వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 44వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండల కేంద్రం నుంచి 44వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్క మాను మీదుగా కొనసాగిన యాత్ర 10 గంలకు గాజులవారిపల్లె చేరుకుంటుంది. అనంతరం చామలగొంది క్రాస్ నుంచి 11 గంటలకు ధనియని చెరువు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.
ప్రజాసంకల్పయాత్ర 44వ రోజు షెడ్యూల్
Published Tue, Dec 26 2017 9:09 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement