అసలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా లేకుండానే అడ్మిషన్లు ఇచ్చేసి.. వైఎస్ఆర్ జిల్లా కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజి భారీ స్కాంకు పాల్పడింది. ఇలా వందమంది విద్యార్థులకు అనుమతి లేకుండా అడ్మిషన్లు ఇవ్వడంతో.. వాళ్లంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. వారు పరీక్షలు రాసేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనుమతి ఇవ్వలేదు. ఒక్కో విద్యార్థి వద్ద రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఫాతిమా మెడికల్ కాలేజి వసూలు చేసినట్లు బాధిత విద్యార్థులు చెబుతున్నారు.