20 నుంచి 25 వరకు రాష్ట్రపతి విడిది!  | President Of India Ram Nath Kovind Scheduled To Arrive In Hyderabad On 20th | Sakshi
Sakshi News home page

20 నుంచి 25 వరకు రాష్ట్రపతి విడిది! 

Dec 5 2021 4:34 AM | Updated on Dec 5 2021 4:34 AM

President Of India Ram Nath Kovind Scheduled To Arrive In Hyderabad On 20th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 20వ తేదీన హైదరాబాద్‌ రానున్నట్టు సమాచారం. ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు ఆయన హైదరాబాద్‌లో విడిది చేస్తారని తెలిసింది. అయితే ఈ షెడ్యూల్‌ పూర్తిగా ఖరారు కాకపోయినా.. రాష్ట్రపతి వస్తారన్న నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

కోవిడ్‌ నేపథ్యంలో గత సంవత్సరం రాష్ట్రపతి ఇక్కడ విడిదికి రాలేదు. కోవిడ్‌ తగ్గిందనుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్‌ పేరుతో మళ్లీ కేసులు వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రపతి వస్తారా? లేదా? అన్నదానిపై తుది సమాచారం లేదని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిగా ఉన్నవారు డిసెంబర్‌లో హైదరాబాద్‌ నగరంలో విడిది చేయడం ఆనవాయితీగా వస్తోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement