అనూహ్యం ఏమీ జరగలేదు... మ్యాచ్ మూడో రోజే భారీ ఆధిక్యం కోల్పోయి ఆశలు కోల్పోయిన భారత జట్టు ఆదివారం కూడా బ్యాటింగ్లో కుప్పకూలింది. ఫలితంగా రెండో టెస్టులో చిత్తుగా ఓడింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 159 పరుగుల తేడాతో భారత్పై ఘనవిజయం సాధించింది.