పోలీసుల సాయంతో మగవాళ్లను గృహ నిర్బంధం చేశారు. అనంతరం అధికార ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చెల రేగిపోరుున రౌడీలు మహిళలపై దాష్టీకానికి తెగబడ్డారు. ముగ్గురు మహిళల్ని తీవ్రంగా గాయపరిచారు. విధ్వంసం సృష్టించి.. చివ రకు అదంతా ప్రజలే చేశారంటూ తప్పుడు కేసులు బనారుుంచారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కె.బేతపూడిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మంగ ళవారం సాయంత్రం జన చైతన్య యాత్ర నిర్వహించేందుకు కె.బేతపూడికి చేరుకున్నా రు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మా ణాన్ని ఆ గ్రామస్తులంతా వ్యతిరేకి స్తుండటంతో ఈ సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.