సోషల్ మీడియా ఆధారంగా చేపట్టే కార్యక్రమాలను తాము అనుమతించేది లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు వాటి నిర్వాహకులు ఎవరన్న విషయం ముఖ్యమని.. కానీ సోషల్ మీడియా ఆధారంగా జరిగే కార్యక్రమాలకు ఓనర్ షిప్ ఉండదని ఆయన చెప్పారు. విశాఖలో ఈనెల 26వ తేదీన తలపెట్టిన దీక్షకు అనుమతి కావాలని ఎవరూ తమను కోరలేదన్నారు. తమకు శాంతిభద్రతలే ముఖ్యమని.. పోలీసు ఆంక్షలకు అంతా సహకరించాలని చెప్పారు.