పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ 26వ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో అమరీందర్తో పాటు తొమ్మిది మంది మంత్రులతో గవర్నర్ వీపీ సింగ్ బద్నూర్ ప్రమాణం చేయించారు.