త్వరలో సమైక్యాంధ్రపార్టీ రాబోతున్నది: ఎంపీ రాయపాటి సాంబశివరావు | త్వరలో సమైక్యాంధ్రపార్టీ రాబోతున్నది: ఎంపీ రాయపాటి సాంబశివరావు | Sakshi
Sakshi News home page

త్వరలో సమైక్యాంధ్రపార్టీ రాబోతున్నది: ఎంపీ రాయపాటి సాంబశివరావు

Sep 1 2013 10:08 PM | Updated on Mar 18 2019 9:02 PM

త్వరలో సమైక్యాంధ్రపార్టీ రాబోతున్నది: ఎంపీ రాయపాటి సాంబశివరావు - Sakshi

త్వరలో సమైక్యాంధ్రపార్టీ రాబోతున్నది: ఎంపీ రాయపాటి సాంబశివరావు

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఆదివారం ఓ సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రంలో ఎవరూ గెలిచే అవకాశం లేదని రాయపాటి తేల్చేశారు. అంతేకాక త్వరలోనే సీమాంధ్రలో కొత్తపార్టీ వచ్చే అవకాశం ఉంది అని జోస్యం చెప్పారు. సెప్టెంబర్ 6 తేది తర్వాత సీమాంధ్ర ప్రాంత ఎంపీలు కీలక నిర్ణయం తీసుకోనున్నారని రాయపాటి తెలిపారు. త్వరలోనే ఎంపీలందరూ కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారన్నారు. త్వరలోనే సమైక్యాంధ్ర పార్టీ రాబోతున్నదని ఎంపీ రాయపాటి సూచనప్రాయంగా తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement