సమాజ్వాదీ పార్టీలో ఇప్పటివరకు నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు అపర్ణా యాదవ్కు టికెట్ దక్కింది. అది కూడా ఆమె ఎప్పటినుంచో ఆశిస్తున్న లక్నో కంటోన్మెంట్ టికెట్నే ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయించారు. దాంతో అక్కడ ఆమె.. కాంగ్రెస్ నుంచి ఈమధ్యే బీజేపీలో చేరిన సీనియర్ మోస్ట్ నాయకురాలు రీటా బహుగుణ జోషిని ఢీకొనబోతున్నారు.