అమరావతి రైలు మార్గానికి 2,680 కోట్లు | 2,680 crore to the Amaravati railways | Sakshi
Sakshi News home page

అమరావతి రైలు మార్గానికి 2,680 కోట్లు

Published Sat, Feb 4 2017 10:17 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

అమరావతి రైలు మార్గానికి 2,680 కోట్లు

అమరావతి రైలు మార్గానికి 2,680 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ నూతన రైల్వే మార్గం నిర్మాణానికి తాజా రైల్వే బడ్జెట్‌లో రూ.2,680 కోట్లు మంజూరయ్యాయి.

తాజా రైల్వే బడ్జెట్‌లో కేటాయింపు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ నూతన రైల్వే మార్గం నిర్మాణానికి తాజా రైల్వే బడ్జెట్‌లో రూ.2,680 కోట్లు మంజూరయ్యాయి. ఆ మేరకు విజయవాడ–అమరావతి–గుంటూరులను కలుపుతూ 106 కిలోమీటర్ల మేరకు రైల్వే ట్రాక్‌ నిర్మించనున్నారు. 2016–17 బడ్జెట్‌లో ఈ రైల్వే లైన్‌కు సర్వే మంజూరవగా.. ఇటీవలే రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) సర్వే పూర్తి చేసి రైల్వే బోర్డుకు నివేదిక అందించింది.

ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో ఈ మార్గానికి  నిధులు కేటాయించడంతో నాలుగేళ్లలో రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తి కానుంది. ఏపీ ప్రభుత్వం రైల్వేశాఖతో ఇటీవలే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వివిధ  ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగాయి. ఆ మేరకు నడికుడి–శ్రీకాళహస్తి, కడప–బెంగళూరు, కోటిపల్లి–నర్సాపురం, అమరావతికి రైల్వే కనెక్టివిటీ... ఈ నాలుగు ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement