఇది రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దీన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–క్యాన్సరస్ దశ’ దీనికి ఉంది డా‘‘ కావ్య ప్రియ వజ్రాల లీడ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ – రిస్క్ ఆబ్స్టెట్రీషియన్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కు వ్యాక్సిన్ను ప్రభుత్వమే అందజేస్తే మహిళాలోకానికి చాలా మేలు చేసినట్లవుతుంది. తమ కుటుంబానికే తొలి ప్రాధాన్యమిచ్చే స్త్రీలు సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి, ఏ నాలుగో దశలోనో, మూడో దశలోనో హాస్పిటల్స్కు వస్తూ, చేజేతులా మరణాన్ని తెచ్చుకుంటున్నారు. అదే తొమ్మిది నుంచి 45 ఏళ్ల వయసులోనే వారికీ వ్యాక్సిన్ ఇప్పిస్తే ఎన్నో మరణాలను నివారించగలం. కోవిడ్ టైమ్లో దేశం మొత్తానికి వ్యాక్సిన్ ఇప్పించిన మనకు ఇదేమీ కష్టం కాబోదు. ప్రైవేటు సంస్థల్లో దీన్ని దాదాపు రూ. 1,400 నుంచి రూ. 1,500 లకు అమ్ముతున్నారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపి, చవగ్గా ఏ ఏడువందల రూపాయలకో ఇప్పించగలిగితే అత్యంత నిరుపేద మహిళల ప్రాణాలనూ మనం కాపాడ గలిగినవాళ్లమవుతాం. – సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలు, సమాజ సేవిక -
పాకిస్తాన్లో పోలియో కేసుల కలకలం
పోలియోమైలిటీస్ వ్యాధిని వాడుక భాషలో పోలియో అని పిలుస్తుంటారు. ఇది ఒక రకమైన అంటు వ్యాధి. వైరస్ కారణంగా వ్యాప్తిచెంది, మానవ నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు వయసుగల చిన్నారులు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి ఇప్పుడు పాకిస్తాన్ను వణికిస్తోంది.పాకిస్తాన్లోని బలూచిస్థాన్లోగల క్వెట్టాలో పోలియో కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. తాజాగా ఐదో కేసు వెలుగు చూసింది. ఇది ఏప్రిల్ 29న వెలుగు చూడగా, జూన్ 8న నిర్ధారణ అయ్యింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) నివేదిక ప్రకారం బాధిత చిన్నారి తొలుత అతిసారం, వాంతులు తదితర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని చికిత్స కోసం క్వెట్టాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతున్న తరుణంలో 10 రోజుల తర్వాత ఆ చిన్నారి శరీరంలోని దిగువ భాగం బలహీనంగా మారింది. తరువాత పోలియో వ్యాధి ఆ చిన్నారి శరీరానికంతటికీ వ్యాపించింది. దీంతో బాధిత చిన్నారిని కరాచీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ఎన్ఐసీహెచ్)కు తరలించారు. అక్కడ ఆ చిన్నారికి అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతం (ఏఎఫ్పీ) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వైద్య చికిత్స అందించినప్పటికీ వ్యాధి సోకిన చిన్నారి మే 22న మృతి చెందింది. దీనిపై వైద్యారోగ్యశాఖ విచారణ చేపట్టింది.బాధిత చిన్నారి రక్త నమూనాలను సేకరించారు. ఆ చిన్నారి తోబుట్టువులలో ఒకరికి వైల్డ్ పోలియోవైరస్ టైప్ వన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా ఆ చిన్నారికి పోలియో వ్యాక్సిన్ వేయించని కారణంగానే మృతి చెందిందా? అనే కోణంలో వైద్యశాఖ విచారణ చేస్తోంది. -
వేగంగా బీసీజీ వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్షయ(టీబీ) వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్యశాఖ బాసిల్లస్ కాల్మెట్–గ్వెరిన్ (బీసీజీ) వ్యాక్సిన్ను వేగంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని 12జిల్లాల్లో టీకా పంపిణీని ఈ నెల 12న ప్రారంభించింది. తొలి రెండు వారాల్లోనే 16.98శాతం టీకా పంపిణీ పూర్తిచేసింది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన టీటీటీ (ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్) విధానాన్ని టీబీ నియంత్రణలోను వైద్యశాఖ పాటిస్తోంది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా వైద్యం, మందులు, పౌష్టికాహారం అందిస్తున్నారు. 2025 నాటికి టీబీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెద్దలకు ఉచితంగా టీకా పంపిణీ చేస్తున్నారు. హైరిస్క్ వర్గాలకు... క్షయ వ్యాధి బారినపడే అవకాశం ఉన్న హైరిస్క్ వ్యక్తులను గుర్తించి వారికి టీకా పంపిణీ వేస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, టీబీతో బాధపడుతున్న వ్యక్తుల కుటుంబ సభ్యులు, టీబీ చరిత్ర కలిగిన వారితోపాటు ధూమపానం చేసేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, చ.మీ.కు 18కిలోల కంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వ్యక్తులు.. ఇలా ఆరు వర్గాలకు చెందిన వారికి తొలి దశలో టీకా పంపిణీ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో ఆరు వర్గాలకు చెందినవారు 50లక్షల మంది వరకు ఉన్నట్టు వైద్యశాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. తొలి మూడు నెలల్లో 20లక్షల మందికి టీకా వేయాలని లక్ష్యం కాగా, రెండు వారాల్లోనే 16.98 శాతం 3,39,640 మందికి పూర్తిచేశారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 45,891మందికి, నెల్లూరులో 38,602మందికి, వైఎస్సార్ జిల్లాలో 37,995మందికి టీకాలు వేశారు. ప్రస్తుతం ఎంపికచేసిన 12 జిల్లాల్లో ప్రతి గురువారం బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటికే పిల్లలకు టీకా ఇప్పటికే వైద్యశాఖ పిల్లలకు సాధారణ టీకాలతోపాటు టీబీకి సంబంధించిన టీకాను వేస్తోంది. వైద్యశాఖ 2022లో ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. తొమ్మిది నెలల్లోపు పిల్లలకు మూడు డోసులుగా ఈ టీకాను వేస్తున్నారు. పుట్టిన ఆరు వారాలలోపు ఒక డోసు, 14 వారాల్లోపు రెండో డోసు, చివరిగా 9 నెలల వయసులోపు మూడో డోసు వేస్తున్నారు. మూడు డోసుల టీకా వేసుకున్న పిల్లలకు న్యుమోనియా నుంచి రక్షణ లభిస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. -
COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!
కొవిడ్-19 వాక్సినేషన్, గుండెపై ప్రభావానికి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. వివిధ దేశాల్లో ఈ టీకా తీసుకున్న వారిలో(భారత్ మినహా) గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. గులియన్ బారే సిండ్రోమ్, మయోకార్డిటిస్, పెర్కిర్డిటిస్ , సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ (CVST) లాంటి కేసులు కనీసం 1.5 రెట్లు పెరిగాయని ఈ స్టడీ వెల్లడించింది. బ్లూమ్బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో COVID-19 టీకాతో తీవ్ర ప్రమాదం ఉందో లేదో నిర్ధారించేందుకు ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వ్యాక్సిన్ అధ్యయనం అని తెలుస్తోంది. భారత్ మినహా, వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది వాక్సిన్ తీసుకున్న వారిని విశ్లేషించారు. 13 రకాల ప్రభావాలను పరీశీలించారు. వివిధ దేశాల్లో 9.9 కోట్లమందిలో ద గ్లోబల్ కొవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ పేరుతో ఈ పరిశోధన నిర్వహించింది. Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజా పరిశోధన కీలక డాటా సేకరించింది. మోడర్నా(mRNA),కోవిషీల్డ్ (ChadOX1) వ్యాక్సిన్ల తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలున్నాయని కనుగొంది. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 టీకా తీసుకున్నవారిలో చాలా అరుదైన రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే Guillain-Barre సిండ్రోమ్ను గుర్తించారు ఇది కండరాలకు తీవ్ర హాని కలిగించవచ్చు, సుదీర్ఘ చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఈ టీకా డోస్ తీసుకున్న వారిలో 6.9 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని అధ్యయనం కనుగొంది. వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..! కోవిషీల్డ్ వ్యాక్సిన్తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలు, గుండెపోటు,పక్షవాతం,రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయట. ఈ తరహా టీకాలే భారత్లోనూ పెద్ద సంఖ్యలో తీసుకున్నారని, దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదనినిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్టీ ప్రాజెక్ట్ కింద అర్జెంటీనా, న్యూ సౌత్ వేల్స్ , ఆస్ట్రేలియాలోని విక్టోరియా, బ్రిటిష్ కొలంబియా , కెనడా, డెన్మార్క్లోని అంటారియోతో సహా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ , స్కాట్లాండ్ పలు ప్రదేశాల్లో డి COVID-19 వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రతికూల సంఘటనలపై ఎలక్ట్రానిక్ హెల్త్కేర్ డేటాను సేకరించింది. కాగా కరోనా మహమ్మారి ప్రారంభం తరువాత ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13.5 బిలియన్ల కంటే ఎక్కువ టీకాలు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ పరిశోధనపై వాక్సిన్ తయారీదారులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఏడు టీకాలతో 7-స్టార్ రక్షణ : పిల్లల టీకాలపై జీఎస్కే ప్రచారం
ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాక్సో స్మిత్క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (GSK) పిల్లలకు క్లిష్టమైన రక్షణను అందించే టీకాల గురించి అవగాహన కల్పిస్తోంది. ఒకటి నుండి రెండేళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు అందించాల్సిన టీకాలపై జనవరి 25 నుంచి ప్రచారాన్ని ప్రారంభించింది. 1-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఏడు కీలకమైన టీకాల ద్వారా '7-స్టార్ ప్రొటెక్షన్' అందించాలంటూ తల్లిదండ్రులను కోరుతోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) పిల్లలకు ఏడు టీకాలును సిఫార్సు చేస్తోంది, చికెన్పాక్స్ హెపటైటిస్ ‘ఏ’ తొలి డోస్ , ఎంఎంఆర్ (MMR) మెనింజైటిస్ రెండో డోస్, పీసీవీ DTP Hib IPV బూస్టర్ డోస్, ఫ్లూ వార్షిక మోతాదు ప్రధానంగా ఉన్నాయి. పలు రకాల ఇన్ఫెక్షన్లనుంచి కాపాడి, రోగ నిరోధక వ్యవప్తను బలోపేతం చేసే టీకాలు వేయవలసిన అవసరంపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తోంది. బిడ్డ పుట్టిన తొలి ఏడాదిలో టీకాలపై ఎక్కువ ఆసక్తి ఉన్నప్పటికీ, రెండో సంవత్సరంలో టీకాలు వేయించుకోని వారి సంఖ్య పెరుగుతోందని జీఎస్కే తెలిపింది. దీంతో పాక్షికంగా టీకాలు తీసుకుంటున్న పిల్లల సంఖ్య దేశంలో బాగా పెరుగుతోందని పేర్కొంది. అంటే తొలి ఏడాది శ్రద్దగా వాక్సీన్లు వేయించిన తల్లిదండ్రులు, రెండో ఏడాదికి వచ్చేసరికి మునుపటి శ్రద్ధ చూపించడలేదు. అలా కాకుండా క్రమంగా తప్పకుండా పిల్లలకు టీకాలు వేయిస్తే వారి ఆరోగ్య భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్టు అవుతుందనే సందేశంతో జీఎస్కే ఈ ప్రచారాన్ని చేపట్టింది. పాక్షికవ్యాక్సినేషన్ వల్ల పిల్లల్ని తీవ్రమైన సమస్యలకు గురి చేస్తుందని జీఎస్కే చెబుతోంది. అందుకే రెండో సంవత్సరంలో కూడా క్రమం తప్పకుండా టీకాలు వేయించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఇది పిల్లల్ని చాలా రోగాల నుంచి పిల్లలను కాపాడుతుందంటోంది. అలాగే రెండో ఏడాదిలో టీకాలను తీసుకోని పిల్లలు స్వయంగా ప్రమాదంలో పడటంతోపాటు, ఇంట్లో వారి మిగిలిన తోబుట్టువులను, అమ్మమ్మ తాత,నానమ్మ తదితర వృద్ధులకు ఇన్ఫెక్షన్ వ్యాపించి వారిని మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని కంపెనీ పత్రికా ప్రకటన తెలిపింది. టీకాలతో నివారించగలిగే చికెన్పాక్స్, మీజిల్స్ , ఫ్లూ వంటి వ్యాధులు గత మూడేళ్లలో దేశంలో బాగా వ్యాపించాయని జీఎస్కే ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , మెడికల్ అఫైర్స్, డాక్టర్ రష్మీ హెగ్డే తెలిపారు. పిల్లల అభివృద్ధిపై టీకాల దీర్ఘకాలిక ప్రభావాన్ని నొక్కి వక్కాణించిన ఆయన సంబంధిత టీకాలను పూర్తి చేయడం ద్వారా ఆరోగ్య కరమైన సంతోషకరమైన బాల్యం అందించినట్టు అవుతుందన్నారు. రెండేళ్ల వయసున్న పిల్లల ఎదుగుదలకు భరోసా ఇచ్చే టీకాల గురించి తెలిదండ్రులకు అవగాహన కల్పించడమే తమ ప్రచార లక్ష్యమని హెగ్డే వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల వైద్యుల క్లినిక్లలో టెలివిజన్, సోషల్ మీడియా, పోస్టర్లు వంటి బహుళ ఛానెల్లలో ప్రచారాన్ని ప్రారంభించింది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వివరాలపై మరింత సమాచారం కోసం శిశు వైద్యులను సంప్రదించాలి. 7 కీలకమైన VPDల గురించి అదనపు సమాచారాన్ని MyVaccinationHub.inలో కూడా పొందవచ్చు. -
అన్ని వేరియంట్లకు ఒకే టీకా?
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) సైంటిస్టులు వినూత్నమైన కోవిడ్–19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. సార్స్–కోవ్–2కు చెందిన అన్ని రకాల సబ్ వేరియంట్లను ఇది సమర్థంగా ఎదుర్కొంటోందని చెబుతున్నారు. భవిష్యత్తులో పుట్టుకొచ్చే వేరియంట్లపైనా పోరాడగలదని అంటున్నారు. కాగా, ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ నేతృత్వంలో ఐఐఎస్సీ మాలిక్యులర్ బయోఫిజిక్స్ యూనిట్ బృందం తయారు చేసిన ఈ టీకాకు ఆర్ఎస్2 అని పేరుపెట్టారు. కోవిడ్–19పై జరుగుతున్న పోరాటంలో ఈ వ్యాక్సిన్ ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని సైంటిస్టులు అభివర్ణించారు. ఇది వేడిని తట్టుకోగలదని, చల్లని ప్రదేశంలో నిల్వ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా వైరస్కు చెందిన స్పైక్ ప్రొటీన్లలోని రెండు కాంపోనెంట్ల సమ్మేళంతో ఆర్ఎస్2 టీకాను అభివృద్ధి చేశారు. ఇదొక సింథటిక్ యాంటీజెన్. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాలతో పోలిస్తే ఆర్ఎస్ఈ టీకా మరింత ఎక్కువ రక్షణ ఇస్తుందని ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇందులోని ఎస్2 అని సబ్ యూనిట్ వైరస్ మ్యుటేషన్లను సమర్థంగా తట్టుకుంటుందని పేర్కొన్నారు. -
బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు?
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న కరోనా వైరస్లోని కొత్త సబ్-వేరియంట్ జేఎన్.1 భారతదేశంలోకి ప్రవేశించింది. కేరళలో తొలి కేసు నమోదైన తర్వాత గోవా, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం బూస్టర్ డోసు లేదా నాలుగో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియా సార్స్- కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం చీఫ్ ఎన్కే అరోరా మాట్లాడుతూ.. కొత్త సబ్-వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. డాక్టర్ అరోరా మాట్లాడుతూ.. 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే, ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ముందుజాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సాధారణ ప్రజలకు నాలుగో డోసు అవసరం లేదని చెప్పారు. ఓమిక్రాన్లోని ఈ కొత్త సబ్-వేరియంట్కు సంబంధించిన కేసులు తీవ్రంగా లేవని, వైరస్ సోకిన వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు. జేఎన్.1 సబ్వేరియంట్ లక్షణాలు.. జ్వరం, ముక్కు కారటం, దగ్గు, కొన్నిసార్లు విరేచనాలు, తీవ్రమైన శరీర నొప్పులు అని తెలిపారు. ఇవి సాధారణంగా ఒక వారం రోజులలో తగ్గిపోతాయన్నారు. కాగా కోవిడ్-19 పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన డేటాలోని వివరాల ప్రకారం దేశంలో ఆదివారం కొత్తగా 656 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కి చేరుకుంది. ఇది కూడా చదవండి: పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ! -
ఆకస్మిక మరణాలకు.. టీకాకు సంబంధం లేదు!
అకస్మాత్తుగా తీవ్రస్థాయి వ్యాయామంతో ముప్పు.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన 22 ఏళ్ల యువకుడు!.. వ్యాయామం చేస్తూండగా గుండెపోటు.. 42 ఏళ్ల యాక్టర్ మృతి.. పాతికేళ్లకే గుండెపోటు.. ఆకస్మిక మరణం!.. ఇలాంటి శీర్షికలు వార్తాపత్రికల్లో మీరూ చూసే ఉంటారు. కోవిడ్ తరువాత ఇలాంటి ఆకస్మిక మరణాలు మరీ ముఖ్యంగా తక్కువ వయసు వారిలో ఎక్కువయ్యాయి అన్న చర్చ కూడా జరిగే ఉంటుంది. అయితే ఇందులో వాస్తవం లేదంటోంది భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, క్లుప్తంగా ఐసీఎంఆర్). కోవిడ్ టీకాలతోనే గుండె జబ్బుల ముప్పు పెరిగిందన్నది ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ కంటే ముందు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం మొదలుకొని కుటుంబ ఆరోగ్య చరిత్ర, మితిమీరిన మద్యపానం, అలవాటు లేని తీవ్రమైన పనులు కొనసాగించడం వంటివి యువత ఆకస్మిక మరణాలకు కారణాలు కావచ్చునని వీరు అంటున్నారు. కోవిడ్ తరువాత యువకులు ఆకస్మికంగా గుండెజబ్బుల కారణంగా మరణిస్తున్నారన్న వదంతులు ప్రబలుతున్న సమయంలో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 47 టెరిటరీ ఆసుపత్రుల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ద్వారా అసలు సమస్య ఏమిటన్నది తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ అధ్యయనంలో 18 - 45 మధ్య వయస్కుల ఆకస్మిక మరణాల కారణాలను విశ్లేషించారు. ఈ మరణాల్లో కొంతమంది సెలబ్రిటీలూ ఉండటం గమనార్హం. ‘‘కోవిడ్ వ్యాధి, టీకాలకు ఈ మరణాలకు సంబంధం ఉందన్న ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో అసలు కారణాలేమిటో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేపట్టాం’’ అని ఐసీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. 3645 మంది వివరాలతో... ఐసీఎంఆర్ అధ్యయనంలో భాగంగా మొత్తం 3645 మంది వివరాలను విశ్లేషించారు. ఇందులో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరి ఆ తరువాత 24 గంటల్లోనే మరణించిన వారు కూడా ఉన్నారు. వీరందరూ 18 - 45 మధ్య వయస్కులే. ఆకస్మిక మరణానికి కారణం కాగల వ్యాధులు, సమస్యలు ఏవీ లేనివారే. అక్టోబరు 2021 - మార్చి 2023 మధ్యకాలంలో వీరు ఆకస్మికంగా మరణించారు. ఆకస్మిక మరణాలకు గుండె సంబంధిత సమస్యలే కారణమైనప్పటికీ అన్నీ కార్డియాక్ అరెస్ట్ (అకస్మాత్తుగా గుండె పనిచేయకుండా పోవడం) ఫలితంగానూ జరగలేదని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడియమాలజీ డైరెక్టర్ శాస్త్రవేత్త మనోజ్ ముర్హేకర్ తెలిపారు. మరణించిన వారి సమచారాన్ని, కోవిడ్ బాధితులను పోల్చి చూసినప్పుడు టీకాలే మరణానికి కారణమని సూచించే ఏ అంశమూ బయటపడలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వాస్తవానికి టీకాలు మరణాలను అడ్డుకుంది. ఆకస్మిక మరణాలకు ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు’’ అని ఆయన వివరించారు. కోవిడ్ -19 టీకాలు, వ్యాధి, చికిత్స తరువాత ఆరోగ్యం వంటి విషయాలపై తాము కొంతమందిని ఇంటర్వ్యూ చేశామని, కుటుంబంలో ఆకస్మిక మరణాల చరిత్ర ఏమైనా ఉందా? అన్నదీ పరిశీలించామని, ధూమపానం, మత్తుముందుల వాడకం, మద్యపానం ఎంత తరచుగా చేస్తారు? మరణానికి రెండు రోజుల ముందు అతిగా శ్రమించారా? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నామని... ఇలాంటి కారణాల వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసిందని మనోజ్ ముర్హేకర్ తెలిపారు. ‘‘మద్యపానం ఎంత తరచుగా తీసుకుంటూంటే ఆకస్మిక మరణానికి అవకాశాలు అంత ఎక్కువగా పెరిగాయి’’ అని వివరించారు. రెండు డోసుల టీకాతో రక్షణ... కోవిడ్ వ్యాధి నివారణకు రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశాలు తక్కువైనట్లు తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ చెబుతోంది. అయితే కోవిడ్-19 కారణంగా మరణాలు ఎలా సంభవిస్తాయన్న అంశం ప్రస్తుతానికి పూర్తిగా అర్థం కావడం లేదని తెలిపింది. అయితే సార్స్ కోవ్-2 వ్యాధి వల్ల గుండెజబ్బు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుందని మాత్రం ఈ అధ్యయనం అంగీకరించడం గమనార్హం. ఆకస్మిక మరణాలకూ కారణమవుతుందా? అన్న విషయంపై మాత్రం తగినంత సమాచారం లేదని ఐసీఎంఆర్ చెబుతోంది. కోవిడ్ టీకాల కారణంగా ఆకస్మిక మరణాలు పెరిగాయని కొంతమంది తగిన సాక్ష్యాధారాల్లేకుండా మాట్లాడుతున్రాను. వ్యాక్సీన్లతో మరణాలు తగ్గాయని చెప్పేందుకు రుజువులు ఉన్నాయి. ముప్ఫై ఏళ్ల పైబడ్డ వారు.. అప్పటివరకూ తరచూ వ్యాయామం చేయకుండా.. అకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం మొదలుపెడితే వారిలో ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం వల్ల గుండె రక్తనాళాల్లో అప్పటివరకూ పేరుకుపోయిన గార లాంటి పదార్థం ముక్కలై గుండెపోటుకు దారితీయవచ్చు’’ అని వైద్య నిపుణులు కొందరు చెబుతున్నారు. చదవండి: డయాబెటిస్ పేషెంట్స్.. ఇకపై ఆ బాధ తీరినట్లే -
కొవిన్ పోర్టల్లో డేటా లీక్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కొవిన్ పోర్టర్లోని డేటా లీక్ అయ్యిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేటా లీక్ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. ఆరోగ్య శాఖకు చెందిన కొవిన్ పోర్టల్ పూర్తిగా సురక్షితమని స్పష్టం చేసింది. ఆ పోర్టల్లోని సమాచారం గోప్యంగా ఉందని వెల్లడించింది. ఈ క్రమంలనే డేటా లీక్ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. కాగా, డేటా లీక్ అంశంపై కేంద్రం స్పందించింది. ఈ సందర్బంగా కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో కొవిన్ పోర్టర్లోని డేటా లీక్ అయిందన్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ఎలాంటి ఆధారం లేకుండానే లీకైనట్లు ప్రచారం జరిగిందని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని సీఈఆర్టీని కేంద్రం కోరింది. ఇదే సమయంలో కొవిన్ పోర్టల్ పూర్తిగా సేఫ్. ఇందులోని డేటాను సీక్రెట్గా ఉంచేందుకు వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్, యాంటీ-డీడీఓఎస్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇలా అన్ని భద్రతా ప్రమాణాలతో పోర్టల్ను రూపొందించినట్టు స్పష్టం చేసింది. ఇక, ఓటీపీ అథెంటికేషన్తో మాత్రమే కొవిన్ పోర్టల్లోని డేటాను చూడగలమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఓటీపీ లేకుండా కొవిన్ పోర్టల్లోని సమాచారాన్ని ఏ బాట్లోనూ షేర్ చేయలేమని కేంద్రం పేర్కొంది. డేటా లీక్ వార్తలపై తాము దర్యాప్తు చేపటినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం కొవిన్ పోర్టల్ను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ నంబర్, ఆధార్ నంబర్లో భారతీయులు టీకా తీసుకున్నారు. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్తో పాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్ వేసుకున్నారు వంటి సమాచారం ఉంటుంది. ఇది కూడా చదవండి: టీకా వేయించుకున్నారా? డాటా లీక్ -
అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది?
సాక్షి, హైదరాబాద్: నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోతున్నారు..నృత్యం చేస్తూ నేలరాలిపోతున్నారు. జిమ్ చేస్తూ జీవితాలు ముగిస్తున్నారు. జోకులేస్తూనే ప్రాణాలొదిలేస్తున్నారు. వీరిలో మధ్య వయసు్కలు, యువత, కొన్ని సందర్భాల్లో 15 ఏళ్ల లోపు వారూ ఉంటున్నారు. దీంతో ఆరోగ్యవంతుల్ని సైతం గుండెపోటు భయం పట్టిపీడిస్తోంది. అనుమానాలతో ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే అన్ని ఆకస్మిక మరణాలకూ గుండెపోట్లనే కారణంగా పరిగణించలేమని వైద్యులు చెబుతున్నారు. జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో జాప్యం కూడా ఆకస్మిక మరణాలకు దారితీస్తోందని వారంటున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులతో ఈ పరిస్థితుల్ని అధిగమించవచ్చని స్పష్టం చేస్తున్నారు. భయం..భయం.. గుండె పనితీరు గురించిన రకరకాల భయాలు, సందేహాలతో వైద్యుల్ని సంప్రదిస్తున్నవారు ఇటీ వల పెరిగారని ఆన్లైన్ హెల్త్కేర్ ప్రొవైడర్ ‘ప్రాక్టో’అధ్యయనం తేల్చింది. గుండె పనితీరు గురించి సందేహాలతో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణె నగరాల నుంచీ వైద్యుల్ని సంప్రదించిన వారిలో 56% మంది 30–39 సంవత్సరాల మధ్య వయస్కు లేనని వెల్లడించింది.వీరిలో 75% మంది పురుషులు, 25% మహిళలు ఉన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది తాము 100 మందికి పైగా కార్డియాలజిస్టులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుప్రాక్టో నిర్వాహకులు తెలిపారు. టీకా కారణం కాదు యువకులు, మధ్య వయస్కు లు ఆకస్మికంగా తీవ్రమైన అనారోగ్యాలకు గురికావడం ఒక్క ఏడాదిలో 31% నుంచి 51%కి పెరిగిందని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. అయితే ఇవి కరోనా టీకాలు వేసిన, వేయని వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ నివేదిక ప్రకారం.. కోవిడ్ 19 వ్యాక్సిన్లు తీసుకున్న 1,00,000 మందిలో 1.7% మంది మాత్రమే మయోకార్డిటిస్ (కరోనా నేపథ్యంలో గుండె సంబంధిత వ్యాధికి గురికావడం)కు గురయ్యే అవకాశం ఉంది. గుండెపోటు ఎవరికి వస్తుంది? గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులలో ఆకస్మిక అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. ‘ధమనిలో కొవ్వు ఫలకం ఏర్పడి ఇది రక్తనాళంలోకి ప్రవేశించి, గడ్డ కట్టి, అకస్మాత్తుగా ఉక్కిరిబిక్కిరి చేయడాన్నే గుండెపోటుగా పేర్కొంటారు. ‘సాధారణంగా ధూమపానం చేసే వ్యక్తులు, కూర్చుని ఉద్యోగం చేసేవారు, ఊబకాయం కలిగినవారు, తక్కువ రక్తపోటు లేదా తీవ్రమైన మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలున్నవారిలో ఈ పరిస్థితి రావచ్చు..’అని వైద్యులు చెబుతున్నారు. ‘శిక్షణ లేకుండా లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా కరోనరీ నాళాలలో ఫలకాలు పగిలి, గుండె ఆగిపోవడానికి దారితీయవచ్చు..’అని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయకుమార్ చెప్పారు. వ్యాయామశాలకు వెళ్లేవారిలో, ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం పెరిగిందని, వైద్యుల పర్యవేక్షణ లేకపోతే అది ప్రమాదమని స్పష్టం చేశారు. జీవనశైలిలో మార్పులతో.. జీవనశైలిలో మార్పులు చాలావరకు యుక్త వయస్కులలో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అలాగే కొన్ని జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో ఆలస్యం కూడా ఆకస్మిక మరణాలను తెస్తోంది. నిజానికి ప్రతి ఆకస్మిక మరణాన్నీ హార్ట్ ఎటాక్గా పరిగణించలేం. మొత్తం ఆకస్మిక మరణాల్లో 3 శాతమే గుండె పోటు కారణంగా సంభవిస్తాయి. ఆహారపు అలవాట్లు, దినచర్యలో మార్పుచేర్పులతో జీవనశైలిని సరైన విధంగా తీర్చిదిద్దుకోవాలి. అలాగే ఏ మాత్రం సందేహం ఉన్నా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. – డా.ఆర్.కె.జైన్, కార్డియాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి కార్డియో వ్యాస్క్యులర్వ్యాయామాలు అవసరం.. ధూమపానం, మద్యపానం, మధుమేహం, అధిక కొలె్రస్టాల్ వంటి వాటి వల్ల కావచ్చు, ఆధునిక జీవనశైలి వల్ల కావచ్చు గుండె బలహీనపడటం సాధారణమైపోయింది. హృద్రోగాల వల్ల కోల్పోయిన గుండె సామర్థ్యాన్ని తిరిగి దశలవారీగా సంతరించుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని కార్డియో వాసు్క్యలర్ వ్యాయామాలు చేయడం అవసరం. అవి గుండె పంపింగ్ సామర్థ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని, మందుల వాడకాన్ని తగ్గిస్తాయి. – డాక్టర్ మురళీధర్, ఈఎస్ఐసీ ఆసుపత్రి -
కరోనాతో జాగ్రత్త: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శులతో వర్చువల్గా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా వ్యవహరించాలని, కోవిడ్–19 మేనేజ్మెంట్ కోసం సన్నద్ధం కావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఎక్కడ అధికంగా వ్యాప్తిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు గుర్తించాలని చెప్పారు. ఎమర్జెన్సీ హాట్స్పాట్లలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా తేలిన నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్ను పెంచాలని కోరారు. కోవిడ్–19 వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రజా చైతన్యం ద్వారానే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలి గతంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేశాయని, చక్కని ఫలితాలు సాధించాయని మాండవీయ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సమన్వయంతో పనిచేయాలన్నారు. పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరోగ్య శాఖ సన్నద్ధతపై ఈ నెల 8, 9న జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులకు పిలుపునిచ్చారు. 10, 11న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై మాక్డ్రిల్స్ నిర్వహించాలన్నారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా వైరస్ నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని వివరించారు. టెస్ట్–ట్రాక్–ట్రీట్–వ్యాక్సినేట్తోపాటు కోవిడ్–19 నియంత్రణ చర్యల పటిష్ట అమలుతో సత్ఫలితాలు లభిస్తాయని వెల్లడించారు. అర్హులైన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. కోవిడ్–19 బాధితులకు ఆసుపత్రుల్లో సరిపడా పడకలు సిద్ధంగా ఉండేలా, ఔషధాలు లభ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావుతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు పాల్గొన్నారు. 6 వేల మార్కు దాటిన కోవిడ్ కేసులు దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 203 రోజుల తర్వాత 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,050 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసులు 28,303కు చేరుకున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. మొత్తం కేసులు 4.47 కోట్లకు చేరాయి. దీంతోపాటు, మరో 14 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాలు 5,30,943కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేట్ 3.39%కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06%గా ఉంది. ప్రతి 10 లక్షల జనాభాకు 100 టెస్టులు ఎక్స్బీబీ.1.5తోపాటు బీక్యూ.1, బీఏ.2.75, సీహెచ్.1.1, ఎక్స్బీబీ, ఎక్స్బీఎఫ్, ఎక్స్బీబీ.1.16 వేరియంట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని వెల్లడించింది. ఇతర వేరియంట్ల ప్రభావం బాగా తగ్గిందని పేర్కొంది. ఎక్స్బీబీ.1.16 అనే వేరియంట్ వ్యాప్తి ఫిబ్రవరిలో 21.6 శాతం ఉండగా, మార్చిలో 35.8 శాతానికి చేరిందని వివరించింది. అయితే, వైరస్ వ్యాప్తి పెరిగినప్పటికీ ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు పెద్దగా నమోదు కాలేదని స్పష్టం చేసింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు నిత్యం సగటున 100 కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్, తమిళనాడు, హరియాణాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు పేర్కొంది. -
TS: కరోనా టీకా వికటించి 37 మరణాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా వేసుకున్న తర్వాత దాని దుష్ప్రభావాల ఫలితంగా తెలంగాణలో 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కోవిడ్ టీకా ప్రారంభమైన 2021 జనవరి 16 నుంచి ఈ ఏడాది మార్చి 15వ తేదీ వరకు సంభవించిన మరణాలు, టీకా తర్వాత దుష్ప్రభావాలపై ఒక నివేదికను వెలువరించింది. నివేదిక ప్రకారం టీకా తర్వాత దు్రష్పభావాల కారణంగా దేశంలో 92,479 మంది ఆసుపత్రుల పాలయ్యారు. అందులో తెలంగాణలోనే 10,370 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఈ తరహా కేసుల్లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ మొదటి స్థానంలోఉంది. ఆ రాష్ట్రంలో 10,513 ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్లో 10,127 ఘటనలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ మూడు రాష్ట్రాల్లోనే పదివేలకు పైగా ఇటువంటి ఘటనలు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 8,212, పశ్చిమబెంగాల్లో 8,130, కర్ణాటకలో 6,628 మంది ఆసుపత్రులపాలయ్యారు. కాగా, టీకా అనంతరం దేశంలో మొత్తం 1,156 మంది మరణించారు. అందులో అత్యధికంగా కేరళలో 244 మంది మృతి చెందారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 102 మంది, ఉత్తరప్రదేశ్లో 86 మంది మరణించారు. మధ్యప్రదేశ్లో 85, కర్ణాటకలో 75, పశి్చమ బెంగాల్లో 70 మంది మరణించారు. కాగా, ఛత్తీస్గఢ్లో కేవలం ఒకరే మృతిచెందడం గమనార్హం. ప్రతి 19.03 లక్షల డోసులకు ఒక మరణం.. దేశంలో ఇప్పటివరకు కోట్లాది మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. అందులో కరోనా టీకా వేసుకున్న ప్రతీ 23 వేల మందిలో ఒకరు ప్రతికూల ప్రభావాలతో ఆసుపత్రుల్లో చేరారు. తెలంగాణలో ఇప్పటివరకు 3.24 కోట్ల మంది కరోనా టీకా మొదటి డోసు వేసుకున్నారు. ఇందులో 3.15 కోట్ల మంది రెండో డోసు, అలాగే 1.35 కోట్ల మంది బూస్టర్ డోసు తీసుకున్నారు.మొత్తం మూడు డోసులు కలిపి 7.75 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. కాగా, రాష్ట్రంలో టీకా తీసుకున్నవారిలో 37 మంది చనిపోయారు. ఇప్పటివరకు దేశంలో 220 కోట్ల టీకా డోసులు ఇచ్చారు. అంటే ప్రతి 19.03 లక్షల డోసులకు ఒక మరణం సంభవించింది.తెలంగాణలో ప్రతీ 20.96 లక్షల డోసులకు ఒక మరణం సంభవించింది. వీటిని దుష్ప్రభావాలతో ఆస్పత్రుల్లో చేరిన తర్వాత జరిగిన మరణాలుగానే ప్రభుత్వం ప్రకటించింది. అంతేగానీ కరోనా వ్యాక్సిన్ వల్లే నేరుగా సంభవించిన మరణాలుగా ప్రకటించలేదని నిపుణులు అంటున్నారు. కోవిడ్ వ్యాప్తితీవ్రతతో సంభవించిన మరణాలతో పోలిస్తే టీకా అనంతర మరణాలు చాలా స్వల్పమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 8.42 లక్షల మందికి కరోనా సోకగా, అందులో 8.38 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా అధికారికంగా 4,111 మంది చనిపోయారు. ఇతర వ్యాక్సిన్లతోనూ ఇలాగే మరణాలు ఇతర వ్యాక్సిన్లతోకూడా ఇదే తీరులో మరణాలు సంభవిస్తాయి. ప్రతీ మిలియన్ వ్యాక్సిన్ డోసుల్లో ఒక మరణం సంభవిస్తుంది. కరోనా వ్యాక్సిన్ అనంతరం జరుగుతున్న మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే మరే ఇతర వ్యాక్సిన్ కూడా కరోనా టీకా అంత పెద్ద ఎత్తున అన్ని వర్గాలకు వేసినట్లు లేదు. అయినా కూడా సాధారణ స్థాయిలోనే మరణాలు ఉన్నాయి. కరోనా టీకాతోనే కాకుండా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు మృతిచెందితే వారిని కూడా టీకా అనంతర మరణాల జాబితాలో చేర్చే అవకాశముంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. –ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
భారీగా కేసులు.. మళ్లీ కరోనా టెన్షన్
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో మళ్లీ భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఐదు నెలల తర్వాత.. రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2, 151 కేసులు నమోదు కాగా, క్రియాశీలక కేసుల సంఖ్య 11,903కి చేరినట్లయ్యింది. గత ఐదు నెలల కాలంలో కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళతో పాటు యూపీలోనూ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అయితే.. సోమవారంతో పోలిస్తే మంగళవారం దేశవ్యాప్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. కానీ, తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల్లో కొత్త కేసులు 2 వేలకుపైగా వెలుగు చూశాయి. కేంద్రం ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్ష జరిగింది కూడా. ఒమిక్రాన్ ఉపవేరియెంట్ ఎక్స్బీబీ 1.16 విజృంభణ వల్లే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. టెస్టుల సంఖ్య పెంచితే.. కేసుల సంఖ్య కూడా ఎక్కువే బయటపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇక మ్యూటెంట్ వేరియెంట్తో రిస్క్ రేట్ తక్కువే అయినప్పటికీ.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, వ్యాక్సినేషన్లోనూ పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. -
కొనసాగుతున్న హెపటైటిస్ – బీ టీకా పంపిణీ
సాక్షి, అమరావతి: హెపటైటిస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హెపటైటిస్–బీ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్న హెచ్ఐవీ బాధితులకు టీకా పంపిణీని గత నెలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. రాష్ట్రంలోని 55 యాంటి రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉంచింది. హెచ్ఐవీ బాధితులకు స్క్రీనింగ్ నిర్వహించి హెపటైటిస్–బీ నెగెటివ్గా నిర్ధారణ అయిన వారికి టీకా వేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 54,805 మందికి తొలి డోసు వేశారు. రెండో డోసు 3,002 మందికి వేశారు. వచ్చే వారంలో హెచ్ఐవీ హైరిస్క్ వర్గాలకు టీకా పంపిణీ ప్రారంభిస్తున్నారు. ఏపీ శాక్స్ హై రిస్క్ వర్గాలుగా గుర్తించిన 3,923 మంది ట్రాన్స్జెండర్లు, 1,16,616 మంది మహిళా సెక్స్ వర్కర్లు, 23,623 మంది పురుష స్వలింగ సంపర్కులు, 1,741 ఇన్జెక్టింగ్ డ్రగ్ యూజర్స్.. మొత్తం 1,45,903 మందికి టీకా పంపిణీ లక్ష్యం. ఈ క్రమంలో దేశంలోనే హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాలకు టీకా ఇస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. తొలి డోసు వేసుకున్న నెలకు రెండో డోసు, తరువాత రెండు నెలలకు చివరి డోసు టీకా వేస్తారు. హెపటైటిస్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే వైద్యులు, వైద్య సిబ్బందికి వందశాతం టీకా పంపిణీ చేశారు. కొత్తగా విధుల్లో చేరుతున్న వారికి కూడా టీకా వేస్తున్నారు. వైద్యశాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో 2.3 శాతం జనాభా హెపటైటిస్ – బీ, 0.3 శాతం హెపటైటిస్–సీతో బాధపడుతున్నారు. శృంగారం, రక్తమార్పిడి, సిరంజిలు, టూత్బ్రెష్, రేజర్లు వంటి వివిధ రూపాల్లో హెపటైటిస్–బీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాల వారు హెపటైటిస్–బీ బారిన పడటానికి ఎక్కువ అవకాశాలుంటాయని, అందువల్ల వీరు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని రాష్ట్ర హెపటైటిస్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం ప్రత్యేకాధికారి డాక్టర్ నీలిమ తెలిపారు. దగ్గరలోని ఏఆర్టీ కేంద్రానికి వెళ్లి స్క్రీనింగ్ చేయించుకుని టీకా వేయించుకోవాలన్నారు. హెపటైటిస్ పాజిటివ్గా నిర్ధారణ అయిన వారు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించి, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
వ్యాక్సిన్తో తగ్గని కరోనా.. ఫైజర్ సీఈవోకి చుక్కలు చూపించిన జర్నలిస్ట్లు!
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయిన ఫైజర్ సీఈవో అల్బర్ట్ బౌర్లకు చేదు అనుభవం ఎదురయింది. కరోనా కట్టడి విషయంలో .. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నా.. ఫలితం మాత్రం అంత గొప్పగా లేదంటూ కొందరు మీడియా ప్రతినిధులు అల్బర్ట్ను ప్రశ్నించారు. వరల్డ్ ఎకనామిక్ సదస్సు నుంచి బయటకు వచ్చి రూం వైపు అడుగులు వేస్తుండగా అల్బర్ట్ను చుట్టుముట్టారు మీడియా ప్రతినిధులు. మానవాళిని తప్పుదోవ పట్టించి.. అసత్యాలు, అబద్దాలతో తప్పుడు ప్రచారం చేశారని, వ్యాక్సిన్ల విక్రయించేముందు ఎంతో భరోసా ఇచ్చినా అవేవీ అమలు కాలేదని ప్రశ్నించారు. ఫైజర్ కంపెనీని నమ్మి వ్యాక్సిన్లు తీసుకున్న ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా.. అల్బర్ట్ మాత్రం నోరు మెదపలేదు. వ్యాక్సిన్ వల్ల వైరస్ సంక్రమణ పూర్తిగా ఉండదని ముందుగానే తెలిసినా.. దాన్ని రహస్యంగా ఉంచారా అని విలేకరులు ప్రశ్నించారు. కరోనా వల్ల చనిపోయిన వారికి ఏం సమాధానం చెబుతావని నిలదీశారు.నీ మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదని అడిగినా..అల్బర్ట్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. కరోనా విక్రయాల ద్వారా 2.3 బిలియన్ డాలర్లు ఫైజర్కు వచ్చాయని, అసలు ఈ మొత్తం వ్యాక్సిన్ తతంగం వెనక ఎవరు కమీషన్లు ఇచ్చారని అడిగారు. కరోనా వ్యాప్తిని అడ్డుకుని మానవుల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశ్యంతో 2020 ఏప్రిల్లో వ్యాక్సిన్ను తీసుకొచ్చింది ఫైజర్. అమెరికా ప్రభుత్వం ఆమోదించిన తొలి కోవిడ్ కట్టడి వ్యాక్సిన్ కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఫైజర్ను మాత్రమే ఎంపిక చేసుకున్నాయి. దాదాపు ఒకటిన్నర బిలియన్ డోసులను ఫైజర్ విక్రయించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యాక్సిన్లు తీసుకున్న కొందరిలో గుండెపోటు సమస్యలు తలెత్తాయని ఫిర్యాదులు వచ్చినా.. అవి వ్యాక్సిన్ వల్లే వచ్చాయని శాస్త్రీయంగా పూర్తి స్థాయిలో నిరూపితం కాలేదు. 🚨WE CAUGHT HIM! Watch what happened when @ezralevant and I spotted Albert Bourla, the CEO of Pfizer, on the street in Davos today. We finally asked him all the questions the mainstream media refuses to ask. Full story: https://t.co/wHl204orrX SUPPORT: https://t.co/uvbDgOk19N pic.twitter.com/c3STW8EGH3 — Avi Yemini (@OzraeliAvi) January 18, 2023 -
గమనించాల్సిన సైన్సు పరిణామాలు
కొత్త ఏడాదిలో శాస్త్ర విజ్ఞాన పరంగా చాలా అంశాలు ఆసక్తిగా నిలుస్తున్నాయి. కోవిడ్కు ముక్కు ద్వారా వేసుకునే టీకాతో పాటు, అధిక ఉష్ణోగ్రతల్లోనూ స్థిరంగా ఉండే టీకా రానున్నాయి. మొత్తంగానే కోవిడ్ పీడ విరగడైందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్ తొలి ప్రయత్నంలో భాగంగా ఆదిత్య–ఎల్1ను ఈ ఏడాదే ప్రయోగించనున్నారు. ‘ఇస్రో’ ఈ ఏడాదిలోనే చంద్రయాన్–3ను కూడా ప్రయోగించనుంది. అణు విద్యుత్తు రంగంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు పని చేయనున్నాయి. డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టనున్న డిజిటల్ రూపాయి ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. కొత్త సంవత్సరంలో అప్పుడే నాలుగైదు రోజులు గడిచిపోయాయి. కాకపోతే ఫీలింగ్ మాత్రం గత ఏడాది జనవరి మాదిరిగానే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావంతో కోవిడ్ ఇంకోసారి విజృంభిస్తుందేమో అన్న బెంగ గత ఏడాదిదైతే, కొత్త రూపాంతరంతో ఏం చిక్కు వస్తుందో అన్న భయం ఈసారి వెంటాడుతోంది. సమస్య కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఆరోగ్య వ్యవస్థ మొత్తానికీ సవాలు విసరగలగటం ఆందోళ నకరం. కాకపోతే దేశం ఇప్పటికే సంసిద్ధమై ఉన్న కారణంగా కొంచెం నింపాదిగా ఉండవచ్చు. అయితే ఈ ఏడాది ప్రశ్న కోవిడ్ ఇంకోసారి విజృంభిస్తుందా, లేదా? అన్నది కాదు. ఈ పీడ శాశ్వతంగా విరగడ అవుతుందా, కాదా? అన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియాసస్ మాత్రం కొంత ఆశావహంగానే ఉన్నారు. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో కోవిడ్ శని వదిలిందని ప్రకటించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. జనవరిలోనే జరిగే డబ్ల్యూహెచ్ఓ అత్యవసర కమిటీ సమావేశాల్లోనే ఈ అంశంపై చర్చ జరగనుంది. వేడిలోనూ పనిచేసే టీకా కోవిడ్–19 ప్రపంచానికి ముప్పు అన్న హెచ్చరికను డబ్ల్యూహెచ్ఓ తొలగించినప్పటికీ వైరస్తో ప్రమాదం లేదని అర్థం కాదు. ఇప్పటికే ఉన్న అనేకానేక శ్వాసకోశ సంబంధిత వ్యాధుల జాబితాలోకి ఇది కూడా చేరిపోయి అప్పుడప్పుడూ అక్కడక్కడా వచ్చిపోతూ ఉంటుంది. ఆరోగ్య వ్యవస్థలు మాత్రం నిత్యం ముంగాళ్లపై ఉండా ల్సిన పరిస్థితి. అదే సమయంలో శాస్త్రవేత్తలు కొత్త టీకాలు, చికిత్స లను కనుక్కునే ప్రయత్నాల్లో ఉంటారు. భారత దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సీన్ (ముక్కు ద్వారా తీసు కునేది) అందరి దృష్టిలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో, బూస్టర్ డోసుగా వాడేందుకు ఈ టీకాకు అనుమతులు లభించాయి. ఈ టీకా వేయడం మొదలుపెడితే విస్తృత సమాచారం అందుబాటులోకి వస్తుంది. తద్వారా టీకా సామర్థ్యం ఏమిటన్నదీ తెలిసిపోతుంది. ఈ ఏడాది గమనించాల్సిన ఇంకో కోవిడ్ వ్యాక్సీన్ వేడిని కూడా తట్టుకునే రకానిది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు లోని స్టార్టప్ కంపెనీ మైన్వాక్స్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం... ఈ టీకా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా రూపాంతరితాలను నాశనం చేయగల యాంటీబాడీలను తయారు చేయగలదని తేలింది. చండీగఢ్లోని సీఎస్ఐఆర్–ఐఎంటెక్తోపాటు, ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రిపేర్డ్నెస్లలో ఈ టీకాను పరీక్షించారు. మానవ ప్రయోగాలు ఈ ఏడాది ప్రారంభం కావచ్చు. ఇప్పటివరకూ తయారైన టీకాలను రిఫ్రిజరేటర్లలో భద్రపరచాల్సిన అవసరముండగా... కొత్త టీకా అధిక ఉష్ణోగ్రతల్లోనూ స్థిరంగా ఉంటుంది. దీనివల్ల ఎంతో ప్రయోజన ముంటుందన్నది తెలిసిన విషయమే. ఆదిత్యుడి పైకి చూపు ఈ ఏడాది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అందరూ ఎదురు చూస్తున్న ప్రయోగాల్లో ఆదిత్య–ఎల్1 ముఖ్యమైందని చెప్పాలి. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్ తొలి ప్రయత్నమిది. సుమారు 400 కిలోల బరువుండే ఈ ఉపగ్రహంలో స్వదేశీ పరిజ్ఞానంతో సిద్ధం చేసిన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ను ఏర్పాటు చేశారు. శ్రీహరికోట నుంచి ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే దీని ప్రయోగం జరిగే అవ కాశం ఉంది. కరోనాగ్రాఫ్తోపాటు ఆదిత్య–ఎల్1లో ఇంకో ఆరు పేలోడ్స్ ఉంటాయి. భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు శూన్యంగా ఉండే లగ్రానిగన్ పాయింట్ (ఎల్1)లో ఉంటూ ఈ ఉపగ్రహం సూర్యుడిని పరిశీలిస్తుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిలోనే చంద్రయాన్–3ను కూడా ప్రయోగించ నుంది. చంద్రుడి ఉపరితలం పైకి సురక్షితంగా దిగడాన్ని పరీక్షించేం దుకు చంద్రయాన్–2 ఉపయోగపడగా, తాజాగా చంద్రయాన్–3లో ఒక లాండర్, ఓ రోవర్ రెండూ ఉంటాయి. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా వీటిని జాబిల్లిపైకి చేర్చనున్నారు. మళ్లీ గగన్యాన్ మిస్? ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో గగన్యాన్ ఒకటి. అయితే అది ఈ ఏడాది కూడా డెడ్లైన్ను అందుకోకపోవచ్చు. 2018 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ‘‘భరత మాత ముద్దుబిడ్డ ఒకరు 2022 లేదా అంతకంటే ముందుగానే భారతీయ రాకెట్లో అంతరిక్షంలోకి ఎగురు తారు’’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి ఇటీవల లోక్సభలో ఒక ప్రకటన చేస్తూ, గగన్యాన్ను 2024 నాలుగో త్రైమాసికంలో ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలపడం ప్రస్తావించాల్సిన అంశం. సిబ్బంది తప్పించు కునేందుకు అవసరమైన వ్యవస్థ, పారాషూట్ ఆధారంగా వేగాన్ని తగ్గించుకునేందుకు చేయాల్సిన ఏర్పాట్ల విషయంలో జాప్యం జరగడం వల్ల గగన్యాన్ మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయో గాలు ఈ ఏడాది చివరిలో జరగవచ్చు. 2024 రెండో త్రైమాసికంలో సిబ్బంది లేకుండా ఒక ప్రయోగాన్ని నిర్వహించి ఆ తరువాత అసలు ప్రయోగం చేపట్టవచ్చు. గగన్యాన్లో పాల్గొనే వ్యోమగాముల ఎంపిక ఇప్పటికే జరిగిపోయింది. వీరు రష్యాలో తొలిదశ శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం బెంగళూరులో ఇతర శిక్షణలు పొందుతున్నారు. చిన్న అణు రియాక్టర్లకు సమయం? ఈ ఏడాది దేశంలో అణు విద్యుత్తు రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లకు సంబంధించి కొంత కదలిక కనిపించవచ్చు. కాలుష్య రహిత విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడటం వల్ల, పైగా ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ప్రపంచస్థాయిలో విద్యుత్తు రంగం తీరుతెన్నులు మారి పోయాయి. భారీస్థాయి అణు రియాక్టర్ల మాదిరిగా కాకుండా, 300 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను ఫ్యాక్టరీల్లో తయారు చేసే సౌలభ్యం ఉంది. పెద్ద రియాక్టర్లనైతే విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేసే స్థలంలోనే అమర్చాల్సి ఉంటుంది. దీనివల్ల నిర్మాణానికి చాలా సమయం పట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల తయారీలో ప్రైవేట్ కంపెనీలకూ అవ కాశం కల్పించేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. డిజిటల్ రూపాయి కూడా.. రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తేనుండటం ఈ ఏడాది ఎదురు చూడాల్సిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానపరమైన అంశాల్లో ఒకటి. దీంతోపాటు జన్యుమార్పిడి ఆవాల పంట క్షేత్ర ప్రయోగాలు, జీ20 అధ్యక్ష స్థానంలో భాగంగా చేపట్టనున్న సైన్స్ డిప్లొ మసీ, కృత్రిమ మేధ రంగాల్లోని మార్పులనూ నిశితంగా చూడాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో డిజిటల్ రూపాయి ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. భౌతిక రూపాయి కున్నంత భద్రత, ఫీచర్లు, నమ్మకం డిజిటల్ రూపాయికీ ఉంటాయని ఆర్బీఐ చెబుతోంది. గోప్యత ఎంత వరకన్నది ఒక సందేహమే. ఈ ఏడాది జరగనున్న జీ20 సమావేశాలు భారతదేశంలో జరుగుతున్న సైన్స్, టెక్నాలజీ ఇన్నొవేషన్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు చక్కటి అవకాశాల్ని కల్పిస్తున్నాయి. జీ20 సభ్యదేశా లన్నింటికీ మరింత దగ్గరయ్యేందుకు సైన్స్ డిప్లొమసీని ఉపయోగించు కోవాలి. ఇందులో భాగంగానే కోయంబత్తూరు, లక్ష్యద్వీప్, అగర్తలా, ఇండోర్, రాంచీ, సిమ్లా, డయూ, ఇటానగర్, దిబ్రూఘర్లలో శాటి లైట్ ఈవెంట్లు, సైన్స్ శాఖల మంత్రుల సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే... వీటిల్లో ఏ ఒక్కటీ సైన్సు, టెక్నాలజీలకు హబ్ అయిన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లేదా అహ్మదాబాద్లలో నిర్వ హించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం! దినేశ్ సి. శర్మ. వ్యాసకర్త సైన్సు అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో). -
గుడ్ న్యూస్.. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులు ఫ్రీ..!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి. రూ.410 కోట్ల విలువైన 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను ఉచితంగా అందజేస్తామంటూ సీరం సంస్థ ప్రతినిధి ప్రకాశ్కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారని వెల్లడించాయి. ఈ డోసులు ఎలా అందజేయాలో చెప్పాలంటూ ఆయన కోరారని పేర్కొన్నాయి. సీరం సంస్థ ఇప్పటికే 170 కోట్లకు పైగాడోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. చదవండి: కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్లోకి ఎంట్రీ..! -
భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ రెడీ!
పలు దేశాల్లో కరోనా వైరస్ వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మరోసారి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బూస్టర్ డోస్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో అప్డేట్ ఇచ్చింది. ముక్కు ద్వారా అందించే(నాజల్ స్ప్రే) కోవిడ్ వ్యాక్సిన్ను త్వరలో దేశంలో బూస్టర్ డోస్గా తీసుకువస్తున్నట్టు పేర్కొంది. గోవాగ్జిన్ టీకా నుంచి నాజల్ వ్యాక్సిన్ రూపంలో దీన్ని అందించనున్నారు. డీజీసీఏ నుంచి తుది ఆమోదం పొందిన వెంటనే బూస్టర్ డోస్ రిలీజ్చేయనున్నట్టు సమాచారం. జాతీయ మీడియా సమాచారం మేరకు నాజల్ వ్యాక్సిన్కు అనుమతులు చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే వారంలో టీకా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. 18 ఏళ్లుపైన వయసు ఉన్న వారికి బూస్టర్ డోస్గా నాజల్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. నాజల్ వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం? నాజల్ వ్యాక్సిన్లు ఇంజెక్షన్ ద్వారా తీసుకునే వ్యాక్సిన్తో పోలిస్తే అదనపు ప్రయోజనాలను కలిగి వున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, నాజల్ వ్యాక్సిన్లను నిల్వ సౌలభ్యం, పంపిణీలో సులభంగా ఉంటుంది. నాజల్ వ్యాక్సిన్లు వైరస్.. మానవ శరీరంలోకి ప్రవేశించే ముక్కు , ఎగువ శ్వాస కోశం వద్ద రక్షణను అందిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. #Breaking | Bharat Biotech’s nasal Covid vaccine to be rolled out as booster dose #6PMPrime #Covid #India | @Akshita_N @milan_reports pic.twitter.com/HutHQ7tLMj — IndiaToday (@IndiaToday) December 22, 2022 -
మహారాష్ట్రకు మరో టెన్షన్.. మీజిల్స్ వైరస్తో చిన్నారులు మృతి
కరోనా సమయంలో వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మహారాష్ట్రను తాజాగా మీజిల్స్ వైరస్ టెన్షన్ పెడుతోంది. మీజిల్స్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం మహారాష్ట్రవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, అప్రమత్తమైన ప్రభుత్వం చిన్నారులకు వ్యాక్సినేషన్ చేస్తోంది. వివరాల ప్రకారం.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మీజిల్స్ వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకింది. దీంతో, ఈ వైరస్ సోకిన చిన్నారుల సంఖ్య 300కి చేరువైంది. కేసుల పెరుగుతున్న క్రమంలో అలర్ట్ అయిన అధికారులు బీఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 1,34,833 మంది 9 నెలల నుంచి 5 ఏండ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు మీజిల్స్-రుబెల్లా స్పెషల్ డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు నెలల్లోనే 2 వందల కేసులు నమోదకావడం అక్కడి వైద్యాధికారులను టెన్షన్ పెడుతోంది. అయితే, గతకొన్నేండ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మరోవైపు.. ఈ వైరస్ కారణంగా చిన్నారులు మృతిచెందడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక, నవంబర్ 22వ తేదీన బీవండిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి చనిపోయాడు. కాగా, నవంబర్ 20వ తేదీన వైరస్ బారినపడిన చిన్నారి ఒంటిపై దద్దుర్లతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే, చిన్నారికి అటాప్సీ టెస్టు చేసిన తర్వాత మీజిల్స్ కారణంగా చనిపోయినట్టు నిర్ధారించారు. ఇక, మీజిల్స్ కారణంగా ఈ ఏడాది 13 మంది చిన్నారులు మృతిచెందారు. మరోవైపు.. మీజిల్స్ కేసులు మహారాష్ట్రతోపాటు బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళలోనూ నమోదు అవుతున్నాయి. BMC prepares list of nearly 1.4 lakh Mumbai children for extra measles shot https://t.co/2KLGyJsHYT Download the TOI app now:https://t.co/2Rmi5ecUTa — Vinod KumarTOI🇮🇳 (@vinod904) November 27, 2022 -
AP: ఆయుష్మాన్భవ: గర్భిణులకు, పిల్లలకు పది రకాల వ్యాక్సిన్లు
చిన్నారులను దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతోంది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు జరిగే వరకు, పుట్టిన శిశువుల నుంచి యుక్తవయస్సు వచ్చే వరకు క్రమం తప్పకుండా టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రణాళికతో నిర్వహిస్తోంది. వారంలో రెండు రోజులు ప్రభుత్వాస్పత్రుల్లోనూ, క్షేత్రస్థాయిలోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందు కోసం ముందుగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన నాటి నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతోంది. అయితే వ్యాక్సినేషన్పై అవగాహన లేకపోవడంతో చిన్నారులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒంగోలు అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇమ్యూనైజేషన్ ప్రక్రియ గర్భిణులు, నవజాత శిశువుల మరణాలకు చెక్ పెట్టడంతో పాటు చిన్నారుల భవిష్యత్కు ఎంతగానో ఉపకరిస్తుంది. శిశువు నుంచి వృద్ధాప్యం వరకు ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి వ్యాక్సినేషన్ రక్షణ కల్పిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్దేశించిన వాతావరణంలో భద్రపరిచి అన్ని పీహెచ్సీ, యూపీహెచ్సీ, ఎంసీహెచ్, ఏరియా ఆస్పత్రులకు వాక్సిన్లను అవసరం మేరకు సరఫరా చేస్తోంది. ప్రతి బుధ, శనివారాల్లో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియలో డాక్టర్లు, నర్సులతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రులు లేని గ్రామాలకు ముందు రోజే ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియపై తెలియజేసి బుధ, శనివారాల్లోనే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 64 పీహెచ్సీలు, 18 యూపీహెచ్సీలు, 8 సీహెచ్సీలు, 2 ఏరియా ఆస్పత్రులు, మాతా శిశు వైద్యశాల, మార్కాపురంలోని జిల్లా ఆస్పత్రి, ఒంగోలు జీజీహెచ్లో వ్యాక్సిన్లు వేస్తారు. ఈ ఏడాదికి జిల్లాలో ఏడాదికి 42,062 జీరో డోసులు టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు 20,603 డోసుల ప్రక్రియ పూర్తయింది. టీకాలు.. పది రకాలు గర్భిణులకు, పిల్లలకు మొత్తం పది రకాల వ్యాక్సిన్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో రెండు రకాలు చుక్కల మందు, ఒక రకం ద్రావణం, ఏడు రకాల ఇంజక్షన్లు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు పుట్టిన క్షణం నుంచి 16 ఏళ్ల వయసు వరకు నిర్దేశించిన వయసు ప్రకారం ఆయా డోసులు వేయించుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్కు సంబంధించి పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సినేషన్ కార్డు ఇచ్చి అందులో వ్యాక్సినేషన్ వివరాలు పొందుపరుస్తారు. గర్భిణులు, పిల్లలకు డీటీ (డిప్టీరియా టెటానస్) ఈ టీకా గర్భం దాల్చిన తొలి రోజుల్లో మొదటి డోసు, తర్వాత నాలుగు వారాలకు రెండో డోసు, ఆ తర్వాత బూస్టర్ డోసు వేస్తారు. చిన్న పిల్లల వ్యాక్సినేషన్ మొదటిగా పుట్టిన సమయంలో బీసీజీ (క్షయ) ఓపీవీ వ్యాక్సిన్ జీరో మోతాదుతో పాటు హెపటైటీస్ బీ పుట్టిన వెంటనే మోతాదు ఇస్తారు. 6 వారాల వయసులో ఓపీవీ–1 (పోలియో రాకుండా) చుక్కల మందు, రోటా–1 (విరోచనాలు రాకుండా) చుక్కల మందుతో పాటు ఎఫ్ఐపీవీ–1 ఇంజక్షన్ (పోలియో రాకుండా), పెంటావాలెంట్ (డిప్టీరియా, కంఠసర్పి, ధనుర్వాతం, కామెర్లు, మెదడువాపు రాకుండా) టీకాలు వేస్తారు. పది వారాల వయసులో ఓపీవీ, పెంటావాలెంట్, రోటా టీకాలు రెండో డోసు వేస్తారు. 14 వారాలకు ఓపీవీ, పెంటావాలెంట్, రోటా మూడో డోసుతో పాటు ఎఫ్ఐపీవీ రెండో డోసు వేస్తారు. 9 నెలలకు తట్టు, రుబెల్లా రాకుండా ఎంఆర్ వ్యాక్సిన్తో పాటు విటమిన్ ఏ ద్రావణం ఇస్తారు. 16 నుంచి 24 నెలలకు డీపీటీ మొదటి బూస్టర్, ఓపీవీ బూస్టర్తో పాటు ఎంఆర్ రెండో డోసు వేస్తారు. 5,6 సంవత్సరాలకు డీపీటీ రెండో బూస్టర్ మోతాదు, 10–16 సంవత్సరాలకు టీడీ వ్యాక్సిన్ వేస్తారు. టీకాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవం అనంతరం పుట్టిన బిడ్డ వరకు సకాలంలో టీకాలు వేయించాలి. టీకాల కాల పరిమితి ఆశా వర్కర్లు, అంగన్వాడీల ద్వారా తెలుసుకుని సకాలంలో పిల్లలకు టీకాలు వేయించాలి. టీకాల వలన ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు, ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలను కాపాడవచ్చు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం నిర్దేశించిన రోజుల్లో క్రమం తప్పకుండా జరుగుతోంది. – ఏఎస్ దినేష్కుమార్, కలెక్టర్ ఇమ్యూనైజేషన్ ప్రక్రియ పక్కాగా పర్యవేక్షిస్తాం జిల్లాలో నిర్వహించే ఇమ్యూనైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పక్కాగా పర్యవేక్షిస్తున్నాం. ప్రజలకు టీకాలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నాం. ప్రతి ఆస్పత్రిలో ప్రతి బుధ, శనివారాల్లో వ్యాక్సినేషన్ నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ కార్డులో నమోదు చేస్తున్నాం. ఆశాలు, అంగన్వాడీల ద్వారా వ్యాక్సినేషన్ సమయాన్ని కూడా తల్లిదండ్రులకు ముందుగానే గుర్తు చేసేలా చర్యలు తీసుకున్నాం. ప్రజలు టీకాలపై అవగాహనతో ఉండి పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించి పోలియో, ఇతర ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందాలి. – పద్మజ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి -
ప్రజారోగ్య సంరక్షణలో ఏపీ ది బెస్ట్.. ర్యాంకులు ప్రకటించిన కేంద్రం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. గర్భిణులకు చెకప్లు, 9–11 నెలల పిల్లలకు టీకాలు వేయడం వంటి అంశాల్లో దేశంలోనే తొలి స్థానంలో ఏపీ నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన హెచ్ఎంఐఎస్ 2021–22 అనాలసిస్ రిపోర్ట్లో వెల్లడైంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు, గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ, ఇమ్యునైజేషన్ సహా 13 అంశాలపై పెద్ద, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా (మూడు విభాగాలుగా) పనితీరు ఆధారంగా ర్యాంక్లు కేటాయించింది. ఈ ర్యాంకులు ఇవ్వడానికి హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా తొలిసారిగా దేశంలోని 735 జిల్లాల్లోని 1,64,440 సబ్ సెంటర్లు, 32,912 పీహెచ్సీలు, 15,919 కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, 2,970 సబ్ జిల్లా ఆస్పత్రులు, 1,264 జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లోని 2.17 లక్షల ఆరోగ్య సేవలను మ్యాపింగ్ చేసినట్లు హెచ్ఎంఐఎస్ ఈ–బుక్ బులెటిన్లో పేర్కొంది. కొత్త పోర్టల్లో వ్యక్తి నిర్ధిష్ట వినియోగదారు ఆధారాలు, రియల్ టైమ్ డేటా ఎంట్రీ, రియల్ టైమ్ మానిటరింగ్, నేషనల్ ఐడెంటిఫికేషన్ నంబర్, స్థానిక ప్రభుత్వ డైరెక్టరీ (అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్) ఉన్నట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 9 నుంచి 11 నెలల పిల్లలకు టీకాలు ఇవ్వడం (ఇమ్యునైజేషన్)లో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీకి నంబర్–1 ర్యాంక్ రాగా.. తెలంగాణకు 5, తమిళనాడుకు 11 ర్యాంక్లు లభించాయి. ఇదే సందర్భంలో గర్భిణులకు ప్రసవానికి ముందు నాలుగు ఏఎన్సీ చెకప్లు నిర్వహించడంలోనూ దేశంలోనే నంబర్–1 ర్యాంక్ను ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. ఆ తరువాత స్థానాల్లో వరుసగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఉండగా.. పొరుగున ఉన్న తెలంగాణ 13వ ర్యాంక్కు పరిమితమైంది. ఆరోగ్య సేవలకు సంబంధించిన అన్ని అంశాల పనితీరులోనూ దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీకి రెండో ర్యాంక్ దక్కింది. బెడ్ ఆక్యుపెన్సీలోనూ.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అంతకన్నా పెద్ద ఆస్పత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ విషయంలో ఏపీ 57.8 శాతంతో దేశంలోనే రెండోర్యాంకులో నిలిచింది. జాతీయస్థాయిలో బెడ్స్ ఆక్యుపె న్సీ 27.9 శాతమే ఉంది. ఎటువంటి దుష్ఫ్రభావాలు లేకుండా సురక్షితంగా ఉండేందుకు గర్భిణులకు టెటానస్ టాక్సాయిడ్ ఇంజెక్షన్లు వేయడంలో ఆంధ్రప్రదేశ్ 103.9 శాతంతో రెండవ ర్యాంకులో ఉంది. జాతీయ స్థాయిలో ఈ ఇంజెక్షన్లను 73.9 శాతమే వేశారు. ఇంటి దగ్గర డెలివరీల్లో 69.0 శాతం మేర స్కిల్ బర్త్ అటెండెంట్స్ హాజరవుతున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మూడో ర్యాంకులో నిలిచింది. జాతీయ స్థాయిలో 17.5 శాతం మాత్రమే హాజరు ఉంది. ఇనిస్టిట్యూషన్ డెలివరీల్లో ఆంధ్రప్రదేశ్ 70.7 శాతంతో 6వ ర్యాంకు పొందింది. జాతీయ స్థాయిలో 53.4 శాతమే ఇనిస్టిట్యూషన్ డెలివరీలున్నాయి. -
కోవిడ్ వ్యాక్సిన్లతో వైద్య సంక్షోభం!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్లతో అంతర్జాతీయ వైద్య సంక్షోభం తలెత్తిందని ఈ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలపై పోరాడుతున్న వైద్య బృందం ఆరోపించారు. ఈ వ్యాక్సినేషన్ ప్రభావంపై మెడికల్ క్రైసెస్ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. శనివారం జూమ్ యాప్ ద్వారా పలు దేశాలకు చెందిన వైద్యుల బృందం ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా డాక్టర్ గాయత్రి పండిట్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్లతో తలెత్తిన ప్రతికూల పరిస్థితులను వివరించారు. ‘‘ఆరోగ్యవంతమైన వ్యక్తులు కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నాక అనారోగ్యాల బారిపడినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యూకేలోని యెల్లోకార్డ్ సిస్టం, ఆస్ట్రేలియన్ అడ్వర్స్ ఈవెంట్ మానిటరింగ్ సిస్టం, యూరప్లోని యుడ్రా విజిలెన్స్ సిస్టంలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ వీజీ యాక్సిస్ డేటాబేస్ ద్వారా మేం గణాంకాలను సేకరించి పరిశీలించాం. ఆ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల (కోటీ 10 లక్షల) మంది కోవిడ్ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలకు లోనయ్యారు. అందులో సుమారు 70 వేల మంది వ్యాక్సినేషన్ తదనంతర కారణాలతోనే చనిపోయినట్టు పలు సంస్థల గణాంకాలు చెప్తున్నాయి. నిజానికి క్షేత్రస్థాయిలో బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది..’’ అని వైద్యుల బృందం పేర్కొంది. తక్షణమే కోవిడ్ వ్యాక్సినేషన్లను నిలిపివేసి, వాటిద్వారా తలెత్తిన దుష్ప్రభావాలను గుర్తించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. 34 దేశాల ప్రతినిధుల మద్దతు కోవిడ్ వ్యాక్సినేషన్తో అంతర్జాతీయ వైద్య సంక్షోభం (ఇంటర్నేషనల్ మెడికల్ క్రైసెస్) తలెత్తుతోందన్న వాదనకు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల వైద్యులు మద్దతు పలుకుతున్నట్టు ఈ బృందం పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా తయారు చేసి, అతి తక్కువ కాలంలో క్లినికల్ ట్రయల్స్ జరిపి.. ప్రజలకు అందించారని.. ఈ క్రమంలో వ్యాక్సిన్ల దీర్ఘకాలిక ప్రభావాల సంగతిని తేల్చలేదని వివరించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కొంతకాలం తర్వాత అనారోగ్యాల బారినపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాలను కోరింది. అన్ని కోవిడ్ వ్యాక్సిన్లపై లోతుగా పరిశీలన జరిపి.. మాలిక్యులర్, సెల్యులార్, బయోలాజికల్ ప్రభావాలను తేల్చాలని డిమాండ్ చేసింది. -
జింబాబ్వేలో 'మీజిల్స్' విలయం.. 700 మంది చిన్నారులు మృత్యువాత
హరారే: జింబాబ్వేను మీజిల్స్ వ్యాధి కలవరపాటుకు గురి చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. సెప్టెంబర్ 4 నాటికి దేశంలో మొత్తం 6,291 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అయితే రెండు వారాల క్రితం మీజిల్స్ వల్ల 157మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. మీజిల్స్ వ్యాధి బాధితుల్లో ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోని, పోషకాహార లోపం ఉన్న చిన్నారులే ఉంటున్నారు. మతపరమైన నమ్మకాలతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించకపోవడమూ ఈ పరిస్థితికి కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకునే వ్యాక్సిన్ తప్పనిసరిచేసేలా కొత్త చట్టం తీసుకురావాలని జింబాబ్వే భావిస్తోంది. 6 నెలల నుంచి 15ఏళ్ల పిల్లలకు పెద్దఎత్తున మాస్ వ్యాక్సినేషన్, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మతపెద్దలు దీనికి సహకరించాలని కోరుతోంది. డేంజర్.. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో మీజిల్స్ కూడా ఒకటి. గాలి ద్వారా, తమ్ముడం, దగ్గడం వల్ల ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లలలో దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కన్పిస్తాయి. వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులకు ఈ వ్యాధి సోకితే తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీజిల్స్ వ్యాప్తిని నియంత్రించాలంటే 90శాతం మంది చిన్నారులకు వ్యాక్సిన్లు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందుల వల్ల సేవలు నిలిచిపోయి పేద దేశాల్లో మీజిల్స్ విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్లోనే హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5కోట్ల మంది పిల్లలు సాధారణ వ్యాక్సిన్లు తీసుకోలేకపోయారని యూనిసెఫ్ జులైలో చెప్పింది. దీనివల్ల పిల్లలకు ప్రమాదమని అప్పుడే హెచ్చరించింది. చదవండి: చైనాలో తీవ్ర భూకంపం.. 46 మంది దుర్మరణం -
కి‘లేడీ’: కరోనా టీకా వేస్తున్నట్టు నటించి.. బంగారు గొలుసుతో...
గుంటూరు రూరల్: ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి మాయమాటలు చెప్పి వారి వద్దనుంచి బంగారు గొలుసులు మాయంచేసే మాయలేడీని నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బి.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. భవనం ప్రభావతి హౌసింగ్బోర్డ్ కాలనీ ఎల్ఐజీలో తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి నివాసం ఉంటుంది. ఇద్దరే ఉంటున్నారని గమనించిన నగరంలోని గౌతమినగర్ 4వ లైనుకు చెందిన దొల చంద్రకళ ద్విచక్రవాహనంపై ప్రభావతి ఇంటికి ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం సమయంలో వచ్చింది. కరోనా టీకాలు వేస్తున్నామని మీరు టీకా వేయించుకోవాలని ప్రభావతిని నమ్మబలికింది. దీంతో ప్రభావతి సరే టీకా వేయండని చెప్పగా, టీకా వేస్తున్నట్లుగా నటిస్తూ మాయలేడీ చంద్రకళ ప్రభావతి మెడలోని రెండు బంగారు గొలుసులను కట్చేసి బయటకు పరిగెత్తింది. (చదవండి: సాఫ్ట్వేర్ లవ్స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ..) ఒక్కసారిగా గొలుసు లాక్కుని పరారవ్వటంతో కిందపడిన ప్రభావతి తేరుకుని బయటకు వచ్చి చూడగా మాయలేడీ ద్విచక్ర వాహనంపై పరారవ్వటం గమనించింది. దీంతో చేసేదిలేక నల్లపాడు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్హఫీజ్ ఆదేశాల మేరకు సౌత్జోన్ రూరల్ డీఎస్పీ వై.జెస్సీప్రశాంతి, సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్ఐ ఆరోగ్యరాజు సిబ్బందితో కలిసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా మాయలేడీ వినియోగిస్తున్న ద్విచక్రవాహనం నంబర్లు సైతం సరైనవి కాదని నంబర్లు మార్చి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఎట్టకేలకు మాయలేడీ చంద్రకళను ఆదివారం అరెస్ట్ చేశారు. అనంతరం తమదైన శైలిలో పోలీసులు విచారించగా నిందితురాలు చేసిన నేరం ఒప్పుకుంది. చోరీ చేసిన రూ.4 లక్షల విలువ చేసే రెండు బంగారు గొలుసులు రికవరీ చేశామని సీఐ తెలిపారు. దీంతోపాటుగా నిందితురాలు వినియోగిస్తున్న ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన ఎస్.ఆరోగ్యరాజును, ఎస్ఐ ఎస్.సత్యనాయక్, కానిస్టేబుళ్లు కె.సుబ్బారావు, షేక్ జాన్సైదా, షేక్ మస్తాన్వలి, ఎం.లోకేశ్వరరావులను అభినందించి అర్బన్ ఎస్పీ రివార్డులను ప్రకటించారని సీఐ తెలిపారు. (చదవండి: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం) -
మంకీపాక్స్తో వణికిపోతున్న అమెరికా.. హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటన
వాషింగ్టన్: ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మహమ్మారిపై పోరాటం కోసం ఎక్కువ నిధులు కేటాయించడమే గాక, సమాచార సేకరణ కోసం ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. మంకీపాక్స్ను సీరియస్గా తీసుకుని ప్రజలు తమకు సహకరించాలని అమెరికా ఆరోగ్య శాఖ కోరింది. మంకీపాక్స్ నియంత్రణకు తాను కట్టుబడి ఉన్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. టీకా పంపిణీ వేగవంతం చేసి పరీక్షల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. ఈ వైరస్ వల్ల ముప్పును ప్రజలకు తెలియజేస్తామన్నారు. అందుకే మంకీపాక్స్ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినట్లు తెలిపారు. వైరస్పై పోరాటంలో ఇది చాలా కీలకమన్నారు. I remain committed to our monkeypox response: ramping-up vaccine distribution, expanding testing, and educating at-risk communities. That's why today's public health emergency declaration on the virus is critical to confronting this outbreak with the urgency it warrants. — President Biden (@POTUS) August 4, 2022 ప్రపంచవ్యాప్తంగా 83 దేశాలకుపైగా వ్యాపించింది మంకీపాక్స్. 23,350 మందికిపైగా సోకింది. ఈ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్లా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..? -
కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తవగానే అమలులోకి ‘పౌరసత్వ’ చట్టం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు మరోమారు తెరపైకి తీసుకొచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కోవిడ్-19 టీకాల పంపిణీ పూర్తవగానే పౌరసత్వ చట్టం అమలు చేస్తామని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో మంగళవారం పార్లమెంట్ హౌస్లో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి. బెంగాల్లో బీజేపీ కార్యవర్గ సమస్యలపై చర్చించేందుకు ఇరువురు సమావేశమైనట్లు తెలిసింది. అనంతరం మాట్లాడిన సువేందు అధికారి సీఏఏ అంశాన్ని తెలిపారు. ‘కోవిడ్-19 మూడో డోసు పంపిణీ పూర్తవగానే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సీఏఏ అమలు చేస్తామని అమిత్ షా చెప్పారు.’ అని పేర్కొన్నారు అధికారి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్లో బుస్టర్ డోసుల పంపిణీని ప్రారంభించింది కేంద్రం. అది తొమ్మిది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. మే నెలలో పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయ్గురిలో నిర్వహించి సభలో సీఏఏపై మాట్లాడారు అమిత్ షా. సీఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా సీఏఏ ప్రస్తావన తీసుకొచ్చారు కేంద్ర మంత్రి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ వంటి దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన అక్కడి మైనారిటీ హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్ మతాలకు చెందిన వారికి పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. అయితే.. 2014, డిసెంబర్ 31లోపు వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం కల్పించాలని నిర్ణయించారు. 2019, డిసెంబర్లో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దాంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మతం పేరుతో వివక్ష, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. భారత్లోని ముస్లింలను లక్ష్యంగా చేసుకునే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్, సీఏఏలు ఉన్నాయని పేర్కొన్నారు నిరసనకారులు. ఆ వాదనలను తోసిపుచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిరసనలు రాజకీయంగా ప్రేరేపితమైనవేనని పేర్కొన్నారు. ఏ ఒక్క భారతీయుడు తన పౌరసత్వాన్ని కోల్పోడని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: భవిష్యత్లో చరిత్రను నిర్దేశించేది డేటానే - ప్రధాని మోదీ -
Free Chhole Bhature: బూస్టర్ డోస్ తీసుకున్నవారికి బంపర్ ఆఫర్!
చండీగఢ్: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది కేంద్రం. అయితే.. ప్రజల నుంచి స్పందన లేకపోవటం వల్ల ఉచితంగా అందిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75 రోజుల పాటు ఈ ఉచిత డోసులు అందిస్తామని తెలిపింది. మరోవైపు.. మూడో డోసు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను పోత్సహించేందుకు కొందరు తమ వంతుగా పాటుపడుతున్నారు. చండీగఢ్కు చెందిన స్ట్రీట్ వెండర్ ఉచితంగా ఛోల్ భతుర్(సెనగ మసాల పూరీ) టిఫిన్ అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. కరోనా వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నవారికేనని ఓ షరతు పెట్టారు. ఉత్తర భారతంలో చోల్ భతురే చాలా ఫేమస్. సెనగ మసాలా కర్రీతో పూరీని అందిస్తారు. ఈ స్నాక్స్ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ స్ట్రీట్ ఫుడ్కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు 45 ఏళ్ల సంజయ్ రాణా. చండీగఢ్లో తన ద్విచక్రవాహనంలో ఛోలో భతురేను విక్రయిస్తారు సంజయ్. గత 15 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. ‘అర్హులైన ప్రతిఒక్కురు ముందుకు వచ్చి మూడో డోసు తీసుకోవాలి. దేశంలోని చాలా ప్రాంతాల్లో మళ్లీ కరోనా పెరుగుతోంది. పరిస్థితులు చేతి నుంచి చేజారేవరకు ఎందుకు వేచి చూడాలి? ప్రికాషన్ డోసు వేసుకున్న రోజున తన వద్దకు వస్తే ఉచితంగా ఈ ఛోలో భతురేను ఇస్తున్నా.’ గత ఏడాది సైతం తొలి డోసు వేసుకున్న వారికి ఉచితంగా అందించారు సంజయ్. ఈ విషయాన్ని మన్కీ బాత్లో ప్రస్తావించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సంజయ్ రాణాపై ప్రశంసలు కురిపించారు. ఇదీ చదవండి: ఇదేం విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి.. ఎలాగంటే -
టీకా కలకలం: ఒకే సిరంజీతో 30 మందికి వ్యాక్సినేషన్.. ఆ తర్వాత..
Vaccinated 30 Students With One Syringe.. కరోనా కట్టడిలో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు స్థాయిలో 200కోట్ల డోసులకుపైగా టీకాలను అందించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాక్సినేషన్ కేంద్రంలో జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు టీకా ఇవ్వడం కలకలం సృష్టించింది. అయితే, దీనికి ఆయన చెప్పిన సమాధానం విన్న స్థానికులు అవాక్కయ్యారు. తన పై అధికారులు ఆదేశాల మేరకే తాను ఇలా చేసినట్టు స్పష్టం చేశారు. వివరాల ప్రకారం..సాగర్ జిల్లాలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యార్థులకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మందికి టీకా వేశాడు. అది గమనించిన విద్యార్థులు పేరెంట్స్ ఇదేంటని ప్రశ్నిస్తే.. తమ పై అధికారులు ఒకే సిరంజీ పంపించారని, ఆ ఒక్క సిరంజీతోనే విద్యార్థులందరికీ టీకా వేయాలని ఆదేశించారని వెల్లడించారు. ఈ క్రమంలో ఇలా టీకా వేయడంలో తప్పు ఏముంది అంటూ వ్యాఖ్యలు చేయడం అక్కడున్న వారిని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో, పిల్లల పేరెంట్స్ అతడిపై దాడి చేసినంత పనిచేశారు. Shocking violation of “One needle, one syringe, only one time” protocol in #COVID19 #vaccination, in Sagar a vaccinator vaccinated 30 school children with a single syringe at Jain Public Higher Secondary School @ndtv @ndtvindia pic.twitter.com/d6xekYQSfX — Anurag Dwary (@Anurag_Dwary) July 27, 2022 ఈ విషయం.. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రాకేశ్ రోషన్ దృష్టికి చేరడంతో ఆయన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జితేంద్ర.. వన్ నీడిల్, వన్ సిరంజీ, వన్ టైమ్ అనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఉల్లఘించారని తెలిపారు. అందుకే జితేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా, జిల్లా కలెక్టర్ క్షితిజ్ సింఘాల్ స్పందిస్తూ.. జితేంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు సూచించారు. ఇది కూడా చదవండి: ‘నేను ఏం చేస్తానో తెలుసా?’ ఎంపీ కూతురి సమాధానంతో.. -
ప్రధాని మోదీకి బిల్గేట్స్ అభినందనలు
సియాటెల్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారత్లో 200 కోట్ల వ్యాక్సినేషన్ డోసుల ప్రక్రియ పూర్తైనందునా అభినందించారు బిల్గేట్స్. ఈ మేరకు ఓ వార్త కథనాన్ని ట్యాగ్ చేసి మరీ ట్విటర్లో ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు.. భారత వ్యాక్సిన్ తయారీదారులతో భాగస్వామ్యం కొనసాగింపుపైనా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించినందుకు భారత వ్యాక్సిన్ తయారీదారులు, భారత ప్రభుత్వంతో మా నిరంతర భాగస్వామ్యాన్ని గొప్పగా భావిస్తున్నాం అని ట్వీట్ చేశారాయన. ఇక ప్రధాని మోదీ ఆదివారం నాడు భారత్ మరో చరిత్ర సృష్టించిందంటూ వ్యాక్సినేషన్పై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బూస్టర్ డోసులను సైతం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా ప్రజలకు అందిస్తోంది. Congratulations @narendramodi for yet another milestone of administering #200crorevaccinations. We are grateful for our continued partnership with Indian vaccine manufacturers and the Indian government for mitigating the impact of COVID19. https://t.co/YeGUPsveL0 — Bill Gates (@BillGates) July 19, 2022 -
మరో మైలురాయికి సిద్ధమా?
కరోనా ఇప్పటికీ ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపెట్టలేదని వార్తలు వస్తున్న వేళ... ఆదివారం ఒకింత సంతోషకర సమాచారం వచ్చింది. మనదేశంలో వేసిన కోవిడ్–19 టీకా డోసుల సంఖ్య తాజాగా 200 కోట్ల మైలురాయిని చేరుకుంది. దేశ వయోజనుల్లో 96 శాతానికి కనీసం ఒక డోసు, 87 శాతానికి రెండు డోసులూ అందినట్లయింది. ప్రపంచంలోనే అతి పెద్ద టీకాకరణ కార్యక్రమంలో ఇది ఓ అరుదైన విన్యాసం. ప్రధాని మోదీ మాటల్లో చెప్పాలంటే, ‘భారతదేశం మరోసారి చరిత్ర సృష్టించింది.’ టీకాలపై అపోహలు, మందకొడి టీకాకరణ, టీకాల కొరత – ఇలా సవాలక్ష సమస్యలు ఎదురైనా, 2021 జనవరి 16న మొదలుపెట్టి, 18 నెలల్లో ఇన్ని కోట్ల కరోనా టీకా డోసులు వేయడం కచ్చితంగా చరిత్రే. కాకపోతే, ‘ముందు జాగ్రత్త మూడో డోసు’ను వయోజనులకు ఉచితంగా వేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించే వేళకు దేశంలో గత నాలుగు నెలల్లోకెల్లా గరిష్ఠస్థాయికి మళ్ళీ కరోనా కేసులు పెరిగాయి. అలక్ష్యం వదలాలని అందరికీ గుర్తుచేస్తున్నాయి. మన దేశంలో తొలి శతకోటి డోసులకు 9 నెలలు పడితే, ఇప్పుడీ రెండో శతకోటి సంబరానికీ మళ్ళీ 9 నెలలే పట్టింది. టీకాలు వేయడంలో వేగం తగ్గలేదనడానికి ఇదే సాక్ష్యమని ప్రభుత్వ వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి. లెక్కల్లో చూస్తే అది నిజమే కానీ, క్షేత్రస్థాయిలో నిజంగా వేగం తగ్గలేదంటారా అన్నది విమర్శకుల ప్రశ్న. వ్యవస్థాగతంగా ప్రభుత్వ సత్వర జోక్యం వల్లే దేశీయంగా ఒకటికి మించి కరోనా టీకాలు బయటికొచ్చాయని కేంద్ర ఆరోగ్య మంత్రి జవాబు. దేశాన్ని ఇవే కాపాడాయనీ, ముఖ్యంగా ఈ ఏడాది థర్డ్ వేవ్లో భారత్లో మరణాలు తక్కువగా ఉన్నాయంటే అదే కారణమనీ మంత్రివర్యుల మాట. దేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారీ ‘కోవిషీల్డ్’ 160 కోట్లు, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్’ 33.5 కోట్లు, బయొలాజికల్ ‘ఇ’ వారి ‘కోర్బెవ్యాక్స్’ 6.5 కోట్లు – ఇలా పిన్నపెద్దలకు ఒకటికి మూడు డోసుల వంతున మొత్తం 200 కోట్ల డోసుల మార్కు చేరగలిగాం. ఇప్పటి దాకా వేసిన డోసుల్లో దాదాపు 71 శాతం గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించినవే. అలాగే, మొత్తం డోసుల్లో 48.9 శాతం ఆడవారికి అందాయని లెక్క. రెండేళ్ళ పైచిలుకు క్రితం అంతుచిక్కని మాయదారి రోగంతో యావత్ ప్రపంచంతో పాటు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న అధిక జనాభా దేశం ఇప్పుడు కాస్తంత ఊపిరి పీల్చుకోవడం వెనుక ఎంతోమంది శాస్త్రవేత్తల, వైద్యుల, పలు వర్గాల ఫ్రంట్ లైన్ యోధుల అవిశ్రాంత కృషి ఉంది. దేశీయంగా టీకాల అభివృద్ధి, డోసులు వృధా కాకుండా నిరంతర సమీక్షలతో ప్రాధాన్యతా క్రమంలో సమర్థంగా టీకాలేస్తూ వచ్చిన విధానం, ప్రజలకూ – పాలకులకూ తక్షణ సమాచారం అందించే ‘కోవిన్’ పోర్టల్ – ఇలా అనేకం ఈ విజయానికి తోడ్పడ్డాయి. ఎవరేమన్నా కరోనాపై టీకాల యుద్ధంలో అనేక దేశాల కన్నా భారత్ ముందంజలో ఉంది. ఐరోపా అంతటా కలిపి 130 కోట్ల డోసులైతే... మన దగ్గర 200 కోట్ల డోసులు వేయడం, మరో 23 కోట్లకు పైగా డోసుల్ని 50కి పైగా దేశాలకు ఎగుమతి చేయడం విశేషం. ఇవి కాక దాదాపు మరో 10 కోట్ల డోసులు నిల్వలో సిద్ధంగా ఉన్నాయి. అంటే, గత 18 నెలల్లో భారత్ దాదాపు 233 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి చేసిందన్న మాట. ఇది రొమ్ము విరుచుకొనే విషయమే. ప్రపంచ జనాభాలో 17.5 శాతం, అందులోనూ 95 కోట్ల మంది వయోజనులూ ఉన్న దేశం మనది. ప్రతి ఇద్దరి మధ్య కనీసం నాలుగు భిన్నాభిప్రాయాలుంటాయనే ఇలాంటి దేశంలో ఇప్పటికి ఏడు విడతల్లో ఇంతమంది స్వచ్ఛందంగా టీకాకరణకు ముందుకొచ్చేలా చేయడం అంత సులభ మేమీ కాదు. అందులో ప్రభుత్వం విజయం సాధించింది. 75 రోజుల పాటు ఉచిత ‘ముందు జాగ్రత్త మూడో టీకా’ ప్రకటనతో మరోసారి ఊపు తేవాలని ప్రభుత్వ ప్రయత్నం. ఇదీ విజయవంతమైతే, అయిదారు నెలల్లో 250 కోట్ల డోసుల మైలురాయినీ దాటేస్తాం. నిజానికి, 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు ఈ జనవరి 10 నుంచీ, 18 –59 ఏళ్ళ మధ్యవయసు వారికి ఏప్రిల్ 10 నుంచే ప్రభుత్వం మూడో డోస్కు వీలు కల్పించింది. అయినా, ఆరు నెలల్లో నూటికి అయిదుగురే వేయించుకున్నారు. రెండు, మూడు డోసుల మధ్య ఉండాల్సిన విరామాన్ని తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు ఈ జూలై మొదట్లో సర్కార్ తగ్గించింది. అయినా అదే పరిస్థితి. ఉద్ధృతి తగ్గిందంటూ ఉదాసీనత ప్రజల్లో పేరుకుపోయిందనడానికి ఇది ఉదాహరణ. కానీ, కరోనా పూర్తిగా పోలేదని పెరుగుతున్న కేసులు తట్టి చెబుతున్నాయి. కొత్తగా మంకీ పాక్స్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళనకరం. ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు, ముందు జాగ్రత్త డోసు లాంటివి అశ్రద్ధ చేయవద్దని వైద్యులు చెవినిల్లు కట్టుకొని మరీ చెబుతున్నది అందుకే. కేంద్రం సైతం 18–59 ఏళ్ళ వారికి మూడో డోసుకు ఓకే చెప్పడానికి తాత్సారం చేసింది. ప్రజారోగ్య రీత్యా ఏ మహమ్మారికైనా ఉచితంగా టీకా వేయాల్సిన పాలకులు 75 రోజులే ఉచితం అనడం సరికాదు. డబ్బులకే టీకా అంటే ఆరోగ్యంలోనూ ఆర్థిక, భౌగోళిక అంతరాలు పెరుగుతాయి. 2017 నాటి జాతీయ ఆరోగ్య విధానంలోని సమానత్వ భావనకే ఇది విరుద్ధం. అలాగే, కరోనా విజయగాధను ఇతర టీకాలకూ విస్తరించాలి. సాధారణ పిల్లల టీకాలను నేటికీ నూటికి 80 మందికే టీకాలిస్తూ, నేపాల్, శ్రీలంక కన్నా మనం వెనుకబడి ఉన్నాం. ద్విశత కోటి విజయగానంతో ఊరుకోకుండా బాలల టీకాల్లోనూ భారత్ ఉపక్రమించడానికి ఇదే సరైన సమయం. -
India: వ్యాక్సినేషన్లో కొత్త రికార్డు.. మోదీ ఏమన్నారంటే..?
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా 20వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,528 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా, అదే సమయంలో కరోనాతో 49 మంది మృతిచెందారు.దీంతో, దేశంలో ఇప్పటికి వరకు నమోదైన పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 4,37,50,599కి చేరగా.. కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 5,25,709 మందికి చేరుకుంది. ఇదిలా ఉండగా.. దేశంలో ప్రస్తుతం 1,43,449 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక, గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 17,790 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా బులిటెన్లో పేర్కొంది. కాగా, కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 200 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు. వయోజన జనాభాలో 98 శాతం మంది మొదటి డోసు టీకాను తీసుకున్నట్టు తెలిపింది. ఇక, శనివారం ఒక్కరోజే 25,59,840 మందికి వ్యాక్సినేషన్ చేశారు. COVID19 | India records 20,528 new cases & 49 deaths in the last 24 hours; Active caseload at 1,43,449 199.98 cr total vaccine doses administered so far under the nationwide vaccination drive. pic.twitter.com/gHFyDoOGAd — ANI (@ANI) July 17, 2022 ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. భారత్ మళ్లీ చరిత్ర సృష్టించింది. 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. అసమానంగా కృషిచేసి ఈ రికార్డును అందుకోవడం గర్వకారణం. ఇది కోవిడ్కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేస్తుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. India creates history again! Congrats to all Indians on crossing the special figure of 200 crore vaccine doses. Proud of those who contributed to making India’s vaccination drive unparalleled in scale and speed. This has strengthened the global fight against COVID-19. https://t.co/K5wc1U6oVM — Narendra Modi (@narendramodi) July 17, 2022 -
కరోనా వైరస్: కలవరపెడుతున్న కొత్త కేసులు
న్యూఢిల్లీ: కొత్త వేరియెంట్ ముప్పు రాకున్నా.. భారత్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 20వేలకు పైనే కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో.. 20, 038 కొత్త కేసులు రికార్డు అయ్యాయి. దేశవ్యాప్తంగా 47 మంది కరోనాతో చనిపోయారు. గత ఇరవై నాలుగు గంట్లో దేశవ్యాప్తంగా 20, 038 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే వంద కేసులు తక్కువే(20, 139) నమోదు అయినప్పటికీ.. మరణాలు మాత్రం ఎక్కువే రికార్డు అయ్యాయి. డెయిలీ పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే ఎక్కువగా నమోదు అవుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందని, బూస్టర్ డోసు పంపిణీ ద్వారా వైరస్ కట్టడికి మరింత కృషి చేస్తామని కేంద్రం ప్రకటించుకుంది. సరిగ్గా 145 రోజుల తర్వాత భారత్లో గురువారం 20వేల మార్క్ దాటాయి కొత్త కేసులు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1, 39, 073కి చేరింది. గత ఇరవై నాలుగు గంటల్లో.. 16,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలు సాధారణ స్థాయికి చేరడం, పాజిటివిటీ రేటు దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు జారీ చేస్తోంది. కరోనాతో ఇప్పటివరకు 5, 25, 604 మంది మృతి చెందారు. జనజీవనం సాధారణంగా మారినప్పటికీ వ్యాక్సినేషన్ ప్రభావంతో కేసులు తక్కువగా నమోదు అవుతుండగా.. చాలామంది టెస్టులకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు కొత్త వేరియెంట్ రాకుంటే భారత్ కరోనా గండాన్ని దాటినట్లేనని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
18–59 ఏళ్ల వారికి ఉచితంగా ప్రికాషన్ డోస్
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడికి చేపడుతున్న టీకా ప్రక్రియలో మరో కీలక ఘట్టానికి అడుగు పడింది. దేశ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి ఉచితంగా ప్రికాషన్ టీకా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల వారికి ప్రికాషన్ డోస్ పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకూ హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఉచితంగా ప్రభుత్వం ప్రికాషన్ డోస్ పంపిణీ చేస్తోంది. 18 నుంచి 59 ఏళ్ల వారు డబ్బు చెల్లించి ప్రైవేటు టీకా కేంద్రాల్లో ప్రికాషన్ డోస్ పొందేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ వర్గాల వారు ఇప్పటి వరకూ 20 మంది వరకూ మాత్రమే రాష్ట్రంలో ప్రికాషన్ డోస్ వేయించుకున్నారు. 75 రోజుల పాటు.. 18 నుంచి 59 ఏళ్ల వారికి ఉచితంగా ప్రికాషన్ టీకా పంపిణీకి శుక్రవారం నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ వైద్య శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75 రోజుల పాటు డ్రైవ్ నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వాస్పత్రులు, గ్రామ/వార్డు సచివాలయాల్లో, టీకా కేంద్రాల్లో ఉచితంగా ప్రికాషన్ టీకా వేస్తారు. రెండో డోసు టీకా తీసుకుని 6 నెలలు దాటిన వారందరూ ప్రికాషన్ డోస్కు అర్హులు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్ల వయసున్న 3,50,94,882 మందికి రెండు డోసుల టీకాను వైద్య శాఖ వేసింది. వీరిలో సెప్టెంబర్ నెలాఖరుకు 3.41లక్షల మంది ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు అర్హత కలిగి ఉంటారు. వీరందరికీ గడువులోగా టీకా పంపిణీకి వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. -
Booster Dose: ఇకపై ఫ్రీగా కరోనా బూస్టర్ డోస్
ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే 199.72 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఇప్పటి వరకు 18-59 ఏళ్ల వారికి రెండు డోసులు ఉచితంగా అందించింది కేంద్రం. ఆ తర్వాత ఏప్రిల్ 10న ప్రికాషన్ డోసుల పంపిణీ ప్రారంభించింది. అయితే.. 18-59 ఏళ్ల వారు ప్రికాషన్ డోస్ను ప్రైవేటు కేంద్రాల్లో డబ్బులు చెల్లిస్తున్నారు. అలాగే 60 ఏళ్లుపైబడిన వాళ్లకు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వారియర్లకు మూడో డోసు ఫ్రీగానే అందించింది. కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రికాషన్ డోస్పై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవటం వల్ల ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 18-59 ఏళ్ల వారికి సైతం ఉచితంగా ప్రికాషన్ డోసు అందించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. జులై 15న మొదలై 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ ప్రత్యేక డ్రైవ్ను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 18-59 ఏళ్ల వారికి సైతం ఉచితంగా మూడో డోసు అందించనున్నారు. 'దేశ జనాభాలో ఎక్కువ మంది తొమ్మిది నెలల క్రితమే రెండు డోసులు తీసుకున్నారు. ఐసీఎంఆర్, ఇతర అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల్లోపు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. బూస్టర్ డోస్ తీసుకుంటే ఇమ్యూనిటీ ప్రతిస్పందన మెరుగ్గా ఉంటుందని తేలింది. 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో 18-59 ఏళ్ల వారికి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా ప్రికాషన్ డోసు అందించనున్నారు. జులై 15న ప్రారంభం కానుంది.' అని అధికారులు తెలిపారు. కేవలం ఒక శాతమే.. ఇప్పటి వరకు దేశంలోని 77 కోట్ల మంది ఉన్న 18-59 ఏళ్ల వయసు వారిలో కేవంల 1 శాతం మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకున్నారు. అర్హత కలిగిన 60 ఏళ్లు పైబడినవారు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లు 16 కోట్ల మంది ఉండగా.. అందులో 26 శాతం మంది మూడో డోసు తీసుకున్నారు. వ్యవధి తగ్గింపు.. కొద్ది రోజుల క్రితమే ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉండగా.. ఆ సమయాన్ని ఆరు నెలలకు కుదించింది. వ్యాక్సినేషన్పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్ వేగం పెంచేందుకు ఇంటింటికీ టీకా 2.O పథకాన్ని జూన్ 1న ప్రారంభించింది కేంద్రం. ప్రస్తుతం ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని 96 శాతం మంది తొలి డోసు తీసుకోగా.. 87 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ఇదీ చదవండి: కోవిడ్ టీకా తీసుకున్నవారికి రూ.5 వేల రివార్డు.. నిజమెంత? -
దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 18,257 మందికి పాజిటివ్గా తెేలింది. వైరస్ బారినపడినవారిలో 14,553 మంది కోలుకున్నారు. మరో 42 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,36,22,651కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,25,428కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,28,428(0.30 శాతం) యాక్టివ్ కేసులున్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 4.22శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.08శాతంగా నమోదైంది. కరోనా రికవరీ రేటు 98.50శాతంగా ఉంది. మరణాల రేటు 1.20శాతంగా నమోదైంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిర్విరామంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 198.76 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు. మరో 4,32,777 కరోనా పరీక్షలు నిర్వహించారు. -
ప్రికాషన్ డోసు గడువు తగ్గింపు
సాక్షి, అమరావతి: కరోనా టీకా ప్రికాషన్ డోసు కాల వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించినట్టు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గడువును తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనల మేరకు సవరించిన మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్లకు జారీ చేశామని చెప్పారు. ఇకపై 18 ఏళ్లు పైబడిన వారందరూ రెండో డోసు టీకా తీసుకున్న 6 నెలలు లేదా 26 వారాల తర్వాత ప్రికాషన్ డోసు టీకా వేసుకోవచ్చన్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రభుత్వమే ఉచితంగా ప్రికాషన్ డోసు వేస్తోందని తెలిపారు. 18–59 ఏళ్ల వయసున్న వారు ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రికాషన్ డోసు తీసుకోవాలని సూచించారు. సవరించిన టీకా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేలా జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్వోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన వారంతా ప్రికాషన్ డోసు తీసుకునేలా చూడాలని సూచించారు. -
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. మరో 28 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 16,159 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4,35,47,809కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,25,270కి పెరిగింది. క్రితం రోజుతో పోల్చితే కొత్త కేసుల సంఖ్య 737 పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,15,212 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారినపడినవారిలో 98.53 శాతం మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల శాతం 0.26గా ఉంది. మరణాల శాతం 1.21గా నమోదైంది. రోజూవారి పాజిటివిటీ రేటు 3.56శాతం కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.54శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం బుధవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 198.20 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు. మంగళవారం నిర్వహించిన 4,54,465 కరోనా పరీక్షలతో కలిపి మొత్తం పరీక్షల సంఖ్య 86.49 కోట్లకు చేరింది. -
ప్రతి పక్షాలేసుకున్న వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్పై కూడా మీ ఫొటో కనిపించేసరికే...
ప్రతి పక్షాలేసుకున్న వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్పై కూడా మీ ఫొటో కనిపించేసరికే... ఫీలయ్యారనుకుంటా సార్! -
World Zoonoses Day: కని‘పెట్’కుని ఉండాలి..! లేదంటే కష్టమే!
ఆధునిక సమాజంలో ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి. అయితే పెంపుడు జంతువులతో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకుంటే మన ప్రాణాలకూ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 6న ‘ప్రపంచ జునోసిస్ డే’ను నిర్వహిస్తుంటారు. పొంచి ఉన్న వ్యాధులు మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం. మనం ఎంతో అభిమానంగా పెంచుకునే కుక్కల నుంచి ర్యాబిస్, గజ్జి, పశువుల నుంచి, గొర్రెలు, మేకలు వంటి గడ్డి తినే జంతువుల నుంచి ఆంత్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు మనుషులకు సోకుతాయి. ఈ సంక్రమిత వ్యాధులనే జూనోసిస్ డిసీజెస్ అంటారు. ముఖ్యంగా వీధి కుక్కుల నుంచి ర్యాబిస్ వేగంగా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతుంది. పశువుల నుంచి మనుషులకు తరచుగా వచ్చే మరో వ్యాధి ఆంత్రాక్స్. దీన్ని దొమ్మ రోగం అని కూడా పిలుస్తారు. మనుషుల్లో చర్మంతో పాటు పేగులు, ఊపిరితిత్తులకు సోకే ఈ వ్యాధి అత్యంత ప్రమాదం. పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, గుర్రాల్లో ఆంత్రాక్స్ చాలా వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ర్యాబిస్ నివారణ చర్యలు ►ర్యాబిస్ సోకకుండా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలి. ►అలాగే కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా ఇంజెక్షన్లు చేయాలి. ►ఇంటిలో పెంచుకునే పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ చేసినట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి. ►కుక్కలతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ►ర్యాబిస్ వ్యాధి సోకిన కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చకుండా దహనం చేయాలి. అప్రమత్తత అవసరం జూనోసిస్ వ్యాధులు ప్రమాదకరమైనవి. మన పరిసరాల్లో ఉండే జంతువుల నుంచే వస్తాయి. జంతువులను కుట్టిన దోమలు మనుషులను కుట్టడం వల్ల, కుక్కలు నేరుగా మనుషులను కరవడం వల్ల ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. ర్యాబిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి. మా వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ జూనోసిస్ వ్యాదుల పట్ల అవగాహన కల్పిస్తున్నాం. పెంపుడు జంతువుల యజమానులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. పశువైద్య కేంద్రాల్లో కుక్కలకు వ్యాక్సిన్లు వేస్తున్నాము. – డాక్టర్ సనపల లవకుమార్, మల్టీ స్పెషలిస్ట్, పశువైద్యాధికారి, ఇచ్ఛాపురం మండలం -ఇచ్ఛాపురం రూరల్, శ్రీకాకుళం చదవండి: Pregnancy Tips: ఆరో నెల.. నడుము నొప్పి, కాళ్ల నొప్పులు.. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడాలి? -
వ్యాక్సినేషన్ సక్సెస్ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు
గాంధీనగర్: కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్పై మోదీ ఫొటో ఎందుకంటూ ప్రతిపక్షాలు నిలదీయడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారులకు తక్షణమే సర్టిఫికెట్ను అందజేసిన భారత్ను చూసి ప్రపంచమంతా చర్చించుకుంటుండగా, కొందరు మాత్రం ఆ సర్టిఫికెట్పై తన ఫొటో ఉండటంపై రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గాంధీనగర్లో సోమవారం ఆయన డిజిటల్ ఇండియా వీక్–2022ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఆన్లైన్ చెల్లింపుల విధానం తీసుకురావద్దంటూ కొందరు పార్లమెంట్లో వాదించారని, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో డిజిటల్ సాంకేతిక ప్రవేశంతో ప్రజల జీవితాలు మారిపోయాయని ప్రధాని చెప్పారు. యూపీఐ ఫలితంగా చిరు వ్యాపారులు కూడా తమ రోజువారీ కార్యకలాపాలను సాగిస్తున్నారన్నారు. బిహార్లోని ఓ వ్యక్తి డిజిటల్ విధానంలో కూడా తనకు దానం చేయవచ్చంటూ క్యూఆర్ కోడ్ ప్లకార్డును మెడలో కట్టుకుని బిచ్చమెత్తుకుంటున్న విషయం ప్రస్తావించారు. వివిధ రకాల సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాక ప్రజలు క్యూల్లో నిల్చోవాల్సిన బాధ తప్పిందన్నారు. ఆధునిక సాంకేతికతను భారత్ అందిపుచ్చుకోనట్లయితే ఇప్పటికీ వెనుబడి ఉండేదన్నారు. ‘పదేళ్ల క్రితం ప్రజలు బర్త్ సర్టిఫికెట్లు, బిల్లుల చెల్లింపు, పరీక్షల ఫలితాలు, ప్రవేశాల కోసం క్యూల్లో నిలబడేవారు. ఇప్పుడు అన్ని సేవలను ఆన్లైన్ చేసి క్యూలు లేకుండా చేశాం’ అని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితంగా అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థను అరికట్టగలిగినట్లు చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో 80 కోట్ల మంది పేదలకు సులువుగా ఉచిత రేషన్ అందించామన్నారు. ఇలా ఉండగా, ప్రధాని మోదీ గురువారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సుమారు రూ.1,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పీఎంవో తెలిపింది. -
స్వతంత్ర భారతి 1978/2022
శిశువులకు టీకాలు ‘రోగ నిరోధక టీకాల విస్తరణ’ అనే ఈ టీకాల కార్యక్రమాన్ని ప్రభుత్వం 1978 లో ప్రారంభించక ముందు, ప్రతి ఏటా జన్మించిన ప్రతి 10 మంది శిశువులలో ఒకరు ఏడాది లోపలే మరణించేవారు. ప్రధానంగా డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు వంటివి వారి మరణాలకు కారణం అయ్యాయి. 1990 కల్లా భారతదేశం చాలా రాష్ట్రాలలో అందరికీ టీకాలు.. శిశువులలో కనీసం 80 శాతం మందికి టీకాలు వేసి ఉండటం.. అనే లక్ష్యాన్ని సాధించడం ద్వారా దాదాపు 2 కోట్ల మంది శిశువులను మృత్యువు బారి నుండి ప్రభుత్వం కాపాడగలిగింది. భారతదేశ జనాభా వృద్ధి రేటును కూడా ఈ కార్యక్రమం మందగింపజేసింది. తమ సంతానంలో చాలామంది బతకడం వల్ల తల్లిదండ్రులు, ముఖ్యంగా గ్రామీణులు మరింత మందిని కనాల్సిన అవసరం ఉందని భావించకపోవడమే అందుకు కారణం. మరికొన్ని పరిణామాలు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లను (వెయ్యి, ఐదు వేలు, పది వేలు) రద్దు చేసింది. 1978 జనవరి 16న ఈ నోట్ల రద్దు జరిగింది. నల్లధనాన్ని అరికట్టడం కోసమే ఈ మూడు రకాల నోట్లను రద్దు చేయడం జరిగిందని ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రకటించారు. ఆ పార్టీ నుంచి ఆవిర్భవించిన బీజేపీ ఆధ్వర్యంలోని మోదీజీ ప్రభుత్వం కూడా 2016లో పెద్ద నోట్లను రద్దు చేయడం తెలిసిందే. బోయింగ్ 747 ప్యాసింజర్ జెట్ అయిన ఎయిర్ ఇండియా ఫ్లయిట్ 855 బాంబే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అరేబియా సముద్రంలో కూలిపోయింది. 213 మంది ప్రయాణికులు దర్మరణం చెందారు. -
కరోనా భారత్: ఆందోళనకరంగా పాజిటివిటీ రేటు!
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. గత వారంగా క్రమం తప్పకుండా 15వేలకు పైనే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీనికి తోడు డెయిలీ పాజిటివిటీ రేటు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. టెస్టుల సంఖ్య పెంచితే.. కేసులు ఇంకా ఎక్కువే బయటపడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. తాజాగా.. దేశంలో ఒక్కరోజులో 17,092 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 29 నమోదుకాగా.. 14,684 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568కి చేరుకోగా.. పాజిటివిటీ రేటు 4.14 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రేసింగ్పై దృష్టిసారించాలని కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోంది. మరోవైపు కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరుతోంది. #AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/VkryOJG5vz pic.twitter.com/QxO99p5odW — Ministry of Health (@MoHFW_INDIA) July 2, 2022 భారత్లో ఇప్పటిదాకా కరోనాతో 5,25,168 మంది మరణించారు. కరోనా రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,28,51,590 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా 1,97,84,80, 015 డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి ఉందన్న డబ్ల్యూహెచ్వో హెచ్చరికలను ఇప్పటికే పలు దేశాలు పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. -
భారత్లో కరోనా: యాక్టివ్ కేసులు పైపైకి..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 17, 070 కొత్త కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే (18వేలకుపైగా) తక్కువే అయినప్పటికీ.. పాజిటివిటీ రేటు పెరిగిపోతుండడం, రికవరీలు పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కొత్తగా 17,070 కేసులు నమోదు అయ్యాయి. 23 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 1,07, 189కి చేరింది. దేశంలో 3.40 శాతానికి కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. ఈ మధ్యకాలంలో రికవరీల సంఖ్య పెరగకపోవడంపై వైద్య విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య పెంచితే.. కేసులు ఇంకా ఎక్కువే బయటపడతాయని అంచనా వేస్తున్నారు. ఇక సుమారు 122 రోజుల తర్వాత.. దేశంలో లక్ష మార్క్ను దాటేశాయి కరోనా యాక్టివ్ కేసులు. గత రెండు వారాల సగటున 78 శాతం కేసుల పెరుగుదల కనిపిస్తోందని, మరణాలు కూడా 119 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ విషయంలోనూ కేంద్రం స్పష్టమైన ప్రకటనలూ చేస్తూ వస్తోంది. #Unite2FightCorona ➡️ Over 86.28 Cr COVID Tests conducted so far. ➡️ Weekly Positivity Rate currently at 3.59%. ➡️ Daily Positivity Rate stands at 3.40%. pic.twitter.com/aRFcPhQ8Is — Ministry of Health (@MoHFW_INDIA) July 1, 2022 ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగానూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయ్. గత వారం రోజుల్లో 4.1 మిలియన్ కేసులు నమోదు అయ్యాయని, 18 శాతం పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా మహమ్మారి కథ ముగియలేదని, మార్పు తీసుకుని వేరియెంట్ల రూపంలో విరుచుకుపడే అవకాశం ఉందని ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తోంది డబ్ల్యూహెచ్వో. చదవండి: కరోనా మారుతోంది.. జాగ్రత్తగా ఉండండి -
ఆదర్శ భారత్: బిల్గేట్స్ని ఆకట్టుకున్న భారత్
భారతదేశ శక్తి సామర్థ్యాలు, ఆ దేశం సాధించిన ఘనత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని బిల్ గేట్స్ ఇటీవల అన్నారు. అందుకాయన చూపిన నిదర్శనం కోవిడ్ నియంత్రణలో భారత్ ఆదర్శంగా నిలబడటం. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారత్ అత్యంత క్లిష్టమైన సమయంలో ఆరోగ్య సవాళ్లను అధిగమించి తన సత్తాను చాటింది. 100 కోట్ల డోసుల కోవిడ్–19 టీకాలు వేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఇదే అత్యంత వేగంగా సాగిన అతిపెద్ద టీకా కార్యక్రమం. భారత్ సాధించిన ఈ విజయంలోని మౌలిక అంశాలను ఇతర దేశాలు కూడా అనుసరించాలి అని కూడా గేట్స్ అన్నారు. మొదట అంశం: పైనుంచి కింది స్థాయి వరకు రాజకీయ సంకల్పం బలంగా పని చేయడం. రెండో అంశం: భారత్ తనకున్న సుదీర్ఘ అనుభవం, అవగాహన, మౌలిక వసతులను ఉపయోగించుకుని కోవిడ్పై పోరాటానికి ప్రచారం చేయడం. మూడో అంశం: మహమ్మారి కంటే ముందే తన టీకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు భారత్ నిలబెడుతూ ఉండటం. ముఖ్యంగా మెనైంజైటస్, నిమోనియా, డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు అందివ్వడం. నాలుగోది : భారతదేశం తన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో విజయవంతంగా మానిటర్ చేయడం. ఈ మౌలికమైన అంశాలన్నిటితో ఇండియా ప్రపంచానికి ఒక ధైర్యాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో వచ్చే 25 ఏళ్లలో ఇండియా ఆరోగ్య అగ్రరాజ్యంగా మారినా ఆశ్చర్యం లేదన్న భావన కూడా గేట్ మాటల్లో ధ్వనించింది. -
వేల సంఖ్యలో కోవిడ్ కేసులు.. మరో వేవ్కు సంకేతమా?
పారిస్: కరోనా పీడ ఇప్పట్లో విరగడయ్యేలా కనిపించడం లేదు. ప్రపంచాన్ని పట్టి కుదిపేసిన కోవిడ్ మహమ్మారి మరోసారి పంజా విసిరేలా ఉంది. పలు దేశాల్లో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఈ భయాలను మరింత పెంచుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్లో కోవిడ్ తీవ్ర రూపు దాల్చేలా ఉందని ఫ్రెంచ్ వ్యాక్సినేషన్ చీఫ్ అలేన్ ఫిష్చర్ అన్నారు. ఫ్రాన్స్-2 టెలివిజన్తో బుధవారం ఆయన మాట్లాడారు. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయని, ఇది మరో వేవ్కు సంకేతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం ఇదేమాదిరిగా అధిక కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. మహమ్మారి మరోసారి విజృంభిస్తుందనడంలో సందేహం లేదని చెప్పారు. అయితే, కొత్త వేరియంట్లతో కూడిన తాజా వేవ్ తీవ్రత ఎలా ఉంటుందన్నదే అసలైన సవాల్ అని వ్యాఖ్యానించారు. ఐసీయూలో వెంటిలేటర్పై పాక్ దిగ్గజ క్రికెటర్ భౌతిక దూరం పాటించడం, జనం గుంపులోకి వెళ్లినప్పుడు మాస్కు ధరించడం తప్పనిసరి అని సూచించారు. ఇతర యూరప్ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా పోర్చుగల్లో రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ.4, బీఏ.5 వెలుగుచూశాయని తెలిపారు. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లతో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంటున్నట్టు తెలిపారు. అయితే, వ్యాప్తిలో వేగం ఉండటం ఆందోళన కలిగించే అంశమని చెప్పుకొచ్చారు. కాగా, మంగళవారం ఒక్కరోజే ఫ్రాన్స్లో 90 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీడెవడ్రా బాబు! ఇలా వెళ్తున్నాడు.. తేడా కొడ్తే అంతే సంగతులు -
‘ప్రభుత్వ ప్రికాషనరీ’ డోస్కు అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: అర్హులందరికీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రికాషనరీ డోస్ ఇవ్వడానికి అనుమతివ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి మన్సుక్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ తెలం గాణ వద్ద 32 లక్షల వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయని, వాటి గడువు కూడా సమీపిస్తోందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ల రూపంలో కరోనా కేసులు పెరుగుతున్నందున, రెండు డోసులు పూర్తిచేసుకొన్న అర్హులకు ప్రికాషనరీ డోస్ ఇవ్వడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు. ప్రభుత్వ వైద్యంలో ప్రస్తుతం 60 ఏళ్లు దాటినవారికి మాత్రమే ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతించిందని పేర్కొన్నారు. 18 ఏళ్లుపైబడిన వారికి ఏప్రిల్ 10 నుంచి ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు కేవలం ప్రైవేటు ఆసుపత్రులకే అనుమతించిందని చెప్పారు. ప్రైవేటుతోపాటు ప్రభుత్వ కేంద్రాల్లోనూ 18–59 ఏళ్ల వయస్సన్నవారికి ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు అనుమతిస్తే ఫలితాలు గణనీయంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోందని, ఈ నెల 3న రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటింటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా పదిరోజుల్లో 1.30 లక్షలమందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు మరింత పెంచనున్నట్లు చెప్పారు. టీబీ నిర్మూలన కోసం అమలు చేస్తున్న నిక్షయ్మిత్ర కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. సమీక్షలో ఉన్నతాధికారులు రిజ్వీ, శ్వేతా మహంతి, గంగాధర్, శ్రీనివాస్రావు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
కరోనా అలర్ట్: ఆఫీసుల్లో, ప్రయాణాల్లో మాస్క్ మస్ట్!
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ మరోసారి తన ఉనికిని చాటుతోంది. గత కొంతకాలంగా తగ్గుముఖం పడుతున్న కేసుల్లో పెరుగుదల ఊగిసలాట కనిపిస్తోంది. మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే.. శనివారం కేంద్రం విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 3,962 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా 26 మంది కరోనాతో మరణించారు. మహారాష్ట్రంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. తాజాగా వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ముంబై నుంచే అధికంగా కేసులు వస్తున్నాయి. ఈ తరుణంలో.. అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణాల్లో, ఆఫీసుల్లో మాస్క్ తప్పనిసరిని చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అదనపు సీఎస్ డాక్టర్ ప్రదీప్ వ్యాస్.. జిల్లా అధికారులకు ఉత్తర్వులు పంపించారు. రైళ్లు, బస్సులు, సినిమా హాల్స్, ఆడిటోరియమ్స్, ఆఫీసులు, ఆస్పత్రులు, కాలేజీలు, స్కూల్స్.. ఇలా క్లోజ్డ్గా ఉండే పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ తప్పనిసరి అని ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే బహిరంగ ప్రాంతాల్లో మాత్రం మాస్క్ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. అయినప్పటికీ మాస్క్ స్వచ్ఛందంగా ధరించాలంటూ సీఎం ఉద్దవ్ థాక్రే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 2,697 మంది కరోనా నుంచి కోలుకోగా... 26 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 22,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ కరోనా ఉదృతి ఉన్నప్పటికీ.. పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించుకుంది. తాజా కరోనా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,72,547కి చేరుకున్నాయి. మొత్తం 4,26,25,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా 26 మరణాలతో.. ఇప్పటి వరకు 5,24,677 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా, క్రియాశీల రేటు 0.05 శాతంగా, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,93,96,47,071 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 11,67,037 మంది వ్యాక్సినేషనల్లో పాల్గొన్నారు. #LargestVaccineDrive #Unite2FightCorona #AmritMahotsav pic.twitter.com/kbmuYEmk8O — Ministry of Health (@MoHFW_INDIA) June 4, 2022 కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలంటూ.. శుక్రవారం ఐదు రాష్ట్రాలకు లేఖలు రాసింది. పెరుగుతున్న కోవిడ్ కేసులు, పాజిటివిటీ రేటుపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీలకు లేఖలు రాసింది. వైరస్ కట్టడికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, పరిస్థితి అదుపు తప్పకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. చదవండి: భారత్లో మంకీపాక్స్ కలకలం -
రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' కరోనా వ్యాక్సిన్ ప్రచారం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి దేశం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అందువల్ల మళ్లీ ఆ మహమ్మారి దరిదాపుల్లోకి రాకుండా ముందస్తు చర్యగా మరోసారి సమర్ధవంతమైన కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆ దిశగా జూన్ నుంచి రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' ప్రచారం 2.0 కోసం ప్లాన్ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాదు ఇంకా మెదటి, రెండు డోసుల వ్యాక్సిన్ను తీసుకోవల్సిన వారందరికీ వ్యాక్సిన్లు వేయడమే కాకుండా అందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. "ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రజలందరికీ మొదటి, రెండు డోసుల, బూస్టర్ డోస్లు వేయడం, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలలోని వారందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా దృష్టిసారించడం తదితరాలు హర్ ఘర్ దస్తక్ 2.0' ప్రధాన లక్ష్యాలని తెలిపింది. వ్యాక్సిన్ డ్యూ-లిస్ట్ల ఆధారంగా సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆసుపత్రులలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారందరికి వ్యాక్సిన్ డోస్లు అందేలే సమీక్షించాలని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రకియను సమర్ధవంతంగా నిర్వహించేలా కమ్యూనికేషన్ వ్యూహాన్ని అనుసరించాలని స్పష్టం చేసింది. అలాగే కరోనా వ్యాక్సిన్ అమూల్యమైన జాతీయ వనరు అని, అది వృధా కాకుండా చూసుకోవాలని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ నొక్కి చెప్పారు. ఫస్ట్ ఎక్స్పైరీ ఫస్ట్ అవుట్ సూత్రం ఆధారంగా గడువు ముగిసిపోనున్న బ్యాలెన్స్ వ్యాక్సిన్ మోతాదులను త్వరితగతిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వినియోగించిలే క్రియాశీలక పరివేక్షణ చేపట్టాలన్నారు. డిసెంబర్ 2021 నుంచి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వారి డిమాండ్కి అనుగుణంగా వ్యాక్సిన్ డోస్లను సరఫరా చేశామని చెప్పారు. (చదవండి: పటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ) -
టీకాలు.. రక్షణ కవచాలు
ప్రాణాలను కాపాడటంలో వ్యాక్సిన్లకు అమిత ప్రాధాన్యత ఉంది. అయినప్పటికీ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఫ్లూ వ్యాక్సిన్ ను తీసుకోవడం భారతదేశంలో చాలా స్వల్పంగా మాత్రమే ఉంది. అంటువ్యాధుల ద్వారా సంభవించే మరణాలలో 25% వరకూ టీకాలు నివారిస్తాయి. ఈ నేపధ్యంలో అంటువ్యాధుల నివారణ కోసం జీవితమంతా రోగ నిరోధక టీకాలను వేయించడం అవసరం. చాలామంది టీకాలనగానే పిల్లలుకు మాత్రమే అనే భ్రమలో ఉంటారు. అయితే పెద్దవారికి కూడా టీకాలు వేయించుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి. , వ్యాక్సిన్ తో నివారించగల వ్యాధుల వ్యయాన్ని తగ్గించడానికి పెద్దలలో కూడా టీకాలపట్ల సుముఖత పెంచాలి. ఈ ప్రపంచ రోగ నిరోధక వారంలో భాగంగా ఇమ్యునైజేషన్ కార్యక్రమం పట్ల ఉన్న అపోహలు తొలగించడంతో పాటు తప్పుడు సమాచారం పట్ల అవగాహన కల్పించాల్సి ఉందని వైద్యులు అంటున్నారు. పెద్దలకు మేలు... ఫ్లూ, న్యుమోనియా లాంటి సంక్రమణ వ్యాధులకు వ్యతిరేకంగా తగిన రీతిలో టీకాలను తీసుకోకపోవడం వల్ల హాస్పిటలైజేషన్ , చికిత్స పరంగా అనవసర ఖర్చులు పెరుగుతున్నాయి. ‘‘భారతదేశంలో 2–3% మంది పెద్దలు కూడా టీకాలు వేయించుకోవడం లేదు. అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పెద్దగా ప్రజలకు చేరువ కావడం లేదు. తగిన టీకా షెడ్యూల్ పాటించడం ద్వారా హాస్పిటలైజేషన్ అవసరాన్ని తగ్గించుకోవచ్చు. తీవ్ర అనారోగ్య నివారణకు టీకాలు తప్పనిసరి అని ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. మరోవైపు ప్రపంచ మధుమేహ, సీఓపీడీ రాజధానిగా ఇండియా వెలుగొందుతోంది. భారతీయులు ఈ రెండు వ్యాధుల బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. హెచ్1ఎన్ 1 లాంటి వ్యాధులు విపత్తును కలిగిస్తుంటే హెప్ బీ ప్రాంణాంతికంగా మారుతుంది. ఈ సమస్యలను వ్యాక్సిన్ లతో నివారించవచ్చు’’ అని అపోలో ఆసుపత్రికి చెందిన డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి అన్నారు. డిఫ్తీరియా, టెటానస్ లాంటి టీకాలను సైతం తీసుకోవడం ద్వారా మరణాలు లేదా అనారోగ్యం నివారించవచ్చు. భారతప్రభుత్వంతో పాటుగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా చిన్నారులకు టీకాలను వేయించడం ప్రాధాన్యతాంశంగా చూస్తుంటాయి. అంటు వ్యాధుల బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలుండటం కూడా దీనికి కారణం. పిల్లలకు తప్పనిసరి... ‘‘ఐదేళ్ల లోపు పిల్లల్లో అధికశాతం మంది మరణించడానికి న్యుమోకోకల్ బ్యాక్టీరియా కారణమవుతుంది వ్యాధులకు చికిత్సకంటే నివారణ మేలు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండటానికి టీకాలు తప్పనిసరి. అయితే వీటి గురించి ముందస్తుగా డాక్టర్లతో చర్చించడం అవసరం ’’ అని డాక్టర్ ఎం సురేంద్రనాథ్, పీడియాట్రిషియన్ అన్నారు. -
Corona Updates: కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో మళ్లీ స్వల్ప పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,805 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 22 మంది మరణించారు. ఇందులో 20 మరణాలు కేరళ నుంచి ఉండడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 20,303గా ఉంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,168 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కోవిడ్తో ఇప్పటి వరకు 5,24,024 మంది మృతి చెందారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 4, 30, 98, 743 మంది కరోనా బారినపడ్డారు. ► భారత్లో ప్రస్తుతం ఇన్ఫెక్షన్ రేటు ఆధారంగా.. యాక్టివ్ కేసుల శాతం 0.05 శాతంగా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతం. డెయిలీ పాజిటివిటీ రేటు 0.78 శాతంగా ఉండగా, వారంతపు పాజిటివిటీ రేటు 0.79 శాతంగా నమోదు అవుతోంది. ► గడిచిన 24 గంటల్లో.. ఢిల్లీలో గరిష్ఠంగా 1, 656 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత ఇదే హయ్యెస్ట్ మార్క్. పాజిటివిటీ రేటు 5.39 శాతంగా ఉంది. ► ముంబైలో 117 కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. వరుసగా నాలుగవరోజూ కేసులు 100కి పైగా నమోదు కావడం గమనార్హం. #AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/PJIiBPrHb0 pic.twitter.com/bhVaDrzMYE — Ministry of Health (@MoHFW_INDIA) May 7, 2022 -
Corona: ఒక్కరోజులో తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ, ఉత్తరాదిలో మరికొన్ని చోట్ల కేసుల ఎఫెక్ట్తో గత వారం రోజులుగా కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 2, 568 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనాతో 20 మంది మృతి చెందినట్లు పేర్కొంది. అంతకు ముందు రోజుతో పోలిస్తే.. ఇది 18.7 శాతం తక్కువ. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,84,913 కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు 5,23, 889 మంది మరణించారు(అధికారికంగా). రికవరీ రేటు 98.74 శాతానికి చేరుకుంది. గత ఇరవై నాలుగు గంటల్లో 2, 911 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల నుంచే 80.58 శాతం కొత్త కేసులు నమోదు అవుతుండగా.. ఢిల్లీ నుంచి ఎక్కువ కేసులు రికార్డు అవుతున్నాయి. -
టీకా వేసుకోవాలని... బలవంతపెట్టలేం: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా టీకా వేసుకోవాల్సిందిగా ఎవరినీ బలవంతపెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ శరీరానికి ఏం కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను రాజ్యాంగం ప్రతి పౌరునికీ కల్పించిందని పేర్కొంది. సేవలు పొందడానికి టీకాను తప్పనిసరి చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గవాయ్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. వ్యాక్సినేషన్ తాలూకు ప్రతికూల ప్రభావాలకు సంబంధించిన వివరాలను, గణాంకాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్రానికి సూచించింది. అంతేగాక కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నంత కాలం టీకా తీసుకోని వాళ్లు బహిరంగ స్థలాల్లో స్వేచ్ఛగా తిరగడం, ఇతరత్రా సేవలు పొందడంపై ఆంక్షలు విధించరాదని సూచించింది. అయితే ప్రభుత్వ కరోనా టీకా కార్యక్రమాన్ని సమర్థించింది. అది అసమగ్రంగా ఉందని చెప్పలేమని పేర్కొంది. ప్రజాప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం కొన్ని పరిమితులు కూడా విధించొచ్చని తెలిపింది. పిల్లలకూ కరోనా టీకా వేయించాలన్న కేంద్రం నిర్ణయం కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీసుకున్నదేనని అభిప్రాయపడింది. ఈ విషయంలో కూడా పలు దశల పరీక్షల తాలూకు ఫలితాలను అందరికీ అందుబాటులో ఉంచాలని కేంద్రానికి సూచించింది. కరోనా టీకాలకు సంబంధించి అన్ని వివరాలనూ ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంచినట్టు కేంద్రం తెలిపింది. ‘‘మార్చి 13 నాటికి దేశవ్యాప్తంగా 180 కోట్లకు పైగా డోసులు వేశాం. 15–18 ఏళ్ల వయసు వాళ్లకు 8.91 కోట్ల డోసులు వేశాం. టీకా వల్ల స్వల్ప ఆరోగ్య సమస్యలు వచ్చాయంటూ 1,739, తీవ్ర సమస్యలంటూ 81, అతి తీవ్ర సమస్యలొచ్చాయని 6 కేసులు నమోదయ్యాయి’’ అని వివరించింది. -
Covid Cases: దేశంలో కరోనా టెన్షన్..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత క్రమంలో పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,927 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 32 మంది మృతిచెందారు. మరో 2,252 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,279 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇదే సమయంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతంగా నమోదు అయింది. మరోవైపు.. దేశంలో ఇప్పటివరకు 4,30,65,496 కరోనాబారినపడ్డారు. కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య 5,23,654 కు చేరుకుంది. ఇక, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,88,19,40, 971 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఇదిలా ఉండగా.. దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిస్థితి, కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ బుధవారం మధ్యాహ్నాం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. COVID-19 | India reports 2,927 fresh cases and 2,252 recoveries, in the last 24 hours. Active cases 16,279 Daily positivity rate (0.58%) pic.twitter.com/bUGouzeoSX — ANI (@ANI) April 27, 2022 ఇది కూడా చదవండి: ఫోర్త్ వేవ్ ముప్పుతప్పదు.. నిపుణుల హెచ్చరిక -
రూ. 225కే కోవిడ్ ప్రికాషన్ డోస్
న్యూఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా మొదలయ్యే కరోనా టీకా ప్రికాషన్ డోస్ను రూ.225కే ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. ‘కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కోవిషీల్డ్ టీకా ఒక్కో డోస్ ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించాం’అని ఎస్ఐఐ సీఈవో అథర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. అదేవిధంగా, ‘మా సంస్థ తయారు చేసే కోవాగ్జిన్ టీకా ఒక్కో డోస్ను ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,200కు బదులుగా రూ.225కే అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నాం’అని భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా వెల్లడించారు. 18 ఏళ్లు నిండి, రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారంతా 10వ తేదీ నుంచి ప్రైవేట్ టీకా కేంద్రాల్లో కోవిడ్ ప్రికాషన్ డోస్కు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
ప్రైవేట్ టీకా కేంద్రాల్లో 'ప్రికాషన్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి ప్రైవేట్ టీకా కేంద్రాల్లో కోవిడ్ ప్రికాషన్ డోసు టీకా పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ప్రైవేట్ కేంద్రాల్లో ప్రికాషన్ డోసు పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. రెండో డోసు టీకా తీసుకుని 9 నెలలు పూర్తయిన వారందరూ ప్రికాషన్ టీకా వేసుకోవడానికి అర్హులు. తొలి రెండు డోసులు ఏ టీకా పొందారో ప్రికాషన్ డోసు కింద అదే రకం టీకా వేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 446 ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా పంపిణీకి గతంలో వైద్య శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఆస్పత్రులు టీకా తయారీ కంపెనీల నుంచి కొనుగోలు చేసి పంపిణీ చేపట్టవచ్చు. ఆయా కేంద్రాల్లో ఎంఆర్పీ ధరకే టీకా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనంతా వైద్య శాఖ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో 18–59 సంవత్సరాల మధ్య వయసు గల 3.47 కోట్ల మందికి ప్రభుత్వమే ఇప్పటివరకూ రెండు డోసుల టీకా వేసింది. 60 ఏళ్లు పైబడిన వారికి జనవరిలోనే ప్రికాషన్ డోసు టీకా పంపిణీ ప్రారంభించగా.. ఈ కార్యక్రమం తుది దశకు చేరుకుంది. -
ఆ ఒప్పందం సఫలం కావాలంటే...
ఆరోగ్యరంగంలో నెలకొన్న అసమానతల పునాదిపైనే మహమ్మారి ప్రాణం పోసుకుని ప్రపంచంపై విరుచుకుపడింది. రికార్డు సమయంలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలిగినప్పటికీ వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రజల సంఖ్య అనేక పేద దేశాల్లో ఇప్పటికీ తక్కువే. న్యాయమైన పంపిణీ, చౌకగా లభ్యం కావడం, పరీక్షలకు అందుబాటులో ఉండటం వంటివి ఇప్పటికీ సవాలుగానే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సరికొత్త అంతర్జాతీయ ఆరోగ్య ఒడంబడిక ఫలితాలు తీసుకువస్తుందని ఆశించడంలో ఔచిత్యం లేదనిపిస్తుంది. సమన్యాయం, అందరికీ అందుబాటులో ఉంచడం అనేవి ఆరోగ్యానికి సంబంధించిన కీలక సూత్రాలుగా గుర్తించనంతవరకూ మహమ్మారిపై ఒప్పందం కూడా అంతర్జాతీయ వాతావరణ మార్పు ఒడంబడికలాగే నిష్ఫలమవుతుంది. కోవిడ్–19 మహమ్మారి భారత్లో తగ్గు ముఖం పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2022 మార్చి 22 నాటికి ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల 80 లక్షల కేసులు నమోదు కాగా, 60 లక్షల మంది మరణాల బారిన పడ్డారని సమాచారం. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ స్థిరంగా పెరుగుతూ వచ్చింది. ఆఫ్రికాలోనూ, మరికొన్ని నిరుపేద దేశాల్లోనూ వ్యాక్సిన్లు వేయడం ఇప్పటికీ స్వల్పంగానే ఉంది. గత రెండేళ్లుగా మహమ్మారి ప్రపంచాన్ని కనీవినీ ఎరుగని స్థాయిలో అతలాకుతలం చేయడమే కాకుండా, దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. దీంతో అంతర్జాతీయ సంస్థలు భవిష్యత్ మహమ్మారులతో వ్యవహ రించడం ఎలాగని చర్చించుకుంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఒక అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకోవాలనే ప్రతి పాదన కూడా వీటిలో ఒకటి. రెండేళ్లలో పూర్తవుతుందని భావిస్తున్న ఈ ప్రయత్నపు విజయం పలు కారణాలపై ఆధారపడి ఉంటుంది. మానవ ఆరోగ్యం ప్రధాన సూత్రంగా లేకపోతే ఈ ఒప్పందానికి కూడా వాతావరణ మార్పు ఒప్పందానికి పట్టిన గతే పడుతుంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్–19ని ఎదుర్కోవడా నికి దేశాల మధ్య సహకారం చాలా అవసరమని స్పష్టమైంది. ఒక సాంకేతిక, శాస్త్ర సంబంధిత ఏజెన్సీ అయిన ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ సవాలును ఎదుర్కోవడానికి అవసరమైన వివిధ ప్రజారోగ్య, బయో మెడికల్ కొలమానాలపై మార్గదర్శకత్వాన్ని అందించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారికి చెందిన డేటాను నిర్దిష్టంగా పదిలపర్చే స్థలంలాగా పాత్ర పోషించింది. వైరస్ కట్టడిపై ఈ సంస్థ ఇచ్చే పిలుపును జాతీయ ప్రభుత్వాలే స్వీకరించి ఆచరణలో పెట్టాయి. మాస్కు ధరించడం, లాక్డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షలు వంటి వాటిని ఏజెన్సీ అందించిన సాంకేతిక సలహాను బట్టి, స్థానిక పరి స్థితిని బట్టి ఆయా దేశాలు పాటిస్తూ వచ్చాయి. అయితే చైనాలో వైరస్ మూలం గురించిన తనిఖీల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆరోపణలకు గురైంది. ప్రత్యేకించి చైనా పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా మృదు వైఖరి అవలంబించిందని కొన్ని పాలనా యంత్రాంగాలు విమర్శించాయి. మరోవైపున, దేశాలు స్వతంత్రంగా వైరస్ రూపాలపై పరిశోధన చేయడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన అధికారాలు కుదించుకుపోతున్నట్లు భావించింది. వ్యాధి లేక వైరస్ సంబంధిత సమాచారం, డేటా కోసం సభ్య దేశాలపై ఆధారపడాల్సి ఉండటమే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అతిపెద్ద అవరోధంగా ఉంటోంది. 2002–2003 సంవత్సరాల్లో సార్స్ వైరస్ ప్రపంచంపై విరుచుకుపడిన నేపథ్యంలో 2005లో అంతర్జాతీయ ఆరోగ్య క్రమ బద్ధీకరణ (ఐహెచ్ఆర్) చట్టాన్ని తీసుకొచ్చారు. సార్స్ వైరస్ ఉనికికి సంబంధించిన సమాచారాన్ని చైనా నెలల తరబడి వెల్లడించకుండా తొక్కిపెట్టడంతో చాలా దేశాలకు అది విస్తరించింది. ప్రజారోగ్యానికి సంబంధించిన ఘటనలు దేశాల సరిహద్దులు దాటి సంభవించి నప్పుడు ప్రపంచ దేశాలు పాటించాల్సిన విధులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నియమాలను ఐహెచ్ఆర్ నెలకొల్పింది. 2020 జనవరి 30న ఐహెచ్ఆర్ ఎమర్జెన్సీ కమిటీ నిర్వహించిన సమావేశం లోనే, కోవిడ్–19ని అంతర్జాతీయంగా కలవరపెట్టే ప్రజారోగ్య అత్యవ సర పరిస్థితిగా సిఫార్సు చేశారు. అయితే ఐహెచ్ఆర్ బలహీనమైన చట్రంతో కూడుకుని ఉందనీ, పర్యవేక్షణ, నిఘా వంటి అంశాల్లో దాని అమలు లోపభూయిష్ఠంగా ఉందనీ అనుభవాలు తెలియజేస్తున్నాయి. మహమ్మారి వెలుగులో 2020 మే నెలలో ఐహెచ్ఆర్ వ్యవస్థ పనితీరు, దాని అమలు గురించి సమీక్షించాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సభ (వరల్డ్ హెల్త్ అసెంబ్లీ)... ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది. 2021 డిసెంబర్లో మహమ్మారి సన్నాహక చర్యలపై సరికొత్త అంతర్జాతీయ ఒడంబడికపై చేసిన కృషిని ఆరోగ్య సభ ఆమోదించింది. ప్రతిపాదిత ఒడంబడికపై చర్చలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. తొలి ప్రశ్న ఏమిటంటే, ఈ ఒడంబడిక తీసుకునే రూపం చట్టానికి కట్టుబడి ఉండే ఉపకరణంగా ఉండాలా లేదా మరొకలా ఉండాలా అనేదే! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య సమస్యలపై విధివిధానాలను రూపొందించే అధికారాలను ఆరోగ్య అసెంబ్లీకి కట్టబెట్టింది. ఇంత వరకు దీనికి సంబంధించిన ఏకైక ఉదాహరణ ఏమిటంటే, 2005లో అమలులోకి వచ్చిన పొగాకు నియంత్రణపై ముసాయిదా కన్వెన్షన్ మాత్రమే. ఈ కన్వెన్షన్ కింద పొగాకు ఉత్పత్తులలో అక్రమ వాణిజ్యాన్ని తొలగించే ప్రొటోకాల్ని అమలులోకి తెచ్చారు. కొన్ని దేశాలు మహమ్మారిపై ఒడంబడిక విషయంలోనూ ఇలాంటి వైఖరినే పాటించాలని సూచించాయి. దీనికింద ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, నిర్దిష్ట విధివిధానాలతో కూడిన చట్రం ఉండాలని ఇవి కోరాయి. ఉదాహరణకు, జంతువుల నుంచి మను షులకు వ్యాపించే వ్యాధుల విస్తరణను నిరోధించేందుకు అడవి జంతువుల వ్యాపారంపై నిషేధం విధించే ప్రొటోకాల్ గురించి యూరోపియన్ యూనియన్ మాట్లాడుతోంది. కొత్త, ఆవిర్భవిస్తున్న వైరస్లపై జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను తప్పనిసరిగా అన్ని దేశాలూ పరస్పరం పంచుకోవాలనే డిమాండ్లు కూడా రంగంమీదికి వచ్చాయి. అయితే ఈ కొత్త విధానం లేదా ఒడంబడిక ఐహెచ్ఆర్ని తోసి రాజంటుందా లేదా దానికి అనుబంధ పాత్రను పోషిస్తుందా అనేది స్పష్టం కావడం లేదు. ఈ అన్ని ఘర్షణాత్మకమైన అంశాలపై సంప్ర దింపుల కమిటీ ఒక అవగాహనకు రావాల్సి ఉంది. ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించి కొత్త నిబంధనలను అభివృద్ధి చేసే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, ఇంతవరకు మనకు ఎదురైన అతి పెద్ద గుణపాఠాలను విస్మరించకూడదు. ఆరోగ్యరంగంలో నెలకొన్న అసమానతల పునాదిపైనే మహమ్మారి ప్రాణం పోసుకుని ప్రపం చంపై విరుచుకుపడింది. రికార్డు సమయంలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలిగినప్పటికీ వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రజల సంఖ్య అనేక పేద దేశాల్లో ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉండిపోయింది. సంపన్న దేశాల్లోని ప్రజలు ఇప్పటికే బూస్టర్ డోసులు కూడా వేసుకున్నారు. మరోవైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన వ్యాక్సిన్ పూల్ పేదప్రజలకు వ్యాక్సిన్లను అందించడంలో విఫలమైంది. న్యాయమైన పంపిణీ, చౌకగా లభ్యం కావడం, పరీక్షలు అందుబాటులో ఉండటం వంటివి ఇప్పటికీ సవాలుగానే ఉంటున్నాయి. భౌగోళిక–రాజకీయ వ్యూహాల పరంగా కఠినమైన స్థానాల నుంచి ప్రపంచ దేశాలు పక్కకు తొలిగేలా మహమ్మారి మార్పు తీసుకు రాలేక పోయింది. వాణిజ్య ఒప్పందాలలోనూ ఈ పరిస్థితే కొనసాగుతోంది. మేధా సంపత్తికి చెందిన అవరోధాలన్నీ చెక్కుచెదర కుండా అలాగే ఉంటున్నాయి. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్కనబెట్టి గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఎజెండా వంటి ప్రైవేట్ చర్యలను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అమెరికా ఇలాంటి వాటిని ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో అందరికీ వర్తించే బహుపాక్షికత అనే గొప్ప భావనపై దాడి చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో సరికొత్త అంతర్జాతీయ ఆరోగ్య ఒడంబడిక ఫలితాలు తీసుకు వస్తుందని ఆశించడంలో ఔచిత్యం లేదనిపిస్తుంది. దశాబ్దాలుగా వాతావరణ మార్పుపై ఒప్పందం కోసం ప్రపంచం చర్చిస్తూనే ఉంది. కర్బన ఉద్గారాలకు సంబంధించిన సూత్రాలను సంపన్న దేశాలు నిరంతరం వ్యతిరేకిస్తూ, ఉమ్మడి బాధ్యతలు చేపట్ట డానికి నిరాకరిస్తున్నాయి. పేద దేశాలకు టెక్నాలజీ బదలాయింపు, ఆర్థిక వనరుల పంపిణీపై చేసిన వాగ్దానాలు ఇప్పటికే కాగితాల మీదే ఉండిపోయాయి. సమన్యాయం, అందరికీ అందుబాటులో ఉంచడం అనేవి ఆరోగ్యానికి సంబంధించిన కీలక సూత్రాలుగా గుర్తించనంత వరకు మహమ్మారిపై కుదిరే ఒప్పందానికి కూడా వాతావరణ మార్పు ఒప్పందానికి పట్టిన గతే పడుతుందని విస్మరించరాదు. -
ఒకప్పుడు మాదాపూర్.. ఇప్పుడంతా నల్లగండ్ల వైపే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కరోనా మహమ్మారి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. ప్రస్తుతానికైతే కుదుటపడ్డట్టే కనిపిస్తుంది. కేసుల సంఖ్య తగ్గిపోవటం, వేగవంతమైన వ్యాక్సినేషన్తో ప్రజలలో నమ్మకం పెరిగింది. దీంతో గృహ కొనుగోలుదారులు మార్కెట్లోకి తిరిగి వస్తున్నారు. ఇతర నగరాలతో పోలిస్తే ధరలు స్థిరంగానే ఉండటంతో సమీప భవిష్యత్తులో డిమాండ్ ఏర్పడటం ఖాయమని వెర్టెక్స్ ఎండీ వీవీఆర్ వర్మ అభిప్రాయపడ్డారు. కోవిడ్ సమయంలోనూ హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో భవిష్యత్తులో నివాస విభాగానికి గణనీయమైన డిమాండ్ ఉంటుందని తెలిపారు. మారిన అభిరుచులు కరోనా తర్వాతి నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. విలాస, విశాలమైన అపార్ట్మెంట్లు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్లతో పాటూ కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోమ్ను కొనసాగిస్తుండటం, మరికొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానంలో ఉండటంతో గృహ కొనుగోలుదారులు హోమ్ ఆఫీస్ వసతులు ఉన్న ప్రాజెక్ట్లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటూ సూపర్ స్టోర్, ఫార్మసీ, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు గేటెడ్ కమ్యూనిటీ లోపలే ఉన్న ప్రాజెక్ట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. భిన్న ప్రాధాన్యతలు గృహ ఎంపికలో కొనుగోలుదారుల ప్రాధాన్యతలు విభిన్నంగా ఉన్నాయి. కొంత మంది ఇంటికి చేరువలోనే ఆఫీసు, స్కూల్, ఆసుపత్రులు, మార్కెట్ వంటివి ఉండాలని కోరుకుంటుంటే... మరికొంత మంది రద్దీ జీవనానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో గృహాలు ఉండాలని భావిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాలు విద్యా సంస్థలు, పని ప్రదేశాలతో అనుసంధానించబడి ఉండాలని కోరుకుంటున్నారు. మధ్య తరహా గృహాలతో పాటూ అల్ట్రా ప్రీమియం ప్రాజెక్ట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. నల్లగండ్ల, తెల్లాపూర్.. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలలోని ప్రాజెక్ట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. మాదాపూర్ వంటి ఏరియాలో పరిమిత స్థాయిలో స్థలాల లభ్యత కారణంగా కోకాపేట, నల్లగండ్ల, తెల్లాపూర్, కొల్లూరు వంటి ప్రాంతాలు ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో సరికొత్త నివాస కేంద్రాలుగా అవతరించాయి. కొంపల్లి, ఈసీఐఎల్ వంటి ఏరియాలు కూడా నివాస సముదాయ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. -
అక్కడ ఒమిక్రాన్ కలకలం.. కోవిడ్ రూల్స్పై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కనిష్ట స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను సడలించాయి. కాగా, కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో భద్రతా చర్యల కోసం కేంద్రం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేంద్రం కొవిడ్ రూల్స్ విధించిందిన విషయం తెలిసిందే. అయితే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీ నుంచి అన్ని నిబంధనలను తొలగిస్తున్నట్టు బుధవారం కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. కానీ, బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మాస్క్ ధరించాల్సి ఉంటుందని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కాగా, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కేంద్రం తీసుకున్న కోవిడ్ రూల్స్ మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. యూరప్, చైనా, దక్షిణ కొరియా, వియత్నాం, ఫ్రాన్స్, జర్మనీలలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 23, బుధవారం నాటికి 1,81,89,15,234 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. దేశంలో ప్రస్తుతం 12 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం టీకాలు అందిస్తోంది. ఇక, కోవిషీల్డ్ టీకాల మధ్య గ్యాప్ను కూడా కేంద్రం 8-16 వారాలకు తగ్గించిన విషయం తెలిసిందే. కోవాగ్జిన్ టీకాల మధ్య గ్యాప్ 28 రోజులుగా ఉంది. ఇది చదవండి: బయటపడ్డ మాజీ ఎమ్మెల్యే సమాధి.. అధికారులు పట్టించుకోకపోవడంతో.. -
‘ఎన్ని కోవిడ్ వేవ్లు వచ్చినా పర్లేదు.. అయితే, అవి మాత్రం మరవొద్దు’
న్యూఢిల్లీ: భారత్లో కరోనా నాలుగో వేవ్ వచ్చినా ఆందోళన అవసరం లేదని ఎయిమ్స్ వైద్య నిపుణులు అంటున్నారు. ఇకపై ఎన్ని వేవ్లు వచ్చినా మన దేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదని చెబుతున్నారు. భారీ వ్యాక్సినేషన్, కరోనా రోగుల్లో పెరిగిన నిరోధక శక్తి వల్ల ఇకపై వచ్చే వేవ్లు ప్రభావం చూపలేవని ఎయిమ్స్ ఎపిడిమాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ అన్నారు. ‘‘కరోనాలో ఇప్పటికే వెయ్యికి పైగా మ్యుటేషన్లు జరిగాయి. వాటిలో ఐదు వేరియెంట్లే ఎక్కువ ప్రభావం చూపాయి. కరోనా రెండో వేవ్ భారత్లో తీవ్ర ప్రభావం చూపినా డెల్టా వేరియెంట్ వల్ల అత్యధికుల్లో ఏర్పడ్డ రోగనిరోధక శక్తి ఇకపై వచ్చే వేవ్ల నుంచి కాపాడుతుంది’’ అన్నారు. మాస్కులు, భౌతికదూరం తప్పనిసరని సఫ్దర్జంగ్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ జుగల్ కిశోర్ చెప్పారు. కోవిషీల్డ్ రెండో డోసు వ్యవధి తగ్గింపు కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించారు. తొలి డోసు తర్వాత 8 నుంచి 16 వారాల మధ్య రెండో డోసు తీసుకోవడానికి అనుమతిస్తూ నీతి అయోగ్ (ఇమ్యూనైజేషన్) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది 12–16 వారాలు (84 రోజులు)గా ఉంది. -
గుడ్ న్యూస్.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులపై కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. పాజిటివ్ కేసుల సంఖ్య కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, కరోనా కట్టడి కోసం దేశంలో ప్రజలు కోవిషీల్డ్, కోవాగ్జిన్ వాక్సిన్లను తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్ల రెండు డోసులను తీసుకునేందుకు కేంద్రం.. కొన్ని వారాల గ్యాప్ను విధించింది. ఈ క్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్పై ఆదివారం కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులకు మధ్య ఉన్న గ్యాప్ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎన్టీఏజీఐ(NTAGI) కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను ఇకపై 8-16 వారాల గ్యాప్తో రెండో డోసును తీసుకోవచ్చని పేర్కొంది. కాగా, ఎన్టీఏజీఐ సూచనల మేరకు మే 13, 2021 నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య గడువును 12-16 వారాల గ్యాప్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, డోసుల మధ్య గ్యాప్ తగ్గించడంతో వ్యాక్సిన్ తీసుకునే వారికి వెసులుబాటు కలిగింది. మరోవైపు కోవాగ్జిన్ వ్యాక్సిన్ షెడ్యూల్లో మాత్రం మార్పులేదని కేంద్రం తెలిపింది. కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య 28 రోజుల గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే. ఇక దేశంలో వ్యాక్సిన్ తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఇప్పటికే కోవిషీల్డ్తో పాటు కోవాగ్జిన్, రష్యన్ స్పుత్నిక్ వంటి వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లోనూ విక్రయించేందుకు కేంద్రం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్లను కేంద్రం విధించిన నిబంధనల మేరకే తీసుకోవాలని హెచ్చరించింది. ఇది చదవండి: దూసుకోస్తున్న 'అసని తుపాను'...భారీ నుంచి అతి భారీ వర్షాలు -
అన్ని గొంతులూ విన్నప్పుడే...
మంచిమాట ఎవరు చెప్పినా ముందు వినాలన్నాడు సుమతీ శతకకర్త. విని, తొందరపడకుండా ఆలోచించి, నిజానిజాలు తెలుసుకోగలిగినవారే నీతిపరులని చెప్పాడు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అల్లాడించింది. ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేసింది. వీటన్నింటికీ నిజంగా కారణం కరోనాయేనా అని ప్రశ్నించే గొంతులూ ఉన్నాయి. కోవిడ్ను సీజనల్గా వచ్చే ఇన్ఫ్లుయెంజాగానే పరిగణించి వైద్యం చేసివుంటే అనవసర లాక్డౌన్స్ తప్పేవని ప్రొఫెసర్ చోసుడొవస్కీ లాంటివాళ్లు చెబుతున్నారు. కరోనా వల్ల ప్రపంచ సంపదను మహాశ్రీమంతులు మరింతగా పంచుకున్నారని కూడా అన్నారు. ఇందులోని నిజానిజాలు తేల్చుకోవాలన్నా ముందు ఇలాంటివాళ్ల మాటలు తొందరపడకుండా వినాలి. సత్యం దిశగా యోచించాలి. సుమతీ శతకకారుడు బద్దెన భవిష్యత్తును ఊహించి వందల సంవత్సరాల క్రితమే బోధించిన నీతి సూత్రం ఈ క్షణానికీ ఎంత విలువైనదో మరోసారి రుజువైంది. ‘నీతి తెలిసిన వాడెవడు?’ అన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం... మానవేతర ప్రకృతిలోని పశుపక్ష్యాదులకు కూడా వర్తిస్తుంది. మంచిమాట ఎవరు చెప్పినా ముందు వినాలని చెబుతూ ఇలా హెచ్చరించిపోయాడు. ‘‘విన్న తరువాత తొందరపడకుండా బాగా ఆలోచించాలి. ఆ తరువాత నిజానిజాలు తెలుసుకోగలిగినవారే లోకంలో నీతిపరులు’’ అని బోధించాడు. ఇప్పుడా బోధించే వంతు తెలివిగల రెండు ఎలుకలపై పడిందనిపిస్తుంది. ఇంతకూ ఆ ఎలుకల సంభాషణను ఒక సుప్రసిద్ధ కళాకారుడు (క్యారికేచరిస్టు) ఇలా అక్షరబద్ధం చేశాడు: ఒక ఎలుక రెండో ఎలుకను ‘‘నీవు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి పోతున్నావా?’’ అని అడిగితే, ఆ రెండో ఎలుక ‘‘ఎందుకా తొందరపాటు? మనుషుల మీద ప్రయోగ ఫలితాలు తేలనీ’’ అని సరిపెడుతుంది, తెలివిగా! ప్రపంచమంతటా 2020–21 నుంచి విస్తరించిన కరోనా వైరస్ పౌర సమాజాన్ని నాశనం చేసింది. అది విస్తరించిన దేశాలన్నిటా ఆర్థిక సంక్షోభాలు సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ బడుగు దేశాలకు, ప్రజలకు అత్యంత ఆశాజనకంగా తన విశిష్ట విశ్లేషణలను, సకాలంలో హెచ్చరికలను అందిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు కెనడాకు చెందిన ఆర్థికవేత్త ప్రొఫెసర్ మైఖేల్ చోసుడొవస్కీ (కాట్లిన్ జాన్స్టోన్ ప్రత్యేక వ్యాసం 14 ఫిబ్రవరి 2022). చోసుడొవస్కీ విశ్లేషణల వల్ల ప్రపంచ వైద్య నిపుణులు సహితం పలు వ్యాపార కంపెనీల మందుల నాణ్యత గురించి ప్రశ్నించే స్థితి ఉత్పన్నమైంది. దీనికితోడు కరోనా వైరస్కు దాని విభిన్న రూపాల (వేరియంట్స్) నిర్ధారణకు వాడుతున్న ఆర్టీ – పీసీఆర్ పరీక్షలు కూడా నిరర్థకంగా తయారైనాయని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించడంతో పెద్ద గందరగోళం సర్వత్రా వ్యాపించింది. పైగా ‘సార్స్ – కోవిడ్ 2’ సాధారణంగా సీజనల్గా వచ్చే ఫ్లూ, ఇన్ఫ్లుయెంజాలకు మించింది కాదనీ, వాటికి వాడే సాధారణ ఇంజెక్షన్లకు భిన్నంగా వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా మార్కెట్కు వదులుతున్న ఇంజక్షన్లు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదనీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులే నిర్ధరిస్తూ ఉండడంతో ప్రొఫెసర్ చోసుడొవస్కీ హెచ్చరికలకు విలువ పెరగడం మరొక విశేషం! ఈ గందరగోళం మధ్య దేశదేశాల్లో నిరంతరం జరుగుతున్న పని – లాక్డౌన్లు, ప్రజల నిత్య వర్తక వ్యాపారాలు స్తంభించి, సర్వవ్యాప్త ఆర్థిక సంక్షోభాల్లోకి దేశాల్ని నెట్టడమూ! అంతేగాదు, ఏ ‘కోవిడ్ – 19’ వైరస్ నిర్మూలనకు ఉద్దేశించిన ‘ఎం–ఆర్ఎన్ఏ’ వ్యాక్సిన్స్ ఉన్నాయో, ఆ ప్రత్యేక వ్యాక్సిన్ల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు రావడంతో ప్రపంచ వైద్యరంగంలో భారీ గందరగోళ పరిస్థితులు ఏర్పడటాన్ని నిపుణులు గుర్తించారు. అంతేగాదు, ఈలోగా ‘సమాచార స్వేచ్ఛ’ చట్టం కింద సేకరించిన సమాచారం ప్రకారం, ‘కోవిడ్–19’ వ్యాక్సిన్ రక్షణ కవచమేనా అన్న సందేహం రేకెత్తడం మరొక విషమ పరిణామంగా ప్రసిద్ధ వైద్య నిపుణులు పేర్కొనడం జరిగింది. ఇన్నిరకాల పరిణామాల ఫలితంగానే ప్రొఫెసర్ చోసుడొవస్కీ ఈ కింది నిర్ణయానికి వచ్చి ఉంటారు. ‘‘ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదకర సంక్షోభపు చౌరస్తాలో మనం నిలబడాల్సి వచ్చింది. మనది నడుస్తున్న చరిత్ర. అయినా 2020 సంవత్సరం జనవరి నుంచీ అనుభవిస్తున్న ఘటనల పరంపర గురించిన మన అవగాహన మాత్రం మసకబారిపోయింది. కోవిడ్–19 మహమ్మారి వైరస్ కారణాల గురించీ, దాని వ్యాప్తివల్ల కలిగే దారుణ ఫలితాల గురించీ ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. అంతేగాదు, బయటకు చెప్పని అసలు వాస్తవం – ప్రపంచ దేశాల్ని భారీ ఎత్తున నిరుద్యోగంలోకీ, ఆర్థిక దివాళా పరిస్థితుల్లోకీ, దారుణ దారిద్య్ర పరిస్థితుల్లోకీ, నిరాశా నిస్పృహల్లోకీ నెట్టి ప్రజల్ని సుడిగుండంలోకి దించగల బడాబడా గుత్తాధిపతుల ప్రయోజనాల రక్షణకు ఈ కరోనా వైరస్ ఒక పెద్ద ముసుగని మరిచిపోరాదు. దీని ఫలితానికే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ గురయ్యారు’’. కోవిడ్ను సీజనల్గా వచ్చే సాధారణ ఇన్ఫ్లుయెంజాగానే పరిగణించి వైద్యం చేస్తే మహమ్మారిని నివారించగలిగేవాళ్లమనీ, అప్పుడు అనవసర ఆర్థిక కార్యకలాపాల దిగ్బంధనలు (లాక్డౌన్స్) తప్పేవనీ, జాతీయ ఆర్థిక వ్యవస్థ కునారిల్లకుండా భద్రంగా ఉండగలిగేదనీ చోసుడొవస్కీ తన డాక్యుమెంట్లో స్పష్టం చేశారు (ద 2020 వరల్డ్వైడ్ కరోనా క్రైసిస్: డిస్ట్రాయింగ్ సివిల్ సొసైటీ, ఇంజనీర్డ్ ఎకనామిక్ డిప్రెషన్, గ్లోబల్ కూ డెటట్ అండ్ ద ‘‘గ్రేట్ రీసెట్’’). ఈ సానుకూల నిర్ణయానికి దూరమైనందుననే కరోనా మరో సద్దు మరో సద్దుగా (సెకండ్ వేవ్, థర్డ్ వేవ్) వస్తోందన్న ప్రచారంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నింటినీ దివాళా ఎత్తించారనీ ఆ డాక్యుమెంట్ స్పష్టం చేసింది! ఎక్కడికో అక్కర్లేదు, ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారమే కనీసం అభివృద్ధి దశలోని పాతిక, ముప్ఫయ్ వర్ధమాన దేశాలలో ఈ దశలోనే కరువుకాటకాలు చుట్టుముట్టిన ఫలితంగా విలవిలలాడాయి. ఈ దశలో అనేక కంపెనీలూ, సంస్థలూ దివాళా ఎత్తడానికి, నిరుద్యోగం పెచ్చరిల్లిపోవడానికి ‘వైరస్’ కారణమన్నది కేవలం సాకు మాత్రమేనని కూడా ఆ డాక్యుమెంట్ స్పష్టం చేసింది! అంతేకాదు, ఆర్థిక వ్యవస్థలు ఈ దశలో – అంటే కరోనా కాలంలో చితికిపోతున్న సమయంలోనే 2020 ఫిబ్రవరి నుంచీ బిలియన్ల కొలదీ డాలర్లను మహాకోటీశ్వరులు ఎలా పోగుచేసుకుని బలిసిపోయారో డాక్యుమెంట్ ప్రస్తావించింది. కానీ, అసలు వాస్తవం ఏమంటే – ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగనంత స్థాయిలో ప్రపంచ సంపదను భారీఎత్తున బడా సంపన్న వర్గాలు తమ మధ్యన పునఃపంపిణీ చేసుకోవడం (రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్) జరిగిందని ఆ డాక్యుమెంట్ వివరించింది! బహుశా అందుకే ‘టెంపెస్ట్’ (పెను ఉప్పెన) అన్న రచనలో ‘‘నరకలోకం ఖాళీ అయిపోగా, దయ్యాలన్నీ ఇక్కడ చేరా’’యని మహాకవి, నాటకకర్త షేక్స్పియర్ అన్నాడు! మరొక రహస్యం ఈ సందర్భంగా మరచిపోరానిది – ప్రజలలో విశ్వాస వారధులు నిర్మించి, కష్టాలను కడు ధైర్యంతో ఎదుర్కోగల చేవను ఎక్కించవలసినవాళ్లు కూడా కోవిడ్–19 గురించిన రకరకాల తప్పుడు సమాచారాన్ని భుజాన వేసుకోవడం! వాస్తవాల్ని తెలుసుకోగోరే ప్రాథమిక మానవ హక్కుల్ని పౌరులు చలాయించగల ధైర్యస్థయిర్యాలను అందించాల్సిన అవసరాన్ని ఆ డాక్యుమెంట్ ఎత్తిచూపింది. దీనికితోడు, కోవిడ్–19 చాటున మరో పెను పరిణామం ముంచుకొస్తోందనీ, పైస్థాయిలో ప్రపంచ ద్రవ్య వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని మరీ నిర్ణయాలను రుద్దే సరికొత్త విధాన వ్యవస్థ బ్రహ్మప్రళయంగా రూపుదిద్దుకుంటోందనీ, ఇది ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుందనీ చెప్పింది. ఇలాంటి ఆదేశాలను అనేక దేశాలలోని అవినీతిపరులైన రాజకీయవేత్తలకు ఏకకాలంలో బట్వాడా చేసే విధానం రూపొందించడం జరుగుతుందని చోసుడొవస్కీ హెచ్చరించారు. మొత్తం ఐక్యరాజ్యసమితి ఈ వినాశకర ఎత్తుగడల పట్ల మూగనోము పట్టగల ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. అందుకే, తత్త్వవేత్తలు ఒక సత్యాన్ని వెల్లడించాల్సి వచ్చింది– ‘‘అబద్ధం ఒకసారి నిజమైతే, ఇక వెనక్కి మళ్లే సమస్య ఉండదు’’. పిచ్చి తలకెక్కింది. రోకలిచుట్టమన్నట్టుగా, ఆ పని జరిగితే ప్రపంచం తలకిందులు కాక తప్పదు. కనుకనే మానవాళి ఇప్పుడు సమస్యల చౌరస్తాలో కొట్టుమిట్టాడుతోందని విజ్ఞుల భావనగా అర్థం చేసుకోవాలి! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
12–14 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ రేపటి నుంచే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కోవిడ్–19 వ్యాక్సినేషన్ బుధవారం నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. హైదరాబాద్లోని బయోలాజికల్ ఈ.లిమిటెడ్ సంస్థ తయారు చేసిన కోర్బివాక్స్ టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. చిన్నారులు క్షేమంగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుందని పేర్కొన్నారు. 12, 13, 14 ఏళ్ల వయసున్న వారు బుధవారం నుంచి కరోనా టీకా తీసుకోవాలని కోరారు. అలాగే రెండు కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతూ 60 ఏళ్లు దాటిన వారు కూడా బూస్టర్ డోసు వేయించుకోవచ్చని సూచించారు. సైంటిఫిక్ విభాగాలతో చర్చించిన అనంతరం 12, 13, 14 ఏళ్ల వారికి ఈ నెల 16 నుంచి కరోనా టీకా ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. 2008, 2009, 2010లో జన్మించిన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరింది. 12 ఏళ్లు దాటినవారంతా అర్హులేనని వెల్లడించింది. 12–14 ఏళ్ల వయసు విభాగంలో దేశవ్యాప్తంగా 7.11 కోట్ల మంది పిల్లలు ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. బయోలాజికల్ ఈ.లిమిటెడ్ సంస్థ 5 కోట్ల కోర్బివాక్స్ టీకా డోసులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. దేశంలో 14 ఏళ్లు దాటిన వారికి కోవిడ్–19 వ్యాక్సినేషన్ను గతంలోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. 15–18 ఏళ్ల వారికి ఈ ఏడాది జనవరి 3వ తేదీ నుంచి కరోనా టీకాలు ఇస్తున్నారు. -
Corona Virus: వ్యాక్సినేషన్పై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్రం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. 12 నుంచి 14 ఏళ్లలోపు వయసున్నవాళ్లకు బుధవారం(మార్చి 16వ తేదీ) నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 12-14 ఏళ్ల మధ్య పిల్లలతోపాటు 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్ డోసు ప్రక్రియ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మాన్షుక్ మాండవీయా ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారత్లో వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటి వరకు 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ వేశారు. बच्चे सुरक्षित तो देश सुरक्षित! मुझे बताते हुए खुशी है की 16 मार्च से 12 से 13 व 13 से 14 आयुवर्ग के बच्चों का कोविड टीकाकरण शुरू हो रहा है। साथ ही 60+ आयु के सभी लोग अब प्रिकॉशन डोज लगवा पाएँगे। मेरा बच्चों के परिजनों व 60+ आयुवर्ग के लोगों से आग्रह है की वैक्सीन जरूर लगवाएँ। — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2022 కొత్త కేసులు.. 27 మరణాలే! మన దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 2,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 36,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 675 రోజుల్లో ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో 4,377 మంది కరోనా నుంచి కోలుకోగా... 27 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. వీరిలో 4.24 కోట్ల మంది రికవర్ అయ్యారు. భారత్లో Corona Deaths ఇప్పటి వరకు 5,15,877గా నమోదు అయ్యింది. -
కరోనా వైరస్: ఐసీఎంఆర్ కీలక ప్రకటన
Corona Virus Update: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ప్రభావం మాత్రం కొనసాగుతోంది. గత 25 రోజులుగా వరుసగా లక్షకు దిగువనే కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,396 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గురువారం నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 77, 152 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 142 మంది చనిపోగా.. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా కరోనాతో 5, 14, 388 మరణాలు నమోదు అయ్యాయి. ఇక ఈ ఏడాది మరణాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. 2022లో సంభవించిన కరోనా మరణాల్లో బాధితులు చాలామట్టుకు వ్యాక్సిన్కు దూరంగా ఉన్నవాళ్లే(vaccination)నని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. తద్వారా కరోనా మరణాల కట్టడిలో వ్యాక్సినేషన్ కీలకంగా వ్యవహరిస్తోందని, కాబట్టి, అంతా వ్యాక్సిన్ డోసులు వేయించుకోవాలని, నిర్క్క్ష్యం పనికిరాదని చెప్తున్నారు. ఇక గురువారం నాటికి దేశవ్యాప్తంగా 178.26 కోట్ల డోసులు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. -
Sakshi Cartoon: ప్రపంచానికి భారత్ టీకాల రక్ష
ప్రపంచానికి భారత్ టీకాల రక్ష-బిల్గేట్స్ -
గుడ్ న్యూస్.. దేశంలో కోర్బెవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతి
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి వేళ డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఫార్మా సంస్థ బయోలాజికల్–ఈ.. 12–18 ఏళ్ల గ్రూపు వారి కోసం రూపొందించిన కరోనా టీకా కోర్బెవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది. కోర్బెవాక్స్ను పరిమితులతో వినియోగించేందుకు బయోలాజికల్–ఈకి అనుమతి లభించినట్లు సోమవారం అధికారవర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా కరోనా టీకాను 15 ఏళ్ల లోపు వారికి వేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని విషయం గమనార్హం. -
ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
కవాడిగూడ: ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు అందించడం గర్వకారణమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం కవాడిగూడ డివిజన్ దోమలగూడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 19 మంది ఆశావర్కర్లకు ఎమ్మెల్యే స్మాట్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెల్ఫోన్లు అందించడంతో ప్రతి వ్యక్తి ఆరోగ్యం గురించి ఆశావర్కర్లు అందులో ఎంటర్ చేస్తారన్నారు. టీకాలు, జ్వర పరీక్షలు, మందుల పంపిణీ వంటి సమాచారం ఎంట్రీ అవుతుందన్నారు. కరోనా సమయంలో ఆశావర్కర్లు ఇంటింటికి తిరిగి సమగ్ర విచారణ చేపట్టి కరోనా సోకిన వ్యక్తులను గుర్తించి మందుల కిట్లను పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఈ నెల 27న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
Djokovic: వ్యాక్సిన్కు వ్యతిరేకం కాదు.. బలవంతం చేస్తే మాత్రం..!
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేదే లేదని భీష్మించుకు కూర్చున్న వివాదాస్పద టెన్నిస్ స్టార్ నొవాక్ జోకోవిచ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్కు తాను వ్యతిరేకం కాదని, బలవంతంగా తీసుకోమని ఒత్తిడి తెస్తే మాత్రం భవిష్యత్తులో జరిగే టెన్నిస్ టోర్నీలకు దూరంగా ఉండేందుకైనా సిద్ధంగా ఉన్నానని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ ఏడాది జరగబోయే వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలను వదులుకుంటారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. జోకో ఈ మేరకు స్పందించాడు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం మాత్రమేనని, వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమానికి తానేమీ మద్దతు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా జకో స్పష్టంగా చేశాడు. శరీర ధర్మానికి తగ్గట్లుగానే తన నిర్ణయాలు ఉంటాయని, ఈ విషయంలో తననెవరైనా బలవంతం చేస్తే ట్రోఫీలు వదులుకోవడం పెద్ద సమస్య కాదని తెలిపాడు. కాగా, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఈ సెర్బియన్ స్టార్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022కు దూరమైన సంగతి తెలిసిందే. చదవండి క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డు.. అరంగేట్రం తర్వాత పుట్టిన క్రికెటర్తో..! -
కొత్త వేరియంట్ల ముప్పు అధికమే!
జెనీవా: ఒమిక్రాన్ వేరియంట్తోనే మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు భావించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన కోవిడ్–19 టెక్నికల్ లీడ్ మారియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు అధికంగానే ఉందని తెలిపారు. ఒమిక్రాన్లోని నాలుగు వేర్వేరు వెర్షన్లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. వైరస్ ఎన్నో రకాలుగా మార్పులకు గురవుతోందని, ఉత్పర్తివర్తనాలు సంభవిస్తున్నాయని, కొత్త వేరియంట్ల పుట్టుకకు అవకాశాలు ఎన్నో రెట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. కరోనా కొత్త వేరియంట్ల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే సరిపోదని, నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకొనే చర్యలు కచ్చితంగా చేపట్టాలన్నారు. కరోనా కేసులు 17 శాతం తగ్గాయ్ అంతకుముందు వారంతో పోలిస్తే కోవిడ్–19 పాజిటివ్ కేసులు గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 17 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. కరోనా సంబంధిత మరణాలు 7 శాతం తగ్గిపోయానని తెలిపింది. అమెరికాలో పాజిటివ్ కేసులు ఏకంగా 50 శాతం పడిపోయాయని పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. మొత్తం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులే 97 శాతం ఉన్నాయని వివరించింది. మిగతా 3 శాతం కేసులు డెల్టా వేరియంట్కు సంబంధించినవేనని నివేదికలో ప్రస్తావించింది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒమిక్రాన్ ఉనికిని గుర్తించారని స్పష్టం చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకూ ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 1.9 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 68,000 మంది మరణించారని తెలియజేసింది. కోవిడ్ నియంత్రణకు కొత్త కాంబో డ్రగ్! కోవిడ్–19 వ్యాప్తి నియంత్రణకు ప్రయోగాత్మక ఔషధం బ్రెక్వినార్ను రెమ్డెసివిర్ లేదా మోల్నుపిరవిర్తో కలిపి ఇస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో నిర్వహించిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను నేచర్ పత్రికలో ప్రచురించారు. రెమ్డెసివిర్ లేదా మోల్నుపిరవిర్ను వేర్వేరుగా ఇచ్చినప్పటి కంటే బ్రెక్వినార్ కాంబినేషన్తో ఇస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు అధ్యయనకర్తలు తేల్చారు. అయితే, ఈ కాం బో డ్రగ్పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. -
94 శాతం మందికి రెండు డోసుల టీకా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన జనాభాలో 93.94 శాతం మందికి కోవిడ్ రెండు డోస్ల వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో టీకాల ప్రక్రియలు జరగడంవల్లే రాష్ట్రంలో కోవిడ్ మూడో దశలో లక్షణాల తీవ్రత, మరణాల శాతం చాలా తక్కువగా ఉంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కూడా తొలిడోసు నూటికి నూరు శాతం పూర్తయింది. అలాగే, 18 ఏళ్ల పైబడిన వారికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు డోసులు నూటికి నూరు శాతం పూర్తికాగా.. ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికి పైగా పూర్తయింది. మూడు జిల్లాల్లో 80 శాతానికి పైగా పూర్తయింది. ఇక మొత్తం మీద రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన 50.28 లక్షల మందికి మాత్రమే రెండు డోస్ల టీకా వేయాల్సి ఉంది. వీరికి కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోంది. వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేయడంవల్లే.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా పూర్తిచేయడంవల్లే కోవిడ్ మూడవ వేవ్లో మరణాల సంఖ్య దేశంతో పాటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువగా ఉంది. అంతేకాక.. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలు కూడా చాలా స్పల్పంగా ఉండడంవల్ల కేవలం వారం రోజుల్లోనే అందరూ కోలుకుంటున్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషనే కోవిడ్కు పరిష్కారమని తొలి నుంచీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడమే కాక రాష్ట్రంలో ఆచరణలో అమలుచేసి చూపించారు. దీనివల్లే ఇప్పుడు కోవిడ్ కేసులతో పాటు మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. దేశంలో మరణాల రేటు 1.20 శాతం ఉంటే రాష్ట్రంలో కేవలం 0.64 శాతమే ఉంది. అందుకే మరణాల రేటు తక్కువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి నుంచీ వ్యాక్సినేషన్ను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించడంవల్లే రాష్ట్రంలో 18ఏళ్లు పైబడిన వారిలో 93.94 శాతం మందికి రెండు డోస్ల వ్యాక్సినేషన్ పూర్తయింది. దీని ఫలితం ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్లో స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగైదు రోజుల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గడమే కాకుండా మరణాల రేటు దేశంతో పాటు ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి కూడా లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటోంది. కోవిడ్ వ్యాక్సినేషన్ను రాష్ట్రంలో వేగంగా పూర్తిచేయడమే ఇందుకు కారణం. ఈ నెలాఖరుకల్లా మిగతా వారికీ పూర్తిచేస్తాం. – డాక్టర్ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు -
మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్ ప్రారంభం
శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో మొబైల్ కోవిడ్ వ్యాక్సిన్ వ్యాన్ను జాయింట్ జోనల్ కమిషనర్ మల్లారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ళు నిండిన వారు రెండు డోసుల వ్యాక్సి న్ వేయించుకొని 9 నెలలు పూర్తి అయితే బూస్టర్ డోస్ వేస్తామన్నారు. వికలాంగులు, సిక్ అయిన వారికి ఇంటికే వెళ్లి బూస్టర్ డోస్ వేస్తామని వివరించారు. శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిల్ పరిధిలోని వారు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు. వృద్దులు, సిక్ అయిన వారు బూస్టర్ డోస్ కోసం కంట్రోల్ రూం నెంబర్ 040–21111111లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంహెచ్ఓలు డాక్టర్ రవి, డాక్టర్ కార్తీక్, పీఓ మాన్వి తదితరులు పాల్గొన్నారు. -
వ్యాక్సినేషన్లో ఏపీ దూకుడు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కోవిడ్ వ్యాక్సినేషన్లో ఏపీ దూసుకుపోతోంది. ఈ విషయం కేంద్రం విడుదల చేసిన తాజా ఆర్థిక సర్వేలో కూడా వెల్లడైంది. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఏపీలో 75.7 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిపింది. అలాగే తొలి డోసు వ్యాక్సినేషన్ ఏపీలో లక్ష్యానికి మించి(100.4 శాతం మంది) పూర్తయ్యిందని వెల్లడించింది. తద్వారా దేశంలోనే టాప్లో నిలిచిందని పేర్కొంది. ఇక తెలంగాణలో 68.7 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయని ఆర్థిక సర్వేలో కేంద్రం తెలిపింది. దేశ జనాభాలో48.3 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని పేర్కొంది. మరోవైపు ప్రజలను కోవిడ్ బారి నుంచి కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన మౌలిక వసతులు, ఆక్సిజన్ ప్లాంట్లు, బెడ్లు, ల్యాబ్లు ఏర్పాటు చేస్తోంది. 2019 నాటికి రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేదు. కానీ ప్రస్తుతం 13 జిల్లాల్లో రూ.45 కోట్ల వ్యయంతో 14 వైరాలజీ ల్యాబ్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఏపీలో 90 శాతం మందికి ఆర్టీపీసీఆర్ విధానంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి రికార్డు సృష్టించారు. అలాగే 143 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చి ప్రజలను సంరక్షించేందుకు కృషి చేస్తోంది. -
ఈ నెలాఖరుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలు భర్తీ చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని), వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, కోవిడ్ టాస్క్పోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను సీఎం జగన్కు వివరించారు. సమీక్షలోని ముఖ్యాంశాలు.. ►కోవిడ్ తీవ్రత క్రమంగా తగ్గుతోందని తెలిపిన అధికారులు ►అన్నిరాష్ట్రాల్లోనూ ఆంక్షలను సడలిస్తున్నారని వెల్లడి ►రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 1,00,622 అయితే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు కేవలం 2301 మందేనని తెలిపిన అధికారులు ►ఇందులో ఐసీయూలో ఉన్నవారు 263 మంది, వీరుకూడా దాదాపుగా కోలుకుంటున్నారన్న అధికారులు ►2144 మందికి ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నామని వెల్లడి. ►104 కాల్ సెంటర్కూ వస్తున్న కాల్స్ గణనీయంగా తగ్గాయన్న అధికారులు ►నిన్నటిరోజున వచ్చిన కాల్స్ కేవలం 246, ఇందులో ఆస్పత్రిలో జాయిన్ అయినవారు 18 మంది మాత్రమేనని వెల్లడి వ్యాక్సినేషన్ ►వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందన్న అధికారులు ►రెండు డోసులు వేసుకున్నవారు 3,73,71,243 కాగా, ఒక డోసు వేసుకున్నవారు 55,38,556 ►ప్రికాషనరీ డోస్ టార్గెట్ 12,60,047 కాగా ఇప్పటికే 9,79,723 మందికి వాక్సినేషన్ పూర్తి ►రాష్ట్రంలో 15–18 ఏళ్ల మధ్య అందరికీ మొదటి డోసు పూర్తయ్యిందని వెల్లడి. చదవండి: (నాడు-నేడు: సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు) ఈ సందర్భంగా సీఎం జగన ఏమన్నారంటే... ►ఫిబ్రవరి మాసాంతానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఖాళీలను భర్తీచేయాలని మరోసారి పునరుద్ఘాటించిన సీఎం. ►నాడు – నేడు కింద చేపట్టిన పనులను సమీక్షించిన సీఎం ► అలాగే వైయస్సార్ విలేజ్ క్లినిక్స్, అర్బన్ క్లినిక్స్ నిర్మాణ ప్రగతిని సమీక్షించిన సీఎం ►నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టంచేసిన సీఎం ►గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడంపై దృష్టి పెట్టి.. ఇప్పుడు ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీచేయాలని సీఎం ఆదేశం ►గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు అక్కడ ఉండి సేవలను అందించడానికి ఎలాంటి ప్రతిపాదన చేసినా గ్రీన్ సిగ్నల్ ఇస్తానని వెల్లడించిన సీఎం ►గిరిజన ప్రాంతాల్లో సేవలందించే డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఎంత ఇవ్వాలన్నదానిపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకుంటే.. దాన్ని తప్పనిసరిగా ఆమోదిస్తానన్న సీఎం. ► గిరిజన ప్రాంతాల్లోనే కాదు.. ఫిబ్రవరి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో పూర్తిగా ఖాళీలను భర్తీచేయాలన్న సీఎం ►ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలన్న సీఎం ►డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాట వినిపించకూడదని స్పష్టంచేసిన సీఎం ►ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పష్టంగా మార్పులు కనిపించాలన్న సీఎం -
టీనేజర్ల వ్యాక్సిన్లో హన్మకొండ టాప్
సాక్షి, హైదరాబాద్: టీనేజర్లకు వ్యాక్సినేషన్లో హన్మకొండ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో 15–17 ఏళ్లవారికి వ్యాక్సిన్ల పంపిణీ 100 శాతం పూర్తయింది. రాష్ట్రంలో ఈ కేటగిరీలో 100 శాతం పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా నిలిచింది. జిల్లాలో 55,694 మంది టీనేజర్లకు టీకాలు అవసరమని లక్ష్యంగా నిర్ధారించగా... అంతకుమించి 101 శాతం మందికి వేశారు. ఇప్పటివరకు 56,299 డోసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. -
Djokovic: వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఫ్రెంచ్ ఓపెన్ బరిలో..!
Djokovic Might Play French Open 2022 : వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయిన ప్రపంచ నంబర్ 1 ఆటగాడు నొవాక్ జకోవిచ్.. త్వరలో ప్రారంభంకానున్న ఫ్రెంచ్ ఓపెన్లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ నిబంధనలను సడలించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫ్రాన్స్లో మహమ్మారి వైరస్ అదుపులోకి వస్తున్న నేపథ్యంలో నిబంధనలను సడలించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల క్రితం పాజిటివ్ వచ్చిన వారు ఫ్రాన్స్లో ఎంట్రీకి తప్పనిసరి వ్యాక్సిన్ పాస్ చూపాల్సిన అవసరం లేదని ఫ్రాన్స్ అధికారులు ప్రకటించారు. దీంతో జకో ఫ్రెంచ్ ఓపెన్ ఎంట్రీకి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. కాగా, జకో గతేడాది డిసెంబర్లో కరోనా బారినపడినట్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా వెల్లడించిన విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా క్రికెటర్పై చేయి చేసుకున్న పెద్దాయన.. -
గుడ్న్యూస్: భారీగా తగ్గనున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు!
కొవిడ్ వ్యాక్సిన్లు త్వరలో రెగ్యులర్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయన్న విషయం తెలిసిందే. డ్రగ్ నియంత్రణ విభాగం నుంచి అప్రూవల్ దక్కిన వెంటనే టీకాలు మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నాయి ఆయా కంపెనీలు. ఈ క్రమంలో ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఈ రెండు కొవిడ్ వ్యాక్సిన్ల ధరలు భారీగా తగ్గనున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ల ధరలు ఒక్కో డోసు రూ. 275గా నిర్ధారణ కానున్నాయని, అదనంగా సర్వీస్ ఛార్జీ మరో 150 రూపాయలతో మొత్తం.. రూ. 425గా ఉండొచ్చని ఆ కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు నేషనల్ ఫార్మాసుటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ధరల నియంత్రణ.. తగ్గింపు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 19న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ‘కోవిడ్-19పై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ’ కొన్ని షరతులకు లోబడి వయోజన జనాభాలో ఉపయోగించడానికి కోవిషీల్డ్ మరియు కోవాగ్జిన్లకు సాధారణ మార్కెట్ ఆమోదం ఇవ్వాలని సిఫార్సు చేసింది. అలాగే పనిలో పనిగా ధరల నిర్ధారణపై కూడా ఎన్పీపీఏను కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్కు 1,200రూపాయలుగా ఉండగా.. కోవిషీల్డ్ ధర రూ. 780గా ఉంది. వీటికి అదనంగా రూ. 150 సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ రెండూ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతులు ఉన్న వ్యాక్సిన్లు. ఒకవేళ వ్యాక్సిన్ కు మార్కెట్ ఆథరైజేషన్ లేబుల్ దక్కితే కేవలం అత్యవసర పరిస్థితులు, రిజర్వ్ డ్ కండిషన్స్ లో మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండదు. భారత్లో వ్యాక్సినేషన్ ఉధృతిగా సాగుతున్న టైంలోనే కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ కంపెనీలు రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. -
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలకు..
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ మరోసారి భక్తులకు తెలిపింది. పలువురు భక్తులు నెగిటివ్ సర్టిఫికెట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు. దీనివల్ల అనేక మంది భక్తులు ఇబ్బందికి గురవుతున్నారు. ఇటీవల కోవిడ్ మూడో వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. కచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద చూపించిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. భక్తులు తమ ఆరోగ్యం, టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని టీటీడీ కోరింది. -
గరిష్టానికి ఒమిక్రాన్ కేసులు.. అక్కడ ఇక మాస్కు తప్పనిసరి కాదు!
లండన్: దేశంలో కరోనా కట్టడికి అమలు చేస్తున్న నిబంధనల్లో చాలావాటిని బ్రిటీష్ ప్రభుత్వం తొలగించింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు గరిష్టానికి చేరినందున (అంటే అంతకుమించి ఇక పెరగవని అర్థం) ఈ నిబంధనలు తొలగిస్తున్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఇకపై ఎక్కడైన తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన వచ్చే గురువారం నుంచి రద్దు కానుంది. అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాలకు హాజరయ్యేవారు టీకా సర్టిఫికెట్ తప్పక తీసుకరావాలన్న నిబంధన కూడా కనుమరుగుకానుంది. గురువారం నుంచి పాఠశాల గదుల్లో మాస్కులు తప్పనిసరి నిబంధన కూడా తొలగించనున్నట్లు ప్రధాని చెప్పా రు. ప్రజలు వర్క్ ఫ్రం హోం చేయాల్సిన అవసరం లేదని, ఉద్యోగులు భౌతిక హాజరుపై తమ సంస్థలతో చర్చించాలని సూచించారు. అయితే కరోనా వ్యాప్తి నివారణకు తప్పనిసరి మాస్కుధారణ నిబం ధన కొనసాగిస్తామని స్కాట్లాండ్ డిప్యూటీ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ చెప్పారు. బ్రిటన్లో లాగా తాము నిబంధనలు ఎత్తివేయడం లేదన్నారు. పార్లమెంట్ సూచన మేరకు నిబంధనలు కొనసాగిస్తామని, పార్లమెంట్ సూచిస్తే నిబంధనలు మారుస్తామని చెప్పా రు. పబ్లిక్ స్థలాల్లో మాస్కు ధారణ తప్పదన్నారు. ప్లాన్ బీ టు ఏ ఓఎన్ఎస్ (ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్) అంచనా ప్రకారం దేశమంతా ఒమిక్రాన్ గరిష్టానికి చేరిందని హౌస్ ఆఫ్ కామన్స్కు ప్రధాని తెలిపారు. ఓఎన్ఎస్ డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలు మినహా ఇంగ్లండ్లో ఇన్ఫెక్షన్ స్థాయిలు పడిపోతున్నాయని వెల్లడించారు. ప్లాన్ బీ (తీవ్ర నిబంధనలు) నుంచి ప్లాన్ ఏ (స్వల్ప నిబంధనలు)కు మరలేందుకు కేబినెట్ అంగీకరించిందని చెప్పారు.దేశంలో ఆస్పత్రిలో చేరికలు క్రమంగా తగ్గిపోతున్నాయని, ఐసీయూ అడ్మిషన్లు కూడా పడిపోయాయని వివరించారు. సెల్ఫ్ ఐసోలేషన్ లాంటి కొన్ని నిబంధనలు మాత్రం కొనసాగుతాయన్నారు. బ్రిటన్లో ఈ సెల్ఫ్ ఐసోలేషన్ సమయాన్ని 7 నుంచి 5 రోజులకు గత సోమవారం నుంచి తగ్గించారు. మార్చి నాటికి సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధన కూడా ఎత్తివేస్తామని బోరిస్ అంచనా వేశారు. కోవిడ్ దాదాపు ఎండమిక్ దశకు చేరుతోందని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచించారు. -
కరోనాతో గాయని మృతి! అలాంటి ఛాలెంజ్లు వద్దన్న ఆనంద్ మహీంద్రా
CoronaVirus: ఓమిక్రాన్ కేసులు దేశాన్ని చుట్టుముడుతున్నాయి. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. క్రమంగా దేశం కఠిన ఆంక్షల వైపుకు వెళ్తోంది. ఈ తరుణంలో దేశ ప్రజలకు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సలహా ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. ఇటీవల జరిగిన ఓ దుర్ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన ట్వీట్ చేస్తూ ఈ సలహా ఇచ్చారు. టీకా వద్దు చెక్ దేశానికి చెందిన ప్రముఖ జానపద గాయని హనా హోర్కా ఇటీవల మరణించారు. ఆమెకు భర్త ఒక కొడుకు ఉన్నారు. మరణించే వరకు ఆమె వ్యాక్సినేషన్ వద్దు అనే ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. కరోనాకు విరుడుగా వ్యాక్సినేషన్ వద్దని శరీరంలో సహాజ సిద్ధంగా వృద్ధి చెందే రోగ నిరోధకత శక్తియే మేలు అంటూ తరచుగా చెప్పేవారు. ఆమె భర్త, కొడుకు వ్యాక్సిన్ తీసుకున్నా హనా హోర్కా మాత్రం టీకాకు దూరంగా ఉన్నారు. కరోనా రావాలంటూ.. శరీరంలో ఉండే సహాజ రోగ నిరోధక శక్తి ప్రభావం అందరికీ తెలియజేయాలనే లక్ష్యంతో హనా హోర్కా ఏరికోరి కరోనా తెచ్చుకున్నారు. చనిపోవడానికి రెండు రోజుల ముందు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్తో మాట్లాడుతూ.. తనకు కరోనా వచ్చిందని, టీకా తీసుకోకపోయినా తాను దాన్ని జయించబోతున్నట్టుగా మాట్లాడారు. కానీ ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మరణించారు. బయటి వ్యక్తుల ప్రభావానికి లోనవడం వల్లే తన తల్లి టీకా తీసుకోకుండా ప్రాణాలు కోల్పోయిందటూ ఆమె కొడుకు రెక్ తెలిపాడు. ఇలాంటివి వద్దు హనాహోర్కా ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ప్రమాదకర ఛాలెంజ్ల జోలికి వెళ్లొద్దంటూ సూచించారు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు వస్తున్నా.. ఆస్పత్రి పాలు అవుతున్నవారు, చనిపోతున్న వారు మన దగ్గర తక్కువగా ఉన్నారు. టీకా కార్యక్రమం ముమ్మరంగా చేపట్టడం ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకోవడమే ఇందుకు కారణమని వైద్య వర్గాలు అంటున్నాయి. A chilling, cautionary tale. I was getting confused with all the recent messaging about natural immunity being the superior option but this is like a bucket of cold water. Death isn’t a risk worth challenging vaccinations for.. https://t.co/RsaClxxmrS — anand mahindra (@anandmahindra) January 21, 2022 -
పాజిటివ్ వచ్చినా తల్లి పాలివ్వొచ్చా? డాక్టర్లు చెప్తున్నదేంటి..
వరంగల్ ఎంజీఎం: ‘కరోనా వైరస్ కొద్ది రోజులుగా విస్తరిస్తోంది. కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పాజిటివ్ నిర్ధారణ అయిన కుటుంబంలో చిన్న పిల్లలు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతానికి చిన్నారులెవరూ కరోనాతో అస్వస్థతకు గురికాకపోవడం మంచి పరిణామమే’ అని ఎంజీఎం పిడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.సుధాకర్ శుక్రవారం ‘సాక్షి ఫోన్ ఇన్’లో పేర్కొన్నారు. పలువురు చిన్న పిల్లల తల్లులు తమకు పాజిటివ్ వస్తే.. పిల్లలకు పాలు పట్టించొచ్చా అని డాక్టర్ను ప్రశ్నించగా.. పిల్లలకు పాలు ఇవ్వొచ్చని, పాల ద్వారా కరోనా వ్యాప్తి జరగదని స్పష్టం చేశారు. గర్భిణులు 12 వారాల తర్వాత కచ్చితంగా వ్యాక్సినేషన్ చేసుకోవాలని సూచించారు. లేదంటే పుట్టిన పిల్లలకు కరోనా సోకే అవకాశం ఉందన్నారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్ సుధాకర్ నాకు రెండేళ్ల చిన్నారి ఉంది. కరోనా లక్షణాలుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ప్రియ, హన్మకొండ డాక్టర్ : ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ వచ్చినప్పుడు చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్లో జలుబు, జ్వరం, దగ్గును కరోనా లక్షణాలుగా పరిగణిస్తాం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించాలి. నిర్ధారణ అయితే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. సాధారణ జ్వరం వస్తే పారాసిటమాల్ సిరఫ్ వాడుకోవచ్చు. (చదవండి: కరోనా పాజిటివ్ ఉన్నా.. లేనట్లుగా..) నాకు ఈనెల 13న పాజిటివ్ వచ్చింది. ఐదు రోజుల తర్వాత జ్వరం తగ్గింది. మళ్లీ టెస్టు చేయించుకోమంటారా? – నసీరొద్దీన్, హన్మకొండ డాక్టర్ ::ప్రస్తుతానికి మీకు కరోనా లక్షణాలేమీ లేకపోతే పది రోజుల తర్వాత హోం ఐసోలేషన్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లొచ్చు. 14 రోజుల వరకు మాస్క్ తప్పనిసరిగా ధరించి మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెగెటివ్ కోసం మళ్లీ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్ నిర్ధారణ అయి ఆరు రోజులైంది. ప్రస్తుతానికి నీరసంగా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? – ఈశ్వర్, భీమారం డాక్టర్ : కరోనా తగ్గిన తర్వాత కొద్దిగా నీరసంగా ఉన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నడుస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉన్నా.. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నా వైద్యుడిని సంప్రదించి ఆ మేరకు చికిత్స పొందాలి. కరోనా తగ్గిన తర్వాత కూడా మల్టీ మిటమిన్ మాత్రలు వేసుకోవడం మంచిది. ఒకే గదిలో ఇద్దరు మిత్రులం ఉంటాం. నా మిత్రుడికి పాజిటివ్ వచ్చింది? నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది. పరీక్ష చేసుకోవడం తప్పనిసరా? – లక్ష్మణ్, రాయపర్తి డాక్టర్ : కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగిన వ్యక్తికి అతి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్ష చేసుకోవాల్సిందే. తలనొప్పి.. కొద్ది నీరసంగా ఉందని చెబుతున్నారు కదా.. కరోనా పరీక్ష చేసుకున్న తర్వాత చికిత్స పొందాలి. కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ జరిగిన తర్వాత వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోమంటారు? – భూక్య రామ్, వరంగల్ డాక్టర్ : కరోనా వ్యాధికి గురైన సమయంలో మన శరీరంలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. అందుకే మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. మా ఇంట్లో నా భర్తకు పాజిటివ్ వచ్చింది. నాకు ఏడాది పాప ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? – భీమారం, అనూష డాక్టర్ : ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ జరిగినప్పుడు వారికి దూరంగా పిల్లలను ఉంచాలి. వారికి ఎలాంటి లక్షణాలు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. పాజిటివ్గా నిర్ధారణ జరిగిన తర్వాత చిన్నారులకు పాలు ఇవ్వొచ్చా? – భానుప్రియ, పోచమ్మమైదాన్ డాక్టర్ : కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగిన తర్వాత కూడా మాస్క్, చేతులకు గ్లౌజ్లు ధరించి జాగ్రత్తలు పాటిస్తూ చిన్నారులకు పాలు ఇవ్వొచ్చు. తల్లిపాల ద్వారా చిన్నారులకు కరోనా వ్యాప్తి జరగదు. మా ఇంట్లో అందరికి పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న కిట్టు మందులు వాడితే సరిపోతుందా? – సిద్ధార్థ, పలివేల్పుల డాక్టర్ : ప్రభుత్వం అందిస్తున్న కిట్టు మందులు వాడుతున్న సందర్భంలో శ్వాసకోశ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆక్సిజన్ లెవల్స్ను ఎప్పటికప్పుడు చేక్ చేసుకోవాలి. శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి ఆస్పత్రిలో చేరాలి. (చదవండి: కరోనా ఎఫెక్ట్.. 55 రైళ్లు రద్దు..) -
భారత్లో థర్డ్ వేవ్ ప్రభావం తక్కువే.. కారణమిదే!
న్యూఢిల్లీ: గతేడాది దేశాన్ని కుదిపేసిన కరోనా సెకండ్వేవ్తో పోలిస్తే ప్రస్తుత థర్డ్ వేవ్ వల్ల మరణాలు, ఆస్పత్రిపాలవడం తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. ప్రస్తుత వేవ్లో కేసులు పెరుగుతున్నా, వ్యాక్సినేషన్ కార్యక్రమం స్పీడందుకోవడంతో భారీగా అనారోగ్యాలపాలవడం, చావులు పెరగడం కనిపించడంలేదని తెలిపింది. ఈ మేరకు రెండు, మూడు వేవ్స్ను పోల్చిచెప్పే కీలక సూచీలను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మీడియా సమావేశంలో గురువారం ప్రదర్శించారు. దేశంలో 2021 ఏప్రిల్ చివరకు 3.86 లక్షల కొత్త కేసులు, 3,059 మరణాలు, 31.70 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, ఆ సమయంలో దేశంలో రెండు డోసుల టీకా తీసుకున్నవారి సంఖ్య మొత్తం జనాభాలో 2 శాతమని చెప్పారు. 2022 జనవరి 20న దేశంలో 3.17 లక్షల కొత్త కేసులు, 380 మరణాలు, 19.24 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, ఈ సమయానికి పూర్తిడోసులందుకున్న వారి సంఖ్య 72 శాతానికి చేరిందని వివరించారు. టీకా కార్యక్రమం వల్ల థర్డ్ వేవ్లో మరణాలు తగ్గాయన్నారు. 18ఏళ్లకు పైబడినవారిలో 72 శాతం మంది రెండు డోసులు, 94 శాతం మంది తొలిడోసు అందుకున్నారని చెప్పారు. 15– 18 ఏళ్ల కేటగిరీ ప్రజల్లో 52 శాతం మంది తొలిడోసు టీకా తీసుకున్నారన్నారు. ఈ కేటగిరీలో టీకాలందుకున్నవారిలో ఏపీ టాప్లో ఉందని చెప్పారు. -
Novak Djokovic: ఆస్ట్రేలియా ప్రభుత్వంపై పరువునష్టం దావా.. ఏకంగా 32 కోట్లకు..!
Djokovic To Sue Australian Govt: వ్యాక్సిన్ తీసుకోలేదన్న కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో తనను ఆడనీయకుండా అడ్డుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. స్కాట్ మోరిసన్ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నాడు. తన 21వ గ్రాండ్స్లామ్ కలకు అడ్డుకట్ట వేయడంతో పాటు బలవంతంగా క్వారంటైన్కు తరలించడాన్ని కారణాలుగా చూపుతూ 32 కోట్ల రూపాయలకు దావా వేయాలని డిసైడయ్యాడు. దీనిపై ప్రస్తుతం లాయర్లతో చర్చిస్తున్నాడు. కాగా, ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ ఆడేందుకు మెల్ బోర్న్ వెళ్ళిన జకోవిచ్ను కరోనా వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్న సంగతి తెలిసిందే. జకో.. టోర్నీలో పాల్గొనేందుకు నిర్వహకులు అనుమతించినప్పటికీ, ఆ దేశ ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అతన్ని బలవంతంగా క్వారంటైన్కు తరలించింది. వ్యాక్సిన్ తీసుకోని కారణంగా అతన్ని దేశంలోకి అనుమతించలేమని, అలాగే అతని వీసాను కూడా రద్దు చేస్తున్నామని స్పష్టం చేసింది. దీనిపై కోర్టును ఆశ్రయించిన జకోకు మొదట్లో ఉపశమనం లభించినా.. ఆతర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వాన్నే విజయం వరించింది. ఈ విషయాన్ని చాలా సీరియన్గా తీసుకున్న జకో.. స్వదేశానికి వెళ్లగానే ఆస్ట్రేలియా ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్మనీతో పోలిస్తే అతను దావా వేయాలనుకున్న మొత్తం చాలా ఎక్కువ. ఇదిలా ఉంటే, ఈ సెర్బియన్ యోధుడు ఇటీవలే ఔషధ తయారీ రంగంలోకి కూడా అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. అతనికి కోవిడ్ విరుగుడు మందు తయారు చేసే క్వాంట్ బయోరెస్ అనే ఔషధ తయారీ సంస్థలో 80 శాతం వాటా ఉన్నట్లు సదరు కంపెనీ సీఈఓ స్వయంగా వెల్లడించాడు. చదవండి: కోవిడ్కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్..! -
కోవిడ్కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్..!
Djokovic Holds Major Stake In Firm Developing Covid Drug: వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొనకుండా గెంటి వేయబడ్డ ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. ఔషధ తయారీ రంగంలోకి అడుగుపెట్టాడని తెలుస్తోంది. అతడికి కోవిడ్ విరుగుడు మందు తయారు చేసే సంస్థలో భారీ వాటా ఉన్నట్లు.. సదరు కంపెనీ సీఈఓనే స్వయంగా వెల్లడించాడు. డానిష్కు చెందిన క్వాంట్ బయోరెస్ అనే కోవిడ్ ఔషధ తయారీ సంస్థలో జకో, అతని భార్యకు 80 శాతం వాటా ఉన్నట్లు సంస్థ సీఈఓ ఇవాన్ తెలిపాడు. త్వరలో తమ ఔషధంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నాడు. అయితే, ఈ వార్తలపై జకోవిచ్ స్పందించాల్సి ఉంది. కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడేందకు అనుమతి లభించక పోవడంతో.. 21వ గ్రాండ్స్లామ్ గెలిచే అవకాశాన్ని జకోవిచ్ చేజార్చుకున్నాడు. మరోవైపు అతను వ్యాక్సిన్ వేసుకోకపోతే ఫ్రెంచ్ ఓపెన్లో కూడా అడనిచ్చేది లేదని ఫ్రెంచ్ అధికారులు సైతం స్పష్టం చేశారు. దీంతో జకో వ్యాక్సిన్ వేసుకుంటాడా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకింది. చదవండి: ప్రిక్వార్టర్స్లో సింధు -
ఫాస్ట్గా ‘బూస్టర్’
సాక్షి, అమరావతి: వరుసగా వస్తున్న వేవ్లు.. పెరుగుతున్న కోవిడ్ కేసులు.. విస్తరిస్తున్న కొత్త వేరియంట్లను దృష్టిలో ఉంచుకుని బూస్టర్ డోసు తీసుకునే వ్యవధి తగ్గించటాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరనున్నారు. ఈమేరకు త్వరలో కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ ముగిసిపోయిన తరువాత టీకాలు ఇవ్వడం కంటే వెంటనే ప్రికాషన్ డోసులు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుందని సమావేశంలో సీఎం పేర్కొన్నారు. ప్రికాషన్ డోసు తీసుకునేందుకు ప్రస్తుతం 9 నెలలు ఆగాల్సి వస్తోందని, అన్ని రోజులు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా మూడు లేదా నాలుగు నెలలకే ఇవ్వడం ద్వారా ఆస్పత్రుల పాలు కాకుండా రక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు. హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లు లాంటి అత్యవసర సేవలందిస్తున్న వారితోపాటు సమస్యలతో బాధపడే పెద్ద వయసు వారికి కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అమెరికాలో సైతం మోడర్నా, ఫైజర్ టీకాలను బూస్టర్ డోసుల కింద మూడు లేదా నాలుగు నెలలకే ఇస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. రాష్ట్రంలో 15 లక్షల మంది ఫ్రంట్లైన్ వర్కర్లు, ఐదు లక్షల మంది హెల్త్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారు 58 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా. వెంటనే బూస్టర్ డోసులు ఇవ్వడం ద్వారా మొత్తం 78 లక్షల మందికి టీకాలతో రక్షణ లభిస్తుంది. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరాన్ని నివారించవచ్చు. వ్యాక్సిన్ల వ్యయంతో పోలిస్తే అది చాలా ఎక్కువ. మిగతా జిల్లాల్లోనూ వేగం పెరగాలి పెరుగుతున్న కోవిడ్ కేసులకు అనుగుణంగా వైద్య అవసరాలను గుర్తించి ఆక్సిజన్, ఔషధాలు తదితరాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వ్యాక్సినేషన్లో వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆస్పత్రుల్లో 1,100 మంది మాత్రమే.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. రెండో వేవ్తో పోల్చితే ఆస్పత్రుల్లో కోవిడ్ పడకల సంఖ్యను కూడా పెంచామని, అన్ని జిల్లాల్లో కలిపి 53,184 బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దాదాపు 27 వేల యాక్టివ్ కేసుల్లో 1,100 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఇందులో ఆక్సిజన్ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మాత్రమేనని వివరించారు. కోవిడ్ బాధితులు గతంలో 14 రోజులకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతుండగా ఇప్పుడు వారం రోజులకే ఇంటికి వెళ్లిపోతున్నారని చెప్పారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోవిడ్ కేర్ సెంటర్లలో 28 వేల బెడ్లు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నియోజక వర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ను గుర్తించామని అధికారులు తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లలో సుమారు 28 వేల బెడ్లను సిద్ధం చేశామని వెల్లడించారు. పటిష్టంగా 104 కాల్సెంటర్ 104 కాల్సెంటర్ వ్యవస్థ పటిష్టంగా పని చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. కాల్ చేసిన వారికి టెలిమెడిసిన్ ద్వారా తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. రెండు జిల్లాల్లో వంద శాతం రెండో డోస్ వ్యాక్సినేషన్లో కొద్దిగా వెనుకబడ్డ ఐదు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 15 నుంచి 18 ఏళ్ల వారికి వంద శాతం వ్యాక్సినేషన్ను నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు సాధించగా మరో ఐదు జిల్లాల్లో 90 శాతానికిపైగా పూర్తైంది. ఈ వయసు వారికి నాలుగు జిల్లాల్లో 80 శాతానికిపైగా వ్యాక్సినేషన్ జరిగింది. మిగిలిన చోట్ల కూడా ఉద్ధృతంగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. కేంద్రం కొత్త మార్గదర్శకాలపై చర్చ కోవిడ్ పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలపై సమీక్షలో చర్చించారు. కరోనా లక్షణాలు లేనివారికి ఎలాంటి పరీక్షలు చేయవద్దని ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాల్లో పేర్కొందని అధికారులు తెలిపారు. పాజిటివ్గా తేలినవారి కాంటాక్టŠస్లో కేవలం హైరిస్క్ ఉన్నవారికే పరీక్షలు చేయాలని స్పష్టం చేసిందని చెప్పారు. ఆరోగ్యశ్రీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆరోగ్యశ్రీ రిఫరల్ వ్యవస్థలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పేషెంట్ రిఫరల్ వ్యవస్థపై రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ను ముఖ్యమంత్రి సమీక్షించారు. నెట్వర్క్ ఆస్పత్రులు, సచివాలయాలు, పీహెచ్సీల్లో ఆరోగ్య మిత్రలతోపాటు 104, 108 వైద్యాధికారులకు రూపొందించిన ఎస్ఓపీలను ముఖ్యమంత్రి పరిశీలించారు. 104, 108, పీహెచ్సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో ఉండే డాక్టర్లు కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకుని మంచి సేవలు అందించేలా రిఫరల్ విధానం ఉండాలని, ఆరోగ్య మిత్రలు కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సమన్వయంతో యాప్ ద్వారా సేవలు అందించాలన్నారు. 108కి కాల్ చేసినా, ఆరోగ్య మిత్ర రిఫర్ చేసినా ఈ యాప్ దగ్గరలో ఉన్న నెట్వర్క్ ఆస్పత్రికి రిఫర్ చేస్తుందని అధికారులు వివరించారు. పేషెంట్ వివరాలతో పాటు ఫోటో కూడా డౌన్లోడ్ చేయడం వల్ల బాధితుల పరిస్థితి తెలుస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యశ్రీ రిఫరల్ వ్యవస్థలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంతో మరింత పారదర్శకంగా మెరుగైన సేవలు అందుతాయన్నారు. ఇంటికెళ్లిన పేషెంట్ను పరామర్శించాలి నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్సతో పాటు ఆరోగ్య ఆసరా అందించిన అనంతరం ఇంటికి వెళ్లిన పేషెంట్ ఆరోగ్య పరిస్థితిపై ఏఎన్ఎం వాకబు చేయాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటామనే విషయాన్ని తెలియ చేయాలన్నారు. ఇది పేషెంట్కు గొప్ప ధైర్యాన్నిస్తుందన్నారు. శాశ్వతంగా హోర్డింగ్స్ ఆరోగ్యశ్రీపై పూర్తి వివరాలు తెలియచేసేలా విలేజ్, వార్డ్ క్లినిక్స్లో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద హోర్డింగ్స్ శాశ్వతంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ రిఫరల్ పాయింట్గా వ్యవహరిస్తూ వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలో, ఎవరిని సంప్రదించాలో క్లినిక్స్లో పూర్తి సమాచారం ఉండాలని స్పష్టం చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలలో కూడా హోర్డింగ్స్ అమర్చాలని సూచించారు. ఆరోగ్యశ్రీ చికిత్స కోసం రోగులు వస్తే ఆరోగ్య వివరాలను వెంటనే తెలుసుకుని ఎక్కడకు పంపాలనే విధానం చాలా పటిష్టంగా ఉండాలని సీఎం జగన్ నిర్దేశించారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రగతిపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, సీఎస్ సమీర్శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇన్చార్జ్ ఏ.బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
టీకా...చదువుకు రక్షణ
తొలి,మలి దశ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాల అభివృద్ధికి అంతరాయం కలిగించింది మరీ ముఖ్యంగా చదువులను దాదాపుగా అటకెక్కించింది, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యార్థులు వ్యక్తిగతంగా తరగతులకు హాజరుకాలేదు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో డ్రాపౌట్ల పెరుగుదల నమోదైంది. ఈ నేపధ్యంలో విద్యా సంస్థలు పునఃప్రారంభమై చదువులు గాడిన పడుతున్నాయనుకుంటున్న దశలో...మరోసారి కరోనా పంజా విసిరింది. విద్యా ప్రగతి పట్టాలు తప్పింది. మళ్లీ ఆన్లైన్ తరగతుల ప్రస్తావ తెచ్చింది. ఇది విద్యారంగానికి మేలు చేసేదేనా? మరిప్పుడు ఏం చేయాలి?దీనిపై విద్యావేత్త ఎక్స్లెన్షియా ఇన్స్టిట్యూషన్స్కు చెందిన వెంకట్ మురికి, అపోలో క్రెడిల్ ఆసుపత్రి వైద్యులు డా.బి.వి.ఎల్ నర్సింహారావులు ఏమంటున్నారంటే... ఆన్లైన్ చదువు...ఓ తాజా చేదు జ్ఞాపకం.. గతంలో లాక్డౌన్ల కారణంగా అకస్మాత్తుగా పాఠశాలలు మూసివేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల పిల్లలు బాగా నష్టపోయారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఆన్లైన్ విద్యాభ్యాసం ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులకు సవాలుగా మారడం దీనికో కారణం. ఉపాధ్యాయులు ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా పూర్తిగా భిన్నమైన బోధనా శైలికి సరిపోయేలా వారి పాఠ్య ప్రణాళికలను పునర్నిర్మించుకోవాల్సి వచ్చింది. వర్చువల్ లెర్నింగ్ కారణంగా విద్యార్థులు నేర్చుకునే క్రమంలో ఆన్లైన్లో తరగతులకు శ్రద్ధ చూపడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇంటర్నెట్ కనెక్షన్లను సెటప్ చేయడం, పిల్లలు శ్రద్ధ మళ్లించకుండా తరగతులకు హాజరయ్యేలా చూసుకోవడం ఇలా ఓ వైపు పిల్లల చదువుకు బాధ్యత వహిస్తూ తమ స్వంత పనులపై దృష్టి పెట్టడం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. విద్యకు వ్యాక్సిన్... ఈ పరిస్థితుల్లో తాజాగా 15–18 సంవత్సరాల వయసులోని టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రకటన దేశవ్యాప్తంగా చదువుల పునరుజ్జీవనానికి ఊపిరిలూదింది. .కోవిన్ పోర్టల్ చెబుతున్న డేటా ప్రకారం, 15–18 ఏళ్ల మధ్య వయస్కుల టీకా డ్రైవ్లో మొదటి రోజు 40 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. అంతేకాకుండా పాఠశాలల ప్రాంగణంలోనే విద్యార్థులకు టీకాలు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల చాలా మంది విద్యార్థులు కోవిడ్–19 బారిన పడటం గురించి ఆందోళన లేకుండా పాఠశాలకు తిరిగి వెళ్లడం పట్ల తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు, టీకా డ్రైవ్తోనే సమస్యకి పరిష్కారం ఏ విధంగా చూసినా చదువులు పూర్తిగా గాడిన పడాలంటే... టీకా డ్రైవ్ ఊపందుకోవడం తప్పనిసరి. థర్డ్ వేవ్ ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొదటి డోస్తో టీకాలు వేసిన విద్యార్థులు రోగనిరోధక శక్తిని పొండం తరగతులను సురక్షితంగా ప్రారంభించడానికి బాటలు వేస్తుంది. విద్యార్ధుల మానసిక ఆరోగ్యాన్ని రిఫ్రెష్ చేస్తుంది. వ్యాక్సినేషన్ డ్రైవ్ హైబ్రిడ్ లెర్నింగ్ కోసం కొత్త మార్గాలను, ఇంటరాక్టివ్ లెర్నింగ్ కోసం వినూత్న పరిష్కారాలను మరింత తెరుస్తుంది. హైస్కూలర్లు ప్రీ–యూనివర్శిటీ కాలేజీకి వెళ్లేవారికి, విద్యాసంస్థలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా సాధారణ స్థితికి తిరిగి తీసుకురావడం అంటే అది ఆర్థిక పునరుద్ధరణ అని అర్థం. ల్యాబ్లలో సైన్స్ ప్రయోగాలు, సెమినార్లను ప్రదర్శించడం, క్రీడా కార్యకలాపాలలో భాగం కావడం, సంగీతం, నృత్యం, థియేటర్ తదితర విద్యా అనుబంధ కార్యకలాపాలు ఊపందుకుంటాయి. విద్యా రంగం కూడా కోర్సు మాడ్యూళ్లను పునరాలోచించవచ్చు, వాటిని మరింత సమకాలీన పంధాకు మార్చవచ్చు; మొత్తం మీద, టీకా డ్రైవ్ ఖచ్చితంగా పాఠశాలలు మరియు మొత్తం విద్యా రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది, భావి భారత దార్శనికులకు మంచి భవిష్యత్తును రూపొందిస్తుంది. –డాక్టర్ బి వి ఎల్ నరసింహారావు, పీడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్, అపోలో క్రెడిల్ – చిల్డ్రన్స్ హాస్పిటల్ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్, కొండాపూర్, హైదరాబాద్. –వెంకట్ మురికి, ఎక్సలెన్షియా ఇన్స్టిట్యూషన్స్ -
Vaccination: 12-14 ఏళ్ల వాళ్లకు కూడా వ్యాక్సిన్!
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఈ మధ్యే టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మార్చి నాటికి పూర్తికాగానే.. 12 నుంచి 14 ఏళ్ల వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్లు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) చీఫ్ ఎన్కే అరోరా తెలిపారు. జనాభాలో 15-18 ఏళ్ల వాళ్లు సుమారు 7.4 కోట్ల మంది ఉన్నారని వారిలో దాదాపు 3.45 కోట్ల మందికి పైగా కోవాక్సిన్ తొలి డోసును వేయించుకున్నారని తెలిపారు. కాగా తదుపరి డోసు 28 రోజుల్లో ఇస్తారని ఎన్టీఏజీఐ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం గతేడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకి తర్వాత ఫ్రంట్లైన్ కార్మికులకు వేయడం జరిగింది. అలాగే గతేడాది మార్చి 1 నుండి 60 ఏళ్లు పైబడిన వారికి, ఏప్రిల్ 1 నుండి 45 సంవత్సరాల వారికి, మే 1 నుండి 18 ఏళ్లు పైబడినవారికి.. ఇలా దశాల వారికి వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించింది. అంతేకాదు ప్రభుత్వం కరోన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది దగ్గర నుచి 60 ఏళ్లు పైబడిన వారందరి కోసం ముందుజాగ్రత్త చర్యగా ప్రికాషనరీ వ్యాక్సినేషన్ని ఈ నెల 10 నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. (చదవండి: రైలు రావడం చూసి మరీ ఆమెను పట్టాలపై తోసేశాడు.. ఆపై ఏం జరిగిందో చూడండి) -
హృదయవిదారకం: తండ్రిని భుజాల మీద మోశాడు, కానీ..
శ్రవణ కుమారుడు.. రామాయణంలో ఉదాత్తమైన పాత్ర. అంధ తల్లిదండ్రుల్ని కావడిలో మోస్తూ.. కంటికి రెప్పలా తన చివరిశ్వాసదాకా కాపాడుకున్న తనయుడు. పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ఎంత అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే ఒక మహోన్నత వ్యక్తిత్వం శ్రవణ కుమారుడిది. అలాంటి కొడుకులు ఈరోజుల్లో ఉంటారా? అంటే.. బ్రెజిల్లో ఓ యువకుడిని చూపిస్తున్నారు. బ్రెజిలియన్ అమెజాన్ అడవుల గుండా ఓ వృద్ధుడిని భుజాన మోసుకుంటూ వెళ్తున్న ఒక తెగ యువకుడి ఫొటో సోషల్ మీడియాను కదిలిస్తోంది. ఆ కొడుకు పేరు తైవీ(24). భుజాన ఉంది అతని తండ్రి వాహూ. దట్టమైన అడవి.. ఆరు గంటల కాలినడకన గుట్టలు, వాగులు దాటి ప్రయాణించాడు. వ్యాక్సినేషన్ సెంటర్కు చేరుకుని.. తిరిగి మళ్లీ ఆరు గంటల ప్రయాణంతో ఇంటికి చేరుకున్నాడు. వ్యాక్సినేషన్ కోసం అలా తండ్రిని మోసుకుంటూ వెళ్లాడు. తండ్రికి చూపు సరిగా లేదు. పైగా అనారోగ్యం ఉంది. అందుకే అలా. ‘ఈరోజుల్లో ఇలాంటి కొడుకు ఉంటాడా?’ అనే అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తం అవుతోంది. డాక్టర్ ఎరిక్ జెన్నింగ్స్ సిమోయిస్ ఆ దృశ్యాన్ని క్లిక్మనిపించాడు. సాయం చేసేందుకు తాము ముందుకు వెళ్లినా.. వద్దని సున్నితంగా తిరస్కరించాడట తైవీ. వాస్తవానికి ఈ ఫొటో కొత్తది కాదు. కిందటి ఏడాదిలో తీసింది. పైగా ఈ కథ విషాదాంతం కూడా అయ్యింది. ఈ తండ్రీకొడుకులు జోయ్ గిరిజన తెగకు చెందినవాళ్లు. తైవీ, అతని తండ్రి మొదటి డోస్వ్యాక్సినేషన్ కోసం వెళ్తుండగా తీసిన ఫొటో. కిందటి ఏడాది సెప్టెంబర్లో వాహూ చనిపోయాడు. ఆయన మరణానికి కారణాలు తెలియవు. తైవీ ఆ కుటుంబానికి పెద్దగా మారాడు. ఈ మధ్యే మూడో వ్యాక్సిన్ డోస్ తీసుకున్నాడు కూడా. బ్రెజిల్ పారా స్టేట్లో ఈ కమ్యూనిటీ పలు ప్రాంతాల్లో స్థిరపడింది. వాళ్లంతా ప్రపంచానికి దూరంగా నివసిస్తుండగా.. కరోనా మాత్రం వెంటాడుతోంది. అందుకే వ్యాక్సిన్ కోసం ఇలా సాహసోపేతంగా ప్రయాణిస్తున్నారు. బ్రెజిల్ వ్యాప్తంగా 853 మంది గిరిజనులు చనిపోయారు. కానీ, ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెగ పెద్దలు చెప్తున్నారు. విషాదం: పొగిడారు, ఫొటోలు తీశారే తప్ప.. -
Corona Update: కరోనా కల్లోలం.. కొత్తగా 2.71 లక్షల కేసులు
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. దేశంలో తాజాగా 2,71,202 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 314 మంది మృతి చెందారు. శనివారంతో(జనవరి 15) పోలిస్తే పెరిగిన కేసుల సంఖ్య 2,369గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,50,377గా ఉంది. మరోవైపు కేసుల పాజిటివ్ రేటు 16.28%గా ఉంది. ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 7,743గా నమోదు అయ్యింది. వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 156.76 కోట్లు పూర్తి చేసుకుంది. గత ఇరవై నాలుగు గంటల్లో 66 లక్షల డోసుల్ని అందించారు. ముంబై నగరంలో జనవరి 15న పది వేల కొత్త కేసులు, 11 మరణాలు సంభవించాయి. వ్యాక్సినేషన్కి ఏడాది పూర్తి #1YearOfVaccineDrive.. భారత్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్షుక్ మాండవియా ప్రకటించారు. आज विश्व के सबसे बड़े टीकाकरण अभियान को 1 वर्ष पूर्ण हो गया है। PM @NarendraModi जी के नेतृत्व में शुरू हुआ यह अभियान 'सबके प्रयास' के साथ आज दुनिया का सबसे सफल टीकाकरण अभियान है। मैं सभी स्वास्थ्य कर्मियों, वैज्ञानिकों व देशवासियों को बधाई देता हूँ। #1YearOfVaccineDrive pic.twitter.com/IvoX3Z9Nso — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 16, 2022 -
తొలిరోజు 1.24 లక్షల మందికి ప్రికాషన్ డోసు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ప్రికాషన్ డోసు పంపిణీకి శ్రీకారం చుట్టింది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1,24,609 మందికి వేశారు. వీరిలో 12,128 మంది వృద్ధులు, 36,037 మంది ఫ్రంట్లైన్ వర్కర్లు, 76,444 మంది హెల్త్కేర్ వర్కర్లు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రభుత్వాసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్లు వేశారు. రెండో డోసు వేసుకుని 9 నెలలు (39 వారాలు) పూర్తయిన వారికి వేశారు. ప్రికాషన్ డోస్ వేసుకున్న డిప్యూటీ సీఎం పుత్తూరు రూరల్: కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ వేసుకోవాలని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి కోరారు. ప్రభుత్వం సోమవారం నుంచి ప్రికాషన్ డోస్ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో తొలిరోజే డిప్యూటీ సీఎం ప్రికాషన్ డోస్ను తన ఇంటి వద్ద వేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకొని 90 రోజులు పూర్తయిన వారు, 60 ఏళ్లు నిండిన వారు, ఫ్రంట్లైన్ వారియర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
టీనేజర్లకి వ్యాక్సినేషన్ లో దేశంలోనే ఏపీ మొదటిస్థానం
-
కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై విచారణ కమిటీని కోరిన మంత్రి ఇక లేరు!
Side Effects of Covid- 19 vaccines ఫ్రాన్స్: కోవిడ్ వ్యాప్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన ఫ్రెంచ్ చట్ట సభ్యుడు జోస్ ఎవ్రార్డ్ (76) కరోనా సోకి మరణించినట్లు పార్లమెంట్ అధ్యక్షుడు శుక్రవారం ప్రకటించారు. కాగా ఎవ్రార్డ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోవడమేకాకుండా, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించే నిరసనకారులకు సోషల్ మీడియాలో మద్ధతు తెలిపాడు. అతని భార్య, పిల్లలు, బంధువులు, అలాగే సహోద్యోగులు, సహచరులతో వాస్తవాలను పంచుకుంటానని నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడైన రిచర్డ్ ఫెర్రాండ్ ట్విటర్లో ఈ సందర్భంగా తెలిపారు. ఉత్తర ఫ్రాన్స్లోని పాస్ డి కలైస్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు చట్టసభ్యుల్లో ఎవ్రార్డ్ ఒకరు. నికోలస్ డుపాంట్ ఐగ్నాన్ వ్యాక్సిన్ వ్యతిరేక కార్యకర్తలకు వ్యవస్థాపకుడు. వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటరీ తీర్మానంపై అక్టోబర్లో ఎవ్రార్డ్ సంతకం చేశాడు కూడా. చదవండి: Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు పిల్లలు! 30 కోట్లు దాటిన కేసులు! -
వ్యాక్సిన్ మస్ట్.. లేదంటే జాబ్కే ఎసరు?
ఓవైపు కరోనా ఉధృతి కొనసాగుతుండడంతో గరిష్ట సంఖ్యలో ఉద్యోగులను ఇంకొంతకాలం వర్క్ఫ్రమ్ హోంకే పరిమితం చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఆఫీసులకు వచ్చినా.. హైబ్రిడ్ వర్క్లో కొనసాగినా.. వర్క్ఫ్రమ్ హోంలో ఉన్నా సరే వ్యాక్సిన్ వేయించుకుని తీరాలని కండిషన్లు పెడుతున్నాయి కంపెనీలు. లేకుంటే ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నాయి. ఈ మధ్యే గూగుల్, ఇంటెల్ కంపెనీలు ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు పంపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మరో దిగ్గజం చేరింది. అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్ ఇన్కార్పొరేటెడ్, ఎంప్లాయిస్కు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులంతా వ్యాక్సిన్ సర్టిఫికెట్ను కంపెనీ ఎంప్లాయిస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని జనవరి 14వ తేదీన డెడ్లైన్ విధించింది. ఒకవేళ అప్లోడ్ చేయని పక్షంలో అన్పెయిడ్ లీవ్ కింద వాళ్లను పరిగణించి.. ఈ నెలాఖరులోపు వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ముందస్తు సంతకాలు ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణతో వర్క్ఫ్రమ్ హోం కొనసాగింపు డిమాండ్కు తలొగ్గుతున్న టెక్ దిగ్గజాలు.. ఉద్యోగుల వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు!. ఉద్యోగ నియామకాల టైంలోనూ, ఉద్యోగులకు బోనస్లు చెల్లించే ఒప్పందాల సమయంలోనూ వ్యాక్సినేషన్ పాలసీని ముందుపెడుతూ తప్పనిసరిగా సంతకాలు చేయించుకుంటున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్లకు ఎవరైతే దూరంగా ఉంటారో.. వాళ్లను అన్పెయిడ్ సెలవులపై పంపించడం, జీతాల కోతల, అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సైతం వెనకాడట్లేదు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతతో పాటు ప్రభుత్వాలు తీసుకొస్తున్న వ్యాక్సినేషన్ మస్ట్ పాలసీలకు తలొగ్గుతున్న దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా ఈ నిర్ణయాన్ని ఫాలో అవుతున్నాయి. అయితే మెడికల్, మతపరమైన కారణాలను మాత్రమే మినహాయింపులుగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. మన దేశంలోనూ.. వ్యాక్సినేషన్కి దూరంగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని దేశంలోని కంపెనీలు సైతం నిర్ణయించాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు, చిన్నాచితకా కంపెనీలు సైతం ఉద్యోగుల్ని వ్యాక్సినేషన్ రిపోర్టులు సమర్పించాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో మినహాయింపులు సైతం ఇవ్వట్లేదు. కొన్ని కంపెనీలైతే వ్యాక్సినేషన్కు దూరంగా ఉంటున్న ఎంప్లాయిస్కు ‘హై రిస్క్’ ట్యాగ్ను తగిలిస్తుండడంతో.. సదరు ఉద్యోగులు అవమానభారంగా భావించి వ్యాక్సిన్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. చదవండి: ఉద్యోగులకు గుడ్న్యూస్! డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది -
Harish Rao: ప్రైవేటు ఎందుకు.. సర్కారే బెస్ట్
సాక్షి, హైదరాబాద్: కరోనా మూడోవేవ్ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. కరోనా టీకా రెండో డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయడంతోపాటు, 15–18 ఏళ్ల వారి వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలని చెప్పారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఇళ్లకు వస్తారని, వారికి అవగాహన కల్పించి టీకాలు ఇవ్వాలన్నారు. ఈనెల 10 నుంచి 60 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చే కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇచ్చి, రెండు డోసులు పూర్తి చేసి, బూస్టర్ డోస్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కాకుండా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావుతో కలిసి అన్ని జిల్లాల వైద్యాధికారులు, పీవోలు, ఆశా కార్యకర్తలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో హరీశ్రావు మాట్లాడారు. సబ్ సెంటర్, పీహెచ్సీ స్థాయిలోనే చికిత్స ‘కోటి హోం ఐసోలేషన్ కిట్లు, రెండు కోట్ల కరోనా నిర్ధారణ కిట్లు సమకూర్చుకున్నాం. వీటిని అన్ని జిల్లాల పీహెచ్సీ, సబ్సెంటర్ స్థాయికి సరఫరా చేశాం. ఎవరికి లక్షణాలు కనిపించినా ఎక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి, సాధారణ లక్షణాలుంటే మందుల కిట్లు ఇచ్చి ఇళ్లలో ఐసోలేషన్లో ఉండేలా చర్యలు తీసుకోండి. వీరి ఆరోగ్య పరిస్థితిని ఆశ వర్కర్లు రోజు వారీ పరిశీలించి, అవసరమైతే వారిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించాలి’ అని హరీశ్రావు చెప్పారు. మూడోవేవ్లో వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రమాదం తక్కువగా ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయని, ప్రజలు భయాందోళనకు గురి కాకుండా చైతన్య పరచాలన్నారు. పంచాయతీ, మున్సిపల్ సహా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఐసోలేషన్ కేంద్రాలను స్థానికంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇదే సమయంలో అన్ని ఆసుపత్రుల్లో ఓపీ, గర్భిణులకు సేవలు, దీర్ఘకాలిక రోగులకు సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా జిల్లా వైద్యాధికారులు చూసుకోవాలని చెప్పారు. ప్రభుత్వానికి ఆశాల ధన్యవాదాలు గత ప్రభుత్వాల హయాంలో పారితోషికం పెంపు కోసం ఆశ కార్యకర్తలు ధర్నాలు చేసేవారని, ఇందిరాపార్క్ వద్ద లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితులు ఉండేవని మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. గుర్రాలతో తొక్కించిన సందర్భాలూ ఉన్నాయన్నారు. ఆశాల సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పారితోషికం పెంచారని, సీఎం నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆశాలకు సూచించారు. ఆశాల అందరి తరఫున ఆయన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. పారితోషికం పెంపు సంతోషాన్ని ఆశ కార్యకర్తలు హరీశ్రావుతో పంచుకున్నారు. -
కరోనా సైరన్ మోత!... రికార్డు స్థాయిలో కేసులు
సాక్షి హైదరాబాద్: గ్రేటర్ జిల్లాల్లో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం ఒక్కరోజే 1,588 కేసులు నిర్ధారణ అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,214 మేడ్చల్ జిల్లాలో 161, రంగారెడ్డి జిల్లాల్లో 213 మంది వైరస్ బారిన పడటం ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వారిలో తీవ్రమైన లక్షణాలేవీ లేకపోవడం, సాధారణ దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు మాత్రమే కన్పిస్తుండటం ఊరటనిచ్చే అంశంగా వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కోవిడ్ చికిత్సలకు కేంద్రమైన గాంధీ, టిమ్స్, కింగ్కోఠి, ఫీవర్, ఛాతీ ఆస్పత్రి, నిలోఫర్ సహా అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. అత్యవసరమైతే మినహా సాధారణ కారణాలకు సెలవులను మంజూరు చేయకూడదని ఆయా ఆస్పత్రులకు సూపరింటెండెంట్లకు తెలంగాణ వైద్యవిద్య సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ వేసి కటకటాల్లోకి..!) -
జకోవిచ్పై మండిపడ్డ నదాల్.. టెన్నిస్ దిగ్గజాల మధ్య కోవిడ్ టీకా చిచ్చు
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో పాల్గొనేందుకు మెల్బోర్న్కు వచ్చిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. కోవిడ్ టీకాలు తీసుకోని కారణంగా జకోను అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.. అతని వీసా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సహచర ఆటగాడు, స్పానిష్ బుల్ రఫేల్ నదాల్ జకో తీరును తప్పుపట్టాడు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో రూల్స్ అందరూ తప్పక పాటించాల్సిందేనని, టీకాలు తీసుకోకుండా జకో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. జకో విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరును తప్పుపట్టలేమని అన్నాడు. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్లో పాల్గొనేవారు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలనే నిబంధన నుంచి జకోవిచ్ ప్రత్యేక మినహాయింపు తీసుకున్నాడు. ఇందుకు నిర్వాహకులు సైతం అంగీకరించారు. అయితే వాక్సిన్ తీసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించకపోవడంతో జకోను విమానాశ్రయంలోనే నిలిపివేశారు. ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస్ సైతం స్పందించాడు. జకో.. వ్యాక్సిన్ తీసుకోకపోవడానికి సరైన కారణం చూపితే టోర్నీలో పాల్గొంటాడని స్పష్టం చేశాడు. చదవండి: హార్ధిక్ నుంచి ఆశించింది శార్ధూల్ నెరవేరుస్తున్నాడు..! -
తల్లే పిల్లల్ని కిడ్నాప్ చేసింది.. ఎందుకో తెలుసా?
ఇంతవరకు మనం రకరకాల కిడ్నాప్లు గురించి విని ఉంటాం. అవన్నీ ఆస్తి కోసం లేక వ్వక్తిగత కక్ష్యల నేపథ్యంలోనో కిడ్నాప్లు చేయడం గురించి విని ఉంటాం. కానీ ఎక్కడైన వ్యాక్సిన్ కోసం కిడ్నాప్ చేయడం గురించి మాత్రం ఇప్పుడే వింటున్నాం. అది కూడా తల్లే కిడ్నాప్ చేయడం. చాలా ఆశ్యర్యంగానూ వింతగానూ ఉంది. (చదవండి: అధ్యాపక వృత్తిలో ఉండి అదేం పని!) అసలు విషయంలోకెళ్లితే...స్పెయిన్లోని సెవిల్లె సమీపంలో నివశిస్తున్న ఒక తండ్రి తన కొడుకులని తల్లే స్వయంగా కిడ్నాప్ చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు వేయించడానికి వీల్లేదంటూ కిడ్నాప్ చేసిందని ఆమె మాజీ భర్త ఆరోపించాడు. ఇటీవలే తన పిల్లలకు కోవిడ్ వేయించాలా వద్ద అనే నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఉందని కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. అయితే ఆమె కోర్టు తీర్పు ఇచ్చిన కొద్దిరోజుల్లోనే పిల్లలను స్కూల్కి పంపిచడం మానిపించేయాలనుకుంటున్నట్లు అతని మాజీ భార్య నుంచి ఒక ఉత్తరం కూడా వచ్చిందని తెలిపాడు. పైగా తన అనుమతి లేకుండానే పిల్లలను తీసుకువెళ్లిపోయిందని, నవంబర్ 4 నుంచి తన పిల్లలను చూడలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో అతని మాజీ భార్య 12, 14 ఏళ్ల తన పిల్లలను తీసుకుని కోర్టుకు వెళ్లి అధికారులను ఆశ్రయించింది. అయితే కోర్టు పెండింగ్లో ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను రిమాండ్లో ఉంచాలని ఆదేశించింది. అంతేకాదు ఆ పిల్లలిద్దర్నీ తండ్రికి అప్పగించినట్లు స్పెయిన్ గార్డియా సివిల్ పోలీస్ ఫోర్స్ ప్రతినిధి తెలిపారు. (చదవండి: మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం... 13 మంది మృతి) -
వైరస్ టెన్షన్!.. తారస్థాయిలో విరుచుకుపడుతున్న థర్డ్వేవ్
సాక్షి హైదరాబాద్: ఊహించినట్లే జరుగుతోంది. గ్రేటర్లో థర్డ్వేవ్ తారస్థాయికి చేరుతోంది. ఒకవైపు డెల్టా.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్లు గ్రేటర్వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. క్రిస్మస్, డిసెంబర్ 31 వేడుకల తర్వాత రికార్డు స్థాయిలో కేసులు నమోదువుతుండటం, చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో తారస్థాయికి చేరిన కేసులు.. ఆగస్టు తర్వాత తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ మూడో వారం నుంచి మళ్లీ కేసుల సంఖ్య పెరుతూ వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మూడు రోజుల క్రితం.. 397 పాజిటివ్ కేసులు నమోదైతే.. తాజాగా బుధవారం ఒక్కరోజే 1,285 మందికి వైరస్ నిర్ధారణ కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. హెచ్చరికలు బేఖాతరు.. కోవిడ్ టీకాలు అందుబాటులోకి రావడంతో పాటు వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఆగస్టు నుంచి కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి దశలవారీగా విద్యా సంస్థలను పునఃప్రారంభించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు సినిమా థియేటర్లు, పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు రోజువారీ పనులు కొనసాగించాలని వైద్యులు సూచించినప్పటికీ.. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నామనే ధీమాతో వాటిని పూర్తిగా విస్మరించారు. వైద్యనిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండుగలు, పబ్బాల పేరుతో విందులు, వినోదాల్లో మునిగి తేలారు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు సభలు, సమావేశాలకు వచ్చిన కార్యకర్తలు సైతం మాస్కులను విస్మరించారు. భౌతిక దూరం అనే అంశాన్ని పూర్తిగా మరిచిపోయారు. శానిటైజర్తో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోకపోవడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరించింది. మచ్చుకు కొన్ని కేసులు ఇలా.. మెయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడలోని ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాల టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వందమంది క్రీడాకారుల్లో ఇటీవల చెన్నైలో జరిగిన టెన్నిస్ పోటీలకు 40 మంది హాజరై వచ్చారు. వీరిలో స్థానికంగా ఉన్న ఓ ఇంటర్నేషనల్ స్కూలు విద్యార్థులు కూడా ఉన్నారు. టోర్నమెంట్కు వెళ్లి వచ్చిన తర్వాత వీరిలో ఆరుగురు క్రీడాకారులకు దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. మూడు రోజుల క్రితం వీరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, వీరిలో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో శిక్షణ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. స్కూలు యాజమాన్యం కూడా ఆఫ్లైన్ క్లాసులను రద్దు చేసి, ఆన్లైన్లో పాఠాలు బోధిస్తోంది. నాదర్గుల్ సమీపంలో నివాసం ఉంటున్న డీఆర్డీఓకు చెందిన ఓ కీలక అధికారి ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. అప్పటికే ఆయనకు సన్నిహితంగా తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు మెలగడంతో ఆ తర్వాత వారికి కూడా వైరస్ సోకింది. వైరస్ నిర్ధారణ అయినప్పటికీ.. లక్షణాల తీవ్రత పెద్దగా లేకపోవడంతో వారంతా హోం ఐసోలేషన్లోనే చికిత్స తీసుకున్నారు. శంషాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చాడు. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ర్యాండమ్ చెకప్లో భాగంగా ఆయన నుంచి నమూనాలు సేకరించి, పరీక్షించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ తర్వాత జరిపిన జీనోమ్ సీక్వెన్సీ పరీక్షల్లో ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలింది. అప్పటికే ఆయన ఇంటికి చేరుకోవడం, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగడం వల్ల ఆయన ద్వారా ఆయన కుమారునికి, ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ నిర్ధారణ అయింది. కోర్సిటీ కంటే.. శివారు ప్రాంతాల్లోనే.. నిజానికి ఫస్ట్, సెకండ్ వేవ్లో వైరస్ పూర్తిగా కోర్ సిటీకే పరిమితమైంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల మున్సిపాలిటీలకు, మారుమూల గ్రామాలకు విస్తరించింది. సిటీ నుంచి శివారు ప్రాంతాలకు రాకపోకలు పెరిగింది. దీంతో పాటు వైరస్ శివారు ప్రాంతాలకు విస్తరించింది. సిటిజన్లతో పోలిస్తే.. శివారు బస్తీవాసుల్లో వైరస్పై సరైన అవగాహన లేదు. ఓ వర్గం ప్రజల్లో టీకాలపై ఇప్పటికీ మూఢ నమ్మకం నెలకొంది. దీనికి అపోహ తోడైంది. ఇప్పటికీ చాలా మంది టీకాలు వేసు కోకుండా దూరంగా ఉండిపోయారు. టీకా వేసుకోక పోవడానికి తోడు వీరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వీరు త్వరగా వైరస్ బారిన పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఫంక్షన్ హాళ్లు, ప్రముఖ హోటళ్లు, ఐటీ అనుబంధ సంస్థలన్నీ ఓర్ఆర్ఆర్కు అటూఇటుగా విస్తరించి ఉండటం, ఇక్కడికి రాకపోకలు ఎక్కువగా జరుగుతుండటం కూడా రికార్డు స్థాయిలో కేసుల నమోదుకు మరో కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు వైరస్ నిర్ధారణ అయిన వారిలో పెద్దగా లక్షణాలు కన్పించకపోవడం, ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను గుర్తించి, కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించకపోవడం, ఈ విషయం తెలియక ప్రజలు తరచూ ఆయా ప్రాంతాల్లో సంచరిస్తుండటం, హోం ఐసోలేషన్లో ఉన్న వారిపై నిఘా కూడా లేకపోవడం, మందులు, కాయకూరలు, నిత్యవసరాల కొనుగోలు పేరుతో వీరంతా సాధారణ పౌరుల్లా బయట తిరుగుతుండటం కూడా ఆయా ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటానికి కారణ మ ని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచే కాదు.. సరిహద్దు రాష్ట్రాల బాధితులు చికిత్స కోసం ఇక్కడికే వస్తున్నారు. వీరికి సహాయంగా వచ్చిన వారు ఆస్పత్రి ఆవరణలో సాధారణ రోగుల మధ్య తిరుగుతున్నారు. -
ఏపీలో టీనేజర్ల కోసం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
-
టీన్ టీకా.. ఆ అపోహలు నమ్మకండి: మంత్రి హరీష్
సాక్షి హైదరాబాద్: టీనేజర్లకు టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 7లోని యూపీహెచ్సీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు టీకాలను ప్రారంభించగా, రంగారెడ్డి జిల్లా బడంగ్పేట యూపీహెచ్సీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 45,319 మందికి కోవిడ్ టీకాలు వేయగా, వీరిలో 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లు 5,525 మంది ఉన్నారు. (చదవండి: worlds longest name: ఎంత పె...ద్ద.. ‘పేరు’!) ఈ సందర్భంగా మంత్రులు హరీష్రావు, సబితా ఇంద్రారెడ్డిలు మాట్లాడుతూ.. కోవిడ్ థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బాధితులు అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని సూచించారు. ఆధార్ కార్డు లేని టీనేజర్లకు కాలేజీ గుర్తింపు కార్డు చూసి టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. మరో నాలుగు రోజుల తర్వాత కోవిన్ యాప్లో ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రేటర్ పరిధిలోనూ నేరుగా వచ్చిన వారికి టీకాలు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. తొలిడోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు టీకాను వేయనున్నట్లు తెలిపారు. టీకా వేసుకున్న తర్వాత జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. (చదవండి: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే పుట్టిన బామ్మ బర్త్డే!) -
తొలిరోజు 41 లక్షల మంది టీనేజర్లకు టీకా
దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల గ్రూపు వారికి సోమవారం ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్లో తొలిరోజు 41 లక్షల మందికి పైగా మొదటి డోసు టీకా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 15–18 ఏళ్ల వారి కోసం జనవరి ఒకటో తేదీ నుంచి కోవిన్ పోర్టల్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, సోమవారం రాత్రి 8.30 గంటల సమయానికి 51 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో ఈ గ్రూపు బాలబాలికలు సుమారు 7.4 కోట్ల మంది ఉన్నట్లు అధికారుల అంచనా. ‘మహమ్మారి నుంచి యువతరాన్ని కాపాడేందుకు దేశం ఒక అడుగు ముందుకు వేసింది’అని ప్రధాని మోదీ అన్నారు. ‘టీకా వేయించుకున్న బాలలందరికీ, వారి తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరింతమంది టీకా వేయించుకోవాలని కోరుకుంటున్నాను’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 146.61 కోట్ల డోసుల టీకా పంపిణీ చేసినట్లయిందని ఆరోగ్య శాఖ తెలిపింది. -
Andhra Pradesh: 4.92 లక్షల మందికి టీకా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 15–18 ఏళ్ల వారి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సోమవారం విశేష స్పందన లభించింది. ఉదయం పది గంటల నుంచి టీకా వేసే ప్రక్రియ ప్రారంభించగా అది రాత్రి వరకు కొనసాగింది. తొలిరోజు రాష్ట్రంలోని 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్లలో 4,92,613 మందికి కోవాగ్జిన్ టీకా వేశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,719 మందికి చేశారు. కొన్నిచోట్ల ఆరోగ్య సిబ్బంది పాఠశాలలకు వెళ్లి వేశారు. కోవిన్ యాప్లో పేరు రిజిస్టర్ చేసుకున్న వారికి నేరుగా టీకా ఇవ్వగా.. మిగిలిన వారికి ఆధార్ కార్డు, పాఠశాల గుర్తింపు కార్డులోని వివరాలు నమోదు చేసి టీకా వేశారు. ఇక 7వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు ఇస్తారు. 25 లక్షల మంది యువత లక్ష్యం కాగా 40 లక్షల కోవాగ్జిన్ డోసులను సిద్ధంగా ఉంచారు. -
యువతి యువకులందరికీ వ్యాక్సినేషన్..
-
తెలంగాణలో టీనేజర్లకు వ్యాక్సినేషన్
-
టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. తెలంగాణలో 22. 78 లక్షల మంది టీనేజర్లకు వాక్సిన్ అందించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4. 5 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ పాజిటివిటీ రేటు 4 శాతం పెరిగిందని, బూస్టర్ ఇవ్వమని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఈమధ్యనే కేంద్రం స్పందించిందని, కోవాగ్జిన్ టీకా పిల్లలకు వేస్తున్నామని చెప్పారు. 1014 సెంటర్లలో వాక్సిన్ వేస్తున్నాంమని పేర్కొన్నారు. హైదరాబాద్ సహా 12 కార్పోరేషన్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి టీకా వేస్తున్నామని తెలిపారు. గుమికూడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. జనవరి 10 నుండి 60 ఏళ్ల పై బడిన వారికి టీకాలు వేయనున్నామని చెప్పారు. కాలేజీలు, స్కూళ్ల ప్రిన్సిపాల్లకు టీకాలు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. -
ఏపీలో టీనేజర్లకు వ్యాక్సినేషన్
-
టీకా ప్రాప్తిరస్తు! 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి కోవిడ్ వ్యాక్సిన్..
లబ్బీపేట(విజయవాడ తూర్పు): కృష్ణా జిల్లాలో టీనేజర్స్కు టీకాలు వేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీని కోసం నేటి నుంచి 7వ తేదీ వరకూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) లోతేటి శివశంకర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆదివారం తన చాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15–18 ఏళ్ల మధ్య వయస్సు (టీనేజ్) వారందరికీ టీకాలు వేసేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, విద్యాశాఖ అధికారులు, పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. కాలేజీలో డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి టీకా వేయించాలన్నారు. టీకాపై అపోహలు వీడేలా, పిల్లల తల్లిదండ్రులను చైతన్య వంతం చేసి, అందరికీ టీకా వేయాలన్నారు. కరోనా నివారణకు టీకానే వజ్రాయుధం అని ప్రజలకు వివరించాలని సూచించారు. 430 కాలేజీల గుర్తింపు.. ►గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని కాలేజీలలో టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ►దీనికిగానూ జిల్లాలోని 1,285 సచివాలయాల పరిధి లో 430 కాలేజీలను గుర్తించామని జేసీ చెప్పారు. ►ఇందులో 2.02 లక్షల మంది టీనేజ్ వయస్సు వారు ఉన్నారని.. స్కూల్ టీచర్లు, కళాశాలల ప్రిన్సిపాల్స్, పిల్లల తల్లిదండ్రులతో సమన్వయ పరచుకుని అర్హులందరికీ టీకాలు వేయాలన్నారు. ►కోవిడ్ టీకా తీసుకునేటప్పుడు ఆహారం తిని వేసుకునేలా చూడాలన్నారు. ►కోవ్యాగ్జిన్ టీకా 1.28 లక్షల డోస్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిని ఇప్పటికే పీహెచ్సీలకు తరలించినట్లు తెలిపారు. అక్కడ నుంచి సచివాలయాలకు వ్యాక్సిన్ పంపనున్నట్లు తెలిపారు. ఫ్రంట్ లైన్ వర్కర్ల గుర్తింపు.. జిల్లాలో ఫ్రంట్ లైన్ వర్కర్లు 45వేల మంది ఉన్నారన్నారు. వీరిలో రెండో డోసు వేసుకొని ఫిబ్రవరి నాటికి 9 నెలలు పూర్తి అయ్యే వారు 22 వేల మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరందరికీ ఈ నెల 10, 11, 12 తేదీల్లో బూస్టర్ డోస్ వేసేందుకు సిద్ధం చేశామన్నారు. సమావేశంలో డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎం. సుహాసిని, ఇతర అధికారులు పాల్గొన్నారు. చదవండి: Omicron surge: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరిక లేఖ -
Omicron alert: ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది.. విస్మరించొద్దు: ఆరోగ్య శాఖ హెచ్చరిక
లబ్బీపేట(విజయవాడ తూర్పు): కరోనా వీడిపోలేదు.. కొత్త రూపాల్లో కంగారెత్తిస్తోంది.. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. మన దేశం, రాష్ట్రంలో కూడా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదవతున్నాయి. అయితే ప్రజల్లో మాత్రం ఒకింత ఉదాసీనత కనిపిస్తోంది. పండుగ సీజన్ కావడంతో కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. మాస్క్ లేకుండా రోడ్లపై తిరిగేస్తున్నారు.. శానిటైజర్ వాడటం మానేశారు.. షాపింగ్ మాల్స్, దుకాణాల్లో గుంపులుగుంపులుగా ఉంటూ కొనుగోళ్లు చేసేస్తున్నారు. ఎక్కడ చూసినా రద్దీ తీవ్రంగా కనిపిస్తోంది. వైరస్కు ఇదే అదునుగా మారి, విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసులు తగ్గుముఖం.. జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజుకు 10 నుంచి 20 వరకూ పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, యాక్టివ్ కేసులు సైతం 200 కంటే తక్కువగానే ఉన్నాయి. ఒక్కో రోజు జీరో మరణాలు కూడా నమోదవుతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో సైతం కోవిడ్ అడ్మిషన్స్ బాగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 10 మంది మాత్రమే కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగాలంటే, అది మన చేతుల్లోనే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉప్పెనలా వచ్చే అవకాశం.. గత ఏడాది మే నెలలో డెల్టా వేరియంట్ ఉగ్రరూపం దాల్చడం చూశాం. వేలాది మంది దాని బారిన పడి, ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే 30 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా జిల్లాలో ఒమిక్రాన్ కేసులు నమోదు కానప్పటికీ, పొరుగు జిల్లాలో కేసులున్నాయి. అమెరికాలో ప్రస్తుతం వేరియంట్ విజృంభిస్తోంది. ఉత్తర భారతదేశంలో సైతం రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. పండుగ సీజన్లు ముగిసిన తర్వాత మనకు కూడా రావచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉన్నా, వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. జాగ్రత్తలు తప్పని సరిగా.. కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మాస్కును ధరించాలని, చేతులకు తరచూ శానిటైజర్ రాసుకుంటూ, భౌతిక దూరం పాటించాలంటున్నారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. టీకా తీసుకోవాలి.. ప్రస్తుతం జిల్లాలో వయస్సు 18 ఏళ్లు నిండిన వారందరికీ మొదటి డోస్ కరోనా టీకాలు వేయడం పూర్తి చేశారు. రెండో డోసు సైతం దాదాపు 78 శాతం పూర్తయ్యింది. మిగలిన వారికి సైతం టీకాలు వేయడంతో పాటు, ప్రస్తుతం 15–18 ఏళ్ల మధ్య వయస్సు వారికి సోమవారం నుంచి ఐదు రోజుల పాటు టీకాలు వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో టీకాలు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు హెల్త్కేర్ వర్కర్స్, ఫ్రంట్లైన్ వారియర్స్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు నిండిన వారికి ప్రికాషన్ డోస్ టీకా వేయనున్నారు. అప్రమత్తంగా ఉందాం.. ఒమిక్రాన్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పాజిటివ్ కేసుల ట్రేసింగ్తో పాటు.. వారి ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్ట్లను గుర్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు చేస్తున్నాం. ప్రజలు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మాస్కు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యమైన అంశాలు. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ చదవండి: Omicron: ‘ఆస్పత్రుల సామర్థ్యాన్ని తక్షణమే పెంచండి... ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం!’ -
డాక్టర్ ఉంటారు.. పేరెంట్స్ ఉండాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టీకాల పంపిణీ మార్గదర్శకాలను విడుదల చేసింది. తల్లిదండ్రుల సమక్షంలోనే టీనేజర్లకు టీకాలు వేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అలాగే ఈ నెల 10 నుంచి హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు (ఎన్నికల విధుల్లో ఉన్నవారితో సహా), 60 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రికాషనరీ డోస్ (మూడో డోస్) టీకా వేస్తామని తెలిపింది. అయితే ఈ గ్రూప్లోని వారికి ఏ టీకా వేయాలన్న దానిపై త్వరలో తెలియజేస్తామని వివరించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 15–18 ఏళ్ల వయసు టీనేజర్లకు కోవాగ్జిన్ టీకా మాత్రమే ఇస్తామని పేర్కొన్న ప్రభుత్వం... ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా వేస్తారా? లేదా? ఒకవేళ వేస్తే ఎంత ధర ఉంటుందన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. దేశంలో దాదాపు 10 కోట్ల మంది 15–18 ఏళ్ల మధ్య ఉన్న యువత వ్యాక్సినేషన్ తీసుకొనేందుకు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ అంచనా వేసింది. మరోవైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు ఇవీ... ► 2007 సంవత్సరం లేదా అంతకుముందు పుట్టిన టీనేజర్లు టీకాకు అర్హులు. ► వారందరికీ పీహెచ్సీ, యూపీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేస్తారు. ►వ్యాక్సిన్ కేంద్రం వద్ద ఒక ప్రత్యేక సెషన్ నిర్వహిస్తారు. అక్కడ ప్రత్యేకంగా సైట్లు, క్యూలతోపాటు వ్యాక్సినేటర్లు ఉంటారు. ► రాష్ట్రంలో 15–18 ఏళ్ల వయసు వారికి కోవాగ్జిన్ టీకానే వేస్తారు. వారు 22,78,683 మంది ఉంటారని అంచనా. ►ప్రతి మోతాదులో ఒక్కొక్కరికీ పెద్దలకు ఇచ్చిన తరహాలోనే 0.5 ఎంఎల్ ఇస్తారు. రెండో డోసు తీసుకొని 9 నెలలు దాటితేనే బూస్టర్... ► హెల్త్కేర్ వర్కర్లకు గతేడాది జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. వారు అప్పట్లో రెండో డోస్ తక్షణమే తీసుకుంటే 2021 ఫిబ్రవరి మూడు లేదా చివరి చివరి వారంలో వేసుకొని ఉండొచ్చు. ఫిబ్రవరి 2021లో రెండో డోస్ తీసుకున్న హెల్త్కేర్ వర్కర్లు ఇప్పుడు ప్రికాషినరీ (బూస్టర్) డోస్కు అర్హత సాధించారు. ► ఫ్రంట్లైన్ వర్కర్లకు గతేడాది ఫిబ్రవరి 5 మొదటి డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ మొదలవగా రెండో డోస్ అదే ఏడాది మార్చి మూడు లేదా చివరి వారంలో ప్రారంభమైంది. అప్పుడు మార్చిలో రెండో డోస్ తీసుకున్న ఫ్రంట్లైన్ వర్కర్లు ప్రస్తుతం జనవరిలో ప్రికాషినరీ (బూస్టర్) డోస్ తీసుకొనేందుకు అర్హత సాధిస్తారు. ► ప్రికాషినరీ డోస్ వ్యాక్సిన్కు అర్హులైన లబ్ధిదారుల జాబితా కోవిన్ పోర్టల్లో అందుబాటులో ఉంది. ►ఫ్రంట్లైన్ వర్కర్లు, హెల్త్కేర్ వర్కర్లు ఏ టీకా, ఎంత మోతాదులో వేసుకోవాలన్న విషయంపై త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు... ► 60 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గతేడాది మార్చి ఒకటో తేదీన మొదటి డోస్ వ్యాక్సిన్ను ప్రారంభించారు. వారు రెండో డోస్ అదే ఏడాది ఏప్రిల్ మూడు లేదా చివరి వారంలో తీసుకొని ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రికాషనరీ టీకాకు అర్హుత సాధిస్తారు. ►లబ్ధిదారుల సుముఖతతోపాటు వైద్యులతో తగు సంప్రదింపుల తర్వాత ప్రికాషనరీ డోస్ మోతాదు ఇస్తారు. వారికి పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో టీకా వేస్తారు. ► ఎంత మోతాదులో, ఏ టీకా వేసేదీ త్వరలో తెలియజేస్తారు. ► దీర్ఘకాలిక జబ్బులున్న 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్యను కేంద్రం తెలియజేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం 60 ఏళ్లు దాటి మొదటి, రెండో డోస్ వేసుకున్న వారిలో దీర్ఘకాలిక జబ్బులున్నవారు దాదాపు 20 శాతం ఉండొచ్చని అంచనా. వైద్యుల పర్యవేక్షణలో.. ► టీనేజర్లకు టీకా ఇచ్చే సమయంలో డాక్టర్ అక్కడే ఉంటారు. తల్లిదండ్రుల సమక్షంలోనే టీకా వేస్తారు. ► వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 30 నిమిషాలు టీకా కేంద్రంలోనే వేచి ఉండాలి. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని వైద్యులు పర్యవేక్షిస్తారు. ► మొదటి డోస్ తర్వాత తిరిగి 28 రోజుల అనంతరం రెండో డోస్ టీకా వేస్తారు. గ్రేటర్లో ఆన్లైన్.. ►జీహెచ్ఎంసీ, 12 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని లబ్ధిదారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టీకాలు ఇస్తారు. మిగిలిన జిల్లాలకు చెందిన పిల్లలు నేరుగా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి టీకా పొందొచ్చు. -
చెకోడీలమ్మినట్లు వ్యాక్సిన్ సర్టిఫికేట్లు అమ్మకానికి పెట్టాడు!
కరోనా సెకండ్ వేవ్ ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసింది. ప్రస్తుతం ఈ ఒమిక్రాన్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో ప్రజలు కరోనా వ్యాక్సినేషన్ తీసుకునే విధాంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాక చాలా సంస్థలు ప్రజలు ఉద్యోగంలో ఉండాలంటే కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ని తప్పనిసరి చేసింది. (చదవండి: అందంగా అలంకరించిన ఆ క్రిస్మస్ చెట్టే వాళ్లను జైలుపాలు చేసింది!!) దీంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనుకాడుతున్న వారు సైతం ఇప్పుడు సర్టిఫికెట్ల కోసం అయిన వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇదంతా ఒకఎత్తేయితే కొంతమంది ప్రబుద్ధులు మాత్రం ఈ మహమ్మారి సమయంలో కూడా వ్యాక్సిన్ వేయించుకోవడాన్ని కూడా సంపాదన మార్గంగా ఎంచుకున్నారు. ఇండోనేషియాలో ఒక వ్యక్తి కేవలం 4 వేల రూపాయలకు ఇతరుల పేరుతో కరోనా వ్యాక్సిన్ను వేయించుకున్నాడు. వాస్తవానికి కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసినప్పటి నుండి చాలా మంది ఈ వ్యాక్సిన్ తీసుకోవలసి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇండోనేషియాలోని సౌత్ సులవేసి నివాసి అయిన అబ్దుల్ రహీమ్ అనే వ్యక్తి ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోని తప్పుడూ మార్గంలో డబ్బు సంపాదించే ప్రారంభించాడు. ఈ విధంగా అతను రెండు డోస్ల కరోనా వ్యాక్సిన్ను సుమారు 14 సార్లు తీసుకున్నాడు.ఆ తరువాత అతను ఆ వ్యాక్సిన్ సర్టిఫికేట్లను 4 వేలకు అమ్మేసేవాడు. పైగా ఇంజక్షన్ లేకుండా ఎవరికైనా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ కావాలంటే తనను సంప్రదించండి అంటూ ఒక వీడియో తీసి ప్రచారం చేసుకుని మరీ చెబుతుండటం గమనార్హం. విసషయం తెలుకున్న పోలీసులు అబ్దుల్ రహీమ్ను అరెస్టు చేశారు. (చదవండి: పోలీస్ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!) -
Omicron: నైట్ కర్ఫ్యూ ఎత్తివేత! ఎందుకో తెలుసా..
కేప్ టౌన్: గడచిన ఏడు రోజులతో పోలిస్తే గత వారంలో దాదాపు 30 శాతం ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు తగ్గాయని దక్షిణాఫ్రికా తాజాగా వెల్లడించింది. ఒమిక్రాన్కు బయపడి యూరఫ్, అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించిస్తున్న నేపధ్యంలో నాలుగో వేవ్ తగ్గుముఖం పట్టడంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం రాత్రి కర్ఫ్యు ఎత్తివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. మరణాలు కూడా పెద్దగా నమోదు కాలేదని, వ్యాక్సినేషన్ పెద్ద సంఖ్యలో చేపట్టడం మూలంగా నాలుగో వేవ్ నుంచి బయటపడ్డామని తాజా ఆరోగ్య డేటా నేపథ్యంలో ఆంక్షలు సడలించాలని నిర్ణయించుకున్నట్లు దక్షిణాఫ్రికా ఈ మేరకు మీడియాకు తెల్పింది. సార్స్- కోవ్ 2 వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ నవంబర్లో మొదటిసారి దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. చదవండి: కొత్తొక వింత.. పాతొక రోత! డిసెంబరు 25 నాటికి నమోదైన కేసులతో పోల్చితే, అంతకు ముందు వారాల్లో దాదాపు 1,27,753 కేసులు వచ్చాయని, ఆ సంఖ్య 29.7% తగ్గిందని ప్రభుత్వం తెల్పింది. సడలించిన ఆంక్షల మేరకు వెయ్యి మందితో ఇండోర్ మీటింగ్లు, రెండు వేల మంది సామర్ధ్యంతో ఔట్డోర్ మీటింగ్లు నిర్వహించుకోవచ్చు. అలాగే లైసెన్సులున్న మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల తర్వాత కూడా తెరచుకోవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి. అలా చేయని పక్షంలో క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుందని సూచించింది. కాగా గత రెండేళ్లుగా దక్షిణాఫ్రికాలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ 100కి పైగా దేశాలకు వ్యాపించిందని, వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తులతో పాటు కరోనా సోకిన వారిలో కూడా కొత్త వేరియంట్ వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. చదవండి: డిసెంబర్ 31 రాత్రి పార్టీ వెరైటీగా ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐడియాలివిగో.. -
కరోనా కేసుల్లో పెరుగుదల.. జాగ్రత్త సుమా!
న్యూఢిల్లీ/ముంబై: కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో 8 రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని, ఆస్పత్రుల్లో సన్నద్ధతను పటిష్టం చేయాలని కోరింది. అదేవిధంగా వ్యాక్సినేషన్ను వేగవంతం చేసి, వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను కఠినతరం చేయాలంది. ఈ మేరకు ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలకు కేంద్ర ఆరో గ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈనెల 29న ∙ఒక లేఖ రాశారు. ఇటీవలి కాలంలో ప్రయాణా లు, పండగలు, ఉత్సవాల వంటివి పెరుగుతున్న నేపథ్యంలో వీటిపై ఓ కన్నేసి ఉంచాలని సూచించింది. ‘ఈ శీతాకాలంలో కాలుష్యం కారణంగా, శ్వాస సంబంధ సమస్యల బారినపడే వారిని క్షుణ్నంగా పరీక్షించాలి. కేసులను సకాలంలో గుర్తిస్తే వ్యాప్తిని తగ్గించడంతోపాటు మరణాలను కూడా నివారించవచ్చు. ఈ విషయంలో సానుకూల దృక్పథంతో చర్యలు తీసుకోవాలి’అని కోరింది. గత వారం కోవిడ్ కేసులతోపాటు పాజిటివిటీ రేటులో పెరుగుదల భారీగా నమోదైన మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్లను ‘స్టేట్స్ అండ్ యూటీస్ ఆఫ్ కన్సర్న్’గా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. గురువారం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయెల్ ఆక్సిజన్ నిల్వలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. -
తొలిడోసు 100% పూర్తి
సాక్షి, అమరావతి: కరోనా టీకా వేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మైలురాయి దాటింది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన 3,95,22,000 మందికి టీకా వేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఇందులో భాగంగా 100.11 శాతం అంటే 3,95,65,253 మందికి రాష్ట్ర ప్రభుత్వం తొలిడోసు టీకా పంపిణీ పూర్తిచేసింది. నిజానికి.. తొలి నుంచి వ్యాక్సినేషన్లో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శించింది. స్పెషల్ డ్రైవ్లు పెట్టిమరీ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది. టీకా వేసుకోని వారిని గుర్తించి వారికి టీకాలు వేసేందుకు ఇంటింటి సర్వేలను సైతం ప్రభుత్వం చేపట్టింది. దీంతో పంపిణీ ప్రారంభించి ఏడాది కూడా తిరగకముందే తొలిడోసు పంపిణీని 100 పూర్తిచేసింది. 10 జిల్లాల్లో కేంద్రం నిర్దేశించిన లక్ష్యం వంద శాతం పూర్తికాగా.. అదనంగా ఇంకా టీకా పంపిణీ నడుస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో 99.92 శాతం, విశాఖపట్నంలో 99.77, కృష్ణా జిల్లాలో 98 శాతం మందికి తొలిడోసు టీకా వేశారు. కొందరు అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సినేషన్ ఆలస్యమైంది. కానీ, వీరు ఎక్కడున్నారో గుర్తించి టీకా వేసేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. తొలి డోసు వేసుకున్న వారిలో 74.08 శాతం మందికి అంటే 2,93,11,443 మందికి రెండో డోసు టీకా వేశారు. విదేశీ ప్రయాణికులపట్ల అప్రమత్తం ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వీరి నుంచే ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో.. వీరి వివరాలను ముందే సేకరించి ఆయా జిల్లాలకు వివరాలను పంపుతున్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది విదేశీ ప్రయాణికులను గుర్తించి హోమ్ ఐసోలేషన్లో ఉంచడంతో పాటు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేపడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ 43,539 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. వీరిలో 41,654 మందిని గుర్తించారు. 40,937 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా 40,175 మందికి నెగిటివ్గా నిర్ధారణ అయింది. 671 ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇప్పటికి విదేశీ ప్రయాణికులు, వారి సన్నిహితులు 106 మందికి కరోనా పాజిటివ్గా తేలగా వీరిలో 16 మందికి ఒమిక్రాన్గా నిర్ధారణ అయింది. వేగంగా 35వ ఫీవర్ సర్వే ఇక రాష్ట్రవ్యాప్తంగా 35వ విడత ఫీవర్ సర్వే వేగంగా జరుగుతోంది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,22,57,110 మందిని వైద్య సిబ్బంది సర్వేచేశారు. వీరిలో కరోనా అనుమానిత లక్షణాలున్న 4,219 మందిని గుర్తించారు. 1,260 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి ఒమిక్రాన్ కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. న్యూ ఇయర్ పార్టీల పేరుతో గుంపులుగా చేరి వైరస్ వ్యాప్తికి దోహదపడొద్దు. జనవరి 3 నుంచి పిల్లలకు టీకా పంపిణీ చేస్తాం. 15–18 ఏళ్ల పిల్లలందరూ టీకాలు వేయించుకోవాలి. పిల్లలకు టీకాలు వేయించే విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. – డాక్టర్ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు -
వ్యాక్సిన్ రోగ నిరోధకత 9 నెలలే.. సెకండ్ డోస్ కూడా వేయించుకోండి: ఆరోగ్య శాఖ
Covid 19 vaccination immunity period: కోవిడ్ వాక్సిన్ డోస్, వైరస్ ఇన్ఫెక్షన్, హాస్పిటలైజేషన్, మరణాల రేటు తగ్గించేందుకేనని కేంద్రం అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ ఈ రోజు (గురువారం) మీడియా సమావేశంలో స్పష్టం చేసింది. పోస్ట్ వ్యాక్సినేషన్ తర్వాత రోగ నిరోధకత 9 నెలల వరకు ఉంటుందని, పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా భయపడాల్సిన అవసరం లేదని, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లన్నీ మనదేశంతో సహా, ఇజ్రాయెల్, యూఎస్, యూరప్, యూకే, చైనా నుంచి వచ్చినప్పటికీ ప్రాథమికంగా వ్యాధిని ఎదుర్కొనేవే కానీ వ్యాధిని పూర్తిగా నిరోధించవు. ముందు జాగ్రత్తగా తీసుకునే కోవిడ్ డోసులు.. వ్యాధి తీవ్రతను తగ్గించడం, ఆసుపత్రుల్లో చేరికలు, మరణాల రేటులను తగ్గించడానికేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) డైరెక్టర్ జనరల్ డా. బలరాం భార్గవ తెలిపారు. మన దేశంలోని వయోజన జనాభాలో దాదాపు 90% మందికి మొదటి డోస్ టీకాలు పూర్తయ్యాయి. ఐతే టీకాలు వేయించుకున్న వారిలో కొంతమందికి ముందుగా రోగ లక్షణ అంటువ్యాధులు ఉన్నందు వల్ల చాలా మందిలో సార్స్-కోవ్ 2 యాంటిజెన్కు సంబంధించి కొన్ని లక్షణాలు బయటపడుతున్నాయి. మరికొందరికి గుర్తించబడని లక్షణ రహిత అంటువ్యాధులు ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 10 నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా అర్హులైన వారికి ఫోన్ ఎస్సెమ్మెస్ సందేశాలు పంపడం ద్వారా విస్తృత టీకా కవరేజీని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్ -
ఏపీలో టీనేజర్లకు వ్యాక్సిన్లు
-
AP: వృద్ధులకు ప్రికాషన్ డోసు.. పిల్లలకు తొలి డోసు
సాక్షి, అమరావతి: పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు కోవిడ్ టీకా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. జనవరి 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల పిల్లలకు తొలి డోసు వేయనుంది. 10వ తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి, హెల్త్కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రికాషన్ డోసు టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విభాగాల్లో మొత్తంగా రాష్ట్రంలో 74,34,394 మందికి టీకాలు పంపిణీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకా పంపిణీకి వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది. 15–18 ఏళ్ల పిల్లలు టీకా కోసం జనవరి 1వ తేదీ నుంచి కోవిన్ యాప్/పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. టీకాకు అర్హత గల పిల్లలు 24.41 లక్షల మంది టీకా వేసుకునేందుకు అర్హులైన పిల్లలు రాష్ట్రంలో 24,41,000 మంది ఉన్నారు. 60 ఏళ్లు పైబడి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు 29,42,020 మంది, హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లు 20,51,374 మంది ఉన్నారు. పిల్లలకు కోవాగ్జిన్ టీకా మాత్రమే వేస్తారు. 60 ఏళ్లు పైబడి రక్తపోటు, మధుమేహం, కిడ్నీ, గుండె సంబంధిత, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు ప్రికాషన్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. 10 లక్షల టీకాల్ని జిల్లాలకు పంపాం టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రస్తుతం ఉన్న విధానంలోనే టీకాలు వేసే కార్యక్రమం జరుగుతుంది. జిల్లాల్లో ఇప్పటికే 7 లక్షల టీకా డోసులు ఉన్నాయి. మరో 10 లక్షలు పంపాం. టీకా పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, వైద్య, ఆరోగ్య శాఖ -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆ మూడు గంటలు లిక్కర్ సేల్స్పై బ్యాన్
సాక్షి, చెన్నై(తమిళనాడు): దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్వో ఒమిక్రాన్పై రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ విధించడంతోపాటు కోవిడ్ ఆంక్షలను కూడా కఠినంగా అమలు చేస్తున్నారు. తాజాగా, మద్రాసు హైకోర్టు ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా నూతన సంవత్సర వేడుకలపై పలు ఆంక్షలను విధించాలంటూ సూచించింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబరు 31 రాత్రి 10 గంటల.. అర్ధరాత్రి 1 గంట దాకా.. మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని ఆదేశించింది. ఆ మూడు గంటల పాటు బార్లు, హోటళ్లు ఎక్కడా కూడా మద్యం విక్రయించకుండా చర్యలు చేపట్టాలని బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక రెండు డోసుల టీకా ధృవీకరణ పత్రం లేకుండా డిసెంబరు 31 న రాత్రి 7గం. తర్వాత బహిరంగ ప్రదేశాలలో ఎవరిని అనుమతించకూడదని స్పష్టం చేసింది. పుదుచ్చేరిలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై.. వేడుకల సమయంలో ప్రజలు ఆంక్షలను కఠినంగా పాటించాలని కోరారు.ప్రజలంతా తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ను వేయించుకోవాలని ఆమె కోరారు. పర్యాటకులు, రద్దీ ప్రదేశాల్లో కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరి పాటించాలని సూచించారు. వేడుకల్లో పాల్గొనే వారి సంఖ్యను కూడా పరిమితంగా ఉండేలా చూడాలన్న ఆదేశాలు ఇదివరకే జారీ అయ్యాయి. -
బూస్టర్కు డాక్టర్ సర్టిఫికెట్ అక్కర్లేదు
న్యూఢిల్లీ: అరవై ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బూస్టర్ డోసు (ప్రికాషన్ డోసు)ను తీసుకొనేటపుడు.. తమ ఆరోగ్య స్థితిని తెలియజేయడానికి ఎలాంటి డాక్టర్ సర్టిఫికెట్ను చూపించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. 15–18 ఏళ్ల మధ్యనున్న టీనేజర్లకు కోవిడ్–19 వ్యాక్సినేషన్, వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు వీలుగా జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. టీనేజర్లకు వ్యాక్సినేషన్ జనవరి 3 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అలాగే బూస్టర్డోసును జనవరి 10 తేదీ నుంచి ఇస్తారు. ఈ రెండు కేటగిరీల్లో వారికి విధివిధానాలను వివరిస్తూ రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. అందులోని ముఖ్యాంశాలు... ► 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలున్న వారు బూస్టర్ డోసు కోసం డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన/ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ► వీరు బూస్టర్ తీసుకొనే ముందు తమ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి. ► ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని కూడా ఫ్రంట్లైన్ వర్కర్లుగా పరిగణిస్తారు. వీరు కూడా బూస్టర్ డోసుకు అర్హులు. అందరిలాగే రెండోడోసు తీసుకున్న 9 నెలలు/ 39 వారాల తర్వాత బూస్టర్ తీసుకోవచ్చు. ► టీనేజర్ల కోసం ప్రత్యేకంగా కొన్ని టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడున్న టీకా కేంద్రాల్లో కొన్నింటిని టీనేజర్ల కోసమే ప్రత్యేకంగా ఎంపిక చేసే అవకాశం రాష్ట్రాలకు ఉంది. ► వయోజనులకు టీకాలు వేస్తున్న రెగ్యులర్ కేంద్రాల్లోనూ టీనేజర్లు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వారికి ప్రత్యేక క్యూలైన్ను ఏర్పాటు చేయాలి. కోవాగ్జిన్, కోవిషీల్డ్లు మిక్స్ కాకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు. ► టీనేజర్లు జనవరి 1 నుంచి కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా 3వ తేదీ నుం చి నేరుగా కేంద్రాలకు వెళ్లి అన్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలిడోసు తీసుకొన్న 28 రోజుల తర్వాత రెండోడోసు తీసుకోవచ్చు. ► టీనేజర్లకు ఇవ్వడానికి ప్రస్తుతం ఒక్క కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉన్నందువల్ల... దీని సరఫరా షెడ్యూల్ను రాష్ట్రాలకు త్వరలో కేంద్రం తెలియజేస్తుంది. -
9 నెలల తర్వాతే బూస్టర్
న్యూఢిల్లీ: దేశంలోని 15–18 ఏళ్ల గ్రూపు టీనేజర్లకు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవాగ్జిన్ టీకా మాత్రమే అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలు తదితరులకు ‘ప్రికాషన్ డోస్’గా ఇచ్చే మూడో డోస్ టీకాపైనా మరింత స్పష్టత నిచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి జనవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘15ఏళ్లు ఆపై వారు కోవిన్ యాప్ ద్వారా టీకా కోసం జనవరి 1వ తేదీ నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. 2007, అంతకంటే ముందే పుట్టిన వారు అర్హులవుతారు. దేశంలో 15–18 ఏళ్ల గ్రూపు వారికి కోవాగ్జిన్ టీకా(అత్యవసర వినియోగానికి) ఒక్కటే ప్రస్తుతం అందుబాటులో ఉంది’అని వివరించింది. జైడస్ క్యాడిలా సంస్థ తయారుచేసిన జైకోవ్–డీ వ్యాక్సిన్ను 12–18 ఏళ్ల వారికి వాడటానికి ఈ ఏడాది ఆగస్టు 20న అనుమతులు లభించినా.. ఈ టీకాను ఇంకా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చలేదు కాబట్టి ప్రస్తుతానికి పిల్లలకు కోవాగ్జిన్ ఒక్కటే అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు. అదేవిధంగా, ‘ప్రాధాన్యతాక్రమం ప్రకారం హెల్త్కేర్ వర్కర్లు (హెచ్సీడబ్ల్యూలు), ఫ్రంట్లైన్ వర్కర్లు (ఎఫ్ఎల్డబ్ల్యూలు), 60 ఏళ్లకు పైబడిన ఇతర వ్యాధుల బాధితులు జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రికాషన్ డోస్కు అర్హులు. జనవరి 3వ తేదీ నాటికి వీరు కోవిడ్ టీకా రెండో డోస్ తీసుకుని 9 నెలలు లేదా 39 వారాలు పూర్తయి ఉండాలి’అని ఆ మార్గదర్శకాల్లో వివరించింది. ‘కోవిన్ యాప్ నుంచి వీరు టీకా కోసం నమోదు చేసుకోవచ్చు. కోవిన్ యాప్ నమోదైన రెండో డోస్ తీసుకున్న తేదీ ఆధారంగా ప్రికాషన్ డోస్కు అర్హత లభిస్తుంది. 9 నెలలు/39 వారాల గడువు ముగిసిన వారి రిజిస్టర్ మొబైల్ నంబర్కు మెసేజీ అందుతుంది. ఆన్లైన్తోపాటు ఆన్సైట్లోనూ టీకా కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. నేడు రాష్ట్రాలతో భేటీ ప్రికాషన్ డోస్, టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అనుసరించాల్సిన కార్యాచరణ వ్యూహంపై చర్చించేందుకు కేంద్రం మంగళవారం రాష్ట్రాలతో వర్చువల్గా సమావేశం జరపనుంది. -
గప్‘చిప్’గా చెప్పేస్తుంది
ఒమిక్రాన్ ఎఫెక్ట్తో చాలా ఆఫీసులు, రెస్టా రెంట్లు, కాన్సర్ట్ హాల్స్, సినిమా థియేటర్లు, కొన్ని బ్యాంకులు... వాళ్ల ఆవరణలోకి అడుగుపెట్టాలంటే వ్యాక్సినేషన్ చేసుకున్నారా? లేదా? అని అడుగుతున్నాయి. కొన్ని సంస్థలయితే వాక్సిన్ కంపల్సరీ చేశాయి. అయితే ప్రతి చోటికీ వాక్సినేషన్ సర్టిఫికెట్ను పట్టుకెళ్లలేం కదా! అందుకే ఆ వివరాలన్నీ భద్ర పరిచి చర్మం కింద అమర్చగలిగే ఓ చిప్ను ఆవిష్క రించింది స్వీడిష్ స్టార్టప్ ఎపిసెంటర్. బియ్యం గింజ సైజులో ఉండే ఈ మైక్రోచిప్లో మీకు సంబం ధించిన వాక్సినేషన్ సమాచారమంతా ఉంటుంది. మీరు ఆఫీసు, ఏదైనా స్టోర్, ఎయిర్పోర్ట్ ఎక్కడికి వెళ్లినా సరే.. ఆ చిప్ను స్కాన్ చేస్తే చాలు వాక్సినేషన్ సమాచారమంతా అందులో ప్రత్యక్ష మవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా యాప్ అవ సరం లేదు. మీ ఫోన్ ఛార్జింగ్లేకపోయినా పర్లేదు. నీయర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ప్రొటోకాల్ టెక్నాలజీ ఉన్న ఏ గ్యాడ్జెట్ అయినా ఈ చిప్ను చదివేస్తుంది. విద్యుదయస్కాంత తరంగాలతో రెండు డివైస్ల మధ్య సమాచారం పాస్ అవు తుంది. ప్రస్తుతానికి కేవలం వాక్సినేషన్ సమాచారం కోసమే ఉపయోగి స్తున్నా... భవిష్యత్లో కాంటాక్ట్లెస్ చెల్లింపులకు, తాళం చెవిలా సైతం ఉపయోగించొచ్చంటుందీ సంస్థ. ఈ చిప్ ప్రధాన ప్రయోజనం సౌకర్యవం తంగా ఉంచడమేనని ఎపిసెంటర్ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరు పాట్రిక్ మెస్టర్టన్ తెలిపారు. ఎపిసెంటర్ ఆఫీసు ఆవరణలో తమ ఉద్యోగులకు ఈజీ యాక్సెస్కోసం 2015లోనే ఈ చిప్ను తయారు చేసింది. జస్ట్ చేయి ఊపితే చాలు... తలుపులు తెరుచుకోవడం, ప్రింటర్ ఆపరేషన్ వంటి పనులకు ఉపయోగించింది. ఈ సూక్ష్మ చిప్ను చర్మం కింద ఉంచడం చాలా ఈజీ. చిన్న సిరంజ్ సహాయంతో అమర్చేస్తారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. కేంద్రానికి ఈసీ కీలక సూచన
ఒమిక్రాన్ భయాందోళనల నడుమ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఎన్నికలు జరిగే ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. 2022 ఏడాది మొదట్లో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్లో ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతుండడం, మరోవైపు ఒమిక్రాన్ ఉధృతి పెరిగే అవకాశాలు ఉండడంతో ఈసీ, కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. ఎన్నికలు, ర్యాలీల నిర్వహణతో కేసులు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నడుమ.. సోమవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్తో భేటీ సందర్భంగా ఈసీ ఈ కీలక సూచన చేసింది. వాయిదా ప్రసక్తే లేదు! ఒమిక్రాన్ విజృంభించే నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసే అంశం పరిశీలించాలంటూ ప్రధాని మోదీ, ఈసీని ఉద్దేశించి అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్లపై చీఫ్ ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర స్పందిస్తూ.. యూపీ పరిస్థితుల సమీక్ష తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖతో చర్చలు, ఆయా రాష్ట్రాల్లో పర్యటనకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. అయితే సోమవారం చర్చల అనంతరం ఎన్నికలు వాయిదా వేసే ఉద్దేశంలో ఈసీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ మేరకు వ్యాక్సినేషన్ పెంచాలంటూ కేంద్రంతో చేసిన సూచనలే అందుకు నిదర్శనం. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్, గోవాలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ వంద శాతానికి చేరువైందని, ఉత్తర ప్రదేశ్లో 85 శాతం, మణిపూర్ పంజాబ్లో 80 శాతం పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని ఈసీ, కేంద్రాన్ని కోరింది. వరుస భేటీలు ఆరోగ్య కార్యదర్శి కాకుండా.. ఇంకోవైపు ఐటీబీపీ, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ దళాలను అప్రమత్తం చేస్తోంది ఎన్నికల కమిషన్. ఈ మేరకు ఆయా విభాగాల హెడ్లతో సమావేశమవుతోంది. అంతేకాదు పంజాబ్, గోవా ఎన్నికల్లో డ్రగ్స్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఎన్బీఐని సైతం అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఈసీ ఉత్తర ప్రదేశ్లో పర్యటించాల్సి ఉంది. చదవండి: PM Modi Mann Ki Baat.. స్వీయ అప్రమత్తతే దేశానికి బలం -
15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్!
Vaccine Registration For Children న్యూఢిల్లీ: 15 - 18 యేళ్లలోపు పిల్లలకు జనవరి 1 నుంచి కోవిడ్ - 19 వ్యాక్సిన్కు రిజిస్ట్రేయన్ చేసుకోవల్సిందిగా ప్రభుత్వం సోమవారం తెల్పింది. స్కూల్ ఐడీ కార్డులను ఉపయోగించి కోవిన్ యాప్లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఆన్లైన్ ప్లాట్ఫాంలో మరో స్లాట్ రూపొందించినట్లు కోవిన్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మీడియాకు తెలిపారు. కాగా 15-18 మధ్య వయసున్న పిల్లలకు జనవరి 3 నుంచి తొలి రౌండ్ కోవిడ్ వ్యాక్సిన్లు వేయనున్నారు. అలాగే ఫ్రంట్లైన్, హెల్త్కేర్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్లు వేయనున్నారు. పిల్లలకు టీకాలు వేయడం ద్వారా స్కూళ్లు, విద్యార్ధులు సాధారణ స్థితికి చేరుకుంటారని, ఇప్పటికే అనేక దేశాల్లో ఈ ప్రక్రియ పూర్తచేశాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత్ బయోటిక్స్ డబుల్ డోస్ కోవాగ్జిన్ లేదా జీడస్ కడిలాస్ థ్రీ డోస్ జికోవ్-డి ఈరెండు వ్యాక్సిన్లలో ఒకటి 12 ఏళ్లు పైబడిన పిల్లలకు వేయబడతాయి. సిరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ‘నోవావ్యాక్స్'ను 7 - 11 ఏళ్ల మధ్య పిల్లలపై, అలాగే బయోలాజికల్ ఈ కి చెందిన ‘కార్బెవ్యాక్స్'ను ఐదేళ్లు నిండిన పిల్లలపై ట్రయల్స్ పూర్తి చేసినట్లు డ్రగ్ కంట్రోలర్ ఇప్పటికే ధృవీకరించింది. ఐతే ఈ రెండు వ్యాక్సిన్లు ఉపయోగానికి ఇంకా అనుమతి పొందలేదు. పాఠశాలల్లో కోవిడ్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించారు. మన దేశంలో ఇప్పటివరకు 141.7 కోట్ల వ్యాక్సిన్లు పూర్తి చేసింది. ఐతే 58.1 కోట్ల మందికి మాత్రమే రెండవ డోస్ పూర్తయ్యింది. కాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 6,500 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ సంఖ్య 6.5 శాతం తక్కువ. అలాగే కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు సోమవారం ఉదయం నాటికి 578కి పెరిగాయి. చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు.. -
టీనేజర్ల టీకాకు ఢోకా లేదు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లకు జనవరి 3 నుంచి కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఈ వయసు టీనేజర్ల సంఖ్య 22.78 లక్షలుగా ఉందని లెక్కించింది. టీకాకు అర్హుల్లో ఎక్కువ శాతం మంది టెన్త్, ఇంటర్ విద్యార్థులే ఉంటారని భావిస్తోంది. మరోవైపు పిల్లలకు టీకా ఇచ్చే విషయంలో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని చాలా మంది కంగారుపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోగా అక్కడక్కడా విద్యార్థులు కరోనా బారినపడుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయని వారు అంటున్నారు. అలాగే జనవరి రెండో వారం నుంచి కరోనా తీవ్రత పెరుగుతుందని, ఫిబ్రవరి నాటికి తారస్థాయికి చేరుతుందని ప్రభుత్వం హెచ్చరించిందని... ఈ నేపథ్యంలో టీనేజర్లకు టీకా ఇవ్వడం అత్యంత కీలకమైనదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పరిధిలో ఉచితమే... టీనేజర్లకు ఇవ్వాల్సిన కరోనా టీకాలను ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ ఉచితంగానే టీకా ఇస్తారు. అయితే ప్రైవేటులో ఇచ్చే టీకాను ప్రస్తుత ధరకే ఇస్తారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. పిల్లలకు టీకా ఇస్తున్న నేపథ్యంలో ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మొదటి వారం రోజులపాటు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని, తర్వాత అనుభవాలను బట్టి తదుపరి చర్యలుంటాయని అధికారులు తెలిపారు. మరోవైపు 60 ఏళ్లు పైబడిన అనారోగ్య సమస్యలు ఉన్న వారితోపాటు వైద్యులు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లకు ప్రివెంటబుల్ డోస్ (బూస్టర్ డోసు) టీకా ఇవ్వాలని కూడా కేంద్రం నిర్ణయించడంతో ఆయా లబ్ధిదారుల సంఖ్య, వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు 41.60 లక్షల మంది, ఫ్రంట్లైన్ వర్కర్లు 6.34 లక్షల మంది ఉంటారని, వారిలో రెండో డోస్ పూర్తయిన వారికి జనవరి 10 నుంచి బూస్టర్ డోస్ ఇస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు నూటికి నూరు శాతం మంది మొదటి డోస్ తీసుకున్నారు. రెండో డోస్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. మార్గదర్శకాలపై స్పష్టత రావాలి... పిల్లలకు కరోనా టీకాతోపాటు పెద్దలకు ప్రివెంటబుల్ డోస్ (బూస్టర్)పై కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటాం. ఇప్పటికైతే ప్రధాని విధాన నిర్ణయాన్నే ప్రకటించారు. దానికి సంబంధించి పూర్తి వివరాలతో మార్గదర్శకాలు రావాల్సి ఉంది. పిల్లలకు ఏ కంపెనీ టీకాలు వేస్తారు? ఎలా వేస్తారు? తదితర అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. – డాక్టర్ రమేశ్రెడ్డి, వైద్యవిద్య సంచాలకుడు 15–18 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా వేయాలని కేంద్రం నిర్ణయించడం సబబే. చిన్న వయసులో పిల్లలకు ఇచ్చే ఇతర టీకాలు ఎంత సురక్షితమో కరోనా వ్యాక్సిన్ కూడా అంతే సురక్షితం. ప్రస్తుతం ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీ పిల్లలకు వ్యాక్సిన్ వేయించడానికి తల్లిదండ్రులు వెనుకాడవద్దు. – డాక్టర్ ఎస్.కవిత, పీడియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్, నిలోఫర్ -
తిరుమల వెళ్లాలంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి
-
హై స్కూళ్లు, కాలేజీల్లోనే సచివాలయ సిబ్బంది ద్వారా వ్యాక్సినేషన్
-
ఏపీలో15నుండి18 ఏళ్లు వారికీ కోవిడ్ టీకా..
-
10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అధిక కేసులు నమోదవుతున్న 10 రాష్ట్రాలకు కేంద్రం సహాయ బృందాలను పంపింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, మిజోరాం, కర్ణాటక, బిహార్, యూపీ, జార్ఖండ్, పంజాబ్ల్లో కేసులు పెరగడం, వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండడంతో నిపుణుల బృందాలను పంపామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల్లో 3–5 రోజులుండి రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలిసి పనిచేస్తాయని తెలిపింది. కాంటాక్ట్ ట్రేసింగ్, కంటైన్మెంట్, తగినన్ని శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపడంపై ఈ బృందాలు ప్రత్యేక శ్రద్ధ పెడతాయి. కోవిడ్ నిబంధనల అమలు, ఆస్పత్రుల్లో పడకల వివరాలు, అంబులెన్సులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లభ్యత, టీకా కార్యక్రమంపై సమీక్ష చేస్తాయి. ఆవివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతాయి. ఒమిక్రాన్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు బీఎంసీ(బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ప్రకటించింది. బీఎంసీ పరిధిలోని ఎక్కడా ఉత్సవాలు జరపకూడదని కమిషనర్ ఇక్బాల్ సింగ్ స్పష్టం చేశారు. డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే ముంబైలో రాత్రి పూట ఐదుగురికి మించి గుమికూడడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత్లో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య శనివారానికి 415కు చేరింది. వీరిలో 115మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర(108)లో నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో ఢిల్లీ(79), గుజరాత్(43), తెలంగాణ(38), కేరళ(37), తమిళనాడు(34), కర్ణాటక(31) ఉన్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 7,189 కరోనా కేసులు, 387 మరణాలు నమోదయ్యాయి. వరుసగా 58వ రోజు కూడా కొత్త కేసులు 15వేలకు లోపు నమోదు కావడం విశేషం. అదేవిధంగా మొత్తం యాక్టివ్ కేసులు 77,032కు చేరాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో ఇది 0.22 శాతానికి సమానం. -
బూస్టర్ డోసుపై అధ్యయనం
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో టీకాల బూస్టర్ డోసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బూస్టర్ డోసు సామర్ధ్యాన్ని పరిశీలించేందుకు ఇప్పటికే అన్ని డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న 3వేల మందిపై వైద్య అధ్యయనం నిర్వహించనుంది. హరియాణాకు చెందిన ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ కారణంగా బూస్టర్ డోసులకు అనుమతినిచ్చారు. ఒమిక్రాన్ కారణంగా యూరప్ సహా పలు దేశాల్లో మరో వేవ్ వచ్చే అవకాశాలు పెరిగాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. టీకాలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు బూస్టర్ డోసుతో మరింత రక్షణ లభిస్తుందని చెబుతున్నాయి. వీటన్నింటిపై తాజా అధ్యయనంలో చర్చించనున్నారు. -
ఒక్క అడుగే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఒమిక్రాన్ దడ.. ముంగిట్లో థర్డ్వేవ్ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం జనం పరుగులు తీస్తున్నారు. ‘ఏం పర్వాలేదు’అని ఇప్పటివరకు అనాసక్తి చూపిన వాళ్లూ టీకా వేయించుకుంటున్నారు. రాష్ట్రంలో అర్హత గల వ్యక్తుల్లో 100 శాతం (99 శాతం) చేరువలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. రెండో డోస్ వేయించుకున్నవారు కూడా 63 శాతానికి చేరుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వచ్చే నెల మొదటి వారం వరకు రెండో డోస్ అర్హత కలిగిన వ్యక్తులందరికీ కూడా 100 శాతం అందించేలా ప్రత్యేక ప్రణాళిక వేసినట్టు అధికారులు తెలిపారు. టార్గెట్ 2.7 కోట్లు మంది కరోనా వ్యాక్సిన్ను 18 ఏళ్లు పైబడినవారికి వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం 18 ఏళ్లు నిండి వ్యాక్సిన్కు అర్హులైన వారు రాష్ట్రంలో 2,77,67,000 మంది ఉన్నారు. వీరందరికీ రెండు డోస్లు వ్యాక్సిన్ పూర్తి చేసే దిశగా సర్కారు ప్రణాళిక వేసింది. అర్హత గల వ్యక్తుల్లో ఇప్పటివరకు 2,75,88,003 మందికి వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో అనేక మంది వలస కూలీలు, కార్మికులు, ఇతర ఉద్యోగులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. హైదరాబాద్, మెదక్, ఇతర కొన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి రంగారెడ్డి జిల్లాలో 113 శాతం, హైదరాబాద్లో 110 శాతం, మెదక్లో 104 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ జరిగిందని అధికారులు తెలిపారు. ఇక రెండో డోస్ 1.76 కోట్ల మందికి (63 శాతం) వేశారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 86 శాతం, హైదరాబాద్లో 80 శాతం, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో 78 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76 శాతం రెండో డోస్ వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యంత తక్కువగా కొమురం భీం జిల్లాలో 33 శాతం, వికారాబాద్ జిల్లాలో 36 శాతం, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో 43 శాతం చొప్పున రెండో డోస్ వేశారు. వ్యాక్సినేషన్లో ముఖ్యాంశాలు ♦మొదటి, రెండో డోస్లు కలిపి 4.51 కోట్లు వేశారు. ప్రభుత్వ కేంద్రాల్లోనే ఎక్కువగా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ♦రాష్ట్రంలో అందుబాటులో ఉన్న టీకా డోస్లు – 33.98 లక్షలు. ఇందులో కోవిషీల్డ్ 19.17 లక్షలు, కోవాగ్జిన్ 14.81 లక్షల డోస్లు. ♦ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసేలా మొబైల్ టీంలను ఏర్పాటు చేశారు. ♦కొన్నిచోట్ల కరోనా టీకాలు వేసుకోకపోతే జీతాలు ఇవ్వొద్దని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ♦పొలాలు, గడ్డివాముల మీదికి కూడా ఎక్కి వైద్య సిబ్బంది టీకాలేస్తున్నారు. పనిచేసే చోట కూడా వ్యాక్సినేషన్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ♦18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. -
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ప్రకటన విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: ప్రతి రోజూ మరింత ఎక్కువ మంది అర్హులైన వయోజనులకు కోవిడ్ టీకాలను వేయాలని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు కోవిడ్పై సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వివరాలతో కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘క్రిస్మస్, కొత్త ఏడాది నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే రాష్ట్రాలు కంటైన్మెంట్ చర్యలు, ఆంక్షలు విధించాలి. ఆంక్షలు విధిస్తే కనీసం 14 రోజులపాటు అమలుచేయాలి. తొలి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్, అర్హులైన వారికి రెండు డోస్లూ ఇవ్వాలి. తొలి, రెండో డోస్లు పూర్తి చేయడంలో జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ శాతం నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ’అని కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొంది. ‘కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కన్నా పెరిగినా, ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయమున్న ఐసీయూ పడకలు 40 శాతానికి మించి నిండినా స్థానికంగా కంటైన్మెంట్ చర్యలు వెంటనే తీసుకోవాలి’అని ప్రకటనలో సూచించింది. (చదవండి: ఆవు తల్లితో సమానం) -
మిగిలింది 1.72 శాతమే
సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో టీకాల పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో 98.28 శాతం మందికి ఒక డోసు టీకా పూర్తయింది. అంటే టీకా తీసుకోని వారు 1.72 శాతం మాత్రమే ఉన్నారు. 18 ఏళ్లు పైబడిన వారు రాష్ట్రంలో 3,95,22,000 మంది ఉండగా, 3,88,44,166 మందికి తొలి డోసు టీకా వేశారు. 70.51 శాతం అంటే 2,78,67,898 మందికి రెండు డోసుల టీకాను ప్రభుత్వం పూర్తి చేసింది. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధం కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇంటింటా ఫీవర్ సర్వేను కూడా చేపట్టి, వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై దృష్టి పెట్టింది. ఈ నెలలో ఇప్పటివరకూ 32,762 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి రాగా 31,356 మందిని వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. వీరిని హోమ్ ఐసోలేషన్లో ఉంచుతూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 30,466 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా 44 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరి సన్నిహితుల్లో 9 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారించారు. 29,926 మందికి నెగెటివ్ వచ్చింది. 496 మంది ఫలితాలు రావాల్సి ఉంది. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్కు పంపి పరీక్షించారు. వీరిలో విజయనగరం, చిత్తూరు జిల్లాలకు చెందిన ఇద్దరికి మాత్రమే ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు తేలింది. వీరిలో ఒకరు పూర్తిగా కోలుకోగా, మరొకరు చికిత్స పొందుతున్నారు. వారం రోజుల్లో 6,330 మందికి జరిమానా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించని వ్యక్తులు, వీరిని అనుమతించిన వ్యాపార సముదాయాలకు జరిమానా విధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 6,330 మందికి సంబంధిత శాఖలు జరిమానా విధించాయి. వీరి నుంచి రూ.9,91,259 వసూలు చేశారు. 135 మందికి పాజిటివ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో (బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు) 31,158 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకరు చొప్పున ముగ్గురు మృతి చెందారు. 164 మంది కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20,76,212కి చేరింది. వీరిలో 20,60,400 మంది కోలుకోగా, ప్రస్తుతం 1,326 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మృతుల సంఖ్య 14,486కి చేరింది. ఇప్పటి వరకు 3,10,98,568 నమూనాలను పరీక్షించారు. 29 శాతం సర్వే పూర్తి ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో 34వ విడత ఫీవర్ సర్వేను ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. గురువారంనాటికి నాలుగు రోజుల్లో 29.02 శాతం ఇళ్లల్లో సర్వే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.66 కోట్ల గృహాలు ఉండగా ఇప్పటికే 48,22,539 ఇళ్లను ఆరోగ్య సిబ్బంది సందర్శించారు. కరోనా అనుమానిత లక్షణాలున్న 12,814 మందిని గుర్తించారు. వీరికి స్క్రీనింగ్ నిర్వహించారు. -
తొమ్మిదోసారి వ్యాక్సిన్.. అసలు విషయం తెలిస్తే షాక్!
కరోనా వైరస్ తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ మాత్రమే రక్ష అని తెలిసినప్పటికీ.. కొంతమంది మాత్రం ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకాడుతున్నారు. చాలా మంది అయితే ఇప్పటకీ మొదటి డోస్ వ్యాక్సిన్ కూడా వేయించుకోకపోవడం గమనార్హం. అయితే ఇటీవల ఓ వ్యక్తి మాత్రం తొమ్మిదో సారి వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చి.. అక్కడ ఉన్నవారందరినీ షాక్కు గురిచేశాడు. ఈ ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది. బెల్జియంలోని వాలూన్ ప్రావిన్స్ చార్లెరోయ్ నగరంలో ఓ యువకుడు వ్యాక్సిన్ తీసుకోకుండా సర్టిఫికెట్ పొందాలనుకునే వారిని సంప్రదించి, వారి నుంచి డబ్బులు వసూలు చేసి వారి స్థానంలో అతను వ్యాక్సిన్ వేయించుకోవటం మొదలు పెట్టాడు. టీకా తీసుకున్న తరువాత టీకా ధృవీకరణ పత్రాన్ని సదరు వ్యక్తులకు ఇచ్చేవాడు. ఇలా ఆ వ్యక్తి తొమ్మిదోసారి వ్యాక్సిన్ కోసం స్థానిక వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చి సిబ్బందికి పట్టుబడ్డాడు. సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా.. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఇప్పటకీ ఎనిమిది డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. ఇప్పటికీ 8 డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పటికీ అతను పూర్తిగా సాధారణ స్థితిలోనే ఉన్నాడు. ఎనిమిది డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అతని శరీరంలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించడంలేదని సమాచారం. ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్లో ఉంచామని పోలీసులు తెలిపారు. -
మొత్తం 236 ఒమిక్రాన్ కేసుల్లో 104 మంది కోలుకున్నారు: ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్పై పోరాటంలో భాగంగా ఓ మైలురాయిని అధిగమించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. 18 ఏళ్లకు పైబడిన జనాభాలో దాదాపు 60 శాతానికిపైగా జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తిచేసినట్లు ఈరోజు మంత్రి మన్సుఖ్ మాండావియా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దేశంలోని వయోజన జనాభాలో 89 శాతం మంది ఫస్ట్ డోస్ వాక్సిన్ వేయించుకున్నారని ఆయన తెలిపారు. గురువారం ఉదయం 7 గంటల వరకు నమోదుచేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో 70,17,671 డోసుల వ్యాక్సిన్ను దేశ ప్రజలకు అందించడం ద్వారా, ఇప్పటివరకు 139.70 కోట్ల వ్యాక్సిన్ డోస్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కాగా గడచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 6,960 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. ఐతే, దేశంలో ఇప్పటివరకు 236 ఒమిక్రాన్ కేసులు కూడా వెలుగులోకిరాగా, వీరిలో 104 మంది రోగులు కోలుకున్నారు. ఇంతవరకూ ఒక్క ఒమిక్రాన్ మరణం కూడా సంభవించకపోవడం గమనార్హం. మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తవేరియంట్ ఉధృతి కొనసాగుతోందని ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. చదవండి: నో! నేనొప్పుకోను.. మగవాడిగా ఉండేందుకు హార్మోన్లు తీసుకో! Koo App Accomplishing more new feats! Congratulations India 🇮🇳 Aided by public participation & dedicated efforts of our health workers, over 60% of the eligible population fully vaccinated now 💉 #SabkoVaccineMuftVaccine View attached media content - Dr Mansukh Mandaviya (@mansukhmandviya) 23 Dec 2021 -
జనానికి వాక్సిన్ అంటే భయం ఎందుకు ??
-
నో వ్యాక్సిన్.. నో శాలరీ.. నో జాబ్!
ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణతో వర్క్ఫ్రమ్ హోం కొనసాగింపు డిమాండ్కు తలొగ్గుతున్న టెక్ దిగ్గజాలు.. ఉద్యోగుల వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు!. ఈ విషయంలో జీతాల కోతల నుంచి అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సైతం వెనకాడట్లేదు. తాజాగా వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగుల్ని.. ఇంటికి సాగనంపాలని గూగుల్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో పయనించేందుకు కంపెనీలన్నీ సిద్ధపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, ఇతర కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు అలర్ట్. వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. ఆ సర్టిఫికెట్ను కంపెనీల్లో సమర్పించండి. లేకుంటే జీతాల కట్టింగ్.. అవసరమనుకుంటే ఊస్టింగ్కు కంపెనీలు సిద్ధపడుతున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ నిర్ణయం ప్రకటించాక.. తర్వాత మరో ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయమే ప్రకటించింది. సెమీకండక్టర్లు తయారు చేసే ఇంటెల్ కంపెనీ తాజాగా ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 4లోపు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్-వివరాల్ని సమర్పించాలని.. లేనిపక్షంలో వేతనం లేని సెలవుల మీద ఉద్యోగుల్ని పంపిస్తామని హెచ్చరించింది. ఇక వ్యాక్సినేషన్ను దూరంగా ఉంటున్న ఉద్యోగాలు మినహాయింపుల కోసం సరైన ధృవపత్రాల్ని సమర్పించాలని కోరింది. మెడికల్, మతపరమైన కారణాలను మాత్రమే మినహాయింపులుగా పరిగణిస్తామని, ఇతర కారణాలను అంగీకరించబోదని మెమోలో పేర్కొంది ఇంటెల్. ఇందుకోసం మార్చి 15, 2022 డెడ్లైన్ విధించారు. ఇక వ్యాక్సినేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. మూడు నెలలపాటు జీతాలు ఇవ్వమని, అప్పటికీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోతే తొలగింపు దిశగా ఆలోచిస్తామని ఇంటెల్ హెచ్ఆర్ హెడ్ క్రిస్టీ పాంబియాంచీ వెల్లడించారు. ఇక గూగుల్, ఇంటెల్ లాగే మరో 100 కంపెనీలు (మైక్రోసాఫ్ట్, మెటాలతో పాటు భారత్కు చెందిన కొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి) ఈ నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లోనూ! వ్యాక్సినేషన్కి దూరంగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని దేశంలోని కంపెనీలు సైతం నిర్ణయించాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు, చిన్నాచితకా కంపెనీలు సైతం ఉద్యోగుల్ని వ్యాక్సినేషన్ రిపోర్టులు సమర్పించాలని పట్టుబడుతున్నాయి. కొన్ని కంపెనీలైతే వ్యాక్సినేషన్కు దూరంగా ఉంటున్న ఎంప్లాయిస్కు ‘హై రిస్క్’ ట్యాగ్ను తగిలిస్తుండడంతో.. సదరు ఉద్యోగులు అవమానభారంగా భావిస్తున్నారు. తద్వారా వ్యాక్సినేషన్లో పాల్గొంటున్నారు. నో రిక్రూట్మెంట్ ఇక ఉద్యోగాల విషయంలోనే కాదు.. వాటి భర్తీ విషయంలోనూ కఠినంగా వ్యాక్సినేషన్ రూల్స్ ఫాలో అవుతున్నారు. వ్యాక్సినేషన్కు దూరంగా ఉంటే.. వాళ్లకు ఉద్యోగాలు కష్టంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఐటీ, కార్పొరేట్, రియల్టి, ఫ్యాకల్టీ రంగాల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పణ కాలం తప్పనిసరిగా ఉంటోంది. చాలా కంపెనీల్లో హెచ్ఆర్లు.. ఇంటర్వ్యూ ప్రాసెస్ మొదలుపెట్టే ముందే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు అడుగుతుండడం విశేషం. చదవండి: ఒమిక్రాన్ అలజడి! భారత్ను కుదిపేయనుందా? -
ప్రధాని ఫోటో తొలగించాలంటూ పిటిషన్.. లక్ష జరిమానా వేసిన హైకోర్టు!
PM Photo On Vaccination Certificate: కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని చిత్రాన్ని ఉపయోగించడం వల్ల ఉపయోగం లేదా ఔచిత్యం లేదంటూ పిటిషనర్ పీటర్ మైల్పరంబిల్ అక్టోబర్ నెలలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు ఈ పిటిషన్ విచారణ సంధర్బంగా హైకోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఈ పిటిషన్ వెనుక రాజకీయ ఉద్దేశం దాగి ఉందని, ప్రజా ప్రయోజనాల కోసం కాదని కేవలం ప్రచారం కోసమేనని కోర్టు పేర్కొంది. (చదవండి: ఉత్తర కొరియాలో 11 రోజుల పాటు నవ్వకూడదట!!) ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టీస్ పీవీ కున్హికృష్ణన్ మాట్లాడుతూ... "ప్రధానమంత్రిని కాంగ్రెస్ ప్రధాని అని గానీ బీజేపీ ప్రధాని అని గానీ లేదా ఏ రాజకీయ పార్టీకి ప్రధాని అని గానీ ఎవరూ చెప్పలేదు. కానీ రాజ్యాంగం ప్రకారం ఒకసారి ప్రధాని పదవికి ఎన్నికైతే ఆయనే మన దేశానికి ప్రధానమంత్రి." అని అన్నారు. అంతేకాదు ప్రభుత్వ విధానాలపైన లేదా ప్రధాన మంత్రి రాజకీయ వైఖరిపై కూడా విభేదించవచ్చు. కానీ పౌరులకు ధైర్యాన్ని పెంపొందించే సందేశంతో ప్రధానమంత్రి ఫోటోతో కూడిన టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకువెళ్లడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని అన్నారు. ప్రజా తీర్పుతోనే మోదీ ప్రధాని అయ్యారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు పిటిషనర్కి హైకోర్టు రూ. 1 లక్ష జరిమానాను విధించింది. పైగా ఆరు వారాల్లోగా కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (కెఎల్ఎస్ఎ)కి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, జరిమానాను సకాలంలో జమ చేయడంలో విఫలమైతే అతని ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేయాలని కోర్టు పేర్కొంది. అంతేకాదు కోర్టులో తీవ్రమైన కేసులు నమోదవుతున్నప్పుడు, అలాంటి అనవసరమైన పిటిషన్లను ప్రోత్సహించలేము అని కూడా హెచ్చరించింది. (చదవండి: టెస్లా కారులో పుట్టిన తొలి పాపగా రికార్డు!!) -
న్యూజెర్సీలో వ్యాక్సినేషన్ డ్రైవ్
న్యూజెర్సీలో సాయి దత్త పీఠం వుడ్ లేన్ ఫార్మసీ తో కలిసి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించిందిది. న్యూజెర్సీలోని వుడ్ లేన్ ఫార్మసీ (ఓల్డ్ బ్రిడ్జి) దగ్గర జరిగిన ఈ వ్యాక్సిన్ డ్రైవ్ లో పిల్లలకు, పెద్దలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించారు. కోవిడ్ రెండు డోసులు పూర్తయిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చారు. అమెరికాలో మన వాళ్ళు కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు సాయి దత్త పీఠం ఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. ప్రశంసలు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో దాదాపు 250 మందికి పైగా తెలుగువారు వ్యాక్సిన్లు వేయించుకున్నారు. ఈ సందర్భంగా న్యూజెర్సీ సెనేట్, అసెంబ్లీ తరఫున స్టెర్లే ఎస్ స్టాన్లీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో స్థానిక సాయిదత్త పీఠం, వుడ్ లేన్ ఫార్మసీ, ఓల్డ్ బ్రిడ్జి న్యూజెర్సీలు చేపట్టిన కమ్యూనిటీ సేవాదృక్పధాన్ని కొనియాడారు. ప్రశంసా పత్రాన్ని అందించారు. కృతజ్ఞతలు ఈ వ్యాక్సినేషన్లో పాల్గొన్న ఫార్మసిస్ట్ రవి, డాక్టర్ విజయ నిమ్మ, డాక్టర్ ప్రసాద్ సుధాన్షు, నర్సులు శిరు పటేల్, సలోని గజ్జర్లతో పాటు వాలంటీర్లు గీతావాణి గొడవర్తి, మృదుల భల్లా, అంజలిబుటాలా, రావు ఎలమంచిలి, వికాస్, అన్షు, పల్లవి వీరికి సహాకరించిన పాటు ఇషిత్ గాంధీ, కిరణ్ తవ్వాలకు సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, బోర్డు సభ్యులు వెంకట్ మంత్రిప్రగడ, దాము గేదెల, మురళీ మేడిచెర్ల, సుభద్ర పాటిబండ్ల, వంశీ గరుడలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి న్యూజెర్సీ పబ్లిక్యూటీలిటీ కమిటీ ఉపేంద్ర చివుకుల సహకారం అందించారు. -
ఒమిక్రాన్ కట్టడికి ఐదు సూత్రాల ప్రణాళిక ఇదే..: ఆరోగ్య శాఖ
గుంటూరు మెడికల్: ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒమిక్రాన్ కట్టడికి ఐదు సూత్రాల ప్రణాళిక సిద్ధం చేశారు. మొట్టమొదటి సూత్రం – విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా ఒమిక్రాన్ కేసులు వస్తున్న దృష్ట్యా మొట్టమొదటిగా విమానాశ్రయంలోనే వైరస్ బాధితులను గుర్తించి అక్కడే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాకు చెందిన ఏడుగురు వైద్యులు, వైద్య సిబ్బంది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 24?7 విధులు నిర్వహిస్తూ విదేశాల నుంచి జిల్లాకు చెందిన వారు ఎవరైనా కనిపించగానే తక్షణమే వారికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసి కొన్నిరోజులు క్వారంటైన్లో ఉంచుతున్నారు. ఒమిక్రాన్ కేసులు నమోదు ప్రారంభమైన తరువాత జిల్లాకు 1783 మంది వివిధ దేశాల నుంచి వచ్చారు. వీరందరికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసి ఒమిక్రాన్ లేకపోవడంతో వైద్య అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండో సూత్రం.. ప్రతి ఒక్కరికి కోవిడ్–19 వ్యాక్సిన్ వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.జిల్లా జనాభాలో 96 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని, నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు. మూడో సూత్రం వ్యాక్సిన్ వేసుకోవడంతోపాటు, మాస్క్ పెట్టుకుంటేనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకదనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్ధమయ్యేలా అవగాహన కల్పిస్తూ మాస్క్లు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించేవారిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. మాస్క్లు ధరించకుండా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న జిల్లాలోని 96,675 మంది నుంచి రూ. 71,02,250లు జరిమానా వసూలు చేశారు. నాల్గవ సూత్రం.. కోవిడ్–19 వ్యాధి నిర్ధారణ పరీక్షలు విస్తృత స్థాయిలో వైద్య అధికారులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో డిసెంబరు 12 నాటికి 1,79,080 పాజిటీవ్ కేసులను నిర్ధారించి వైద్య సేవలందించగా, 1,77,647 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడంతోపాటు, మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రాంతాల్లోనే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సిబ్బంది కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా వైరస్ను ముందస్తుగానే గుర్తించి కట్టడి చేసేలా వైద్య అధికారులు ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్నారు. ఐదో సూత్రం.. వైద్య అధికారులు ఇంటింటికి సర్వే కార్యక్రమం చేపట్టారు. కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఎవరైనా ఇళ్లలోనే ఉంటే, వారి నుంచి ఇతరులకు వైరస్ సోకకుండా ఇళ్ల వద్దే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొంత మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒమిక్రాన్ కేసుల నమోదు దృష్ట్యా ప్రజలు అపోహలు, ఆందోళనలు విడనాడి అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలి. అన్నిరకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది. వైద్య సిబ్బంది సైతం ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారు. – డీఎంహెచ్ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ చదవండి: ‘బ్యాంకుల్లో ఉన్న రూ.10 లక్షల కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టేందుకే ఈ కుట్ర'! -
గూగుల్ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగుల తొలగింపు!
కరోనా టైంలో వర్క్ఫ్రమ్ హోం ద్వారా ఉద్యోగులకు ఊరట ఇస్తూ వస్తున్న టెక్ దిగ్గజ కంపెనీలు.. ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి నేపథ్యంలో ‘ఆఫీస్ రిటర్న్’ను కొంత కాలం వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాయి. ఈ క్రమంలో ఆల్ఫాబెట్ కంపెనీ ‘గూగుల్’ అయితే ఏకంగా నిరవధిక వాయిదాను ప్రకటించింది కూడా. అయితే వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులను తొలగించాలన్న గూగుల్ ఉత్తర్వులపై ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. తాజాగా గూగుల్ లీడర్షిప్ పేరిట ఒక మెమో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. డిసెంబర్ 3లోపు వ్యాక్సినేషన్ స్టేటస్ను సమర్పించని ఉద్యోగులపై చర్యలు తప్పవని అందులో ఉంది. ఈ మేరకు సీఎన్బీసీ, రాయిటర్స్లు ఆ మెమోకు సంబంధించిన కాపీలను ప్రచురించాయి. వ్యాక్సిన్ స్టేటస్ను సమర్పించని ఉద్యోగులకు జీతాల్లో కోతలు విధించమో లేదంటే శాశ్వతంగా విధుల నుంచి(అసలు వ్యాక్సిన్ వేయించుకోనివాళ్లను) తొలగించడమో చేయాలని భావిస్తోంది. ఈ అఫీషియల్ మెమో ప్రకారం.. డిసెంబర్ 3లోపు వ్యాక్సినేషన్ స్టేటస్ను అప్లోడ్ చేయని గూగుల్ ఉద్యోగులపై చర్యలు తప్పవు. అలాగే వ్యాక్సినేషన్కు దూరంగా ఉన్న ఉద్యోగులు.. ఎన్ని విజ్ఞప్తులు చేసినా గూగుల్ ఇక పట్టించుకోదు. వ్యాక్సినేషన్ రూల్స్ ఉల్లంఘించిన వాళ్లపై జనవరి 18, 2022 లోపు చర్యలు ఉంటాయి. వాళ్లను ముందుగా 30 పెయిడ్ లీవ్ మీద పక్కనపెడతారు. లేదంటే అన్పెయిడ్ పర్సనల్ లీవ్ మీద ఆరు నెలలు పక్కనపెడతారు. ఆపై ఏకంగా విధుల నుంచి తొలగిస్తారు. అయితే ఈ మెమోపై స్పందించేందుకు గూగుల్ ప్రతినిధులు నిరాకరించారు. ఇక యూఎస్ కంపెనీలకు బైడెన్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల అనుసారం.. వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది గూగుల్. దీనిపై ఆన్లైన్ సైన్ పిటిషన్ ద్వారా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడంతో.. అఘమేఘాల మీద ఆ ఉత్తర్వుల్ని సైతం నిలుపుదల చేసినట్లు ప్రకటించుకున్న గూగుల్. ఈ క్రమంలో ఇలా ఉన్నపళంగా ఉద్యోగులను తొలగిస్తామన్న ప్రకటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చదవండి: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2021.. మనోడు కాకున్నా తెగ వెతికారు! -
AP: అప్రమత్తతే ఆయుధం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు విస్తృతంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉంటూ కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేయడం, ట్రేస్ చేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా మరోదఫా మహమ్మారికి అవకాశం ఇచ్చినట్లవుతుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ‘స్పందన’లో భాగంగా సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్పై పలు సూచనలు చేశారు. అధికార యంత్రాంగానికి అభినందనలు కోవిడ్ నియంత్రణపై అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేస్తోంది. 32 దఫాలు ఇంటింటి సర్వే చేసి డేటా సేకరించారు. కోవిడ్ అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.36 శాతం కాగా రాష్ట్రంలో 99.21 శాతం ఉంది. మరణాల రేటు దేశంలో 1.37 శాతం అయితే మన దగ్గర 0.7 శాతం మాత్రమే ఉంది. సంపూర్ణ వ్యాక్సినేషన్ దిశగా... రాష్ట్రంలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ నెలాఖరులోగా నూటికి నూరు శాతం సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. డబుల్ డోస్ వ్యాక్సినేషన్ కూడా వీలైనంత త్వరగా పూర్తవ్వాలి. డోసుల మధ్య విరామాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందా? ఉంటే.. ఎలా చేయాలి? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని అధికారులను ఆదేశించాం. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే దీని ఉద్దేశం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొదటి డోసు వంద శాతం పూర్తయింది. కలెక్టర్, సిబ్బంది అందరికీ అభినందనలు. వ్యాక్సినేషన్లో వెనకబడ్డ జిల్లాలపై ధ్యాస పెట్టాలి. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, చిత్తూరు, విశాఖ కలెక్టర్లు వ్యాక్సినేషన్పై దృష్టి సారించాలి. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ తరహా మరెక్కడా లేదు.. వంద పడకలు దాటిన ప్రైవేట్ ఆస్పత్రులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశాం. పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులిచ్చాం. వారికి సబ్సిడీ కూడా అందించాం. దీనిపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. డీ–టైప్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తగినన్ని అందుబాటులో ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వం 144 పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ నెలాఖరున వీటిని ప్రారంభించబోతున్నాం. మరే రాష్ట్రంలోనూ ఈ తరహా ఏర్పాటు లేదు. ఇంత పెద్ద సంఖ్యలో ఎవరూ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నెలకొల్పలేదు. కోవిడ్ ఆస్పత్రుల సన్నద్ధతపై కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. 104 వన్ స్టాప్ సెంటర్ 104 కాల్ సెంటర్పై మరోసారి అధికారులు సమీక్ష చేయాలి. కాల్ చేయగానే వెంటనే స్పందన ఉండాలి. కోవిడ్ నివారణ చర్యలు, చికిత్సకు 104 వన్ స్టాప్ సొల్యూషన్. నిర్దేశించుకున్న సమయంలోగా కాల్ చేసిన వారికి సహాయం అందాలి. కాల్ చేస్తే స్పందన లేదనే మాట ఎక్కడా వినిపించకూడదు. -
ఏకంగా పది కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్న మహానుభావుడు!
Man Vaccinated 10 Times In One Day: ఒక్క కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నాకే నాకు బాగోలేదని కొందరూ... బాబోయ్! మేము వ్యాక్సిన్ వేయించుకోమంటూ ఇప్పటికీ భయపడుతున్నవాళ్లు ఉన్నారు. అయితే న్యూజిలాండ్కి చెందిన ఈ మహానుభావుడు మాత్రం ఏకంగా పది కరోనా వ్యాక్సిన్లు వేయించుకన్నాడు. (చదవండి: ఎల్లప్పుడూ ఇలానే ఉండనివ్వండి!.... సోదరీమణులతో దిగిన ఫోటోలను పోస్ట్ చేసిన కత్రినా!) అసలు విషయంలోకెళ్లితే...న్యూజిలాండ్కు చెందిన ఒక వ్యక్తి కేవలం 24 గంటల్లో 10 వ్యాక్సిన్లు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇది నిజమా కాదా అన్న ఉద్దేశంతో న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి ధర్యాప్తు చేయడం మొదలుపెట్టింది. అయితే సదరు వ్యక్తి వేర్వేరు వ్యక్తుల గర్తింపు కార్డులతో వ్యాక్సిన్ మరీ వేయించుకున్నాడని విచారణలో తెలుస్తుంది. దీంతో ఆరోగ్య మంత్రిత్వశాఖకు సంబంధించిన కోవిడ్ వ్యాక్సిన్ మేనేజర్ ఆస్ట్రిడ్ కూర్నీఫ్ ఆ వ్యక్తి ఆరోగ్యం గురించి ఆందోళనకు గురై సదరు వ్యక్తిని తక్షణమే వైద్యుడుని సంప్రదించవల్సిందిగా సూచించారు. అయితే హెల్త్ రికార్డు ప్రకారం ఎవరి హెల్త్ రికార్డు ప్రకారం వారు వేయించకోవాలి. ఇలా మరోకరి గుర్తింపు రికార్డుతో వేయించుకోవడం చాల ప్రమాదం అంటూ న్యూజిలాండ్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హెలెన్ ప్రజలను హెచ్చరించారు. (చదవండి: పెళ్లి చేసుకోమని అడిగినందుకు... గొంతు కోసి చంపేశాడు!) -
Coronavirus Updates: 24 గంటల్లో కొత్తగా 7,774 కోవిడ్ కేసులు.. 306 మంది మృతి!
న్యూఢిల్లీ: గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,774 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం 92,281 కేసులు యాక్టివ్ కేసులున్నాయి. 306 మంది ఒకే రోజు మరణించారు. 8,464 రికవరీలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,90,510కు చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 4,75,434కు చేరినట్లు ఆరోగ్య శాఖ ఆదివారం మీడియాకు తెల్పింది. అన్ని రాష్ట్రాల కంటే కేరళలో అత్యధికంగా 3,795 కేసులు, మహారాష్ట్రలో 807 కేసులు, తమిళనాడులో 681, పశ్చిమ బెంగాల్లో 610 కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల రికార్డు 0.65 శాతంగా ఉంది. కాగా గడచిన 69 రోజులతో పోల్చితే రెండు శాతం తక్కువ అని డేటా తెల్పుతోంది. అలాగే రికవరీ రేటు 98.36 శాతం ఉందని ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటన్ తెల్పుతోంది. చదవండి: ఎయిర్పోర్టులో పోర్న్ వీడియో చిత్రీకరణ.. మోడల్కు 18 యేళ్ల జైలు శిక్ష! COVID19 | India reports 7,774 new cases, 306 deaths and 8,464 recoveries in the last 24 hours; Active caseload at 92,281 pic.twitter.com/pUMkvjVcY4 — ANI (@ANI) December 12, 2021 -
ఒమిక్రాన్ అలజడి..! భారత్ను కుదిపేయనుందా...?
కోవిడ్-19 భారత ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్నే చూపింది. వ్యవసాయం, మత్స్యరంగం, మినహా దేశంలో సకల రంగాలూ 2020–21 ఆర్థిక సంవత్సరంలో తిరోగమనంలోనే వున్నాయని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. కాగా తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ప్రపంచదేశాలు భయపడిపోతున్నాయి. మైనస్ 7.3 శాతంగా వృద్ధిరేటు..! కరోనా మహమ్మారి ఫస్ట్వేవ్ను ఎదుర్కోవడం కోసం వచ్చిన లాక్డౌన్తో దేశ వృద్ధి రేటు మైనస్ 7.3 శాతంగా నమోదు అయింది. కరోనా సెకండ్ వేవ్లో కూడా గ్రోత్ రేట్ కాస్త మెరుగైంది. వేగవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియనే ఆయా దేశాలను ఆర్థిక సంక్షోభాల నుంచి కాపాడుతుందని ప్రపంచ ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. సరైన జాగ్రత్తలు తీసుకొకుంటే ఒమిక్రాన్ వేరియంట్ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థపై భారీగానే ప్రభావం చూపుతోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వేగవంతమైన వ్యాక్సినేషన్..! భారత్లో ఇప్పటివరకు 33 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నివేదికలో వెల్లడించింది. భారత్లో టీకా వేగాన్ని పెంచడంతో ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ- నవంబర్ 2021 నెలవారీ ఆర్థిక నివేదికలో పేర్కొంది. మార్కెట్ సెంటిమెంట్లు, వేగవంతమైన టీకా కవరేజ్, బలమైన బాహ్య డిమాండ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రానున్న త్రైమాసికాల్లో భారత్ ఆర్థికంగా బలపడుతుందని అంచనా వేసింది. రెండో త్రైమాసికంలో 8.4 శాతం గ్రోత్..! గత ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత్ స్థూల జాతీయోత్పత్తి (GDP) 8.4 శాతానికి పెరిగింది. సుమారు 100 శాతానికి పైగా జీడీపీ పుంజుకుంది. సేవ రంగం, తయారీ రంగాల్లో పూర్తి పునరుద్ధరణ, వ్యవసాయ రంగంలో స్థిరమైన వృద్ధి కారణంగా జీడీపీ పుంజుకోవడానికి సహాయపడింది. ప్రైవేట్ రంగంలో రికవరీ మొదటి త్రైమాసికంలో 88 శాతం నుంచి రెండో త్రైమాసికంలో 96 శాతానికి పెరిగింది. సరఫరా విభాగంలో వ్యవసాయ రంగంలో జీవీఏ దాని ప్రీ-పాండమిక్ స్థాయి కంటే ఎక్కువగా కొనసాగుతోంది. తయారీ , నిర్మాణ రంగాలు కూడా వాటి ప్రీ-పాండమిక్ స్థాయిలను అధిగమించి భారత వృద్ధికి కీలక చోదకాలుగా ఉద్భవించాయి. చదవండి: ద్రవ్యోల్బణం ఆందోళనలు ? పడిపోతున్న రూపాయి విలువ ! -
జర్మనీలో ఒమిక్రాన్ గుబులు.. అలా అయితే కష్టమే.. వారికి ‘లాక్డౌన్’
బెర్లిన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. టీకా తీసుకోని వారికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ పూర్తికాని వారు.. మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సంచరించడంపై నిషేధం విధిస్తున్నట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. దీంతోపాటు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో జర్మనీ వ్యాక్సినేషన్ను తప్పనిసరి చేయనుంది. ప్రతి ఒక్కరికి టీకాలను తప్పనిసరి చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ఈ చట్టం పార్లమెంట్లో ఆమోదం తర్వాత.. వచ్చే ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైవు.. జర్మనీ జనాభాలో ఇప్పటివరకు 75శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దాదాపు 68శాతం మందికి మాత్రమే టీకాలు పూర్తి చేసింది. ఇక డెల్టా కంటే అయిదు రెట్ల వేగంతో వ్యాపిస్తున్న ఈ కొత్త వేరియెంట్కు సంబంధించి దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే, ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్ ఉన్నాయి. (చదవండి: Viral Video: కలల రాణిని పెళ్లి దుస్తుల్లోచూసి.. ఒక్కసారిగా ఏడ్చిన వరుడు! బ్యూటిఫుల్ కపుల్..) -
Matilda Kullu: ‘ఫోర్బ్స్’ లిస్ట్లో ఆశా వర్కర్.. ఎందుకంటే..?
Who Is Matilda Kullu: శక్తిమంతమైన మహిళ అంటే కార్పొరేట్ సి.ఇ.ఓ... పెద్ద రాజకీయ నాయకురాలు.. గొప్ప కళాకారిణి... లేదా ఏ ఒలింపిక్స్ క్రీడాకారిణో అయి ఉండవచ్చు. కాని ఫోర్బ్స్ పత్రిక తాజా భారతీయ శక్తిమంతమైన మహిళల్లో ఒక ఆశా వర్కర్ చేరింది. అదీ వెనుకబడిన ఒడిస్సా రాష్ట్రం నుంచి. ఆమె పేరు మెటిల్డా కుల్లు. హేమాహేమీల మధ్య ఇలా ఆశావర్కర్కు చోటు దొరకడం ఇదే ప్రథమం. ఏమిటి ఆమె ఘనత? కోవిడ్ వాక్సినేషన్ కోసం ఆమె ఏమి చేసింది? సూదిమందుకు కులం ఉంటుందా? ఉంటుంది... కొన్నిచోట్ల... ఆ సూది వేసే చేతులు బహుశా షెడ్యూల్డ్ తెగవి అయితే. అందునా చిన్న ఉద్యోగంలో ఉంటే. ఆశా వర్కర్ అంటే నెలకు 4,500 రూపాయల జీతం. గడప గడపకు తిరిగే ఉద్యోగం. అంత చిన్న ఉద్యోగి, స్త్రీ, పైగా షెడ్యూల్డ్ తెగ... తరతరాలుగా వెనుగబడిన ఆలోచనలు ఉన్న ఊళ్లలో, అంటరానితనం పాటించడం వదులుకోని ఇళ్లల్లో ఎంత కష్టం. పైగా ఆ ఊళ్లో చాలామంది మూఢ విశ్వాసాలతో, జబ్బు చేస్తే బాణామతిని నమ్ముకునే అంధకారంలో ఉంటే వారిని ఆస్పత్రి వరకూ నడిపించడం ఎంత కష్టం. ఈ కష్టం అంతా పడింది మెటిల్డా కుల్లు. అందుకే ఫోర్బ్స్ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్ 2021’ పట్టికలోని మొత్తం 20 మంది భారతీయ మహిళలలో కుల్లుకు 3వ స్థానం ఇచ్చింది. ఆమెకు ముందు బ్యాంకర్ అరుంధతి భట్టాచార్య ఉంది. ఆమె తర్వాత క్రీడాకారిణి అవని లేఖరా, నటి సాన్యా మల్హోత్రా, కాస్మోటిక్స్ దిగ్గజం వినీతా సింగ్ తదితరులు ఉన్నారు. వీరందరి మధ్య ఒక చిరు ఉద్యోగి చేరడం సామాన్య ఘనత కాదు. ఇలా ఒక ఆశా వర్కర్ కనిపించడం ఇదే ప్రథమం. ఆ మేరకు భారతదేశంలో ఉన్న ఆశా వర్కర్లందరికీ గౌరవం దక్కిందని భావించాలి. ఎవరు మెటిల్డా కుల్లు? 45 ఏళ్ల మెటిల్డా కుల్లు ఒడిసాలోని సుందర్ఘర్ జిల్లాలో గార్దభహల్ అనే పల్లెకు ఏకైక ఆశా వర్కర్. గార్దభహల్లోని 964 మంది గ్రామీణులకు ఆమె ఆరోగ్య కార్యకర్త. 15 ఏళ్ల క్రితం ఆమె ఈ ఉద్యోగంలో చేరింది. అయితే ఒడిసా పల్లెల్లో ఆశా వర్కర్గా పని చేయడం సులభం కాదు. ‘జ్వరం వస్తే ఆస్పత్రికి వెళ్లాలి అని నేను చెప్తే నన్ను చూసి గ్రామీణులు నవ్వే వారు. ఏదైనా గట్టి రోగం వస్తే బాణామతికి ఆశ్రయించడం వారికి అలవాటు. కాన్పులు ఇళ్లల్లోనే జరిగిపోవాలని కోరుకుంటారు. పైగా నేను షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళను కావడం వల్ల ఇళ్లల్లోకి రాకపోకలకు కొందరు అంగీకరించే వారు కాదు. నన్ను ఏమన్నా ఎంత అవమానించినా వారి ఆరోగ్యం నాకు ముఖ్యం. నేను వారికి చెప్పీ చెప్పీ మార్పు తేవడానికి ప్రయత్నించేదాన్ని’ అంటుంది మెటిల్డా కుల్లు. ఉదయం 5 గంటల నుంచి మెటిల్డా దినచర్య రోజూ ఉదయం ఐదు గంటల నుంచి మొదలవుతుంది. ఇల్లు చిమ్ముకుని, పశువులకు గడ్డి వేసి, భర్త.. ఇద్దరు పిల్లలకు వంట చేసి సైకిల్ మీద ఊళ్లోకి బయలుదేరుతుందామె. గర్భిణులను, బాలింతలను, పసికందుల ఆరోగ్యాన్ని ఆమె ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారికి సూచనలు, సలహాలు మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈడేరిన అమ్మాయిలు ఎటువంటి శుభ్రత పాటించాలో చెప్పడం మరో ముఖ్యమైన పని. ఇక ఆ పల్లెల్లో చాలామందికి గర్భకుహర ఇన్ఫెక్షన్లు సహజం. దానికి తోడు లైంగిక వ్యాధుల బెడద కూడా. వీటన్నింటినీ ఆమె ఓపికగా చూస్తూ గ్రామీణులను ఆస్పత్రులకు చేర్చి వారికి నయమయ్యేలా చూసేది. కోవిడ్ టైమ్లో వారియర్ కోవిడ్ మొదటి వేవ్ కంటే రెండో వేవ్లో దేశంలో అన్ని చోట్లకు మల్లే ఒడిసాలో కూడా విజృంభించాయి. ఆ రాష్ట్రంలో ఉన్న దాదాపు 47 వేల మంది ఆశా వర్కర్ల మీద ఒత్తిడి పడ్డట్టే మెటిల్డా మీద కూడా పడింది. ‘కోవిడ్ సమయంలో నా దినచర్య ఇంకా కష్టమైంది. రోజుకు 40, 50 ఇళ్లు తిరుగుతూ కోవిడ్ సింప్టమ్స్ ఎవరికైనా ఉన్నాయా లేవా అని చూడటం నా పని. ఊళ్లో కోవిడ్ వ్యాపించకుండా నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను. ఆశా వర్కర్లకు పిపిఇ కిట్లు అందింది లేదు. అయినా సరే ఇళ్లల్లోకి వెళ్లి సింప్టమ్స్ ఉన్నవారికి బిళ్లలు ఇచ్చేదాన్ని. గ్రామీణులతో సమస్య ఏమిటంటే వారు టెస్ట్లకు రారు. హాస్పిటల్కు వెళ్లరు. కాని ఇన్నేళ్లుగా నేను సంపాదించుకున్న నమ్మకం వల్ల వారు తొందరగా స్పందించారు. వాక్సినేషన్కు అంగీకరించారు. అందరికీ దాదాపుగా వాక్సిన్ నేనే వేశాను. ఆ విధంగా ఊళ్లో కోవిడ్ను అదుపు చేయగలిగాం’ అంటుంది మెటిల్డా కుల్లు. అయితే ఇంత ప్రాణాలకు తెగించి పని చేసినా ఒక్కసారి ప్రభుత్వం అదనంగా వేసిన 2000 రూపాయల ఇంటెన్సివ్ తప్ప వేరే మేలు ఏమీ జరగలేదు. ఇప్పటికీ ఆమె పాత జీతానికే పని చేస్తోంది. ఆ కొద్దిపాటి డబ్బు కోసం అంత పని చేయడానికి ఎంత శక్తి కావాలి, ధైర్యం కావాలి, అంకితభావం కావాలి. అందుకే ఫోర్బ్స్ ఆమె శక్తివంతమైన మహిళ అంది. సమాజం కోసం పని చేసే శక్తిని అందరూ ప్రదర్శించరు. ప్రదర్శించిన వారు ఇలా ప్రశంసను పొందుతారు. ప్రశంసకు యోగ్యమైన జీవితం కదా అందరూ కొద్దో గొప్పో గడపాలి. -
మరింత ఉధృతంగా వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ను ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. టార్గెట్ నిర్దేశించుకుని మరీ వ్యాక్సినేషన్ చేపట్టాలని నిర్దేశించారు. వ్యాక్సినేషన్ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతామన్నదే మన ముందున్న లక్ష్యమని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో దూకుడుగా ఉండడం చాలా ముఖ్యమన్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ నెలాఖరుకల్లా రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్ (ఇంకా మొదటి డోసు కూడా తీసుకోని వారు, రెండో డోసు తీసుకోవాల్సిన వారితో కలిపి) పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోవాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్లో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, కేంద్రం నుంచి వస్తున్న టీకాలను వీలైనంత త్వరగా వినియోగించాలని పేర్కొన్నారు. డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్, క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్... హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్పోర్ట్లలో స్పెషల్ మెడికల్ టీమ్స్ను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్కు వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయాలి. ర్యాపిడ్ టెస్టులు కాకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్లు మాత్రమే నిర్వహించాలి. మాస్క్లపై మళ్లీ డ్రైవ్.. అందరూ మాస్క్లు ధరించేలా చర్యలు చేపట్టి మళ్లీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. ప్రజలు గుమిగూడకుండా చూడాలి. గతంలో ఉన్న నిబంధనలు అమలు చేయాలి. అవగాహన, అప్రమత్తత రెండూ ముఖ్యం. మాస్క్కు సంబంధించిన గైడ్లైన్స్ వెంటనే పాటించాలి. ఆక్సిజన్ పైప్ లైన్లు పరీక్షించాలి.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పైప్లైన్లు సరిగ్గా ఉన్నాయా? డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా? గతంలో కోవిడ్ చికిత్స కోసం వినియోగించిన అన్ని ఆసుపత్రులలో సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా? ఇవన్నీ సరి చూసుకోవాలి. ఎంప్యానల్ ఆసుపత్రులలో వసతులను కూడా పరిశీలించాలి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్పై మాక్ డ్రిల్ నిర్వహించాలి. క్షుణ్నంగా అన్నీ తనిఖీ చేయాలి. టెండర్లు పూర్తయిన మెడికల్ కాలేజీలకు వెంటనే అగ్రిమెంట్లు పూర్తి చేయాలి. అనారోగ్య సమస్యలపై కాల్ 104 ప్రజలకు ఏ అనారోగ్య సమస్య తలెత్తినా 104 కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలి. క్వారంటైన్ సెంటర్స్, కోవిడ్ కేర్ సెంటర్స్, కోవిడ్ కాల్ సెంటర్లను పరిశీలించండి. జిల్లా స్ధాయిలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. రికవరీ రేట్ 99.20 శాతం ► ఏపీలో రికవరీ రేట్ 99.20 శాతం కాగా పాజిటివిటీ రేట్ 0.64 శాతం ► నిత్యం సగటున 197 కేసులు నమోదు, యాక్టివ్ కేసులు 2,140 ► 104కి కాల్స్ తగ్గుదల ► థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధం ► అందుబాటులో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, డీటైప్ సిలెండర్లు ► 100 బెడ్స్కి పైగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు 82 ► వ్యాక్సినేషన్ ఒక డోస్ పొందిన వారు 87.43 శాతం ► రెండు డోస్లు పొందిన వారు 62.19 శాతం ► డిసెంబర్, జనవరి కల్లా రాష్ట్రంలో అందరికీ రెండు డోస్ల వ్యాక్సినేషన్ త్వరలో విజయవాడలోనే జీనోమ్ ల్యాబ్ కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత మ్యుటేషన్లు జరుగుతున్నందువల్ల చాలా వేగంగా విస్తరిస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై వివిధ దేశాల్లో అధ్యయనం జరుగుతోందని, ఈ వేరియంట్ను గుర్తించేందుకు జీనోమిక్ సీక్వెన్స్ కోసం రోజూ 15 శాతం శాంపిళ్లను సీసీఎంబీకి పంపుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంగ్కాంగ్ నుంచి వస్తున్న వారిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 12 దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్రం సూచించినట్లు వివరించారు. త్వరలోనే విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి.కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇన్చార్జి ఏ.బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి జీఎస్.నవీన్ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్ చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
Omicron: పెను ముప్పు.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు
జెనివా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ప్రపంచానికి పెను ముప్పు వాటిల్లనుందని.. దీని పరిణామలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఒమిక్రాన్ ప్రభావం ఎంత తీవ్రంగా, ప్రమాదకరంగా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ సోమవారం ప్రపంచ దేశాలకు కీలక సూచనలు చేసింది. అవేంటంటే.. ►ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచం అంతా వ్యాపించగలదు. కనుక అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు.. అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ►ఒమిక్రాన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పెను ముప్పు పొంచి ఉంది. దీని గురించి అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు జరగడం అవసరం. ఒమిక్రాన్ అసాంఖ్యమైన స్పైక్ మ్యూటేషన్లు కలిగి ఉంది. ►రానున్న రోజుల్లో ఒమిక్రాన్కు సంబంధించి ముఖ్యమైన సమాచారం రానుంది. దీన్ని పరిశోధించిన తర్వాత దీని గురించి మరింత సమాచారం అందుబాటులోకి వస్తుంది. ►రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కరోనా బారినపడుతున్నారు. కనుక ప్రపంచ దేశాలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. చదవండి: ‘ఒమిక్రాన్’ వేరియెంట్ కథాకమామిషూ హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. సందిగ్ధంలో ప్రయాణికులు