
తాండూరు: ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో శనివారం పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్గా నిర్ధారణయింది. దీంతో హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవల తనను కలసిన వారంతా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.