‘మాకూ రోషముంది.. రాజకీయ రోషం మాత్రం కాదు’ | BJP MLA Manikyala Rao Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘మాకూ రోషముంది.. రాజకీయ రోషం మాత్రం కాదు’

Published Fri, Feb 1 2019 3:45 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

 BJP MLA Manikyala Rao Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణంగానే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీని అంగీకరించింది చంద్రబాబేననీ, దానిని అమలుచేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాలేదని మండిపడ్డారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై దర్యాప్తుకు టీడీపీ ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరిపైనా అయినా సీబీఐ సోదాలు జరిపితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందన్నారు.

ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిధులు మంజూరు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గల నియోజకవర్గాలకు నిధులు నిలుపుదల చేస్తోందని అన్నారు. దేశంలో రాష్ట్రంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. చందబ్రాబు కారణంగా ఏపీకి ఇంత అన్యాయం జరగుతుంటే తాము చాలా బాధపడుతున్నామని విచారం వ్యక్తం చేశారు. తమకు కూడా రోషం ఉందని, కానీ అది రాజకీయ రోషం మాత్రం కాదని, నిజమైన రోషమని మాణిక్యాలరావు పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement