కలికిరిలో నలుగురికి కత్తిపోట్లు..ఒకరి మృతి | 4 injured, 1 died in man attack | Sakshi
Sakshi News home page

కలికిరిలో నలుగురికి కత్తిపోట్లు..ఒకరి మృతి

Published Mon, Jun 8 2015 11:57 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

చిత్తూరు జిల్లా కలికిరి మండలం గుంటివీరన్నగాలిపల్లెలో సోమవారం నలుగురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు.

చిత్తూరు(కలికిరి): చిత్తూరు జిల్లా కలికిరి మండలం గుంటివీరన్నగాలిపల్లెలో సోమవారం నలుగురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. వీరిలో రమేశ్(18) అనే యువకుడు చనిపోగా, వెంకటేశ్, రాజశేఖర్, ఈశ్వరయ్య అనే మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఓ యువతితో అసభ్యకరంగా మాట్లాడరనే విషయంలో అదే గ్రామానికి చెందిన అరిఫ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి యువకులపై దాడి చేసినట్టు తెలిసింది. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement