దేశీయ ఫోర్‌హెడ్‌ థర్మామీటర్, ఫేస్‌ మాస్క్‌ ఆవిష్కరణ | CM Ys Jagan Launched Domestic forehead thermometer and face mask | Sakshi
Sakshi News home page

దేశీయ ఫోర్‌హెడ్‌ థర్మామీటర్, ఫేస్‌ మాస్క్‌ ఆవిష్కరణ

Published Thu, Apr 23 2020 4:41 AM | Last Updated on Thu, Apr 23 2020 7:56 AM

CM Ys Jagan Launched Domestic forehead thermometer and face mask - Sakshi

ఫేస్‌ మాస్క్‌ పనితీరును తెలుసుకుంటున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌కు చెందిన గ్రీన్‌ ఓషన్‌ రీసెర్చ్‌ లాబ్స్‌ రూపొందించిన ఇన్‌ ఫ్రా రెడ్‌ నాన్‌ కాంటాక్ట్‌ ఫోర్‌ హెడ్‌ థర్మామీటర్, ప్రొటెక్టివ్‌ ఫేస్‌ మాస్క్‌లను బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ మాస్క్, థర్మామీటర్‌ పని తీరును ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌కు చెందిన గ్రీన్‌ ఓషన్‌ రీసెర్చ్‌ ల్యాబ్స్‌ డైరెక్టర్స్‌ ఏ శృతి, ఎం సాయిరాం ముఖ్యమంత్రికి వివరించారు.

► తొలిసారి దేశీయంగా ఇన్‌ ఫ్రా రెడ్‌ నాన్‌ కాంటాక్ట్‌ ఫోర్‌ హెడ్‌ థర్మామీటర్, ప్రొటెక్టివ్‌ ఫేస్‌ మాస్క్‌లు తయారు చేస్తున్నామని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో స్థానికంగా ఉన్న ఉద్యోగులతోనే ఈ పరికరాలను తయారు చేస్తున్నామని వెల్లడించారు.
కోవిడ్‌–19 వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా స్థానికంగా అందుబాటులో ఉన్న ఉద్యోగులతోనే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. 
► ప్రస్తుతం రోజుకు 1,000 థర్మామీటర్లు తయారు చేస్తున్నామని, మన రాష్ట్ర అవసరాల అనంతరం త్వరలోనే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే దిశగా ఉత్పత్తిని పెంచుతామని వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement