Top Stories
ప్రధాన వార్తలు

పాక్ తూటాలకు... క్షిపణులతో బదులివ్వండి
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ ప్రతిస్పందన ఇకపై సరికొత్త రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ‘‘పాక్తూటాలకు కచ్చితంగా క్షిపణులతో సమాధానం చెప్పండి. అది చేపట్టే ఒక్కో దుశ్చర్యకూ కలలో కూడా ఊహించనంత బలంగా బదులివ్వండి’’ అని సైనిక దళాలను ఆదేశించాశారు. త్రివిధ దళాల అధినేతలతో ఆయన ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్పై విస్తృతంగా చర్చించారు. పాక్ దాడులను సహించడానికి ఏ మాత్రమూ వీల్లేదంటూ మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై, ముష్కరులపై ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చెల్లించాల్సిన మూల్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కశ్మీర్ అంశంలో విదేశీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్తో జరిగే ఏ చర్చలైనా సరే కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను, పాక్లో దాక్కున్న ఉగ్రవాదులను భారత్కు అప్పగించడంపైనే ఉంటాయని కేంద్రం తేల్చిచెప్పింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న పీఓకేను, ఉగ్రవాద మూకలను భారత్కు అప్పగించాల్సిందేనని, పాక్కు మరో గత్యంతరం లేదని స్పష్టం చేసింది. ‘‘ఆ దేశంతో చర్చలు వీటిపై మాత్రమే జరుగుతాయి. అది కూడా కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయిలో మాత్రమే కొనసాగుతాయి’’ అని కేంద్రం ఉద్ఘాటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా ఉగ్రవాదుల అప్పగింతపై తప్ప మరో అంశంపై చర్చించే ప్రసక్తే లేదని తెలిపింది. ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగుతున్నంత కాలం సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం తథ్యమని పేర్కొంది. విదేశాంగ మంత్రులు, లేదా జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగాలని పాక్ ప్రతిపాదిస్తుండగా అందుకు భారత్కు అంగీకరించడం లేదు.దాడి చేస్తే గట్టిగా ఎదురుదెబ్బజేడీ వాన్స్కు మోదీ స్పష్టీకరణ న్యూఢిల్లీ/వాషింగ్టన్: పాకిస్తాన్ ఒకవేళ భారత్పై మళ్లీ దాడికి దిగితే అంతకంటే గట్టిగానే ఎదురుదెబ్బ తీస్తామని అమెరికాకు మోదీ తేల్చిచెప్పారు. తమ ప్రతిస్పందన అత్యంత తీవ్రస్థాయిలో, దాయాదికి వినాశకరంగా ఉంటుందని స్పష్టంచేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం మోదీతోఫోన్లో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రస్తావించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్తో కూడా వాన్స్ చర్చించారు. పాక్ కాల్పులు ఆపితేనే సంయమనం పాటిస్తామని అమెరికాకు భారత్ తేల్చిచెప్పినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత్–పాక్ ఘర్షణల గురించి అమెరికా నిఘా వర్గాల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందిన కారణంగానే మోదీ తో వాన్స్ మాట్లాడారని సమాచారం. సున్నితమైన అంశం కావడంతో బయటకు వెల్లడించలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ పాక్ దాడులను తిప్పికొట్టాలని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆదేశం న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం దాడులకు దిగితే గట్టిగా ప్రతిస్పందించాలని, తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లకు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. దాడులను తిప్పికొట్టే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సైనిక చర్యలు నిలిపివేస్తూ అంగీకారానికి వచ్చినట్లు భారత్, పాక్ శనివారం ప్రకటించడం తెలిసిందే. అయినప్పటికీ పాక్ సైన్యం కవి్వంపు చర్యలకు పాల్పడింది. శనివారం రాత్రి సరిహద్దుల్లో కాల్పులు జరపగా, భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ పరిణామాలపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమీక్ష జరిపారు. మరోసారి పాక్ సైన్యం కాల్పులకు గట్టిగా ప్రతిస్పందించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పారు.

అవును.. మా యుద్ద విమానం ధ్వంసమైంది: పాక్ అధికారిక ప్రకటన
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. భారత ముప్పెట దాడి చేస్తూ పాకిస్తాన్కు చుక్కలు చూపించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ యుద్ధ విమానంపై అటాక్ చేయడంతో అది ధ్వంసమైంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.పాకిస్తాన్ సైన్యం, వైమానిక దళం, నావికాదళ సీనియర్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల భారత్ జరిపిన దాడిలో పాకిస్తాన్ యుద్ధ విమానం ధ్వంసమైందని అధికారికంగా ప్రకటించారు. భారత్ దాడులను ఎదుర్కొనే క్రమంలో ఇలా జరిగిందన్నారు. అయితే నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, భారత్-పాకిస్తాన్ మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ ప్రకటన చేయడం గమనార్హం.ఇదే సమయంలో భారత పైలట్.. పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడ్డారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చౌదరి స్పందించారు. ఇది ఫేక్ వార్త అని ఖండించారు. భారత్ పైలట్ ఎవరూ తమ ఆధీనంలో లేరని స్పష్టం చేశారు. అలాగే, భారత్ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చారు. పాక్ను దెబ్బకొట్టాం..మరోవైపు.. ఆపరేషన్ సిందూర్లో భారత్ సాధించిన విజయాలను మన సైన్యం ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్ విమానాలను నేల కూల్చామని ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి తెలిపారు. అయితే, ఆ సంఖ్య ఎంత అన్నది ఆయన చెప్పలేదు. ‘‘మన సరిహద్దు లోపలికి పాక్ యుద్ధవిమానాలను రాకుండా నిరోధించాం. కాబట్టి వాటి శకలాలు మా దగ్గర లేవు. కాకపోతే కచ్చితంగా కొన్ని విమానాలను కూల్చాం’’ అని తెలిపారు.బ్రహ్మోస్ సూపర్ పవర్..ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్నువిరిచేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో.. అప్పటి వరకూ అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్బాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకుపుట్టింది. మొత్తం పరిస్థితే మారిపోయింది. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాక్లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్ ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. ఇక్కడ గగనతల రీఫ్యూయలర్ ట్యాంకర్ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికే పాకిస్థాన్ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు... గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400తో మధ్యలోనే పేల్చివేసింది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్ నుంచి నలియా వరకు 26 లక్ష్యాలపైకి పాక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.

ట్రంప్ ఖతార్ పర్యటన.. భారీ బహుమతి రెడీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఖతార్ భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని ట్రంప్కు బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఖతార్కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారంలో మధ్యప్రాచ్య పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్.. ఖతార్ పాలక కుటుంబం నుంచి విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని బహుమతిగా స్వీకరించనున్నట్లు సమాచారం. ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఖతార్కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఒక విదేశీ ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద కానుకను అమెరికా అధ్యక్షుడు స్వీకరించడం, దాని చట్టబద్ధతపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.Qatar to Gift $400 Million Plane to President Trump:▪️According to ABC News, the Trump administration is set to accept a luxury Boeing 747-8 jumbo jet—valued at around $400 million—from the Qatari royal family.▪️The plane will serve as Air Force One for Trump until just… pic.twitter.com/d1H7OdyNmD— Beau Bannon🇺🇸 (@BeauBannon) May 11, 2025అయితే, విదేశీ ప్రభుత్వం నుండి ఇంత పెద్ద బహుమతిని అధ్యక్షుడు స్వీకరించడంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అమెరికా రాజ్యాంగంలోని జీతాల నిబంధన, ఆర్టికల్ I, సెక్షన్ 9, క్లాజ్ 8, ప్రభుత్వ పదవిలో ఉన్న ఎవరైనా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏదైనా.. రాజు, యువరాజు లేదా విదేశీ రాష్ట్రం.. నుండి ఏదైనా బహుమతి, జీతం, కార్యాలయం లేదా బిరుదును స్వీకరించడాన్ని నిషేధిస్తుంది. ఈ నేపథ్యంలో, అమెరికా అధికారులు దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్ఫోర్స్ వన్) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీ విరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్ ‘ఎయిర్ఫోర్స్ వన్’కు కొత్త వెర్షనుగా ఉపయోగిస్తారు. సురక్షితమైన కమ్యూనికేషన్లు, ఇతర అవసరమైన సౌకర్యాలు జోడించాలని యోచిస్తున్నారు.

మా బతుకులతో ‘ఆడుకోవద్దు’
భూమితో మాది విడదీయరాని అనుబంధం.. వ్యవసాయం తప్పితే మాకు వేరే వృత్తి తెలియదు.. తక్కువో ఎక్కువో ఉన్నదాంట్లోనే పంటలు పండించుకుంటున్నాం, గుట్టుగా బతుకుతున్నాం.. కన్నతల్లి లాంటి భూమిని మానుంచి లాక్కుని మా జీవితాలతో ఆటలాడొద్దు.. గతంలో భూ సమీకరణకు తీసుకున్న భూములకే ఇప్పటికీ దిక్కూమొక్కు లేదు.. ఇప్పుడు మా నుంచి తీసుకున్న భూమికి ఎప్పుడు న్యాయం చేస్తారు? కళ్లముందు ఉన్న భూమిని పోగొట్టుకుని.. ఎక్కడో ఇచ్చే భూమి మాకెందుకు? – స్పోర్ట్స్ సిటీ భూసమీకరణ గ్రామసభల్లో రైతులుసాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా, మా భూములు ఎందుకివ్వాలని నిలదీస్తున్నా, తమ జీవితాలతో ఆడుకోవద్దని వేడుకుంటున్నా, స్పోర్ట్స్ సిటీ పేరుతో భూ సమీకరణ ద్వారా భారీఎత్తున భూములను తీసుకునేందుకే ప్రభుత్వం సిద్ధమవుతోంది. అన్నదాతలు ససేమిరా అంటున్నా.. మాయమాటలతో మభ్యపెట్టి ముందుకు అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగానే అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. వీటిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే సర్కారు తన ధోరణిని మార్చుకోవడం లేదు.ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, త్రిలోచనాపురం, కాచవరం, కేతనకొండ, జమీమాచవరంలో స్పోర్ట్స్ సిటీకి అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి స్పోర్ట్స్ సిటీకి తొలుత కృష్ణా నది లంక గ్రామాలు, లంక భూములను ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్నారు. నెల రోజుల క్రితం కృష్ణా పరీవాహక ప్రాంతమైన చినలంక, పెదలంక, ఇబ్రహీంపట్నం, జూపూడిలో లంక భూములను మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు. కానీ, ఈ భూములకు కృష్ణా వరద తాకిడి ఉంటుందనే కారణంతో తాజాగా మూలపాడు పరిధిలోని మెరక ప్రాంత భూములపై కన్నేశారు.అయితే, స్పోర్ట్స్ సిటీ, ఐకానిక్ బ్రిడ్జి పేరుతో విలువైన, జీవనాధారమైన భూములను తీసుకునేందుకు ప్రభుత్వం పన్నిన పన్నాగాన్ని రైతులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. స్పోర్ట్స్ సిటీ పేరుతో వ్యాపారం చేసేందుకే తమ భూములను తీసుకుంటున్నారనే అభిప్రాయం రైతుల్లో నెలకొంది. దీంతో పంట పొలాలను ఇవ్వబోమని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య ఎదుట తెగేసి చెప్పారు. వారు ఒప్పుకోకున్నా ఏదోరకంగా భూములు స్వా«దీనం చేసుకునే ఎత్తుగడల్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఒప్పుకోకున్నా ఒప్పుకొన్నట్లు.. రైతుల అభిప్రాయ సేకరణకు రెవెన్యూ అధికారులు గురు, శుక్రవారాల్లో గ్రామ సభలు నిర్వహించారు. మూలపాడు సభలో కొందరు భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. కానీ, వెంటనే 90 శాతం మంది రైతులు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వబోమని తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు తెగేసి చెప్పారు. అమరావతి రాజధానినే ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదని ఇక తమ ప్రాంతాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారని సూటిగా ప్రశి్నంచారు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే తాము పొలాలను ఎలా ఇస్తామని నిలదీశారు. భూమి మా చేతిలో ఉంటేనే బంగారంజమీమాచవరంలో సభకు హాజరైన రైతులు అందరూ ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చేది లేదని తేల్చి చెప్పారు. కాచవరం, కేతనకొండ గ్రామ సభల్లో ఆర్డీవో కావూరి చైతన్య పాల్గొన్నారు. కాచవరంలో ఒకరిద్దరు భూస్వాములు మినహా మిగిలిన రైతులు ప్రభుత్వానికి పొలాలు ఇవ్వబోమని ప్రకటించారు. కేతనకొండలో రైతులు నిరసనగా చప్పట్లు కొడుతూ మరీ పొలాలు ఇచ్చేది లేదని వెల్లడించారు. ‘భూమి మా ఆధీనంలో ఉంటే పిల్లల చదువులు, వివాహాలు, కుటుంబ అవసరాలకు వాడుకుంటాం. ప్లాటు ఇవ్వడానికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. అప్పటివరకు మా అవసరాలు ఎలా తీరతాయి’ అంటూ ఆర్డీవో చైతన్యను రైతులు సూటిగా ప్రశి్నంచారు.2,874 ఎకరాల సేకరణకు ఎత్తుగడ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలం ఐదు గ్రామాల పరిధిలోని భూములను ల్యాండ్ పూలింగ్లో సేకరించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి గ్రామాల్లో ఉన్న భూముల వివరాలను వెల్లడించారు. మూలపాడులో 313 ఎకరాలు, కాచవరంలో 590 ఎకరాలు, త్రిలోచనాపురంలో 1,390 ఎకరాలు, జమీమాచవరంలో 301 ఎకరాలు, కేతనకొండలో 280 ఎకరాలు చొప్పున మొత్తం 2,874 ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో తీసుకోనున్నారు. వీటిలో ఎక్కువగా పట్టా భూములు ఉండగా, ఎన్ఎస్పీ కాలువ, ప్రభుత్వ అసైన్మెంట్, లంక భూములు కొన్ని ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతుల పొట్టకొడతారా? చిన్న, సన్నకారు రైతుల భూములను ల్యాండ్ పూలింగ్లో తీసుకోవడం దుర్మార్గమైన చర్య. వారి పొట్టకొడతారా? పూలింగ్పై ప్రతి గ్రామంలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. రెవెన్యూ అధికారుల వద్ద వారి ఆవేదనను వెల్లడించారు. భూములే జీవనాధారం అని కూడా తేల్చిచెప్పారు. మెజార్టీ రైతుల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. –గరికపాటి శ్రీదేవి, జెడ్పీ వైస్ చైర్మన్, మూలపాడు 3 పంటలు పండే భూములు.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఇబ్రహీంపట్నంలో ఎకరా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల ధర పలుకుతోంది. మా భూముల్లో ఏడాదికి మూడు పంటలు పండుతాయి. వీటిని ప్రభుత్వానికి ఇచ్చేది లేదు. – ఎస్డీ జానీ, పీఏసీఎస్ మాజీ చైర్మన్, కేతనకొండ ఉన్నది 80 సెంట్లు.. అదీ తీసుకుంటారా? 80 సెంట్ల భూమిలో వ్యవసాయం చేస్తున్నా. కొంత భాగం పొలంలో గ్రాసం పెంచి పాడి పరిశ్రమను నిర్వహిస్తున్నా. కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకు వ్యవసాయం తప్ప మరో పని తెలియదు. ఇప్పుడు ఉన్న పొలం తీసుకుని ప్లాటు ఇస్తామంటే ఎలా? – ఆళ్ల శ్రీనివాసరావు, రైతు, త్రిలోచనాపురం

పాక్కు చెక్ పెట్టిన భారత్.. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఉన్నది వీరే..
ఢిల్లీ: ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్ర స్థావరాలపై దాడులే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్లో దాదాపు వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు. అయితే, ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది.వివరాల ప్రకారం.. ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఆర్మీ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు.. పాక్ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. అయితే, తొలుత తాము అంత్యక్రియల్లో పాల్గొనలేదని పాక్ బుకాయించినా భారత్ ఫొటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది.ఇక, తాజాగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారుల పేర్లను భారత్ విదేశాంగశాఖ వెల్లడించడం గమనార్హం. ఇందులో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియల్లో పాల్గొన్నది వీరే.. లెఫ్ట్నెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్, మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్, లాహోర్ 11వ ఇన్ఫ్రాంట్రీ డివిజన్, బ్రిగేడియర్ మహ్మద్ ఫర్ఖాన్ షబ్బీర్, డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్, మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ ఉన్నారు. Video showing Pakistani Army officials attending the funerals of slain Lashkar-e-Taiba (LeT) terrorists yesterday. The man leading the Janaza is Hafiz Abdul Rauf - a US designated terrorist.Once again blurring the lines between state and terror - the world is watching you 🇵🇰 pic.twitter.com/MjsJXcyDMl— Vinayak Tripathi (@belikevinayak) May 8, 2025

భారత రక్షణశాఖకు ఇళయరాజా విరాళం
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఎంపీ ఇళయరాజా భారత రక్షణశాఖకు తన ఒక్క రోజు పారితోషకాన్ని విరాళంగా ప్రకటించారు. దీని గురించి ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ పహల్గామ్లో మన దేశ పర్యాటకులపై ఉగ్రమూక దాడిచేసిందని, మన దేశ సైనికులు దీనికి తప్పక ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. వారి ధైర్య సాహసాలు అభినందనీయం అని తెలిపారు. మన సైనికులు ఆత్మస్థైర్యంతో వారిని మట్టు పెడతారనే నమ్మకంతో,మన దేశ రక్షణ శాఖకు దేశ పౌరుడిగా, ఎంపీగా తన ఒక్క రోజు పొరితోషికాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్– పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో దేశం మొత్తం హై అలెర్ట్ ప్రకటించడం, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొనడం తెలిసిందే.

బలంగా ఎదిగేందుకు భారత్ సిద్ధం
భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు ఉన్నాయని, స్వల్పకాలిక అంతరాయాలను సమర్థంగా ఎదుర్కొని మరింత బలంగా ఎదగడానికి సిద్ధంగా ఉందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు సంజీవ్ పురి అన్నారు. సమ్మిళిత, దీర్ఘకాలిక వృద్ధిని కొనసాగించడానికి వ్యవసాయం, తయారీ, సేవల్లో వ్యూహాత్మక ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తూ దేశం ఆర్థికంగా ఎదుగుతోందని చెప్పారు.స్వల్పకాలిక సవాళ్లు..ప్రస్తుతం సరిహద్దు వివాదాలు వంటి అడ్డంకులు ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక పథంపై ఆశాజనకంగా ఉన్నట్లు పురి తెలిపారు. దేశ నిర్మాణాత్మక బలం, కొనసాగుతున్న సంస్కరణలు వ్యూహాత్మక పెట్టుబడులు బలంగా కోలుకోవడానికి, స్థిరమైన వేగంతో వృద్ధి చెందడానికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయని, ద్రవ్యోల్బణం క్షీణిస్తోందని, రుతుపవనాల అంచనాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ గ్రామీణ ఆదాయాలను పెంచి ప్రజల వినియోగానికి కీలకంగా మారుతాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: అందాలతో అలరిస్తూ.. వ్యాపారాలు పెంచుతూ..రంగాలవారీ వృద్ధి..పాదరక్షలు, దుస్తులు, ఫర్నిచర్, పర్యాటకం వంటి కార్మిక ఆధారిత పరిశ్రమలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని పురి నొక్కి చెప్పారు. ఇవి గణనీయమైన ఉపాధిని సృష్టిస్తాయని అన్నారు. దేశ ఆర్థిక సమ్మిళిత(ఫైనాన్షియల్ ఇన్క్లూజన్)కు ఈ రంగాలు దోహదం చేస్తాయని స్పష్టం చేశారు. భారతదేశం ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్టలో విలువ జోడింపుపై దృష్టి సారించిందని తెలిపారు. ఇది గ్లోబల్ టెక్నాలజీ హబ్గా ఎదగాలనే దాని ఆశయాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు.

16 లేదా 17 నుంచి ఐపీఎల్!
న్యూఢిల్లీ: ప్రతీ వేసవిలో మెరుపు క్రికెట్ వినోదాన్ని పంచే ఐపీఎల్కు ఈసారి ఉద్రిక్త పరిస్థితుల సెగ తగిలింది. భారత్, పాక్ల మధ్య డ్రోన్ల యుద్ధంతో లీగ్ను వారంపాటు వాయిదా వేశారు. ఇపుడు తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ ఐపీఎల్ పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారాంతంలోనే ఆటను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెల 16 లేదంటే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవనుంది. ఫైనల్ వేదికను కోల్కతా నుంచి అహ్మదాబాద్కు మార్చే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ మార్పునకు వర్ష సూచనే కారణమని తెలిసింది. ఆటగాళ్ల సంసిద్ధత, విదేశీ ఆటగాళ్లను వెంటనే రప్పించే ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని రేపటికల్లా ఫ్రాంచైజీలన్నీ రెడీగా ఉండాలని బీసీసీఐ సూచించింది. అన్నీ డబుల్ హెడర్లేనా? ఈ నెలాఖరుకల్లా ఐపీఎల్ను పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్న లీగ్ పాలకమండలి మిగతా లీగ్ మ్యాచ్ల్ని డబుల్ హెడర్ (రోజూ రెండు మ్యాచ్ల చొప్పున)లుగా నిర్వహించే ప్రణాళికతో ఉంది. హైదరాబాద్లోనే ఆ రెండు ప్లే ఆఫ్స్ హైదరాబాద్ అభిమానులకు ఎలాంటి నిరాశలేకుండా ముందనుకున్న షెడ్యూల్ ప్రకారమే రెండు ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. తేదీలు మారినా... తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్లు హైదరాబాద్లోనే నిర్వహిస్తారు. అయితే రెండో క్వాలిఫయర్ సహా ఫైనల్ పోరుకు వేదికైన కోల్కతాలోనే వాతావరణ సమస్యలు ఎదురవుతాయని తెలిసింది. ఈ నేపథ్యంలో విజేతను తేల్చే మ్యాచ్కు వర్షం అడ్డులేకుండా ఉండేలా అహ్మదాబాద్ను ఫైనల్ వేదికగా ఖరారు చేసే అవకాశముంది. మొత్తానికి సోమవారం షెడ్యూల్పై కసరత్తు పూర్తి చేస్తారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.

నేడు సాగర్.. రేపు చార్మినార్..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా తలపెట్టిన కార్యక్రమాలను ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం, పోటీదారుల భద్రత నేపథ్యంలో కొన్ని కార్యక్రమాల నిర్వహణపై నిర్వాహకులు తొలుత సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, అనంతరం పాత నగరంలోని చౌమొహల్లా ప్యాలెస్లో స్వాగత విందు కార్యక్రమాలు రద్దు చేసే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇప్పుడు వాటిని యధావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దులో ఉద్రిక్తతలు కొంత తగ్గిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించనున్నారు. స్వాగత విందులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు సినీ, క్రీడారంగ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక సోమవారం సాయంత్రం పోటీదారులు, విదేశీ ప్రతినిధులు నాగార్జున సాగర్ సమీపంలోని బుద్ధవనం పర్యటనకు వెళ్లనున్నారు. బుద్ధ జయంతి సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమాన్ని వారు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అక్కడే రాత్రి విందు అనంతరం హైదరాబాద్కు బయలుదేరతారు. చార్మినార్ నుంచి లాడ్బజార్ వరకు నడక మంగళవారం సాయంత్రం పోటీదారులు చార్మినార్ నుంచి లాడ్బజార్ వరకు నడుస్తూ పరిసరాలను వీక్షిస్తారు. షాపింగ్ చేస్తారు. చార్మినార్ చరిత్రను తెలుసుకుంటారు. అనంతరం చౌమొహల్లా ప్యాలెస్లో జరిగే స్వాగత విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాద్యకచేరీ కొనసాగుతుంది. విందులో ఇంటర్ కాంటినెంటల్, తెలంగాణ వంటకాలు విందులో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ధమ్ కీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, బగారా బైంగన్, పత్తర్ కీ ఘోష్, పనీర్ టిక్కా, పులావ్, దహీ వడ, పానీపురి, బాదుషా, గులాబ్ జామూన్ లాంటి వంటకాలు రుచి చూపించనున్నారు. ధమ్ కీ బిర్యానీ ఎక్కువ మసాలా ఘాటు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు. ఇక యూరప్, ఆఫ్రికా, ఆమెరికా, కరేబియన్, ఆసియా ఓషియానా ప్రాంతాల సుందరీమణులు సైతం ఉన్నందున వారి స్థానిక వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. పోటీల్లో పొల్గొనే సుందరీమణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని నాలుగు ఫైవ్ స్టార్ హోటళ్లనుంచి మెనూ తెప్పించి పరిశీలించి, ఒక హోటల్కు ఆర్డర్ ఇచ్చారు. ఆసియా వంటకాలలో సుషీ (జపాన్), డిమ్సమ్ (చైనా), థాయ్ గ్రీన్ కర్రీ (థాయ్లాండ్) వంటివి, యూరోపియన్ వంటకాలైన ఇటాలియన్ పాస్తా, ఫ్రెంచ్ రాటటౌలీ, స్పానిష్ పాయెల్లా, అమెరికా ఖండానికి సంబంధించిన మెక్సికన్ టాకోస్, బ్రెజిలియన్ ఫెయిజోడా, అమెరికన్ బార్బెక్యూ రిబ్స్ లాంటివి, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్ డోరో వాట్, మొరాకన్ టాగిన్, హమ్ముస్తో పాటు మెడిటరేనియన్ ఫలాఫెల్, క్వినోవా సలాడ్ లాంటి వాటిని వడ్డించే వీలుందని సమాచారం. మెనూను మిస్ వరల్డ్ లిమిటెడ్ ప్రతినిధులకు చూపి వారు అనుమతించినవే సిద్ధం చేస్తారని తెలుస్తోంది. మే 26న హైటెక్స్లో జరిగే గలా డిన్నర్ సందర్భంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంటుందని చెబుతున్నారు.

‘ఆసరా’కు ఎసరు.. బాలింతలకు కొసరు
సాక్షి, అమరావతి: ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏటా రూ.18 వేలు ఇస్తాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.. బడికెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం అందిస్తాం’.. అంటూ ఎన్నికలకు ముందు ఎన్నో సాధ్యంకాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటీ అమలుచేయకుండా మహిళలను దగా చేస్తున్నారు. తానిచ్చిన హామీలను అటకెక్కించడమే కాకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలను సైతం నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఆరోగ్యశ్రీ కింద బాలింతలకు అందే రూ.ఐదు వేల ఆసరా సాయానికీ మంగళం పాడేశారు. వైఎస్ జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రసవానంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో బాలింతకు ఆసరా సాయాన్ని ఇచ్చేవారు. కానీ, గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ సాయాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఇలా ఆరోగ్యశ్రీ ఆసరాకు గండికొట్టి ఏకంగా రూ.5 వేలు చొప్పున బాలింతలకు నష్టం చేకూరుస్తూ.. కేవలం రూ.వందలు విలువచేసే సబ్బు, పౌడర్ డబ్బాలతో కూడిన బేబీ కిట్ ఇస్తామంటూ ప్రకటించింది.ఐదేళ్లలో 15 లక్షల మందికి అన్యాయం..రాష్ట్రంలో ఏటా ఆరోగ్యశ్రీ పథకం కింద మూడు లక్షలకు పైగా ప్రసవాలు నమోదవుతుంటాయి. ఆరోగ్య ఆసరా పథకం కింద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే వీరందరికీ గత ప్రభుత్వంలో రూ.5 వేలు చొప్పున బ్యాంకులో జమచేసేవారు. ఈ సాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయడంతో ఏటా మూడు లక్షల చొప్పున లెక్కేసినా 2024–29 మధ్య ఐదేళ్లలో 15 లక్షల మంది మహిళలకు సాయం నిలిచిపోతుంది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఐదేళ్లలో కనిష్టంగా రూ.750 కోట్లను పేద, మధ్యతరగతి బాలింతలు నష్టపోతున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. మొదటి ఏడాదిలో రూ.5 వేలు చొప్పున ఇప్పటికే బాలింతలకు దాదాపు రూ.150 కోట్ల మేర కోల్పోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే సక్రమంగా తమకు ఆసరా సాయం అంది ఉండేదని వీరు చెబుతున్నారు. ఇలా పెద్ద మొత్తంలో పేదింటి మహిళలకు నష్టం చేకూర్చి కేవలం రూ.వందలు విలువచేసే కిట్లు పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు.కిట్ల కొనుగోలులోనూ లూటీ తంతు?ఇక ఆస్పత్రులకు మందుల సరఫరా.. అత్యవసర వైద్యసేవల కల్పన.. రోగనిర్ధారణ.. ఇలా వివిధ రకాల కాంట్రాక్టులను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అవినీతిమయంగా మార్చేశారు. అయినవాళ్లు, పెద్ద మొత్తంలో కమీషన్లు ఇచ్చే సంస్థలకే కాంట్రాక్టు కట్టబెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇదే తంతు బేబీ కిట్ల కొనుగోలులోనూ చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే బేబీ కిట్లు సరఫరా చేసే ఒకరిద్దరు కాంట్రాక్టర్లు ఓ అమాత్యుడిని కలిసినట్లు తెలిసింది. ఆ అమాత్యుడి సిఫార్సుతో వీరు వైద్యశాఖను సంప్రదించినట్లు సమాచారం.
ఉచ్చులోకి దించి.. మాట మార్చి!
నటుడు విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన టీమ్
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు
ఆధ్యాత్మికథ దేని విలువ దానిదే!
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
భార్య ప్రసవం కోసం వచ్చి
అతని సాయం వల్లే నా కూతురి పెళ్లి చేశాను: స్టార్ డైరెక్టర్
సుందర సౌరాష్ట్ర..సమైక్య యాత్ర
నేడు బుద్ధ పూర్ణిమ.. శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
రీరిలీజ్లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
మృణాల్ ఠాకూర్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
పాకిస్తాన్కు మా మద్దతు కొనసాగుతుంది
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
IPL 2025: మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు
భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
పాన్ ఇండియా హీరో..పబ్లిక్ లైఫ్లో జీరో...
ముందుగానే నైరుతి రుతుపవనాలు
పాక్పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
ఆల్రెడీ పాలన స్టార్ట్ అయినప్పటి నుంచి హామీలు అమలు చేయకుండా చాలా ‘స్మార్ట్’గానే వ్యవహరిస్తున్నాం కదా సార్!
నేను పీకే తాలుకా.. తలచుకుంటే లేపేస్తా...!
ఉచ్చులోకి దించి.. మాట మార్చి!
నటుడు విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన టీమ్
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు
ఆధ్యాత్మికథ దేని విలువ దానిదే!
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
భార్య ప్రసవం కోసం వచ్చి
అతని సాయం వల్లే నా కూతురి పెళ్లి చేశాను: స్టార్ డైరెక్టర్
సుందర సౌరాష్ట్ర..సమైక్య యాత్ర
నేడు బుద్ధ పూర్ణిమ.. శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
రీరిలీజ్లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
మృణాల్ ఠాకూర్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
పాకిస్తాన్కు మా మద్దతు కొనసాగుతుంది
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
IPL 2025: మిగిలిన మ్యాచ్లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు
భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
పాన్ ఇండియా హీరో..పబ్లిక్ లైఫ్లో జీరో...
ముందుగానే నైరుతి రుతుపవనాలు
పాక్పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
ఆల్రెడీ పాలన స్టార్ట్ అయినప్పటి నుంచి హామీలు అమలు చేయకుండా చాలా ‘స్మార్ట్’గానే వ్యవహరిస్తున్నాం కదా సార్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి
సినిమా

కోలీవుడ్ ఎంట్రీ
రాజ్ తరుణ్ కోలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. రాజ్ తరుణ్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్–దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం తెరకెక్కనుంది. రఫ్నోట్ ప్రోడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. మే 11 (ఆదివారం) రాజ్ తరుణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది.రాజ్ తరుణ్కు ఇదే తొలి తమిళ చిత్రం కావడం విశేషం. ‘‘గోలీసోడా’ ఫ్రాంచైజీలో భాగంగా విజయ్ మిల్టన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం రాజ్ తరుణ్ మేకోవర్ అయిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. విభిన్నమైన కథ, బలమైన స్క్రీన్ప్లేతో ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

డైరెక్షన్... యాక్షన్... కల్ట్ స్టార్ట్
మాస్ యాక్టర్గా విశ్వక్ సేన్కి మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దర్శకునిగా తొలి చిత్రం ‘ఫలక్నుమా దాస్’తోనే తన ప్రతిభను నిరూపించుకున్నారు విశ్వక్. ఆ తర్వాత ‘దాస్ కీ దమ్కీ’ చిత్రంలో నటించి, దర్శకత్వం వహించారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా ఆయన డైరెక్షన్లోనే ‘#కల్ట్’ చిత్రం ఆరంభమైంది. ఈ చిత్రానికి కథ కూడా రాసుకున్నారు విశ్వక్. 40 మంది నూతన నటీనటులను పరిచయం చేస్తూ, కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) టైటిల్ లోగోను లాంచ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముహూర్తపు షాట్కు కెమెరా స్విచ్చాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఆదివారమే రెగ్యులర్ షూటింగ్ ఆరంభించారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. నటుడు–దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: అరవింద్ విశ్వనాథన్.

సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది
కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్లపై ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు స్పందించారు. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘భార్యతో కలిసి వేసవి సెలవుల కోసం పహల్గాం వెళ్లిన భర్తను ఉగ్రమూక కాల్చి చంపింది.తన భర్తను చంపవద్దని ఆ భార్య ఎంతగానో ఏడుస్తూ, ప్రాధేయపడినా ఆ ఉగ్ర ఉన్మాది వినలేదు. ఆమె కళ్ల ముందే భర్తను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఆమెను విధవరాలని చేశాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ భార్య... తనను కూడా చంపేయమని అడిగినా... ‘నిన్ను చంపను... వెళ్లి చెప్పుకో..’ అని ఆ రాక్షసుడు అన్నాడు. నా కుమార్తెలాంటి ఆమె మానసిక స్థితి చూస్తుంటే .. ‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా... సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది’ అని మా నాన్న (హరివంశ్ రాయ్ బచ్చన్) రాసిన ఓ పద్యంలోని వాక్యం నాకు గుర్తొచ్చింది. అందుకే నేను నీకు సిందూరం ఇస్తున్నా... అపరేషన్ సిందూర్... జై హింద్... భారత సైన్యమా... ఎప్పటికీ ఆగకు... వెనకడుగు వేయకు’’ అంటూ భావోద్వేగమైన ΄పోస్ట్ను షేర్ చేశారు అమితాబ్ బచ్చన్.

టాలీవుడ్ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్.. సెన్సార్ పూర్తి
రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతోన్న చిత్రం వైభవం. ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాకు సాత్విక్ దర్శకత్వం వహిస్తున్నారు. నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్కు క్లీన్ యూ సర్టిఫికేట్ లభించింది. ఇదివరకే విడుదలైన రెండు పాటలకీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వైభవం మూవీ ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.
న్యూస్ పాడ్కాస్ట్

పాకిస్తాన్ తూటాలకు క్షిపణులతో బదులివ్వండి... ప్రతి దుశ్చర్యకూ మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పాల్సిందే...

కాల్పుల విరమణకు అంగీకారం.. కొద్దిసేపట్లోనే మళ్లీ కాల్పులు... పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో
క్రీడలు

త్రుటిలో చేజారిన పతకాలు
అల్ అయిన్ (యూఏఈ): ఆసియా వ్యక్తిగత చెస్ చాంపియన్షిప్ బ్లిట్జ్ విభాగంలో భారత్కు త్రుటిలో రెండు కాంస్య పతకాలు చేజారాయి. పురుషుల విభాగంలో తమిళనాడు గ్రాండ్మాస్టర్ మురళీ కార్తికేయన్... మహిళల విభాగంలో ఒడిశా అమ్మాయి పద్మిని రౌత్ నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను కోల్పోయారు. నిరీ్ణత తొమ్మిది రౌండ్ల తర్వాత కార్తికేయన్ ఏడు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. దాంతో మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించారు.రుడిక్ మకారియన్ (రష్యా)కు మూడో స్థానంతోపాటు కాంస్య పతకం ఖరారైంది. కార్తికేయన్కు నాలుగో స్థానం, నీలాశ్ సాహా (భారత్)కు ఐదో స్థానం, జియాంగ్ హావోచెన్ (చైనా)కు ఆరో స్థానం లభించాయి. పురుషుల విభాగంలో మొత్తం 111 మంది ప్లేయర్లు పోటీపడగా... 8 పాయింట్లతో 15 ఏళ్ల ఇవాన్ జెమ్లియాన్స్కి (రష్యా) విజేతగా అవతరించాడు. ఇరాన్కు చెందిన 15 ఏళ్ల సినా మొవాహెద్ 7.5 పాయింట్లతో రజతాన్ని దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత పద్మిని రౌత్, యుజిన్ సాంగ్ (చైనా), ఎల్నాజ్ కలియాక్మెత్ (కజకిస్తాన్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. దాంతో మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా కాంస్య పతకాన్ని ఖరారు చేయగా... యుజిన్ సాంగ్కు కాంస్యం లభించింది. పద్మిని నాలుగో స్థానంలో, ఎల్నాజ్ ఐదో స్థానంలో నిలిచారు. 7.5 పాయింట్లతో అలువా నుర్మాన్ (కజకిస్తాన్), వాలెంటీనా గునీనా (రష్యా) సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్లను వర్గీకరించగా... నుర్మాన్కు స్వర్ణం, గునీనాకు రజతం లభించాయి. ఆసియా టోర్నిలో రష్యా ప్రాతినిధ్యం ఎందుకంటే... ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రష్యా క్రీడాకారులు అంతర్జాతీయ టోర్నిలలో రష్యా తరఫున పాల్గొనడంపై నిషేధం విధించాయి. అయితే రష్యా క్రీడాకారులు దేశం తరఫున కాకుండా తటస్థ క్రీడాకారులుగా పాల్గొనవచ్చని ఐఓసీ వెసులుబాటు కల్పించింది. దాంతో పలువురు రష్యా క్రీడాకారులు అంతర్జాతీయ టోర్నిలలో ఆయా క్రీడా సమాఖ్య పతాకాలపై బరిలోకి దిగుతున్నారు. ఇక రష్యా చెస్ క్రీడాకారుల విషయానికొస్తే 2023లో రష్యా యూరోపియన్ చెస్ యూనియన్ నుంచి బయటకు వచ్చి ఆసియా సమాఖ్యలో చేరింది. పలు టోర్నీలలో రష్యా ప్లేయర్లు ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) తరఫున పాల్గొంటున్నారు. తాజాగా ఆసియా చాంపియన్షిప్లో రష్యా క్రీడాకారులు ‘ఫిడే’ పతాకంపై పోటీపడుతున్నారు.

ఆర్సీబీకి భారీ షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?
ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు మొదలు పెట్టింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్ను తిరిగి ప్రారంభించేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్దమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మే 15 లేదా మే 16న ఐపీఎల్ మ్యాచ్లు మళ్లీ మొదలయ్యే అవకాశముంది.అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ పునఃప్రారంభమవుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్ వుడ్ గాయం కారణంగా ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. హాజిల్ వుడ్ ప్రస్తుతం భుజం నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే మే 3న సీఎస్కేతో జరిగిన మ్యాచ్కు అతడు దూరమయ్యాడు. అయితే అతడు జట్టుతో పాటు ఉండడంతో తర్వాతి మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని ఫ్యాన్స్ భావించారు. కానీ అంతలోనే బీసీసీఐ ఐపీఎల్ను వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసింది. దీంతో హాజిల్వుడ్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు.ఈ క్రమంలో అతడు తిరిగి భారత్కు వచ్చే సూచనలు కన్పించడం లేదు. జూన్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఉన్నందున ముందు జాగ్రత్తగా అతడిని తిరిగి పంపకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ఈ ఏడాది సీజన్లో హాజిల్వుడ్ 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ నిలిచే సమయానికి అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్గా ఉన్నాడు. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కూడా తిరిగి వచ్చేది అనుమానమే. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ దుమ్ములేపుతోంది. 11 మ్యాచులలో 8 విజయాలు సాధించి.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్కు అడుగు దూరంలో నిలిచింది.చదవండి: #Virat Kohli: మనసు మార్చుకోని కోహ్లి.. త్వరలోనే రిటైర్మెంట్?

మనసు మార్చుకోని కోహ్లి.. త్వరలోనే రిటైర్మెంట్?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందే టెస్టు క్రికెట్ నుంచి కోహ్లి తప్పుకుంటాడని, ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ క్రమంలో కనీసం ఇంగ్లండ్ సిరీస్ వరకైనా కొనసాగేలా కోహ్లిని ఒప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా కోహ్లిని తన రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచన చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సిరీస్తోనే టీమిండియా 2025- 27 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఒకవేళ విరాట్ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఈసారి ఇంగ్లండ్కు వెళ్లే జట్టులో అనుభవం లేని యువ ఆటగాళ్లే ఉండే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడి మనసు మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.మనసు మార్చుకోని కోహ్లి.. కానీ కోహ్లి మాత్రం రిటైర్మెంట్ దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. విరాట్ తను మొదట తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కోహ్లి తన టెస్టు రిటైర్మెంట్ విషయంపై వారాల క్రితమే సెలెక్టర్లకు సమాచారం ఇచ్చాడు. ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్లో ఆడేలా అతడిని ఒప్పించడానికి బీసీసీఐ ప్రయత్నిస్తోంది.కానీ అతడి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేలా కన్పించడం లేదు. వచ్చే వారం జరిగే సెలక్షన్ సమావేశంలో కోహ్లి కొనసాగుతాడా? లేదా అన్నది తేలిపోనుంది అని బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాయి. కాగా రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టులకు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతడి స్దానంలో భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్కు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించనుంది. విరాట్ ఇప్పటివరకు 123 టెస్టుల్లో భారత్ ప్రాతినిధ్యం వహించాడు. 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: IND vs SL: ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు

ఐపీఎల్-2025 ఫైనల్ వేదిక, తేదీ మార్పు?
ఐపీఎల్-2025 సీజన్ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభిస్తే మే 15 లేదా 16వ తేదీన ఐపీఎల్ తిరిగి మొదలయ్యే అవకాశముంది. మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఫైనల్ వేదికను మార్చాలని భారత క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం.. మే 25న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇప్పుడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఫైనల్ వేదికను మార్చనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ తేదీలో కూడా మార్పు చోటు చేసుకోనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. మే 25 బదులుగా మే 30న తుది పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను బీసీసీఐ వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్లకు విదేశీ ఆటగాళ్ల అందుబాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. చాలా మంది ఫారన్ ప్లేయర్లు ఇప్పటికే తమ స్వదేశాలకు వెళ్లిపోయారు.చదవండి: IND vs SL: ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు
బిజినెస్

వేల్యూ ఇన్వెస్టింగ్కి పెరుగుతున్న ప్రాధాన్యత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వేల్యూ ఇన్వెస్టింగ్కి ప్రాధాన్యత పెరుగుతున్నట్లు టాటా అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ సోనమ్ ఉదాసీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో టాటా ఈక్విటీ పీఈ ఫండ్లోకి రూ. 884 కోట్లు రాగా, ఏయూఎం రూ. 8,004 కోట్లకు పెరగడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.సాధారణంగా నెగెటివ్ మార్కెట్ సెంటిమెంట్ వంటి అంశాల వల్ల ఉండాల్సిన దానికన్నా తక్కువ విలువకి ట్రేడవుతున్న స్టాక్స్లో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటాయని వివరించారు. టారిఫ్లపరంగా కఠినతర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఫైనాన్షియల్స్, యుటిలిటీస్, ఇంధన, సిమెంట్, పెట్రోకెమికల్స్, సర్వీసెస్ వంటి దేశీ పరిస్థితుల ఆధారిత రంగాలు ఆకర్షణీయంగా ఉండొచ్చన్నారు.

ఏంజెల్ వన్ నుంచి రెండు కొత్త ఫండ్స్..
ఏంజెల్ వన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్తగా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ 50 ఈటీఎఫ్ పేరిట రెండు ప్యాసివ్ ఫండ్స్ను ఆవిష్కరించింది. మే 16 వరకు ఈ న్యూ ఫండ్ ఆఫర్స్లో (ఎన్ఎఫ్వో) ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. సిప్ రూపంలోనైతే రోజువారీ, వారంవారీ, పక్షానికోసారి, నెలవారీ, త్రైమాసికాలవారీగా రూ. 250 నుంచి రూ. 3,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి రెండూ నిఫ్టీ 50 సూచీని ట్రాక్ చేస్తాయి. నాణ్యమైన లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడుల ప్రయోజనాలను పొందాలనుకునే ఇన్వెస్టర్లు వీటిని ఎంచుకోవచ్చని సంస్థ ఈడీ హేమేన్ భాటియా తెలిపారు. బరోడా బీఎన్పీ పారిబా నుంచి..ఇన్కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్) పేరిట న్యూ ఫండ్ ఆఫర్ను బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ (బీబీపీఎంసీ Baroda BNP Paribas) ఆవిష్కరించింది. ఇది మే 21న ముగుస్తుంది. రిస్కులను అంతగా ఇష్టపడకుండా.. మూలధన వృద్ధి, మెరుగైన రాబడులు కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ అనువైనదిగా ఉంటుంది. బీబీపీఎంసీకి చెందిన డెట్ ఆధారిత ఫండ్స్లో 50–65 శాతం నిధులను, ఆర్బిట్రేజ్ పథకంలో 30–50 శాతం, మిగతా మొత్తాన్ని మనీ మార్కెట్ సాధనాల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది.

జీడీపీ వృద్ధి 6.5 శాతం
న్యూఢిల్లీ: దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, స్వల్పకాల ప్రబావాలను అధిగమించే సామర్థ్యం దేశ ఆర్థిక వ్యవస్థకు ఉందని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి అన్నారు. వడ్డీ రేట్లు కొంత తగ్గడం, ద్రవ్యోల్బణం దిగిరావడాన్ని ప్రస్తావించారు. వడ్డీ రేట్లు మరింత దిగొస్తాయన్న అంచనాను వ్యక్తీకరించారు. బడ్జెట్లో ఆదాయపన్ను రాయితీలు కల్పించడం, ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడాన్ని సానుకూలంగా పేర్కొన్నారు. ఇంధనం, రవాణా, మెటల్స్, కెమికల్స్, ఆతిథ్య రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయన్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడుల విషయంలో కొంత అప్రమత్తతకు దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. వాణిజ్య అడ్డంకులు పెరిగిపోతున్న క్రమంలో దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు కీలక భాగస్వాములతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను తప్పకుండా కుదుర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా యూస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధిక టారిఫ్లు ప్రకటించడాన్ని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణాత్మక ధోరణి పెరుగుతున్నట్టు చెప్పారు. వాణిజ్యానికి మరిన్ని అవరోధాలు ఏర్పడుతున్న దృష్ట్యా ద్వైపాక్షిక వాణిజ్యాల ద్వారా దేశ ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా యూస్, ఈయూలతో ఒప్పందం ఎంతో కీలకమన్నారు. దేశీయంగా వృద్ధి చోదకాలు, పోటీతత్వం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయం, వాతావరణ మార్పుల విషయంలో ఎంతో పరిశోధన, కృషి అవసరమన్నారు. గ్రామీణ వినియోగం పుంజుకున్నప్పటికీ పట్టణ వినియోగం ఫ్లాట్గా ఉన్నట్టు చెప్పారు. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో పట్టణ వినియోగం సైతం వేగాన్ని అందుకుంటుందని సంజీవ్ పురి అంచనా వేశారు.

ఇండో–పాక్ ఉద్రిక్తతలపై ఇన్వెస్టర్ల దృష్టి
ముంబై: భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపు యుద్ధమేఘాలు అలుముకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో బలహీనపడ్డాయి. అయితే వారాంతాన కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ సరిహద్దు పొడవునా పాక్ అతిక్రమణలకు పాల్పడినట్లు వెలువడిన వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి అనిశి్చత పరిస్థితులు తలెత్తినట్లు పేర్కొన్నారు. వెరసి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేవరకూ మార్కెట్లు బలహీనపడవచ్చని అభిప్రాయపడ్డారు.ద్రవ్యోల్బణంపై కన్ను ఏప్రిల్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(13న) విడుదలకానున్నాయి. మార్చిలో సీపీఐ వరుసగా ఐదో నెలలోనూ నీరసిస్తూ 3.34 శాతానికి పరిమితమైంది. ఈ బాటలో ఏప్రిల్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు 14న వెల్లడికానున్నాయి. మార్చిలో డబ్ల్యూపీఐ 2.38 శాతం నుంచి 2.05 శాతానికి బలహీనపడింది. ఇక ప్రభుత్వం ఏప్రిల్ నెల వాణిజ్య గణాంకాలను గురువారం(15న) ప్రకటించనుంది. మార్చిలో దేశీ వాణిజ్యలోటు 21.54 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆర్థిక గణాంకాలు కొంతమేర మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఫలితాలు కీలకం ఇప్పటికే గతేడాది(2024–25) చివరి త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వచి్చంది. ఈ బాటలో ఈ వారం సైతం మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు జనవరి–మార్చి(క్యూ4) పనితీరును వెల్లడించనున్నాయి. జాబితాలో రేమండ్, టాటా స్టీల్, యూపీఎల్(12న), టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, సిప్లా, హీరోమోటో కార్ప్, సీమెన్స్, గెయిల్(13న), ఐషర్ మోటార్స్, లుపిన్, శ్రీ సిమెంట్, టాటా పవర్(14న), అబాట్ ఇండియా, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, గోద్రెజ్ ఇండస్ట్రీస్(15న), బీహెచ్ఈఎల్(16న) ఫలితాలు ప్రకటించనున్నాయి. భారత్, పాక్ ఉద్రిక్తతలతోపాటు క్యూ4 ఫలితాలు ట్రెండ్కు కీలకంగా నిలవనున్నట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా అభిప్రాయపడ్డారు. విదేశీ అంశాలు ఈ వారం ఏప్రిల్ నెలకు యూఎస్ గణాంకాలు వెలువడనున్నాయి. ద్రవ్యోల్బణం 13న, రిటైల్ అమ్మకాలు 15న విడుదలకానున్నాయి. గురువారం ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. వరుసగా మూడో సమావేశం(మే)లోనూ ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంవద్ద కొనసాగించేందుకే కట్టుబడిన సంగతి తెలిసిందే. శుక్రవారం(16న) జపాన్ జీడీపీ(జనవరి–మార్చి) ప్రాథమిక వృద్ధి రేటు గణాంకాలు వెలువడనున్నాయి. గత వారమిలా.. భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం(5–9) దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 1,048 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 79,454 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 339 పాయింట్లు(1.4 శాతం) నీరసించి 24,008 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు సైతం 1.4 శాతం చొప్పున నష్టపోయాయి. అమ్మకాలు పెరిగితేమార్కెట్లు గత వారం చివర్లో బలహీనపడటంతో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 24,000 పాయింట్లవద్ద నిలిచింది. భారత్, పాక్ మధ్య ఘర్షణలు నెలకొనడంతో నిఫ్టీ 23,900స్థాయి దిగువకు చేరే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది జరిగితే మార్కెట్లు మరింత బలహీనపడవచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాకాకుండా 24,250 పాయింట్ల ఎగువకు చేరితే బలాన్ని పుంజుకునే వీలున్నట్లు అంచనా వేశారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణతోపాటు పరిస్థితులు కుదుటపడితే సెంటిమెంటుకు ప్రోత్సాహం లభించవచ్చని మెహతా ఈక్విటీస్ సీనియర్ వీపీ(రీసెర్చ్) ప్రశాంత్ తాప్సీ విశ్లేషించారు. సాధారణంగా మార్కెట్లు ఇలాంటి పరిస్థితుల నుంచి త్వరగా రికవరీ సాధిస్తాయని అభిప్రాయపడ్డారు.ఎఫ్పీఐలు రివర్స్గేర్గత రెండు వారాలుగా దేశీ స్టాక్స్లో నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) గత వారాంతాన ఉన్నట్టుండి నికర అమ్మకందారులుగా నిలిచారు. నగదు విభాగంలో శుక్రవారం(9న) రూ. 3,799 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 14,167 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! జీఎస్టీ వసూళ్లు, ఎఫ్పీఐ పెట్టుబడులు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతాయని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. జనవరిలో రూ. 78,027 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, మార్చిలో 3,973 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్పీఐలు ఏప్రిల్లో రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. తిరిగి ఈ నెలలో దేశీ స్టాక్స్ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.
ఫ్యామిలీ

ఏఐ దేవత..! కష్టసుఖాలు వింటుంది, బదులిస్తుంది కూడా..
సముద్రపు ఒడ్డున ఏసూన్ ఒంటరిగా నిలబడి ఉంది. పదేళ్ల ఆ అమ్మాయి.. భూమ్యాకాశాలు తాకుతున్నంత మేరా సముద్రం వైపు చూస్తూ పెద్దగా ఏడుస్తోంది. ఏడుస్తూ సముద్రాన్ని ప్రశ్నిస్తోంది. సముద్రంపై గర్జిస్తోంది. సముద్రాన్ని వేడుకుంటోంది. ‘‘... దయచేసి మా అమ్మని ఒంటరిగా వదిలేయ్. నువ్వు మా అమ్మని వదిలే...య్. సముద్ర దేవతా... ఎందుకిలా అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటావు? (ఏడుపు) మా అమ్మను అలా చేయకు. మా అమ్మనలా చేయకూ. మా అమ్మపై కనికరం చూపించూ. జీవితాంతం ఎముకలు అరిగిపోయేలా పని చేసింది. ఒక్కసారి కూడా విమానం ఎక్కలేదు. తనకి ముత్యాలహారం వెయ్యాలి. తనని నేను విమానం ఎక్కించాలి. నేను మా అమ్మ కోసం ఎన్నో చేయాలి. వదిలేయ్... (ఏడుపు)... వదిలేయ్ (ఏడుపు)... వదిలేయ్.. (ఏడుపు) ఏసూన్ తల్లి ప్రతిరోజూ సముద్రం పైకి వేటకు వెళుతుంది. నత్తగుల్లల్ని వలపట్టి తెస్తుంది. ఆ నత్తగుల్లలే ఆ కుటుంబానికి జీవనాధారం. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతోనే పూట గడిచినా, రోజు గడిచినా! కానీ ఏసూన్కి భయం, సముద్రంపైకి వేటకు వెళ్లినప్పుడు తన తల్లికి ఏమైనా జరిగి చనిపోతుందేమోనని. వెళ్లొద్దని తల్లికి చెబితే వినలేదని, రానివ్వొద్దని సముద్ర దేవతకు మొరపెట్టుకుంటుంది ఆ చిన్నారి. ‘వెన్ లైఫ్ గివ్స్ యు టాంజరీజ్స్’ (జీవితం నీకు నిమ్మకాయలు ఇస్తే..) అనే ఇటీవలి సౌత్ కొరియన్ వెబ్ సీరీస్లో.. మనసును కదిలించే ఒక సన్నివేశం ఇది. కష్టాల్లో ఉన్నప్పుడు దైవానికి మనం ఎన్నో చెప్పుకుంటాం. దైవాన్ని మనం ఎన్నో అడుగుతుంటాం. చిన్నారి ఏసూన్ కూడా అలాగే చెప్పుకుంది. అలాగే అడిగింది. కానీ, సముద్ర దేవత నుంచి బదులు లేదు. అలల హోరు తప్ప ఆ దేవత అలకించిన చప్పుడే లేదు. కానీ , ఈ దేవత అలా కాదు!మలేషియాలోని మజూ సముద్ర దేవత... పిలిస్తే పలుకుతుంది! భక్తుల కష్టసుఖాలను వింటుంది. వెంటనే బదులిస్తుంది! ఆ దేవత కోసం సముద్రపు ఒడ్డుకు వెళ్లనవసరం లేదు. అక్కడి జొహోర్ పట్టణంలోని తియాన్హూ ఆలయం ప్రాంగణంలో వెలసిన చైనా సముద్ర దేవత మజూ సందర్శిస్తే చాలు. ఆ దేవత తన భక్తులతో నవ్వుతూ మాట్లాడుతుంది. కరుణా కటాక్ష వీక్షణాలను రువ్వుతుంది. దేవత దర్శనం గుడి ఆవరణలోని తెరమీద. ఆ తెరకు ఎదురుగా నిలబడి భక్తులు ఆ సముద్ర దేవతతో సంభాషించవచ్చు! ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్తో ఇదంతా సాధ్యం అవుతోంది. ప్రాచీన ఆధ్యాత్మిక ఆచారాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల కలబోతగా సంప్రదాయ చైనా దుస్తులతో ‘అవతరించి’ దర్శనభాగ్యం కలిగిస్తున్న ఈ సముద్ర దేవతను వ్యక్తిగత విషయాలు అడవచ్చు. భవష్యత్తు ఎలా ఉండబోతోందో అడిగి తెలుసుకోవచ్చు. ఇంకా.. ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు.. ఒకటేమిటి, ప్రతి విషయాన్నీ నివేదించవచ్చు. అప్పటికప్పుడు సమాధానాలు తెలుసుకుని ఊరట పొందవచ్చు. సంతృప్తి చెందవచ్చు. ఈ ఏఐ దేవత నెమ్మదిగా, ప్రశాంతంగా బదులిస్తుంది. సలహాలు, సూచనలు అందచేస్తుంది. ధైర్యం చెబుతుంది. టూరిస్టులకు కొత్త ఆకర్షణమలేషియాలోని టెక్ కంపెనీ ‘ఏఐ మాజిన్’ ఇటీవలే ఈ ఏఐ సముద్ర దేవతను సృష్టించింది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో ఈ దేవత చైనావారి మాండరిన్ తో పాటుగా అనేక భాషల్లో మాట్లాడుతుంది. మత బోధనలు, చారిత్రక విషయాలు, జానపద కథలను ఫీడ్ చేసి, ఈ దేవతకు శిక్షణ కూడా ఇచ్చారు. ఏఐ మాజిక్ కంపెనీ వ్యవస్థాపకురాలు షిన్ కాంగ్ తన అనూహ్య భవిష్యత్తు గురించి అడిగినప్పుడు.. ‘‘నువ్వు ఇంట్లో ఉంటే అనూహ్య భవిష్యత్తు విషయంలో అంతా మంచే జరుగుతుంది’’ అని దేవత మృదువుగా సలహా ఇచ్చింది. మరొకరు తనకు నిద్ర పట్టటం లేదని వాపోతే, ‘‘పడక మీదకు ఉపక్రమించే ముందు కాస్త గోరువెచ్చటి నీరు తాగు..’’ అని సూచించింది. అందుకే ఆమెను ‘విన్నపాల అలల దేవత’ అని కూడా అంటున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిదైన ఈ ‘ఏఐ మజూ దేవత’ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవటంతో పాటుగా, మలేషియా వెళ్లే టూరిస్టులు ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారింది. (చదవండి: కోత తక్కువ.. కరిగించే కొవ్వు ఎక్కువ)

ఈ హెయిర్ గాడ్జెట్తో జుట్టు సమస్యలకు చెక్..!
నిగనిగలాడే పొడవాటి కేశాలతో వచ్చే అందమే వేరు. అయితే ఆధునిక జీవనశైలి, కాలుష్యం కారణంగా జుట్టు నిర్జీవంగా మారి, పలుచబడిపోయి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సెల్రిటర్న్ ఆల్ఫా రే హెయిర్ గాడ్జెట్ కేశ క్లేశాలకు చెక్ పెడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ అత్యాధునిక పరికరం చాలా చక్కగా పని చేస్తుంది. ఇది ఎల్ఈడీ సాంకేతికతతో పనిచేస్తుంది. తలలోని రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడుతుంది.ఈ గాడ్జెట్లో మొత్తం 720 ఎల్ఈడీ లైట్లు ఉంటాయి, వీటిలో ఎరుపుకాంతితో వెలువడే ఆల్ఫా ఈ కాంతి కిరణాలు జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకుపోయి, వాటికి ఆక్సిజన్ను అందిస్తాయి. ఈ పరికరాన్ని వైర్లెస్గా వినియోగించుకోవచ్చు. రోజుకు ఇరవై నిమిషాలు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఇది సాఫ్ట్, నార్మల్, పవర్ అనే మూడు వేర్వేరు మోడ్లను కలిగి ఉంటుంది. ఈ పరికరంలో ఒకదానికొకటి అనుసంధానమై టాప్, సెంటర్, ఆల్ఫా ప్యాడ్ అనే మూడు భాగాలు ఉంటాయి. క్లినికల్ అధ్యయనాల ప్రకాశం ఈ సెల్రిటర్న్ ఆల్ఫా రే హెయిర్ గాడ్జెట్ జుట్టు సాంద్రతను, మందాన్ని బాగా మెరుగుపరుస్తుంది. పని పూర్తయ్యాక దీని భాగాలను విడి విడిగా విడదీసుకోవచ్చు. దీనికి మెత్తటి దిండును కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేసుకుని చిత్రంలో చూపినట్లుగా సేదతీరితే సరిపోతుంది. ఉత్తమ ఫలితాలు అందుతాయి.

కోత తక్కువ.. కరిగించే కొవ్వు ఎక్కువ
సన్నగా నాజూకుగా ఉంటేనే అందం, ఆరోగ్యం బాగుంటాయి. కొవ్వు పెరిగి లావెక్కిపోతే, ఒంట్లో అదనంగా చేరిన కొవ్వును కరిగించడానికి చక్కని సౌందర్య చికిత్స ‘లేజర్ లిపోలిసిస్ ట్రీట్మెంట్’. ఈ చికిత్స శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడానికి ఉపయోగపడుతుంది. కొవ్వు ఎక్కువగా ఉన్న చోట చిన్న కోతలు కోసి, వాటి నుంచి ఒక సన్నని ట్యూబ్ను చొప్పిస్తారు. ఈ ట్యూబ్ ద్వారా లేజర్ను పంపి, కొవ్వు కణాలను కరిగిస్తారు. ఇలా కరిగిపోయిన కొవ్వు శరీరం నుంచి సహజంగా బయటకు పోతుంది. మరీ ఎక్కువగా ఉంటే, ఒక పరికరం ద్వారా కొవ్వును పీల్చేసి, తొలగిస్తారు. ఈ పద్ధతి లిపోసక్షన్ కంటే సులభంగా తక్కువ నొప్పితో పూర్తవుతుంది. ఇది చర్మం బిగుతుగా మారడానికి కూడా సహాయపడుతుంది. మెడ, చేతులు, తొడలు, పొట్ట వంటి ప్రాంతాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. అయితే, ఇది బరువు తగ్గించే ప్రక్రియ కాదని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిపి చేస్తేనే ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలాంటి చికిత్సలను నిపుణులైన వైద్యుల ద్వారా మాత్రమే చేయించుకోవాలి. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో ముక్కు నుంచి రక్తం కారడం ప్రమాదమా..?)

ప్రెగ్నెన్సీ టైంలో ముక్కు నుంచి రక్తం కారడం ప్రమాదమా..?
నాకు ఇప్పుడు ఏడవ నెల. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ, నా ముఖం, చేతులు, కాళ్లల్లో ఒక్కసారిగా వాపులు మొదలయ్యాయి. ఇది సాధారణమా లేక ప్రమాదమా?– లక్ష్మీ, నెల్లూరు. వాపు అనేది శరీర భాగాలలో ద్రవం నిలిచిపోవడం వల్ల ఏర్పడుతుంది. ఇది గర్భధారణ సమయంలో తరచుగా కనిపించేదే. సాధారణంగా ఎక్కువ సేపు కూర్చోవటం, నుంచోవటం వలన ప్రెగ్నెన్సీలో వస్తుంది. ఎక్కువ ఉప్పు పదార్ధాలు తిన్నా, బరువు ఎక్కువ ఉన్నా, బీపీ మందులు, స్టెరాయిడ్స్, ఇతర మందులు వాడుతున్నా వస్తుంది. చాలా అరుదుగా కాలేయం, గుండె, మూత్రపిండాల సమస్యల వల్ల కూడా ఈ వాపులు రావచ్చు. ప్రెగ్నెన్సీలో వచ్చే సాధారణ వాపు ఎక్కువగా రాత్రి వేళల్లో కనిపిస్తుంది. ఉదయానికి తగ్గిపోతుంది. కానీ, ఒక్కసారిగా వాపు రావడం, బీపీ పెరగడం, తలనొప్పి, చూపు మసకబారడం వంటివి కనిపిస్తే అది ప్రీ ఎక్లాంప్షియా అంటాం. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఈ వాపులు ప్రెగ్నెన్సీలో నెలలు పెరిగే కొద్దీ, ఆ బరువుకి కాళ్లలో రక్త ప్రసరణ తక్కువగా ఉండటంతో వస్తుంది. ఇది తగ్గించుకోవడానికి ఎక్కువ సేపు నిలబడకూడదు. అనుకూలమైన సాక్సులు, చెప్పులు వేసుకోవాలి. బాగా వాకింగ్, వ్యాయామం చేయాలి. ఒకసారి మీరు డాక్టరుని కలిస్తే బీపీ, బరువు అన్నీ పరీక్షించి ఇది నార్మల్ ఏనా కాదా అనేది చెప్తారు.నేను మూడునెలల గర్భవతిని. చాలా అలసటగా ఉంటుంది. నిద్ర పట్టడం లేదు. నిద్రలో చెడు కలలు ఎక్కువగా వస్తున్నాయి. ఏం చేయాలో చెప్పండి?– నందిని, సంగారెడ్డి.ప్రెగ్నెన్సీలో హార్మోన్ల మార్పుల వలన మొదటి మూడు నెలల్లో అలసట, బలహీనత, నిస్సహాయత భావం ఎక్కువగా ఉంటుంది. ఇవి మానసికంగా చాలా ప్రభావితం చేస్తాయి. అందుకే, అన్నింటికీ సమాధానం విశ్రాంతి తీసుకోవటమే. ఈ సమయంలో కాళ్లు రెండు ఎత్తులో పెట్టుకొని కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. పోషకాహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. నెలలు నిండిన తర్వాత అధిక బరువుతో బలహీనంగా, డల్గా ఉంటారు. పొట్ట పెరిగే కొద్దీ నిద్రపట్టడం కష్టం కావచ్చు. దీని వలన బేబీకి ఏ ప్రమాదం ఉండదు. రిలాక్సినేషన్, బ్రీతింగ్ టెక్నిక్స్ పాటించాలి. మృదువైన దిండు వాడటం, నిద్రకు అనుకూలంగా పడుకోవడం చేయ్యాలి. అంటెర్నల్ క్లాసెస్లలో ఇవీ నేర్పిస్తారు. వ్యాయామం చేయటం వలన కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆహారం తిన్న తర్వాత తప్పకుండా వాకింగ్ చెయ్యాలి. కొంతమందికి నిద్రలేమితోపాటు అలసట, చిరాకు, నిస్సహాయత భావం, పనుల మీద ఆసక్తి లేకపోవటం ఉంటాయి. ఇవి ఉంటే డిప్రెషన్ కావచ్చు. ఇలాంటి సమయంలో మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.నాకు ఇప్పుడు తొమ్మిదవ నెల. ఒక వారం నుంచి ముక్కు నుండి రక్తం వస్తోంది. ఐస్ ప్యాక్ పెట్టుకోమన్నారు. ఇది సాధారణమేనా? ఏవైనా పరీక్షలు చేయించుకోవాలా?– మమత, యాదాద్రి.ప్రెగ్నెన్సీలో ముక్కులో ఉండే రక్తనాళాలు విస్తరించి, సున్నితంగా మారుతాయి. అప్పుడు ముక్కు నుంచి రక్తం రావడం సాధారణమే. ఇది హార్మోన్ల మార్పులు, ఎక్కువ రక్త ప్రసరణ వలన జరుగుతుంది. కొంతమందికి కొన్ని సెకన్ల నుంచి నిమిషాలపాటు రక్తం రావచ్చు. నిద్రలో కూడా ఇలా జరగచ్చు. ఇలా అయినప్పుడు వెంటనే నిటారుగా కూర్చొని, ముక్కు పై భాగాన్ని గట్టిగా మూసివేసి కొన్ని సెంకడ్ల పాటు పట్టుకుంటే తగ్గిపోతుంది. నోటితో శ్వాసతీసుకోవటం మంచిది. ఐస్ప్యాక్ పెట్టుకోవచ్చు. అలా చేసినా తగ్గకపోతే డాక్టర్ని కలవాలి. ముక్కుని ఎక్కువ చీదటం, కిందకు వంగటం, వ్యాయామం చేయటం ఒక రెండు రోజులు మానేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల్లో తగ్గకపోతే, వెంటనే డాక్టర్ని కలవాలి. అలసటగా, బలహీనంగా ఉన్నా డాక్టర్ను కలవాలి. ఆసుపత్రిలో సన్నని గాజుగుడ్డతో నోస్ ప్యాకింగ్ చేస్తారు. తగ్గిన తర్వాత యాంటీసెప్టిక్ క్రీమ్స్ ముక్కు లోపల ఉపయోగించమని చెప్తారు. ఈ క్రీమ్స్ వలన క్రస్టింగ్, మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి. కానీ, కొన్ని కేసెస్లో బ్లీడింగ్ డిసార్డర్స్ ఉన్నా, రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడుతున్నా, ఈ బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు. అందుకే వెంటనే ఆసుపత్రికే వెళ్లాలి. (చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..)
ఫొటోలు


తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)


విశాఖపట్నం : ఆర్కే బీచ్లో సందర్శకుల సందడే సందడి (ఫొటోలు)


యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు (ఫొటోలు)


వీరజవాన్ మురళీ నాయక్ అంతిమ వీడ్కోలు.. జైహింద్.. అమర్రహే నినాదాలు (ఫొటోలు)


‘లెవన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


మిస్ వరల్డ్ : అందాల ముద్దుగుమ్మలు సందడి.. (ఫొటోలు)


తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)


మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)


డాక్టర్ బాబు నిరుపమ్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)


వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
అంతర్జాతీయం

పాకిస్తాన్కు మద్దతుపై చైనా కీలక ప్రకటన
బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టంచేశారు. పాక్కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఆయన శనివారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్తో ఫోన్లో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలను ఇషాఖ్ దార్ వివరించారు.ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని వాంగ్ యీ ప్రశంసించారు. పాక్ సంయమన ధోరణిని కొనియాడారు. మిత్రదేశమైన పాక్కు తమ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తోనూ ఇషాఖ్ దార్ ఫోన్లో మాట్లాడారు.

భారత్పై పాక్ ప్రధాని ఓవరాక్షన్ కామెంట్స్.. నెటిజన్లు ఫైర్
ఇస్లామాబాద్: సరిహద్దుల్లో మూడు రోజులుగా జరుగుతున్న భీకర పోరులో అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంటూ రెచ్చగొట్టే విధంగా సరిహద్దులో కాల్పులు జరిపింది. అంతటితో ఆగకుండా.. పాక్ ప్రధాని విచిత్రంగా తమదే గెలుపు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత షెహబాజ్ షరీఫ్ పాకిక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా షరీఫ్ మాట్లాడుతూ.. భారత్తో యుద్ధంలో తాము విజయం సాధించినట్టు పేర్కొన్నారు. తమ దేశాన్ని, తమ పౌరులను రక్షించుకోవడానికి తాము ఏది చేయడాకైనా వెనుదిరిగేది లేదన్నారు. పాక్ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. భారత్ తమ దేశంలోని మసీదులు, సామాన్య పౌరులపై డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు చేసిందని.. అనేకమంది సాధారణ పౌరుల చావుకు భారత్ కారణమైందని మండిపడ్డారు. తమదేశంపై నిరాధార ఆరోపణలు కూడా చేస్తుందని.. భారత్కు తగిన బుద్ధి చెప్పామని.. తమ జోలికి వస్తే ఏదైనా చేయగలమని చూపించామంటూ ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.JUST IN: 🇵🇰🇮🇳 Pakistani PM Shehbaz Sharif declares victory over India.pic.twitter.com/go5V3JsGN8— Whale Insider (@WhaleInsider) May 10, 2025 12 Pakistan air bases destroyed, many of their jets shot down by the Indian Army… hundreds of terrorists killed deep inside Pakistan territory.Yet this man, with zero iota of shame, Shehbaz Sharif, says we have won against India. 🤡🤡 pic.twitter.com/qoI7u7NKYY— BALA (@erbmjha) May 10, 2025 ఇక, ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. పాక్ ప్రధాని తీరును ఎండగడుతున్నారు. అమెరికా మధ్యలోకి రాకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భారత్ దాడులను తట్టుకోలేక తోక ముడిచి.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్కు ఇంత నష్టం జరిగినా మీది ఎలా గెలుపు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 🇵🇰Pakistan Prime Minister Shehbaz Sharif tweets, praises trump & declares victory over India: “We have won, this is victory.”Also, Pakistani people are celebrating victory all over the country.THIS IS SHAMELESS 🤮🤮 pic.twitter.com/1N9YhfGrya— Vaishnavi (@vaishu_z) May 10, 2025 Shehbaz Sharif won the war in twitter 😂 pic.twitter.com/TTGaMKN86t— Mr. Nice Guy (@Mr__Nice__Guyy) May 10, 2025 ఇదిలా ఉండగా.. ఒకవైపు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే, మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా, సౌదీ అరేబియా తదితర దేశాలకు పాక్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడాన్ని యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా స్వాగతించాయి. ఉద్రిక్తతల నివారణకు ఇది కీలకమైన ముందడుగు అని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా అన్ని ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించింది. Shehbaz Sharif knows the nation is uneducated and will believe whatever they're told, so he quickly declared victory. He's totally an army puppet. It's honestly laughable to watch him.🤣🤣🤣 #ceasefire #PakistanIndianWar pic.twitter.com/dDUr5ONLhI— Sandeep Pathak⛳ (@iPandit_Pathak) May 10, 2025Pakistan PM Shahbaz Sharif, "we won the war against India. Our attack destroyed the enemy's Air Bases".- Welcome to comedy nights hosted by a country's PM in front of the media. pic.twitter.com/gbcaKX64En— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2025

బంగ్లాదేశ్ షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్రవ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్ను నిషేధించినట్లు శనివారం సాయంత్రం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి(కేబినెట్) నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.అవామీ లీగ్, ఆ పార్టీ అగ్ర నేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్లో కొనసాగుతున్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. షేక్హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 2024 జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రత, పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 1949లో అవామీ లీగ్ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్లోని బెంగాళీలకు స్వయంప్రతిపత్తి హక్కులు దఖలుపడాలన్న లక్ష్యంతో అప్పట్లో అవామీ లీగ్ ఉద్యమం చేసింది. చివరకు స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది.🇧🇩 In Bangladesh, students and the public have been continuously protesting for the past 48 hours, demanding a ban on the Awami League, the party of former autocratic and murderous Prime Minister Sheikh Hasina. ✊ #HasinaOut #BanAwamiLeague #BangladeshCrisis pic.twitter.com/YueL4gwhc4— Ibnul Wasif Nirob (@Wasifvibes) May 10, 2025NEW! #Bangladesh’s interim government on Saturday banned deposed prime minister Sheikh Hasina’s Awami League under anti-terrorism law.The announcement to ban Hasina’s Awami League came after the student-led newly-floated National Citizen Party (NCP) activists rallied since… pic.twitter.com/0Zwfd6DdU1— DOAM (@doamuslims) May 10, 2025

కమికాజ్ డ్రోన్లను ప్రయోగించిన పాక్
న్యూఢిల్లీ: స్వార్న్ డ్రోన్లతోపాటు కమికాజ్ డ్రోన్లను భారత్లో విధ్వంసానికి పాకిస్తాన్ ప్రయోగించగా భారత్ వాటిని విజయవంతంగా అడ్డుకుని ముక్కలుచెక్కలు చేసింది. పహల్గాం ఉదంతం తర్వాత భారత్, పాక్ మధ్య మొదలైన సైనిక చర్యల పర్వంలో పాకిస్తాన్ ఈ కామికాజి డ్రోన్లను ఉపయోగించడం ఇదే తొలిసారి అని రక్షణరంగ నిపుణులు శనివారం వెల్లడించారు. గతంలో అర్మేనియా–అజర్బైజాన్ సాయుధ సంఘర్షణలో, ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యద్ధంలో ఈ కమికాజ్ డ్రోన్ల వినియోగం ఎక్కువైంది. ఇప్పుడు భారత్ పైకి పాకిస్తాన్ కమికాజ్ డ్రోన్లను పెద్ద ఎత్తున ప్రయోగించడంతో ఈ తరహా డ్రోన్లపై చర్చ మొదలైంది. కమికాజ్ డ్రోన్ను ఆత్మాహుతి డ్రోన్గా పేర్కొంటారు. బాంబును లేదా క్షిపణిని మోసుకొస్తూ సంబంధిత లక్ష్యంగా బాంబు/క్షిపణిని జారవిడవడం లేదంటే స్వయంగా అదే కూలిపోయి, పేలిపోవడం ఈ కమికాజ్ డ్రోన్ ప్రత్యేకత. విరుచుకుపడిన వందల కొద్దీ డ్రోన్లు మే 8వ తేదీ అర్ధరాత్రి తర్వాత లేహ్ నుంచి సర్ క్రీక్ ఉప్పుకయ్య దాకా 36 వేర్వేరు ప్రదేశాల గుండా సరిహద్దు ఆవలి నుంచి దాదాపు 400 డ్రోన్లు దూసుకొచ్చాయి. దీంతో క్షణాల్లో అప్రమత్తమైన పలు రకాలైన భారత గగనతల రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను అడ్డుకుని కూల్చేశాయి. భారత్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సాంకేతికతతో గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసిన కారణంగానే ఈ డ్రోన్లను నిరీ్వర్యం చేయగలిగిందని, లేదంటే తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చేదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఈ డ్రోన్లను కూల్చేశాక వీటి శకలాలను భారత మిలటరీ అధికారులు ల్యాబ్లకు తరలించి పరిశీలించడంతో ఇవి కమికాజ్ రకానికి చెందినవని నిర్ధారించారు. పంజాబ్, రాజస్తాన్లలో ఈ తరహా డ్రోన్ల శకలాలు లభించాయి. తుర్కియే నుంచే తెప్పించారు తుర్కియే దేశంలోని అసిస్గార్డ్ సోన్గర్ డ్రోన్ కంపెనీ ఈ కామికాజి డ్రోన్లను తయారుచేస్తుంది. దీంతో వీటిని పాకిస్తాన్ తుర్కియే నుంచే తెప్పించినట్లు స్పష్టమైంది. శనివారం తెల్లవారుజామున సైతం బైకర్ వైఐహెచ్ఏ– ఐఐఐ కమికాజ్ డ్రోన్లు పంజాబ్, రాజస్తాన్ సరిహద్దుల గుండా భారత గగనతలంలోకి వచ్చాయి. వీటిని ఎయిర్ డిఫెన్స్ గన్స్తో నేలమట్టం చేశామని రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. ఎందుకీ పేరు? కమికాజ్ అనేది జపాన్ పేరు. జపాన్ వైమానిక దళంలోని ఎయిర్ఫోర్స్ ప్రత్యేక దళం ఇది. ఇది ఆత్మాహుతి ఫైటర్ పైలట్ల విభాగం. రెండో ప్రపంచ యుద్ధకాలంలో శత్రుదేశాల యుద్ధనౌకలను పేల్చేసేందుకు జపాన్ పైలట్లు తమ యుద్ధవిమానాలను వాటితో ఢీకొట్టించేవారు. అలా రెండో ప్రపంచ యుద్ధకాలంలో దాదాపు 3,800 మంది కమికాజ్ పైలట్లు ఆత్మాహుతి దాడులతో ఏకంగా 7,000 మంది శత్రుదేశాల నావికా సిబ్బందిని చంపేశారు. ఈ స్ఫూర్తితో తయారుచేసిన డ్రోన్లకు కమికాజ్ అని పేరుపెట్టారు.
జాతీయం

పాక్ను చావుదెబ్బ కొట్టాం రాజధానిపైనే దాడి చేశాం
న్యూఢిల్లీ: త్రివిధ బలగాలు నాలుగు రోజుల పాటు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో పాకిస్తాన్ కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నట్టు భారత సైన్యం వెల్లడించింది. పాక్ సైన్యం అత్యంత తీవ్రస్థాయిలో నష్టాలు చవిచూసిందని తెలిపింది. ఇకముందు కూడా పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టం చేసింది. ‘‘పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. కానీ గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం కాల్పులు, దాడులకు దిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే మన ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది. మన బలగాలు అందుకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు దీటుగా స్పందించేందుకు బలగాలకు సైన్యాధ్యక్షుడు పూర్తి అధికారాలిచ్చారు’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ప్రకటించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్(డీజీఏఓ) ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్(డీజీఎన్ఓ) వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్తో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్, తదనంతరం సరిహద్దు రాష్ట్రాలపై పాక్ దాడులు, మన సైనిక ప్రతిచర్య తదితరాల అంశాలను కూలంకషంగా వివరించారు. మొత్తం ఆపరేషన్లో ఐదుగురు భారత సైనికులు అమరులైనట్లు వెల్లడించారు. అమర జవాన్లకు, పాక్ మతిలేని దాడుల్లో దుర్మరణం పాలైన భారత పౌరులకు ఘనంగా నివాళులు అరి్పంచారు. సైనిక ఆపరేషన్ల గురించి త్రివిధ దళాల అత్యున్నతాధికారులు ఇలా సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించడం అత్యంత అరుదు కావడం విశేషం. ఆ ముష్కరులు హతం ‘‘పలు అత్యాధునిక పాక్ యుద్ధ విమానాలను నేలకూల్చాం. మనకున్న సమాచారం మేరకే 40 మందికి పైగా పాక్ సైనికులు మరణించారు. 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో కరడుగట్టిన ఉగ్రవాదులు యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ తదితరులు ఉన్నారు. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసినవారు, 2019లో పుల్వామా దాడికి పాల్పనవారు మరణించారు. పాక్, పీఓకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ ఉగ్రవాద శిక్షణ పొందిన కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్కు కూతవేటు దూరంలోని అతి కీలకమైన చక్లాలా సహా ప్రధాన వైమానిక స్థావరాలన్నీ మన దాడుల్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. లాహోర్ తదితర సైనిక స్థావరాల్లోని కీలక రాడార్ వ్యవస్థలు నేలమట్టమయ్యాయి. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు’’ అని డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ వివరించారు. ఇకపై తమ భూభాగంలో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని పాకిస్తాన్కు పూర్తిస్థాయిలో తెలిసొచ్చిందన్నారు. ‘‘మనం ఎంతో సంయమనం పాటించాం. కేవలం పాక్ ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని కచ్చితత్వంతో కూడిన దాడులు చేశాం. సామాన్య ప్రజల నివాసాలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తపడ్డాం. మన దేశ సార్వ¿ౌమత్వం ప్రాదేశిక సమగ్రతకు, పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లినా నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాం’’ అని ఉద్ఘాటించారు. పాకిస్తాన్ డీజీఎంఓ శనివారం మధ్యాహ్నం తనతో మాట్లాడారని, దాడులు ఆపాలని కోరారని తెలిపారు. ఉగ్రవాద క్యాంపులు భస్మీపటలం పాక్ దాడుల్లో భారత్ కూడా యుద్ధ విమానాలు నష్టపోయిందా అని ప్రశ్నించగా, యుద్ధంలో కొన్ని నష్టాలు సహజమని ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి బదులిచ్చారు. అయితే, ‘‘లక్ష్యాలన్నీ సాధించాం. మన పైలెట్లంతా సురక్షితంగా తిరిగొచ్చారు’’ అని చెప్పారు. ‘‘పాక్ యుద్ధ విమానాలు మన భూభాగంలోకి ప్రవేశించకుండా తిప్పికొట్టాం. అయితే, కచ్చితంగా ఎన్ని యుద్ధ విమానాలు కూల్చేశామన్నది ఇప్పుడే బయటపెట్టలేం. పాకిస్తాన్ ఎయిర్బేస్లు, కమాండ్ సెంటర్లు, సైనిక మౌలిక సదుపాయాలు, గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేశాం. పాక్ రాజధాని ఇస్లామాబాద్ దాకా చొచ్చుకెళ్లాం. అక్కడ వైమానిక స్థావరాన్ని నేలమట్టం చేశాం. ఉగ్రవాదుల క్యాంప్లను నామరూపాల్లేకుండా చేయాలన్న లక్ష్యం ఇప్పటికే సాధించాం. ఈ ఫలితాలు మొత్తం ప్రపంచానికి అనుభవంలోకి వస్తాయి’’ అని ఎ.కె.భారతి స్పష్టం చేశారు. పాక్ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టాన్ని ఫొటోల సాయంతో వివరించారు.పాక్ హార్బర్లకు తీవ్ర నష్టం ఆపరేషన్ సిందూర్లో భాగంగా సముద్రంతోపాటు భూఉపరితలంపై నిర్దేశిత లక్ష్యాలపై కచ్చితత్వంతో కూడిన దాడులు చేశామని వైస్ అడ్మిరల్ ఎ.ఎన్.ప్రమోద్ చెప్పారు. పాకిస్తాన్లో ప్రధానమైన కరాచీలోనూ దాడులు జరిగాయని తెలిపారు. ‘‘పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం మేము అప్రమత్తమయ్యాం. అరేబియా సముద్రంలో లైవ్–ఫైరింగ్ డ్రిల్స్, లాంచ్ టెస్టులు, కాంబాట్ ఆపరేషన్ డ్రిల్స్ నిర్వహించాం. పాకిస్తాన్ ముష్కరులకు గుణపాఠం నేర్పాలన్న లక్ష్యంతో మా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. మన సైనిక దళాలు అరేబియా సముద్రంలో నిత్యం అప్రమత్తంగా ఉన్నాయి. ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురైనా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాం. పాకిస్తాన్ సైన్యం దాడులను గట్టిగా తిప్పికొట్టాం. పాక్ నావికాదళంపై మన నావికాదళం పైచేయి సాధించింది. పాక్ ఎత్తుగడలు గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాం. ఇండియన్ నేవీ దాడుల్లో పాక్ హార్బర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాక్ చర్యల పట్ల మన ప్రతిస్పందన దీటుగా, ప్రణాళికాబద్ధంగా సాగింది’’ అని ఎ.ఎన్.ప్రమోద్ స్పష్టం చేశారు.

పాక్ తూటాలకు... క్షిపణులతో బదులివ్వండి
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ ప్రతిస్పందన ఇకపై సరికొత్త రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ‘‘పాక్తూటాలకు కచ్చితంగా క్షిపణులతో సమాధానం చెప్పండి. అది చేపట్టే ఒక్కో దుశ్చర్యకూ కలలో కూడా ఊహించనంత బలంగా బదులివ్వండి’’ అని సైనిక దళాలను ఆదేశించాశారు. త్రివిధ దళాల అధినేతలతో ఆయన ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్పై విస్తృతంగా చర్చించారు. పాక్ దాడులను సహించడానికి ఏ మాత్రమూ వీల్లేదంటూ మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై, ముష్కరులపై ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చెల్లించాల్సిన మూల్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కశ్మీర్ అంశంలో విదేశీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్తో జరిగే ఏ చర్చలైనా సరే కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను, పాక్లో దాక్కున్న ఉగ్రవాదులను భారత్కు అప్పగించడంపైనే ఉంటాయని కేంద్రం తేల్చిచెప్పింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న పీఓకేను, ఉగ్రవాద మూకలను భారత్కు అప్పగించాల్సిందేనని, పాక్కు మరో గత్యంతరం లేదని స్పష్టం చేసింది. ‘‘ఆ దేశంతో చర్చలు వీటిపై మాత్రమే జరుగుతాయి. అది కూడా కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయిలో మాత్రమే కొనసాగుతాయి’’ అని కేంద్రం ఉద్ఘాటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా ఉగ్రవాదుల అప్పగింతపై తప్ప మరో అంశంపై చర్చించే ప్రసక్తే లేదని తెలిపింది. ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగుతున్నంత కాలం సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం తథ్యమని పేర్కొంది. విదేశాంగ మంత్రులు, లేదా జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగాలని పాక్ ప్రతిపాదిస్తుండగా అందుకు భారత్కు అంగీకరించడం లేదు.దాడి చేస్తే గట్టిగా ఎదురుదెబ్బజేడీ వాన్స్కు మోదీ స్పష్టీకరణ న్యూఢిల్లీ/వాషింగ్టన్: పాకిస్తాన్ ఒకవేళ భారత్పై మళ్లీ దాడికి దిగితే అంతకంటే గట్టిగానే ఎదురుదెబ్బ తీస్తామని అమెరికాకు మోదీ తేల్చిచెప్పారు. తమ ప్రతిస్పందన అత్యంత తీవ్రస్థాయిలో, దాయాదికి వినాశకరంగా ఉంటుందని స్పష్టంచేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం మోదీతోఫోన్లో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రస్తావించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్తో కూడా వాన్స్ చర్చించారు. పాక్ కాల్పులు ఆపితేనే సంయమనం పాటిస్తామని అమెరికాకు భారత్ తేల్చిచెప్పినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత్–పాక్ ఘర్షణల గురించి అమెరికా నిఘా వర్గాల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందిన కారణంగానే మోదీ తో వాన్స్ మాట్లాడారని సమాచారం. సున్నితమైన అంశం కావడంతో బయటకు వెల్లడించలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ పాక్ దాడులను తిప్పికొట్టాలని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆదేశం న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం దాడులకు దిగితే గట్టిగా ప్రతిస్పందించాలని, తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లకు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. దాడులను తిప్పికొట్టే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సైనిక చర్యలు నిలిపివేస్తూ అంగీకారానికి వచ్చినట్లు భారత్, పాక్ శనివారం ప్రకటించడం తెలిసిందే. అయినప్పటికీ పాక్ సైన్యం కవి్వంపు చర్యలకు పాల్పడింది. శనివారం రాత్రి సరిహద్దుల్లో కాల్పులు జరపగా, భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ పరిణామాలపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమీక్ష జరిపారు. మరోసారి పాక్ సైన్యం కాల్పులకు గట్టిగా ప్రతిస్పందించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పారు.

మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్కు ఇండియన్ ఆర్మీ వార్నింగ్
ఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనే లక్ష్యంతో తలపెట్టిన ఆపరేషన్ సిందూర్తో సుమారు 100మందికి పైగా ఉగ్రవాదుల్ని హత మార్చినట్లు త్రివిధ దళాల డీజీఎంవోలు (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించాంఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశాంఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లను ముందే గుర్తించాందాడికి ముందే ట్రైనింగ్ సెంటర్లను ఖాళీ చేశారుమురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను తొలిసారి నాశనం చేశాంఅజ్మల్ కసబ్,డేవిడ్ హెడ్లీ లాంటి వాళ్లు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేశాం100 మంది ఉగ్రవాదులు ఎయిర్ స్ట్రైక్లో హతమయ్యారుమేం ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత పీవోకే వద్ద పాక్ కాల్పులు జరిపిందిఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలు, ఆ వీడియోల్ని విడుదల చేస్తున్నాంపాకిస్తాన్ మాత్రం ప్రార్ధనా స్థలాలు,స్కూళ్లను టార్గెట్ చేసింది.ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలు మాత్రమే టార్గెట్ చేశాంలాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాం లాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాంఈనెల 8,9వ తేదీవరకు శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడులు చేసిందిఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్యలో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మృతి చెందారు మరోసారి కాల్పులు జరిపితే పాక్ను వదిలిపెట్టంనిన్న మధ్యాహ్నం 3.15గంటలకు పాక్ డీజీఎంవో మాకు ఫోన్ చేశారుకాల్పుల విమరణకు అంగీకరించాలని పాక్ ప్రాధేయ పడిందివిరమణకు అంగీకరించాంకాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాక్ కాల్పులకు విమరణకు పాల్పడిందికాల్పులు జరిపింనందుకు పాక్కు వార్నింగ్ మెసేజ్ పంపాంఒకవేళ ఈ రోజు రాత్రి కాల్పులు జరిపితే పాక్పై దాడి చేసేందుకు ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉందిమరోసారి కాల్పులు జరిపితే పాక్ అంతు చూస్తాంపాక్ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు మా నివాళులుఆపరేషన్ సిందూర్లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారుభారత సైనికుల త్యాగం వృధా కాదుఈ రోజు రాత్రి ఏం జరుగుతుంతో మానిటర్ చేస్తున్నాం

‘ఇది చాలా బాధాకరం.. మనం ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా?’
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణ అంగీకారాన్ని భారత విదేశాంగా కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించిన తర్వాత ఆయన ట్రోలింగ్ బారిన పడ్డారు. విక్రమ్ మిస్రీని ఆయన కుటుంబంపై కొంతమంది పనిగట్టుకుని విమర్శలకు దిగారు. దీన్ని ప్రధాన పార్టీలన్నీ ఖండించాయి. ప్రజాస్వామ్య యుత దేశంలో ఉన్న మనం ఈ రకంగా ఓ అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని, కీలక ఆపరేషన్ సంబంధించిన వివరాలను వెల్లడించిన క్రమంలో విక్రమ్ మిస్రీని విమర్శించడం తగదంటూ పలువురు నేతలు ఖండించారు.విక్రమ్ మిస్రీపై విమర్శల చేయడాన్నిభారత మాజీ విదేశాంగశాఖ మంత్రి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా ఖండించారు. ‘ మిస్రీని టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు చేయడం చాలా బాధాకరం. విక్రమ్ మిస్రీతో పాటు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లది ఆపరేషన్ సిందూర్ లో ఓ కీలక పాత్ర. అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. ఇందులో ఆయన తప్పేముంది. నాగరిక సమాజంలో ఉన్న మనం ఇలా ఓ వ్యక్తిని ఎలా ట్రోల్ చేస్తాం. విక్రమ్ మిస్రీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఇది చాలా చాలా బాధాకరం. మనం ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా?, మన హక్కుల్ని కాపాడుకునే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. ఈ రకంగా ట్రోలింగ్ చేసి అధికారులపై మానసికంగా ఒత్తిడి కలిగేలా చేయడం సరైంది కాదు’ అంటూ సల్మాల్ ఖుర్షీద్ ధ్వజమెత్తారు.థాంక్స్ చెప్పడం రాకపోతే..నోరు మూసుకుని కూర్చోండిఅంతకుముందు మరొక కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ అనీస్ సోజ్ కూడా విక్రమ్ మిస్రీని కొంతమంది ట్రోల్ చేయడాన్ని తప్పుబట్టారు. కశ్మీర్ కు చెందిన విక్రమ్ మిస్రీ దేశ గౌరవాన్ని నిలబెట్టేలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన దేశానికి చేసిన సేవలకు మనం ఇచ్చే గౌరవం విమర్శలా?, చేసిన దానికి కృతజ్ఞత చెప్పే సంస్కృతి లేకపోతే నోరు మూసుకుని కూర్చోవడం మంచిది’ అంటూ హితవు పలికారు.Vikram Misri, a Kashmiri, has done India proud. No amount of trolling can diminish his service to the country. If you can't say thank you, learn to shut up.— Salman Anees Soz (@SalmanSoz) May 11, 2025 నిజాయితీ, కష్టపడే తత్వం కల్గిన వ్యక్తి విక్రమ్ మిస్రీనిజాయితీ, కష్టపడే తత్వం కల్గిన వ్యక్తి విక్రమ్ మిస్రీ అంటూ ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఆ తరహా వ్యక్తిని ట్రోల్ చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని విమర్శలకునుద్దేశించి ట్వీట్ చేశారు. కార్యనిర్వహక వ్యవస్థలో సేవ చేసే వారిని గౌరవించడం నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యనిర్వహక వ్యవస్థలో ఉన్న వారిని విమర్శించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదన్నారు ఓవైసీ. Mr Vikram Misri is a decent and an Honest Hard working Diplomat working tirelessly for our Nation.Our Civil Servants work under the Executive this must be remembered & they shouldn’t be blamed for the decisions taken by The Executive /or any Political leadership running Watan E… https://t.co/yfM3ygfiyt— Asaduddin Owaisi (@asadowaisi) May 11, 2025
ఎన్ఆర్ఐ

వైట్హౌస్లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్కు చెందిన ప్రేమ్సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్!?
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసుల అరాచకాలు పరాకాష్టకు చేరాయి. టీడీపీ వీర విధేయుడిగా ముద్రపడిన ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కనుసన్నల్లో సాగిన ‘పోలీసు మార్కు’ విచారణతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ లాకప్ డెత్ వ్యవహారం ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని ఏప్రిల్లో ప్రత్యర్థులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ విభేదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.టీడీపీలోని వీరయ్య చౌదరి వైరి వర్గం వారే ఈ హత్యకు పాల్పడ్డారని కూడా గుర్తించినట్టు సమాచారం. ఆయన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు పలువురు అనుమానితులను కొన్ని రోజులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కానీ కేసు దర్యాప్తు కొలిక్కి రాలేదు. మరోవైపు ఈ కేసును త్వరగా ఛేదించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తోంది. దాంతో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఎలాగైనా దోషులను గుర్తించి త్వరగా కేసు క్లోజ్ చేయాలని పంతం పట్టారు. ఆ మేరకు అనుమానితులుగా భావిస్తున్న వారిని పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొడుతూ నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా వేధిస్తున్నారు. దెబ్బలు తట్టుకోలేకే.. ఇటీవల కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో కాకుండా ఒంగోలులోని పోలీసు శాఖకు చెందిన శిక్షణ కార్యాలయం ప్రాంగణంలో రహస్యంగా ఉంచి విచారించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా ఆ అనుమానితులను అక్రమంగా నిర్బంధించి విచారణ పేరిట పోలీసులు తమదైన శైలిలో తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఓ అనుమానితుడు మృతి చెందాడు. దాంతో ఆందోళన చెందిన పోలీసులు ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ముగించాలని భావించారు.మృతుని కుటుంబ సభ్యులను పిలిచి తీవ్రంగా బెదిరించారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే వారిని కూడా ఈ కేసులో ఇరికిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కూడా ఆ మృతుని కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించినట్టు తెలుస్తోంది. వారికి కొంత మొత్తం ముట్టచెప్పి గుట్టు చప్పుడు కాకుండా మృతునికి అంత్యక్రియలు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా జరిపించేసినట్లు సమాచారం. ఏకంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారే బెదిరించడంతో బాధిత కుటుంబం హడలిపోతోంది. కుటుంబ సభ్యులు ఎవర్ని కలుస్తున్నారు, వారి ఇంటికి ఎవరు వస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వారి నివాసం వద్ద పోలీసు నిఘా కూడా పెట్టడం గమనార్హం. ప్రభుత్వ ముఖ్య నేత మద్దతుతోనే ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి అంతగా చెలరేగిపోతున్నారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం
నిర్మల్/ఆదిలాబాద్టౌన్: ఆగి ఉన్న వాహనాన్ని కారు ఢీకొట్టగా తండ్రీకూతురు మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. మాతృదినోత్సవం రోజున తల్లికి గర్భశోకంతోపాటు సౌభాగ్యమూ దూరం చేసింది. తనతో కలిసి పుట్టిన కవల సోదరిని ఒంటరి చేసింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తండ్రీకూతురు శంకర్(50), కృతిక(20) హైదరాబాద్ నుంచి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సొంతూరైన ఆదిలాబాద్కు కారులో బయల్దేరారు. నిర్మల్ రూరల్ మండలం నీలాయిపేట సమీపంలో ఎన్హెచ్–44 బైపాస్ రోడ్డు వద్దకు ఆదివారం వేకువజామున చేరుకున్నారు.ఈ క్రమంలో రోడ్డుపై ఎలాంటి సూచికలు లేకుండా నిలిపి ఉంచిన ఐషర్ వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శంకర్, కృతిక తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. డ్రైవర్ విలాస్ పరిస్థితి సీరియస్గా ఉండటంతో మహారాష్ట్రలోని యవత్మాల్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. ఘటన జరిగిన సమయంలో విలాస్ డ్రైవింగ్ చేస్తుండగా, ముందు సీట్లో శంకర్, వెనుక సీట్లో కతిక ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు డ్రైవర్ ఐషర్ వాహనాన్ని నిలిపినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు.

‘పేడ నీళ్ల’ రచ్చ.. అసలేం జరిగిందంటే?
జమ్మలమడుగురూరల్(అన్నమయ్య): ఇంటి ముందు పేడ నీళ్లు చల్లే విషయంలో జరిగిన చిన్న చిన్న పాటి గొడవ పెద్దదై పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. మండల పరిధిలోని పి. బోమ్మెపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. బొగ్గు గురులక్ష్మి తన ఇంటి ముందు పేడ నీళ్లు చల్లుకుంటూ ఉండగా కొన్ని నీళ్లు పక్కన నివాసం ఉంటున్న రాజచౌడయ్య ఇంటి వద్ద పడ్డాయి. ఈ విషయమై ఇరువురి మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు కుటుంబాలకు చెందిన వారు గాయపడ్డారు. గాయపడి వారిలో బొగ్గు నాగ అంజి, మహేష్, నాగేంద్ర, మల్లికార్జున, రామాంజనేయులు, గురులక్ష్మి, మరోవర్గంలో గూడెంచెరువు రాజ చౌడయ్య, సోమశేఖర్, పెద్ద చౌడప్ప, రమణమ్మ, రామ చౌడయ్య ఉన్నారు. రాజ చౌడయ్యకు తలపై బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలించారు

పెళ్లిలో ప్రతీకారం!
విశాఖపట్నం: భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ ఆశిపాలెంలో నల్ల తాతారావు అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు తాళ్లతో బంధించి హింసించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. తాతారావును ఆసుపత్రికి తరలించారు. వివరాలివి. చిప్పాడ పంచాయతీలోని కంచేరుపాలేనికి చెందిన అబ్బాయికి, ఆశిపాలెం యువ తితో శుక్రవారం రాత్రి ఆశిపాలెంలో వివాహం జరిగింది. ఈ వివాహానికి అమనాంకు చెందిన నల్ల తాతారావు.. అతని అన్నయ్య అప్పన్న, తల్లి తవుడమ్మతో కలిసి వచ్చారు. వివాహం అనంతరం అప్పన్న, తల్లి అమనాంకు తిరిగి వెళ్లగా.. తాతారావు అక్కడే మంచంపై నిద్రించాడు. దీనిని గమనించిన పెళ్లి కుమార్తె బంధువులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తాతారావు కాళ్లు, చేతులను తాళ్ల తో కట్టేసి బంధించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాతారావు అన్నయ్య అప్పన్నకు ఈ విషయం తెలియడంతో తన తమ్ముడిని విడిచిపెట్టమని బంధువులను కోరాడు. అయితే వారు నిరాకరించారు. గతంలో తాతారావుకు కంచేరుపాలెం యువతితో వివాహం జరిగింది. వారి మధ్య వివాదాల కారణంగా ప్రస్తుతం తాతారావు అమనాంలో, అతని భార్య కంచేరుపాలెంలో ఉంటోంది. గతంలో తాతారావు తన మామ అనుకుని వేరే వ్యక్తిని తీవ్రంగా కొట్టాడని, అందుకు ప్రతీకారంగానే తాము అతన్ని బంధించామని పెళ్లి కుమార్తె బంధువులు ఆరోపించారు. తాతారావు అన్నయ్య ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు శనివారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని విడిపించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు తన తమ్ముడికి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని అప్పన్న డిమాండ్ చేశాడు.
వీడియోలు


లాస్ట్ పంచ్.. బ్రహ్మోస్ మిస్సైల్ తో దెబ్బ అదుర్స్..


నాగార్జున సాగర్ కు అందగత్తెలు


భారత్ సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన ఆపరేషన్ సిందూర..


తూటా పేలిస్తే క్షిపణితో బదులిస్తామని పాక్ కు ప్రధాని మోదీ హెచ్చరిక


శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం


పాకిస్తానీ నటితో చేయను: బాలీవుడ్ హీరో


ముగిసిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు


ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన సమావేశం


బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాక్ కు అడగండి


Miss World Competition: తారలు దిగివచ్చిన వేళ..!