రైతులకు పంట రుణాలు ఇవ్వాలి
వర్ధన్నపేట: రుణమాఫీ అయిన రైతులకు తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు బ్యాంకు అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల ఖాతాలు మెరుగుపరిచి వారికి మాఫీ అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. వర్ధన్నపేట డీసీసీబీ కార్యాలయంలో వర్ధన్నపేట, రాయపర్తి, నందనం, ఐనవోలు సొసైటీలు, ఐనవోలు, వర్ధన్నపేట డీసీసీబీల మేనేజర్లు, నోడల్ అధికారులు, సిబ్బందితో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘాల ద్వారా ఇచ్చిన రుణాలను లీగల్గా కవర్ చేసి రికవరీ చేయాలన్నారు. బ్యాంకు లక్ష్యాలను వందశాతం పూర్తిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిపాజిట్లు, బంగారు ఆభరణాల రుణాలపై దృష్టిసారిస్తూ బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని చైర్మన్ రవీందర్రావు కోరారు. నోడల్ అధికారి ఏజీఎం స్రవంతి, బ్రాంచ్ మేనేజర్లు సమత, శ్రావణ్, భద్రునాయక్, పాక్స్ చైర్మన్ రాజేశ్ఖన్నా, రామచంద్రారెడ్డి, సొసైటీ సీఈఓలు యాదగిరి, సంపత్, సోమయ్య, సిబ్బంది సురేశ్, సమ్మయ్య, ఉమేశ్ పాల్గొన్నారు.
టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు
Comments
Please login to add a commentAdd a comment