ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ప్రకటించారు. దర్శి అభ్యర్థిగా మాధవ్ పేరును ఆయన ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాళ్లూరు బహిరంగ సభలో వైఎస్ జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. మాధవ్ అందరూ ఆదరించాలని వైఎస్ జగన్ ప్రజలను కోరారు. ప్రజాసంకల్పయాత్ర 102వ రోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కొనసాగింది. తాళ్లూరు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.