హయత్నగర్ (రంగారెడ్డి జిల్లా) : వేగంగా వెళ్తున్న లారీ, కారు ఢీ కొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం బాటసింగారం గ్రామంలో జాతీయరహదారి-65పై జరిగింది. గాయపడిన వారిని హయత్నగర్లోని సన్షైన్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Published Sun, Jul 12 2015 8:45 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement