ఏపీ కేబినెట్ సమావేశం ఫిబ్రవరి రెండో తేదీన అమరావతిలో జరగనుంది.
సాక్షి, అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ఫిబ్రవరి రెండో తేదీన అమరావతిలో జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. కేంద్ర బడ్జెట్ అధారంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.