మైనింగ్ మాఫియా దాడిలో ఆప్ ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి. పంజాబ్లోని బైహరా గ్రామంలో ఇల్లీగల్ మైనింగ్ వ్యవహారం కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న రోపార్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే అమర్జీత్ సింగ్ సందోవా తన అనుచరులతో గురువారం మధ్యాహ్నాం అక్కడికి వెళ్లారు. మీడియాతోపాటు ఆయన్ని గమనించిన ముఠా సభ్యులు ముందుగా వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆయనపై చెయ్యి కూడా చేసుకున్నారు. పక్కనే ఉన్న సిబ్బంది నిలువరించే యత్నం చేసినప్పటికీ మైనింగ్ మాఫియా ముఠా అస్సలు వెనక్కి తగ్గలేదు.