సీఏ ఫైనల్ కోర్సులో మారిన పాఠ్యాంశాలు | CA changed the course of the final curriculum | Sakshi
Sakshi News home page

సీఏ ఫైనల్ కోర్సులో మారిన పాఠ్యాంశాలు

Published Sat, Aug 23 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

సీఏ ఫైనల్ కోర్సులో మారిన పాఠ్యాంశాలు

సీఏ ఫైనల్ కోర్సులో మారిన పాఠ్యాంశాలు

నవంబర్‌లో జరగనున్న సీఏ ఫైనల్ పరీక్షల్లో అకౌంటింగ్, ఆడిటింగ్ సబ్జెక్టుల్లో మార్పులు చేసినట్టు ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ దేవరాజరెడ్డి తెలిపారు.

* ఆడిటింగ్, అకౌంటింగ్‌లో కొత్త సిలబస్
* ఐసీఏఐ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఎం.దేవరాజరెడ్డి

 
విజయవాడ:
నవంబర్‌లో జరగనున్న సీఏ ఫైనల్ పరీక్షల్లో అకౌంటింగ్, ఆడిటింగ్ సబ్జెక్టుల్లో మార్పులు చేసినట్టు ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ దేవరాజరెడ్డి తెలిపారు. నగరంలోని ఎ-కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న సీఏ విద్యార్థుల జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కంపెనీల చట్టం-2013లో కొన్ని మార్పులు చేశారని, దానికి అనుగుణంగా సీఏ ప్రొఫెషనల్ కోర్సులోనూ మార్పులు చేసినట్లు వెల్లడించారు.
 
 అడ్వాన్స్ ఐటీ కోర్సు...
 నేడు ప్రతి రంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాధాన్యమెంతో ఉందని, ఈ నేపథ్యంలో సీఏ ప్రొఫెషనల్స్ కూడా ఐటీలో ముందుండాలనే ఉద్దేశంతో ఐసీఏఐ సంస్థ అడ్వాన్స్ ఐటీ కోర్సును నిర్వహిస్తుందని దేవరాజరెడ్డి తెలిపారు. 2012 ఆగస్టు 1న సీఏ కోర్సుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులంతా ఈ అడ్వాన్స్ ఐటీ కోర్సును తప్పక చేయాలన్నారు. సీఏ ఫైనల్‌లో ఈ కోర్సును నేర్పుతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement