ఆ ముగ్గుర్నీ ఆంధ్రాకివ్వండి | Chandrababu Naidu seeks to allocate three IAS officers for Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గుర్నీ ఆంధ్రాకివ్వండి

Published Fri, Aug 29 2014 3:38 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఆ ముగ్గుర్నీ ఆంధ్రాకివ్వండి - Sakshi

ఆ ముగ్గుర్నీ ఆంధ్రాకివ్వండి

తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని కోరుతూ సీఎం చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం లేఖ రాశారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని కోరుతూ సీఎం చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం లేఖ రాశారు. ఈ ముగ్గురు అధికారుల కార్యదక్షత రాష్ట్రానికి ఎంతో అవసరమని లేఖలో పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారులు సురేంద్రబాబు, అనురాధలను చెరో రాష్ట్రానికి కేటాయించారు. ఆ మేరకు సురేంద్రబాబును ఏపీకి, అనురాధను తెలంగాణకు కేటాయించారు. అనురాధ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా పనిచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భార్యాభర్తల అంశంగా పరిగణనలోకి తీసుకుని అనురాధను కూడా ఏపీకి కేటాయించాలని చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జె.ఎస్.వి. ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే వీలుందని అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులపై అభ్యంతరాలు తెలియజేయడానికి శుక్రవారంతో గడువు ముగుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement