కూటమి చర్యలు సిగ్గుచేటు
క్రికెట్ స్టేడియంకు వైఎస్సార్ పేరు రాత్రికి రాత్రే తొలగించడం దుర్మార్గం. మధురవాడ నేడు అభివృద్ధిలో ఉందంటే అక్కడ ఉన్న క్రికెట్ స్టేడియం కారణం. ఈ స్టేడియానికి అంతర్జాతీయ హోదా ఇచ్చిన ఘనత వైఎస్సార్దే. అంతటి మహానాయకుడి పేరును క్రికెట్ స్టేడియంనకు పెట్టాలని అందరూ ప్రతిపాదించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విశాఖలో వైఎస్సార్ గుర్తులు తుడిచేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకన్నా సిగ్గు చేటు ఏముంటుంది?
– వాసుపల్లి గణేష్కుమార్, మాజీ ఎమ్మెల్యే