ఏసీబీ వలలో డీఈఈ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో డీఈఈ

Published Tue, Mar 4 2025 6:30 AM | Last Updated on Tue, Mar 4 2025 6:30 AM

-

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ క్వాలిటీకంట్రోల్‌ విభాగంలో డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న ఎ.దశరథ్‌ ముదిరాజ్‌ ఫైల్స్‌ క్లియర్‌ చేయడానికి, వాటిని ఈఈకి పంపించేందుకు ఒక వ్యక్తిని రూ.20వేలు డిమాండ్‌ చేసి,తీసు కుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకొని నాంపల్లి ఏసీబీ కేసుల కోర్టులో హా జరు పరిచారు. అడ్వాన్స్‌గా అంతకు ముందే రూ. 10వేలు తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది.

మద్యం మత్తులో పురుగు మందు తాగి

వ్యక్తి మృతి

కొందుర్గు: తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తంగెళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవీందర్‌నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి రమేశ్‌(38) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు మందలించినా వినేవాడు కాదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పాడి పశువులకు పాలు తీయడానికి పొలానికి వెళ్లాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో అతడి తండ్రి చెన్నయ్య వెళ్లి చూసేసరికే పాక వద్దనే నురుగులు కక్కి అక్కడే పడి ఉన్నాడు. వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రమేశ్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కారు బీభత్సం

రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఫుట్‌పాత్‌ పైకి ఎక్కిన వాహనం

లక్డీకాపూల్‌ : నెక్లెస్‌ రోడ్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు డివైడర్‌ను ఢీ కొని ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. సోమవారం ఖైరతాబాద్‌ జంక్షన్‌ నుంచి సెక్రటేరియేట్‌ వైపు వెళుతున్న ఓ కారు అతివేగం కారణంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ మలుపు వద్ద అదుపు తప్పింది. కారు డివైడర్‌పైకి దూసుకెళ్లి కరెంట్‌ పోల్‌ను ఢీకొనడంతో పోల్‌ రోడ్డపై అడ్డంగా విరిగిపడింది. ఈ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో విద్యుత్‌ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంస మయ్యాయి. కాగా కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం.

ముసుగులు,సైకిల్‌ చైన్లతో బెదిరింపులు

బంజారాహిల్స్‌: ముసుగులు ధరించి సైకిల్‌ చైన్లు ఊపుకుంటూ హోటలోకి ప్రవేశించిన ఆగంతకులు కస్టమర్లను బెదరింపులకు గురిచేస్తూ గదులు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన ఘటనలో నిందితులపై బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌కు చెందిన సుజాహత్‌ హుస్సేన్‌ (38) 2015లో బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–4లోని బగ్గా హోటల్స్‌ను లీజుకు తీసుకున్నాడు. 2030 వరకు ఈ లీజు గడువు ఉండగా బగ్గా హోటల్స్‌ యజమానులు సత్పాల్‌సింగ్‌ బగ్గా, బల్వీందర్‌ బగ్గా మధ్య అద్దె విషయంలో గొడవలు వచ్చాయి. ఈ విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి 10 మంది ఆగంతకులు ముఖాలకు ముసుగులు ధరించి హో టల్‌లోకి ప్రవేశించి రిసెప్షనిస్ట్‌ సుభాన్‌ను బెదిరించి అక్కడి ను ంచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. అలాగే కస్టమర్లు ఉన్న గదుల వద్దకు వెళ్లి సైకిల్‌ చైన్లు ఊపుకుంటూ ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు గురిచేశారు. రిసెప్షనిస్ట్‌ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న సుజాహత్‌ డయల్‌ 100కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే ముసుగులు ధరించిన వ్యక్తులంతా అక్కడి నుంచి పరారయ్యారు. సత్ఫాల్‌సింగ్‌ బగ్గా, బల్వీందర్‌సింగ్‌ బగ్గా ఇద్ద రూ హోటల్‌లోకి రౌడీలను పంపించారని, భయభ్రాంతులకు గురిచేశారని, విధ్వంసం సృష్టించారని, మెటీరియల్‌ ధ్వంసం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement