
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఏరియల్ వ్యూ ద్వారా మల్లన్నసాగర్ జలాశయాన్ని వీక్షించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రయాన్ని సందర్శించిన అనంతరం ఆయన హెలికాప్టర్ ద్వారా గజ్వేల్లోని నివాసానికి బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యలో మల్లన్నసాగర్ను ఏరియల్ వ్యూ ద్వారా సీఎం వీక్షించారు.