'చంద్రబాబు పాలన పూర్తయి నాలుగేళ్లు అవుతోంది. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయని చంద్రబాబే అంటున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను మనమంతా చూశాం. ఈ నాలుగేళ్ల పాలనలో మేం సంతోషంగా ఉన్నామని మీలో ఎవరైనా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలరా? లేదు. చంద్రబాబు పాలన గురించి ఓ చిన్న కథ, పిట్టలదొర కథ చెప్తాను. అనగనగా ఓ పిట్టలదొర.. ఆ పిట్టల దొర అంటే ఉన్నదిలేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కథలు చెప్పేవాడు. ప్రజలను వీడు ఎంతగొప్పగా మోసం చేశాడు.. వీడు పిట్టలదొరరా బాబు అనేలా చేస్తాడు. మన పుట్టపర్తి నియోజకవర్గంలోనే గుండువారిపల్లెలో శివన్న అనే రైతన్న ఉంటాడు. ఆయనకు ఐదు ఎకరాల భూమి ఉంది. అప్పులు చేసి.. రూ. 90వేలు ఖర్చుచేసి ఆయన తన పొలంలో వేరుశనగ పంట వేశాడు. అసలే అనంతపురంజిల్లాలో కరువు.. అందులోనూ చంద్రబాబు సీఎం అయ్యారు.. ఇంకా ఈ ఏడు వర్షాలు పడలేదు. దీంతో సాగునీరు లేక అల్లాడుతున్న శివన్న వద్దకు పిట్టలదొర వచ్చి..