face mask
-
వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్లు
వేసవి ఉష్ణోగ్రతలకు చర్మం పొడిబారిపోతుంది. తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ముఖం కూడా కళా విహీనంగా తయారవుతుంది. చర్మ, ముఖం సౌందర్య రక్షణలో శతాబ్దాల తరబడి కలబంద లేదా అలోవెరా విశిష్టంగా నిలుస్తోంది. వడదెబ్బ నుంచి ఉపశమనం మొదలు, మొటిమల నివారణలో బాగా పనిచేస్తుంది.అలోవెరాలో అనేక ఆరోగ్య లక్షణాలున్నాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి అద్భుతాలు చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంది. మరి అలోవెరా, ఇతర మూలికలు, పదార్థాలతో కలిసి వేసుకునే మాస్క్ల గురించి తెలుసుకుందామా?జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, కలబంద జెల్లో పాలీసాకరైడ్లు , గ్లైకోప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. గాయం మానడాన్ని వేగవంతం చేసేలా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి మంటను తగ్గించడానికి సాయ పడతాయి. ఇంకాకలబందలోని హైడ్రేటింగ్, యాంటీమైక్రోబయల్లక్షణాలు మొటిమలు, తామర లాంటి సమస్యల నివారణతోపాటు, చర్మం, పొడిబారడం, ఎర్రబారడం, పగుళ్లు, కాలిన గాయాలకు కూడా ప్రభావవంతంగా పనిస్తుందని అధ్యయనం పేర్కొంది.కలబంద ఫేస్ మాస్క్లుకలబంద - తేనె మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జులో 1 టీస్పూన్ తేనె కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసువాలి. ఇది చక్కటి హైడ్రేటింగ్ ఏజెంట్గా పనిచేసి పోషణనిస్తుంది. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.కలబంద - పసుపు మాస్క్: పసుపు, తేనె లేదా రోజ్ వాటర్ వంటి మూలికలు , సుగంధ ద్రవ్యాలతో కలిపినప్పుడు, కలబంద చర్మ సంరక్షణ శక్తి కేంద్రంగా మారుతుంది. ముఖ్యంగా సేంద్రీయ పసుపు , కలబంద మాస్క్, నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మొటిమల మచ్చలను తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ను చిటికెడు పసుపుతో కలపండి. 10 నిమిషాలు అలాగే ఉంచి సున్నితంగా కడగాలి. కలబంద -రోజ్ వాటర్ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్, టీస్పూన్ రోజ్ వాటర్ బాగా కలపాలి. దీన్ని ముఖంపై సమానంగా అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఎరుపును తగ్గించి, చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.కలబంద - నిమ్మకాయ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్లో కొన్ని చుక్కల నిమ్మరసంతో కలపండి.దీన్ని ముఖానికి అప్లై చేసి, 10 నిమిషాలు ఉంచి శుభ్రంగా కడిగేసుకోవాలి. (బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఇది వాడకూడదు). నిమ్మకాయ నల్ల మచ్చలను క్రమంగా తగ్గిస్తుంది.కలబంద-గ్రీన్ టీ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్లో, చల్లని గ్రీన్ టీ కలపండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, క 15 నిమిషాలు అలాగే ఉంచి కడగాలి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ మాస్క్ ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. యవ్వనమైన, అందమైన చర్మాన్ని అందిస్తుంది.కలబంద-కీరా మాస్క్: కలబంద జెల్లో తురిమిన కీరా కలిపి దీన్ని సున్నితంగా ముఖానికి అప్లై చేయాలి. చల్లటి నీటితో శుభ్రం చేయడానికి ముందు 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ మాస్క్ చాలా రిఫ్రెష్గా ఉంటుంది, అలసిపోయిన చర్మాన్ని డీపఫ్ చేయడానికి , హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. -
ఈ మల్టీకలర్ ఫేస్మాస్క్ ధర వింటే షాకే..!
కరోనా బారీనుంచి ఆ సమయంలో ఎన్నోరకాల ఫేస్మాస్క్లను వాడారు. వాటి వలన ఫలితాలు, నష్టాలు కూడా అనుభవించారు. అదొక విధమైతే.., ఈ చర్మ సమస్యలు మరో విధము. వయసు పెరిగేకొద్దీ చర్మం ముడతలు బారుతుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. ఈ సమస్యలను డీల్ చేయాలంటే ఈ లైట్ థెరపీ మాస్క్ను వాడాల్సిందే.. దీన్ని 15 నుంచి 25 నిమిషాల వరకు ముఖానికి పెట్టుకుని ఉంచితే.. మంచి ఫలితం లభిస్తుంది. ఆప్షన్స్లో మల్టీ కలర్స్ని మార్చుకోవడంతో వివిధ చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎటువంటి నొప్పి, శ్రమ, ఇబ్బంది లేకుండా ముఖంలో మెరుపుని సొంతం చేసుకోవచ్చు. ఈ మాస్క్ సాయంతో రెడ్, బ్లూ, ఆరెంజ్, పర్పుల్, వైట్, గ్రీన్, సియాన్ ఇలా మొత్తంగా 7 రంగుల్లో ట్రీట్మెంట్ని అందుకోవచ్చు. రిమోట్ సాయంతో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పోర్టబుల్గానూ, కంఫర్టబుల్గానూ పని చేస్తుంది. స్త్రీల సౌలభ్యం, సౌకర్యం కోసం రూపొందిన ఈ ఎల్ఈడీ బ్యూటీ మాస్క్.. ఫుడ్–గ్రేడ్ సిలికాన్ మెటీరియల్తో తయారైంది. ఇంట్లోనే కాదు ప్రయాణాల్లోనూ సులభంగా ఉపయోగించుకోవచ్చు, ఈ మాస్క్ బిజీ లైఫ్స్టయిల్కి సరైనది. ఎప్పుడైనా, ఎక్కడైనా.. ఏపని చేసుకుంటూ అయినా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. ఈ స్కిన్కేర్ టూల్.. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముడతలు, మచ్చలు వంటి ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. బ్లూ లైట్ చికాకు, అలసటలను దూరం చేస్తుంది. వైట్ లైట్ చర్మానికి పునరుజ్జీవాన్ని అందిస్తుంది. సియాన్ లైట్ స్కిన్ టోన్ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా ఒక్కో కలర్ ఒక్కో సమస్యను దూరం చేస్తుంది. ఈ పరికరం ఇంట్లో ఉంటే హోమ్ స్పాను ఎంజాయ్ చేయొచ్చు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,083 రూపాయలు. ఇవి చదవండి: ఈ భయం.. ఒక ఫోబియా అని మీకు తెలుసా! -
క్షణాల్లో ఫేస్మాస్క్ను రెడీ చేసే మెషీన్.. కొరియన్లు చేసేది ఇదే
నిజానికి ఫేస్ మాస్క్లతో స్కిన్ కేర్ పొందడం మంచి ప్రయత్నమే. కానీ వాటిని సిద్ధం చేసుకోవడమే కష్టం. ఆ కష్టాన్ని సులభతరం చేస్తుంది ఈ లేటెస్ట్ ఫేస్ మాస్క్ డివైస్. ఇంట్లో తయారు చేసుకునే సాధారణ ఫేస్ మాస్క్ వేసుకుంటే.. అప్లై చేసుకునే సమయంలో ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువవుతుంది. కొన్నిసార్లు సగం ఆరి.. సగం ఆరక ఇబ్బందవుతుంది. గుజ్జుమెత్తగా లేకుంటే ఉండాల్సిన సమయం కంటే ముందే రాలిపోతుంది. ఇలా ఒక్కటని కాదు.. ఫేస్ మాస్క్ విషయంలో అన్నీ సమస్యలే. అదే ఈ మెషిన్తో తయారైన మాస్క్ని క్లాత్ మాదిరి పట్టుకుని.. ముఖంపై సమాంతరంగా సులభంగా పరచుకోవచ్చు. పైగా ఈ మెషిన్ని మనం క్లీన్ చెయ్యాల్సిన పనిలేదు. సెల్ఫ్ క్లీనింగ్ మోడ్ ఆన్ చేస్తే పది సెకన్లలో క్లీన్ అయిపోతుంది. దీనికి చార్జింగ్ పెట్టుకుని.. వైర్లెస్గా వాడుకోవచ్చు. ఎన్ని నీళ్లు పొయ్యాలి.. ఇన్గ్రీడియెంట్స్ ఏ మోతాదులో కలపాలి.. అనే సూచనలను వాయిస్ మోడ్లో ఇస్తూంటుంది ఈ మేకర్. అవసరం లేదనుకుంటే వాయిస్ రిమైండర్ ఆపేసుకోవచ్చు. ఇది సరిగ్గా రెండు నిమిషాల్లో మాస్క్కి కావాల్సిన పేస్ట్ని సిద్ధం చేస్తుంది. ఇందులో కూరగాయలు, పండ్లు, విటమిన్ టాబ్లెట్స్ వంటివి పేస్ట్లా చేసుకోవచ్చు. దీని ధర సుమారుగా 6 వేలరూపాయల పైమాటే. మాస్క్ ప్లేట్స్ని బట్టి.. అందులో లిక్విడ్ వేయగానే ఆయా షేప్ మాస్క్లు సిద్ధమవుతాయి. కళ్లు, ముక్కు, పెదవులకు ఇబ్బంది లేకుండా రూపొందిన ఫేస్ షేప్లో ఉండే ప్లేట్తో పాటు.. కళ్లు, ముక్కు, పెదవుల ఆకారంలో ఉండే ప్లేట్స్ కూడా డివైస్తో పాటు లభిస్తాయి. ఈ సౌకర్యాలన్నింటిని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. -
ఏంటిది? మొత్తం ముఖానికే మాస్క్! బాబోయ్! మళ్లీ చైనాకు ఏమైంది?
మొన్న మొన్నటి వరకు చైనా కరోనాతో భయానక నరకాన్ని చవి చూసింది. అన్ని దేశాలు బయటపడ్డా చైనా మాత్రం అంతా తేలిగ్గా ఆ మహమ్మారి నుంచి బయటపడలేకపోయింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్న వేళా! మళ్లా చైనీయులకు ఏమైందో గానీ మొత్తం ముఖం కవర్ అయ్యేలా మాస్క్ ధరిస్తున్నారు. కరోనా టైంలో కేవలం ముక్కుకి మాత్రమే మాస్క్ వేస్తే ఇప్పుడు ఏకంగా మొత్తం ముఖానికి మాస్క్ ఏంటి? బాబోయ్!.. మళ్లీ చైనాలో ఏం మహమ్మారి వచ్చింది అని అన్ని దేశాలు ప్రశ్నలు సంధించడం ప్రారంభించాయి. ఇంతకీ అక్కడ ఏమైందంటే.. చైనాలో ఎండలు గట్టిగా మండిపోతున్నాయి. ఆ వేడికి అక్కడ ప్రజలు తాళ్లలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటుంటే..దంచికొడుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారట. ఈ ఎండ నుంచి రక్షించుకోవడానికి అక్కడ ఉన్న వాళ్లంతా ఇలా ఫేస్మొత్తం కవర్ చేసేలా 'ఫేస్కినిక్' అనే మాస్క్లు వేస్తున్నారట. చైనాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండటంతో నివాసుతులు దగ్గర్నుంచి, పర్యాటకులు వరకు అందరూ కూడా పోర్టబుల్ ఫ్యాన్లను కూడా తీసుకువెళ్తున్నారట. ఎండ వేడి నుంచి కాపాడుకునేందుకు టోపీలు, వివిధ రకాల మొత్తటి దుస్తులను ఆశ్రయిస్తున్నారు అక్కడ ప్రజలు. అదీగాక అక్కడ మహిళలు ఫెయిర్ స్కిన్నే ఇష్టపడతారు అందువల్ల ఈ ఎండ నుంచి తమ మేను కాంతి తగ్గకుండా ఉండేందుకు వారంతా ఇలా ముఖమంతా కవర్ అయ్యేలా మాస్క్లు వేసుకుంటున్నారు. ఇవి చాలా తేలిగ్గా, సింథటిక్ ఉండటంతో చర్మం కమిలిపోకుండా ఉంటుందట. అంతేకాదు ఈ ఎండలు ఎలా ఉన్నా ఈ 'పేస్కినిక్' మాస్క్లు మాత్రం హాట్కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. (చదవండి: ఓపక్క గర్జించే జలపాతం..సెల్ఫీ పిచ్చితో చేసిన పని..) -
బ్యూటిప్స్
ఏ కాలంలోనైనా జిడ్డు చర్మం బాగా ఇబ్బంది పెడుతుంటుంది. జిడ్డుపోగొట్టి ముఖం ఫ్రెష్గా ఉండడానికి ఎగ్, లెమన్ఫేస్మాస్క్ బాగాపనిచేస్తుంది. ఒక గుడ్డును తీసుకుని దానిలోని తెల్లసొనను ఒక గిన్నెలో వేసి దానికి స్పూను తాజా నిమ్మరసం చేర్చి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఫేస్మాస్క్ ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ముఖం మీద జిడ్డు, మొటిమలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది ఈ ప్యాక్. -
కరోనా విజృంభణ.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..
చైనాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో అన్నీ దేశాలు ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టాయి. భారత్లోనూ కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వైరస్ కట్టడికి అన్నిజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం న్యూ ఇయర్ వేడుకలకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటటంతో తాజాగా తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్కు అస్వస్థత.. -
ఇక ఆఫీసుల్లోనూ మాస్క్లు తప్పనిసరి!
బెంగళూరు: చైనా నుంచి కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ బీఎఫ్.7 స్ట్రెయిన్ భారత్లో విజృంభించే అవకాశాల నేపథ్యంలో.. కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాకుండా దాదాపుగా అంతటా మాస్క్ తప్పనిసరి చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. పలు దేశాల్లో ప్రధానంగా పొరుగు దేశం చైనాలో కరోనా కల్లోలం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. బీఎఫ్.7 ప్రభావంతో కరోనా కేసులు, మరణాలతో చైనా ఆగం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇక కర్ణాటక ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలతో పాటు ఇండోర్ లొకేషన్స్, క్లోజ్డ్ ప్రాంతాల్లోనూ మాస్క్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఏసీ గదులున్న ప్రాంతాల్లోనూ మాస్క్లు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో థియేటర్లు, ఆఫీసుల్లోనూ మాస్క్ మస్ట్ కానుంది. అలాగే.. జలుబు లక్షణాలు కనిపించినా, శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తినా.. కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక వైద్యారోగ్య శాఖ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించి.. సీఎం బొమ్మైకి నివేదిక సమర్పించింది. పాజిటివ్ పేషెంట్ల శాంపిల్స్ను జీనోమిక్ సీక్వెన్సింగ్కు పంపించనున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ వెల్లడించారు. అన్ని జిల్లాల్లో వైద్య విభాగాలను అప్రమత్తం చేసినట్లు, సరిపడా బెడ్లు, ఆక్సిజన్తో సిద్ధంగా ఉండాలని సూచించినట్లు ఆయన తెలిపారు. -
పిల్లలూ.. మనం జంతువులను పుస్తకాల్లోనే చూడాలేమో..!
హెచ్ఎం: పిల్లలూ... మీరెప్పుడైనా పులిని చూశారా... విద్యార్థులు: ఊహు.. చూడలేదు సార్... హెచ్ఎం: పోనీ.. ఏనుగునీ.. విద్యార్థులు: (లేదన్నట్టుగా తెల్ల మొహం) హెచ్ఎం: భవిష్యత్తులో మీరు వీటిని జూలో, పుస్తకాల్లోనే చూడాల్సిన పరిస్థితి రావొచ్చేమో.. విద్యార్థులు: ఎందుకు సార్? హెచ్ఎం: ఎందుకంటే... అడవులు నశించిపోవడంతో జంతు సంపద కూడా అంతరించిపోతోంది.. అంటూ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కొత్తపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోసూరు రాము బోధించారు. విద్యార్థులతో జంతు మాస్క్లు ధరింపజేసి, ఆయన కూడా మాస్క్ వేసుకొని బోధన చేశారు. దేశంలో వేలల్లో ఉన్న జంతు సంపద వందల్లోకి చేరిందని.. ప్రస్తుత పరిస్థితులను విద్యార్థులకు వివరించారు. వినూత్న రీతిలో బోధిస్తే విద్యార్థులు ఆసక్తిగా విషయాన్ని అర్థం చేసుకుంటారనే ఇలా చేశానని ఆయన చెప్పారు. (క్లిక్ చేయండి: కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!) -
Covid-19: కరోనా అంతు చూసే మాస్కు!
కరోనా ఇక కాస్త మందగించిందంటూ మూడో వేవ్ దాటిన తర్వాత ప్రజలంతా కొద్దిగా హాయిగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో... తన ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోలేదంటూ అది అడపాదడపా సందడి చేస్తూనే ఉంది. దేశంలో చాలా చోట్ల కేసులు మళ్లీ పెరుగుతున్నాయంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దాంతో మూలన విసిరేసిన మాస్కుల డబ్బాలు మళ్లీ తెరవాల్సిందేనంటూ ఆరోగ్య నిపుణులూ, ప్రభుత్వ పెద్దలూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ తాకిన కొద్దిసేపటికి అది నిర్వీర్యం అయిపోయే కొత్త మాస్కులను శాస్త్రవేత్తలు రూపొందించారు. వైద్యులు వాడే ఎన్–95 మాస్కులూ, ప్రజలు ఉపయోగించే మూడు పొరల మాస్కుల తరహాలో కరోనాను అరికట్టే రసాయనంతో మరో పొరను చేర్చుతూ వీటిని రూపొందించామంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కెంటకీకి చెందిన కెమికల్ ఇంజనీర్ దిబాకర్ భట్టాచార్య. ‘కొత్తగా రూపొందించిన ఈ పొర మీదికి ‘సార్స్–సీవోవీ–2’వైరస్ లేదా దానికి సంబంధించిన అంశాలేవైనా చేరి... అక్కడ దాని మీద కనీసం 30 సెకండ్ల పాటు ఉంటే దాని స్పైక్ ప్రోటీన్ నిర్వీర్యమవుతుంది. కొమ్ముల్లా ఉండే ఈ స్పైక్ ప్రోటీన్ను ఓ తాళం చెవిలా ఉపయోగించుకునే వైరస్ మన జీవకణాల్లోకి చేరుతుందన్న విషయం తెలిసిందే. ఇది ఎన్–95లా పనిచేస్తున్నప్పటికీ దీనిపైని అదనపు పొరపై యాంటీవైరస్ ఎంజైమ్ పూత ఉంటుంది. అది కరోనా వైరస్ను నిర్వీర్యం చేస్తుంది. తద్వారా ‘సార్స్–సీవోవీ–2’వ్యాప్తిని గణనీయంగా అరికడుతుంది’అంటున్నారు దిబాకర్ భట్టాచార్య. దీనిని మరింత అభివృద్ధి చేస్తే మరింత సమర్థంగా వ్యాప్తిని అరికడుతుందనే భరోసా ఇస్తున్నారు. దీన్లో వాడిన ‘స్మార్ట్ ఫిల్టరేషన్ మెటీరియల్’కేవలం గాల్లో వ్యాపించి కరోనాను వ్యాప్తిచేసే ఏరోసాల్స్ను మాత్రమే నిర్వీర్యం చేస్తుంది తప్ప శ్వాసప్రక్రియకు ఎలాంటి అవరోధం కల్పిందంటూ పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ఇవి అటు డ్రాప్లెట్స్(సన్నటి లాలాజల తుంపర్ల)తో పాటు ఇటు ఏరోసాల్స్ (గాల్లో ఉండే అతి సూక్ష్మమైన కణాలు) ద్వారా కలిగే వైరస్ వ్యాప్తులను అరికడుతుందంటున్నారు. విశ్వసనీయమైన ఎన్–95 కంటే సమర్థమైందని, కరోనా వైరస్ సహా, 100 నానోమీటర్ల సైజులో ఉన్న అన్ని పార్టికిల్స్నూ 98.9 శాతం సమర్థంగా అడ్డుకుంటుందనేది పరిశోధకుల మాట. ఈ వివరాలన్నీ ‘కమ్యూనికేషన్స్ మెటీరియల్స్’జర్నల్లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాదం పొడితో ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది..!
బాదం పొడి ఒక టీ స్పూన్ (బాదంపప్పు మీద ఉండే పొట్టుతో సహా గ్రైండ్ చేసినది), బాదం నూనె ఒక టీ స్పూన్, గసగసాల పొడి ఒక టీ స్పూన్, గోధుమ పిండి ఒక టీ స్పూన్, పన్నీరు తగినంత తీసుకోవాలి. బాదం పొడి, గసాల పొడి, గోధుమ పిండిలో బాదం నూనె, తగినంత పన్నీటితో పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత వలయాకారంగా స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి. -
అలర్ట్: మాస్క్ ధరించకుంటే దించేస్తారు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు అలర్ట్. ఎయిర్పోర్ట్లోగానీ, విమానంలోగానీ మాస్క్ ధరించకుంటే అనుమతించకూడదని కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మాస్కులు ధరించకుంటే.. దించేయాలని తెలిపింది. అంతేకాదు.. ప్రయాణం మొత్తంలో మాస్క్ను తప్పనిసరి చేస్తూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్పోర్ట్, విమానాల్లో కరోనా నిబంధనలు పాటించకుంటే.. ప్రయాణికులను అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్కులు ధరించేలా చూడాలంటూ ఢిల్లీ హైకోర్టు.. రెగ్యులేటరీ బాడీని ఆదేశించింది. మాస్క్లు ధరించడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని, పదే పదే హెచ్చరించినా పట్టించుకోపోతే వాళ్లను.. నిబంధనలను పాటించని ప్రయాణికుల జాబితాలో చేర్చి, తదనంతర చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. Mask Must ఈ తరుణంలో.. డీజీసీఏ ఆదేశాలనుసారం మాస్క్లు ధరించని ప్రయాణికులపై చర్యలు తీసుకోనున్నారు ఎయిర్పోర్ట్ నిర్వాహకులు. అలాంటి ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకునే హక్కు కూడా కల్పించారు. ప్రయాణాల్లో కేవలం ప్రత్యేక కారణాలు చూపిస్తేనే.. మాస్క్ తొలగించే అవకాశం కల్పిస్తారు. -
గురుభక్తి చాటుకున్న ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు
ఉత్తర కొరియాలో ఒమిక్రాన్ విజృంభణకు కారణం.. అధికారుల నిర్లక్ష్యమే అని గుర్రుగా ఉన్నాడు నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా.. కరోనా నిబంధనలను మాత్రం కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో.. మాస్క్ నిబంధనలను పక్కనపెట్టాడు కిమ్ జోంగ్ ఉన్. ఎందుకంటారా?.. కొరియన్ పీపుల్స్ ఆర్మీ మార్షల్ హ్యోన్ చొల్ హయే మరణం.. అక్కడి ప్రభుత్వవర్గాల్లో విషాదాన్ని నింపింది. అయితే ఆయన అంత్యక్రియల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన.. అందరి దృష్టి ఆకర్షించింది. ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొని తన గురువుకి నివాళి అర్పించాడు. అంతేకాదు.. కరోనా భయంతో అంతా మాస్కులు ధరించిన వేళ ఆయన మాత్రం మాస్క్ లేకుండానే గురువుకి గౌరవం ఇచ్చాడు. మే 12న అక్కడ తొలి కరోనా కేసు ప్రకటన వెలువడగా.. అప్పటి నుంచి మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చివరకు కిమ్ కూడా మాస్క్ను వదలలేదు. అలాంటి గురువు శవపేటిక మోసే సమయంలో మాత్రం మాస్క్ను పూర్తిగా పక్కనపెట్టాడు. కిమ్ జోంగ్-2 2011లో చనిపోయిన తర్వాత.. కిమ్ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించింది హ్యోన్ చొల్ హయే. అందుకు గురుభక్తిని అంతగా చాటుకున్నాడు కిమ్. ఇది చూసిన వాళ్లంతా.. కర్కశంగా వ్యవహరించే కిమ్లో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు దక్షిణ కొరియా, అమెరికా నుంచి వ్యాక్సిన్ సాయం ప్రకటన వెలువడినా.. కిమ్ నుంచి ప్రతి సమాధానం లేకపోవడం గమనార్హం. -
కోరలు చాస్తోన్న కరోనా.. తమిళనాడులో ఆంక్షలు
సాక్షి, చెన్నై: కరోనా ప్రభావం తగ్గిపోయిందని సంతోషపడుతున్న తరుణంలో వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో గురువారం 21 కేసులు నమెదు కాగా శుక్రవారం 37 మంది వైరస్ బారిన పడ్డారు. కేసుల సంఖ్యలో క్రమంగా పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే రూ.500 జరిమానా విధానం శక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఐఐటీ మద్రాసులో ముగ్గురికి కరోనా పాజిటివ్ బయటపడడంతో అప్రమత్తమై మరికొందరికి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ సంఖ్య శుక్రవారానికి 30కి చేరింది. ఈ క్రమంలో మే 8వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా లక్ష మెగా వ్యాక్సిన్ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ తెలిపారు. రెండు కోట్ల మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు శిబిరాలు పనిచేస్తాయని చెప్పారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కేసులు భారత్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయని అన్నారు. సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఉత్తరా ది నుంచి కార్మికులను రప్పించే సంస్థలు చెన్నైలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి (జీహెచ్)కి ముందుగా సమాచారం ఇవ్వాలని మంత్రి సూచించారు. అలాగే వారందరినీ జీహెచ్కు తీసుకొస్తే ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుపుతారని తెలిపారు. గుంపులుగా రైళ్లలో వచ్చే ఉత్తరాది కూలీలపై అప్రమత్తంగా ఉండాలని.. లేకుంటే పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. తమిళనాడులో ఇప్పటికే కరోనా కేసులు 39కి చేరుకున్నాయని తెలిపారు. కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. చదవండి👉🏾 సీఎం జగన్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ క్వారంటైన్లో ఐఐటీ మద్రాసు విద్యార్థులు కరోనా కట్టడి చర్యల్లో భాగంగా చెన్నై ఓమందూరులోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఐఐటీ మద్రాసులో 700 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. స్వల్ప లక్షణాలున్న వారిని కళాశాల ప్రాంగణంలో హోం క్వారంటైన్లలో ఉంచామన్నారు. విద్యార్థులకు కోవిడ్ సోకితే ఆయా ప్రాంగణాల్లోనే క్వారంటైన్లో ఉంచి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
మాస్క్ ఇక తప్పనిసరి కాదు.. ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత
ముంబై: కొవిడ్ నిబంధన విషయంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై మాస్క్లు ధరించడం తప్పనిసరి ఏం కాదని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 1, శుక్రవారం నుంచి సడలింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మాస్క్ ధరించకపోతే.. పెనాల్డీ విధించబోమని పేర్కొంది. మరోవైపు కరోనా వైరస్ నియంత్రణంలో ఉందని, కాబట్టి, ఆంక్షల సడలింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005 యాక్ట్ ప్రకారం ఇంతకాలం అమలు చేసిన ఆంక్షల్ని ఎత్తేసినట్లు పేర్కొంది. అయితే కరోనా ముప్పు ఇంకా పూర్తి స్థాయిలో తొలగిపోలేదు కాబట్టి ప్రజలంతా స్వచ్చందంగా మాస్క్లు ధరించాలని మాత్రం మహా సర్కార్ సూచించింది. బీఎంసీ కూడా మాస్క్ తప్పనిసరి కాదని, ఫైన్ విధించబోమని చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి శనివారం నుంచి ఇది అమలులోకి రావాల్సి ఉంది. అయితే.. ఒకరోజు ముందస్తుగానే ఈ ఆదేశాలను విడుదల చేసింది ప్రభుత్వం. Maharashtra Government issues order withdrawing all COVID19 restrictions. pic.twitter.com/wTaKCPUa7G — ANI (@ANI) April 1, 2022 కరోనా వైరస్ 2020లో ప్రపంచాన్ని కుదిపేయగా.. డబ్ల్యూహెచ్వో తో పాటు వైద్య నిపుణులంతా ముఖానికి మాస్క్ ధరించడం వల్లనే వైరస్ కట్టడి అవుతుందని సూచించిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్ర, ప్రత్యేకించి ముంబైలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించని వాళ్ల నుంచి కనిష్టంగా 200రూ. నుంచి.. గరిష్టంగా బాగానే ఫైన్ వసూల్ చేశారు అక్కడి అధికారులు. -
మాస్క్ ధరించడం చాయిసే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసిందని ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ‘గత రెండేళ్లుగా కరోనాతో ఎంతో ఇబ్బందిపడ్డాం. మాస్క్లు ధరించడాన్ని కొంత అసౌకర్యంగా భావించాం. అందువల్ల మాస్క్ పెట్టుకోవాలా.. వద్దా.. అనేది ఇప్పుడు చాయిస్ మాత్రమే’అని స్పష్టం చేశారు. అయితే కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోనందున మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం మంచిదని అభిప్రాయపడ్డారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాస్క్లు ధరించాలని, ముఖ్యంగా ఆసుపత్రులకు వెళ్లినప్పుడు తప్పనిసరని పేర్కొన్నారు. ఇతరులు జనసమూహంలో ఉన్నప్పుడు ధరించాలని సూచించారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా కొనసాగుతుందని, అయితే ఈ విషయం లో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తు తం రోజుకు 40 కరోనా కేసులు నమోదవుతున్నాయని, 20 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదన్నారు. ఆరేడు జిల్లాల్లో ఒక్కో కేసు, జీహెచ్ఎంసీలో 20 వరకు కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం 0.18 శాతం పాజిటివిటీ నమోదవుతోందని, ఇప్పటివరకు ఇదే అత్యల్పమని పేర్కొన్నారు. కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నా, ఆ వేరియంట్లు ఇప్పటికే మనదేశంలో వచ్చిపోయాయని అన్నా రు. ఈ ఏడాది చివరినాటికి కరోనా ఎండమిక్ దశకు చేరుకుంటుందని, ఏదో ఒక ప్రాంతానికి అది పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎన్ని వేరియంట్లు వచ్చినా మనం తట్టుకోగలమన్నారు. వ్యాక్సిన్ వికటించి ఒకరు మృతి 18 ఏళ్లుపైబడిన వారందరికీ మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 12–14 ఏళ్ల వయస్సు పిల్లల వ్యాక్సినేషన్లో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు వెనుకబడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లోనూ వ్యాక్సినేషన్ చేపట్టామని, ఈ రెండు జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లు ఎక్కువగా ఉన్నాయని, యాజమాన్యాల నుంచి అనుమతి రావడంలేదన్నారు. ప్రతీ తొమ్మిది నెలలకు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఇప్పటికే ఐటీ కంపెనీలు 50 నుంచి 60 శాతం వరకు వర్క్ఫ్రం హోం ఎత్తేశాయని, మిగిలినవి కూడా ఇదే పద్ధతిని పాటించాలని కోరారు. 12–14 ఏళ్ల పాపకు వ్యాక్సిన్ వికటించి బ్రెయిన్డెడ్ అయిన సంఘటనపై డాక్టర్ శ్రీనివాసరావు స్పందిస్తూ, టీకాకు, దానికి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ వయస్సు వారిలో 7 లక్షలకుపైగా టీకాలు వేస్తే, ఎవరికీ ఏమీ కాలేదన్నారు. రాష్ట్రంలో 6 కోట్ల టీకా డోసులు వేస్తే, రాష్ట్రంలో ఒకరు చనిపోయారని, దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించిందన్నారు. టిమ్స్ ఆసుపత్రిని ఎత్తేయడంలేదని, అక్కడ సాధారణ ఓపీ కొనసాగుతుందని, దాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. పెరిగిన ఎండల తీవ్రత రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిపోయిందని, రాష్ట్రంలోని 6 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం 40 డిగ్రీలకుపైగా ఎండలు ఉంటున్నాయని, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని అన్నారు. వడదెబ్బ తగిలినవారిని వెంటనే నీడలోకి తీసుకువెళ్లి గాలి ఆడేలా చూడాలని, అరగంటలోపు లక్షణాలు తగ్గకపోతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. నిరంతరం బయట ఉంటూ విధులు నిర్వహించేవాళ్లు ఎక్కువగా నీరు, పానీయాలు తీసుకోవాలన్నారు. రోజుకు 4 లీటర్లకుపైగా నీరు తాగాలని, కొబ్బరినీళ్లు, మజ్జిగ తరచూ తీసుకోవాలన్నారు. ఈసారి ఎండలు తీవ్రంగానే ఉంటాయన్నారు. అన్ని ఆసుపత్రులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ పంపించామన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
ముంచుకొస్తున్న థర్డ్ వేవ్.. ముంబై తర్వాత హైదరాబాదే.. కోవిడ్ కేసుల్లో కాదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా.. థర్డ్ వేవ్ భయాలు అన్ని రాష్ట్రాలను చుట్టుముడుతున్నా.. ప్రజలు మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వీడటం లేదు. కరోనా మార్గదర్శకాలను పాటించాలని, పక్కాగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు పదేపదే కోరుతున్నా పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ముంబై, సిమ్లా, కోల్కతా, జమ్మూ, చెన్నై, గువాహటి, చండీగఢ్, పుణే, రాయ్పూర్లలో డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నవంబర్, డిసెంబర్ మాసాలలో మాస్కుల ధరింపుపై సర్వే నిర్వహిస్తే ఒక్క ముంబై మినహా మరే నగరంలోనూ 50 శాతానికి మించి ప్రజలు మాస్కులు ధరించట్లేదని తేటతెల్లమైంది. చదవండి: సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్: మంత్రి క్లారిటీ మాస్కులను పురుషులకన్నా మహిళలే ఎక్కువగా ధరిస్తున్నట్టు వెల్లడైంది. ఇందులో అత్యధికంగా ముంబైలో 76.28 శాతం మంది మాస్కులు ధరిస్తుండగా, మిగతా ఏ నగరంలోనూ 50 శాతానికి మించి ధరించడం లేదని తేలింది. ముంబై తర్వాత హైదరాబాద్లోనే 45.75శాతం మంది పూర్తి స్థాయిలో, 17.10 శాతం మంది పాక్షికంగా మాస్కులు ధరిస్తున్నారు. చదవండి: యూపీలో బీజేపీ భారీ షాక్.. 24 గంటల వ్యవధిలో.. కాగా తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 1,920 కరోనా కేసులు రికార్డయినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్లో ప్రకటించింది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,015 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కరోనా కేసులు 6,97,775కు చేరింది. ఇక మంగళవారం 83,153 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా మహారాష్ట్రలో కొత్తగా 34,424 కేసులు వెలుగు చూశాయి. వీటిలో ముంబైలోనే 11,647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,21,477కు చేరింది. ఇక రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు1,281కి పెరిగాయి. చదవండి: కరోనా కల్లోలం: భారత్లో భారీగా పెరిగిన కేసులు.. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఎలాంటి మాస్క్లు ధరించాలంటే..
కొత్త సంవత్సర వేడుకలు, పండుగల నేపథ్యాల్లో ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభించొచ్చన్న వైద్య వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయన్న ఆందోళన నడుమే.. వ్యాక్సినేషన్ రేటు రోజురోజుకీ పెరిగిపోతోంది కూడా. అదే తరుణంలో మాస్క్ల వాడకం, ఇతర జాగ్రత్తల గురించి కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కరోనా వేరియెంట్లలో డెల్టా, ఒమిక్రాన్ వేరియెంట్లు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ తరుణంలో వైద్య నిపుణులు ‘మాస్క్ అప్గ్రేడ్’ థియరీని తెరపైకి తీసుకొచ్చారు. అంటే.. ఇప్పుడు వాడుతున్న వాటి కంటే మెరుగైన మాస్క్లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్ వేరియెంట్ల స్థాయికి సాధారణ మాస్క్లు సరిపోవంటున్నారు గ్లోబల్ హాస్పిటల్స్ పల్మనాలిజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హరీష్ ఛాప్లే. సాధారణ మాస్క్లు, సర్జికల్ మాస్క్ల కంటే.. ఎన్95, ఎఫ్ఎఫ్పీ2, కేఎన్95 మాస్క్లు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సిబ్బందిని ఇవి కచ్చితంగా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హెల్త్ కేర్ వర్కర్స్, ఇన్ఫెక్షన్కు గురయ్యే హైరిస్క్ ఉన్న వాళ్లు ఈ తరహా మాస్క్లు ఉపయోగించాలని చెప్తున్నారు. అయితే ఇమ్యూనిటీ జోన్లో ఉన్నవాళ్లు, వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకున్నవాళ్లు క్లాత్ మాస్క్ల ద్వారా కూడా రక్షణ పొందవచ్చని ఇంటెర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ వినీత తనేజా చెప్తున్నారు. కాకపోతే సింగిల్, డబుల్ లేయర్ మాస్క్ల కంటే మూడు పొరల మాస్క్ల్ని ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఒకవేళ సింగిల్, డబుల్ లేయర్ మాస్క్లు గనుక ఉపయోగిస్తున్నట్లయితే.. వాటిపైనా మరో మాస్క్ ధరించడం మేలని చెప్తున్నారు. ఇక ఎలాంటి మాస్క్ ధరించాలని ఎంచుకోవడం కంటే.. దానిని సరిగా ధరించడం ఇప్పుడు తప్పనిసరి అవసరం. ఎందుకంటే వైరస్ వేరియెంట్లు ఎంత ప్రమాదకరమైనవి అయినా.. రక్షణ కల్పించే మార్గం ఎక్కువగా ఇదొక్కటి మాత్రమే అని డాక్టర్ వినీత చెప్తున్నారు. చాలామంది మాస్క్ను కిందకి పైకి జారవేస్తూ ఉంటారు. కానీ, దీనివల్ల రిస్క్కు ఛాన్స్ ఉంటుంది. అందుకే బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో మాస్క్ను ముక్కు పైభాగం నుంచి గదవ భాగం వరకు పూర్తిగా కప్పి ఉంచడం ఉత్తమమని డాక్టర్ వినీత చెప్తున్నారు. ఉత్తగా ధరించడం కాదు.. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో చాలామంది జాగ్రత్తలను పక్కాగా పాటించారు. అయితే రాను రాను ఆ వ్యవహారం చిరాకు తెప్పించడమో లేదంటే వ్యాక్సినేషన్ ఇచ్చిన ధైర్యమోగానీ ఆ అలవాట్లను చాలావరకు దూరం చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్ల విషయంలో అయినా కనీస జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ టిప్స్ ►మాస్క్లను తీసేటప్పుడు, ధరించేటప్పుడు వాటి చివరల దారాలను మాత్రమే ముట్టుకోవాలి. ►క్లాత్ మాస్క్లను ఒక్కసారిగా వాడాక శుభ్రంగా ఉతకాలి. వేడినీళ్లలో ఉతక్కూడదు. ►సర్జికల్ మాస్క్లను మళ్లీ ఉపయోగించడం మంచిదికాదు. ►ఇంట్లో అందరి మాస్క్లను కలిపి ఉంచకూడదు. విడివిడిగా ఉంచాలి. ►మాస్క్ మీద శానిటైజర్ చల్లడం, రుద్దడం లాంటివి చేయకూడదు. ►మాస్క్లకు డ్యామేజ్లు, లీకేజీలు లేకుండా చూసుకోవాలి. ►ఇతరులతో మాట్లాడేటప్పుడు మాస్క్లను పదే పదే కిందకి జరపడం లాంటివి చేయకపోవడం మంచి అలవాటు. ►పిల్లలకు నాన్ మెడికల్ మాస్క్లు వాడడం మంచిది. ►పిల్లలకు ఆరోగ్య సమస్యలుంటే గనుక వైద్యులను సంప్రదించి మెడికల్ మాస్క్లు వాడొచ్చు. ►మాస్క్ జాగ్రత్తగా వాడడమే కాదు.. వాటిని పారేసేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించడం ఒక బాధ్యత. మరికొన్ని.. ♦పదే పదే ముఖాన్ని చేతులతో రుద్దకపోవడం. ♦సామూహిక భోజనాలకు దూరంగా ఉండడం. ♦తరచూ చేతుల్ని సబ్బుతో, హ్యాండ్వాష్తో క్లీన్ చేసుకోవడం. ♦చలికాలంలో జలుబు, ఇతర సమస్యల కారణంగా అలర్జీతో ముక్కులో వేలు పెడుతుంటారు. అలా చేయకపోవడం ఉత్తమం. ♦శానిటైజర్ రాసిన చేతులతో తినుబండారాల్ని తాకరాదు. ♦శానిటైజర్ను క్యారీ చేయడం మరీ మంచిది. మాస్క్ను ధరిస్తూ శుభ్రతను పాటిస్తూ వీలైనంత మేర భౌతిక దూరం పాటిస్తే సాధారణ జాగ్రత్తలతోనూ కరోనా వేరియెంట్లను జయించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
చావు తెలివంటే ఇదే.. ట్రిపుల్ రైడింగ్.. హెల్మెట్ లేదు.. మూతికి ఉండాల్సిన మాస్కేమో!
సాక్షి, జీడిమెట్ల : పోలీస్ చలానాల నుంచి తప్పించుకోవాలంటే మూతికి ఉండాల్సిన మాస్క్ను బండికి పెట్టుకోవాలి. అప్పుడే ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్రూట్లలో ఇష్టం వచ్చినట్లు వెళ్లొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్లో కొంతమంది యువకులు ఇలా బైక్ నంబర్ ప్లేట్ను మాస్క్తో మూసేసి పోలీసుల కెమెరాలకు చిక్కకుండా తిరుతున్నారు. ఇలాంటి వారు ఏదైనా ప్రమాదం చేసి తప్పించుకుంటే దొరకడం కష్టంగా మారుతుంది. ఇటువంటి వాహనదారుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించకుంటే ఇది ప్రమాదమేనని ప్రజలు అంటున్నారు. చింతల్లో నంబర్ ప్లేట్కు మాస్కు పెట్టి యువకులు ఇలా ట్రిపుల్ రైడింగ్లో వెళ్తున్నారు. అసలే కోవిడ్ మహమ్మారి మరోసారి రెక్కలు విప్పేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన కొంతమంది నిర్లక్ష్యం వీడటం లేదు. ఇంకోవైపు రాష్ట్రంలో రోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలబారినపడి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా యువకులు తమకేం కాదులే అన్న విపరీత ధోరణితో అటు వైరస్ను , ఇటు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. చదవండి: నగరానికి నయా పోలీస్ బాస్.. సీవీ ఆనంద్ గురించి ఆసక్తికర విశేషాలు.. హైదరాబాద్ నగరంలో గతంలో దర్శనమిచ్చిన ‘మాస్కు’ నెంబర్ ప్లేట్లు.. -
Telangana: మాస్క్ ధరలు.. తగ్గేదే లే!
ఆస్పత్రుల్లో సర్జికల్ మాస్కులుగా మాత్రమే పరిచయం ఉన్నవి కాస్త.. కరోనా టైం నుంచి మన జీవితాల్లో భాగం అయ్యాయి. వేవ్లు విరుచుకుపడుతున్నప్పుడల్లా మూతులకు అతుక్కుపోతున్నాయి. ఆంక్షలు, అభ్యంతరాల నేపథ్యంలో అవసరంకొద్దీ అప్పటికప్పుడు ఎంతైనా సరే చెల్లించి కొనేస్తున్నారు జనాలు. అయితే మాస్క్ల ఉత్పత్తి పెరుగుతున్నా.. వాటి ధరలు మాత్రం ఇంకా దిగిరాకపోవడంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో ఓసారి చూద్దాం. హైదరాబాద్ సహా ఇతర పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో మూడు పొరల సర్జికల్ మాస్క్ ధర ఒకటి రూ.10 నుంచి 15 రూ. మధ్య ఉంటోంది(డిజైన్లు, ఇతర కంపెనీలవి మినహాయించి). సాధారణ మెడికల్ షాపు ఓనర్ల నుంచి బిజీ ఏరియాల దగ్గర చిరువ్యాపారుల దాకా ఈ ధరకి ఫిక్సయిపోయారు. ఇక మండలాలు, రూరల్ ఏరియాల్లో ఇంతకంటే ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు. సాధారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల నుంచి సర్జికల్ బయటకు వచ్చేది రూపాయిలోపు(ఒక్కోటి) ధరకే!. మరి అన్నేసి రేట్ల రేటుకు అమ్మడం ఎందుకు?. ప్రతీకాత్మక చిత్రం మధ్యవర్తులే కారణం.. హైదరాబాద్ శివారులో దాదాపు పది యూనిట్ల నుంచి నిత్యం మాస్క్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో యూనిట్ రోజులో లక్ష నుంచి 4 లక్షల దాకా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. అంటే ఒక్క హైదరాబాద్ నుంచే రోజుకి 30 లక్షల సర్జికల్ మాస్కుల ఉత్పత్తి అవుతున్నాయన్నమాట. ఇవిగాక మరో పది లక్షల మాస్క్లను ఢిల్లీ నుంచి దిగుమతి చేస్తున్నారు. మొత్తంగా 40 లక్షల మాస్క్లతో భారీ సప్లయి నడుస్తోంది. అయినప్పటికీ ధరలు మాత్రం దిగి రావట్లేదు. అయితే దళారులు, మధ్యవర్తుల కారణంగానే వీటి ధరలు అధికంగా ఉంటున్నాయని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు.. రిటైలర్స్కు 90పై. నుంచి 1.రూ.మధ్య అమ్ముతున్నారు. మొదటి వేవ్ నుంచి ఇదే ధర కొనసాగుతోంది కూడా. కానీ, రిటైలర్స్ నుంచి కొందరు దళారులు వీటిని కొనుగోలు చేసి.. మూడు నుంచి ఐదు రూపాయల కమిషన్తో కిందిస్థాయికి అమ్మకాలు చేస్తున్నారు. అందుకే తామూ అధిక ధరలకు అమ్ముతున్నామని మెడికల్ షాప్ ఓనర్లు, వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇక మాస్క్ ధరించకపోతే ఫైన్లు విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు వీళ్ల వ్యాపారానికి మరింత కలిసొస్తోంది. ప్రతీకాత్మక చిత్రం మాదేం లేదు కరోనా మొదటి, రెండో వేవ్ల టైంలో తెలంగాణలో మాస్క్ల కొరత నడిచింది. ఉత్పత్తి అస్థిరత వల్ల ధరలు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు డిమాండ్కు మించి సప్లయ్ ఉంటున్నా.. అధిక ధరలకు అమ్ముతుండడం విశేషం. ఫస్ట్ వేవ్ కోనా టైంలో ఒక్కో మాస్క్ను 8రూ నుంచి 9రూ. గరిష్ట ధరకు అమ్మేవాళ్లు. అయితే తయారీదారులు ఇప్పుడూ పాత రేట్లకే అమ్ముతున్నా.. కస్టమర్కి మాత్రం ఐదు నుంచి పది రేట్లకు చిల్లు పడుతోంది. పైగా ఈ ఏడాది వేసవి తర్వాత ఉత్పత్తి గణనీయంగా పెరిగినా.. ధరలు మాత్రం దిగిరావట్లేదు. తెలంగాణలో సరిపడా యూనిట్లు ఉన్నాయని, ధరల విషయంలో మాదేం లేదంటున్నారు మ్యానుఫ్యాక్చరర్స్. పైగా మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి దందాలను, ధరల నియంత్రణను ప్రభుత్వాలే చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు వాళ్లు. ప్రస్తుతం స్టాక్ వివరాలు ఎన్ 95 మాస్కులు.. 41 లక్షల కుపైనే 3 పొరల మాస్క్లు, కోటి 50 లక్షలకు పైనే పీపీఈ కిట్స్.. 8 లక్షలకుపైనే హోం ట్రీట్మెంట్ కిట్స్.. 8.71 లక్షలు కొసమెరుపు.. బల్క్గా త్రీ లేయర్స్ మాస్క్లను కొనుగోలు చేస్తున్న కొందరు.. షాపులు, మెడికల్ స్టోర్లు కాకుండా రోడ్ల మీద, ఫుట్పాత్లపై రూ. 2 నుంచి 7రూ. మధ్య అమ్మేస్తున్నారు కొందరు. కానీ, వాటి క్వాలిటీపై నమ్మకం లేక చాలామంది దూరంగా ఉంటూ వస్తున్నారు. మాస్క్ మస్ట్.. ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందే వేరియెంట్. గాలి ద్వారా శరవేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేప్పుడు, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో, పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్లేస్లకు వెళ్లినప్పుడు మాస్క్లు(మూడు పొరలున్న ఎలాంటి మాస్క్లైనా సరే వాడడం మరీ మంచిది) ధరించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: క్రిప్టోకరెన్సీలపై ఫైనల్ వర్డ్ ఇదే: ఆర్బీఐ -
కరోనా సోకితే.. మాస్క్ చెప్పేస్తుంది!
కరోనా సోకినా చాలా మందిలో పెద్దగా లక్షణాలు కనిపించవు. వారు టెస్టులకు వెళ్లరు, కరోనా ఉన్నట్టు వారికే తెలియదు. కానీ అలాంటి వారి నుంచి ఇతరులకు వైరస్ సోకుతుంది. మరి ప్రత్యేకంగా టెస్టులేమీ అవసరం లేకుండా.. మనం పెట్టుకున్న మాస్కే కరోనా ఉందో లేదో గుర్తించగలిగితే చాలా మేలు కదా.. అలాంటి మాస్కులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ మాస్కులేమిటి? కరోనాను ఎలా గుర్తిస్తాయి? వంటి వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ సులువుగా పరీక్షించేందుకు.. కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో.. దానిని సులువుగా గుర్తించడంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా జపాన్లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త యసుహిరో సుకమొటో నేతృత్వంలోని బృందం ప్రత్యేక మాస్కులపై దృష్టిపెట్టింది. ఆస్ట్రిచ్ పక్షులు కరోనా వైరస్ను బలంగా ఎదుర్కొంటున్నాయని ఇటీవల గుర్తించిన నేపథ్యంలో.. దీనిని తమ పరిశోధనకు ఆధారంగా తీసుకుంది. ఆస్ట్రిచ్ పక్షి ‘యాంటీబాడీ’లను ఉపయోగించి.. కరోనాను గుర్తించగల మాస్కులను అభివృద్ధి చేసింది. యూవీ లైట్లో మెరుస్తూ.. సుకమొటో బృందం ఆస్ట్రిచ్ పక్షుల గుడ్లను తీసుకుని, వాటిల్లోకి బలహీనపర్చిన కరోనా వైరస్ను ఇంజెక్ట్ చేసింది. అందులో ఏర్పడిన యాంటీబాడీలను సేకరించింది. ఒక సన్నని ఫిల్టర్ (మాస్కు వంటి ఒక పొర)పై ఆ యాంటీబాడీలను స్ప్రే చేసి.. సాధారణ మాస్కులో అమర్చింది. కొందరు కరోనా రోగులకు ఈ మాస్కులు ఇచ్చి.. కొద్ది గంటల పాటు ధరించాలని సూచించింది. ►రోగులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, శ్వాసించినప్పుడు విడుదలయ్యే కరోనా వైరస్.. ఈ మాస్కుల్లోని ఫిల్టర్పైకి చేరింది. ఆ ఫిల్టర్పై ఉన్న ఆస్ట్రిచ్ యాంటీబాడీలు కరోనా వైరస్ను గుర్తించి అతుక్కుపోయాయి. ►శాస్త్రవేత్తలు కొద్దిగంటల తర్వాత రోగుల నుంచి ఆ మాస్కులను సేకరించారు. వాటిలోని ఫిల్టర్లపై.. యాంటీజెన్లకు అంటుకునే ఫ్లోరోసెంట్ డై (కాంతి పడితే మెరిసే పదార్థం)ను స్ప్రే చేశారు. తర్వాత ఆ మాస్కులపై అల్ట్రా వయోలెట్ (యూవీ) కాంతిని ప్రసరింపజేస్తే.. కరోనా వైరస్ ఉన్న ప్రాంతాలన్నీ మెరుస్తూ కనిపించాయి. ఏడాదిలో అందుబాటులోకి.. ఈ మాస్కులను మరింతగా అభివృద్ధి చేస్తున్నామని.. స్ప్రే అవసరం లేకుండానే, కేవలం సెల్ఫోన్ లైట్ ఆధారంగా మెరిసేలా మార్చుతున్నామని పరిశోధనకు నే తృత్వం వహించిన సుకమొటో తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కడైనా కరోనా నిర్ధారణ పరీక్ష చేయడానికి ఈ మాస్కులు వీలు కల్పిస్తాయని.. ఈ విధానంలో కచ్చితత్వం కూడా ఎక్కువని వెల్లడించారు. త్వరలోనే వీటిని జపాన్లో ప్రవేశపెడతామని, ఏడాదికల్లా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని వివరించారు. అయితే దీని ధర ఎంత ఉంటుందన్నది వెల్లడించలేదు. ఆస్ట్రిచ్ ‘యాంటీబాడీ’ల స్పెషాలిటీ ఏంటి? భూమ్మీద ప్రస్తుతం జీవించి ఉన్న పక్షి జాతుల్లో అతి పురాతనమైనవి ఆస్ట్రిచ్లు. ఈ క్రమంలోనే వాటిలో అత్యంత సమర్థవంతమైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆడ ఆస్ట్రిచ్ పక్షులకు ఈ సామర్థ్యం మరింత ఎక్కువ. భారీ సంఖ్యలో వైరస్లు, బ్యాక్టీరియాలకు అత్యంత వేగంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. దీనిపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఆస్ట్రిచ్ల యాంటీబాడీలను ఉపయోగించి.. వివిధ రోగాలకు వ్యాక్సిన్లు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఇదేమి చోద్యం? మూతికి ఉండాల్సిన మాస్క్ నంబర్ ప్లేటుకు ..
MAN Using Face Mask On Number Plate: కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోనేలేదు.. ఇంతలోనే కొంతమంది వాహనదారులకు మరో వైరస్ సోకింది.. మూతికి ఉండాల్సిన మాస్కు బండి నంబర్ ప్లేటుకు చేరింది.. తలకు ఉండాల్సిన హెల్మెట్ హ్యాండిల్కు షిఫ్ట్ అయ్యింది. దీంతో చేతిలో ఉన్న కెమెరాతో వాహనదారుల నంబర్ ప్లేట్స్పై క్లిక్మనిచే ట్రాఫిక్ పోలీసులకు తల నొప్పి మొదలైంది. ఇలా ఒకరో ఇద్దరో కాదు వందల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు రయ్యిమంటూ దుసుకుపోతున్నా ఏం చేయలేని దుస్థితి పోలీసులది.. గురువారం అత్తాపూర్లో కనిపించింది ఈ దృశ్యం.. చదవండి: ఆఫీసుకు హాయ్.. ఇంటికి బైబై.. కారణం ఇదే! -
ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారో పార్లర్కి వెళ్లాల్సిన పనేలేదు!
మీ వయసు కంటే పదేళ్ల పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? పని ఒత్తిడి, కాలుష్యం కారణమేదైనా.. చర్మంపై ముడతలు, మచ్చలు, నల్లని వలయాలు, మృతకణాలు ఏర్పడి చర్మాన్ని జీవం కోల్పోయేలా చేస్తుంది. ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ఫేస్ ఫ్యాక్ ద్వారా మీ చర్మానికి తిరిగి జీవం పోయొచ్చంటున్నారు బ్యూటీషియన్లు. మందారం, ఉసిరిలతో ఫేస్ ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో, ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. కావల్సిన పదార్ధాలు ►1 మందారం పువ్వు లేదా 2 టేబుల్ స్పూన్ల మందారం పువ్వు పొడి ►1 టేబుల్ స్పూన్ తేనె ►2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి లేదా 1 మీడియం సైజు ఉసిరి కాయ తయారీ ఇలా ►మందారం పువ్వు పొడి లేనట్లయితే ఒక మందారం పువ్వును ఒక రాత్రంతా నానబెట్టి మెత్తగా గ్రేండ్ చెయ్యాలి. ►అలాగే ఉసిరి పొడి అందుబాటులో లేకపోతే మీడియం సైజు ఉసిరి కాయను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ►వీటికి తేనె జోడించి అన్నింటినీ బాగా కలుపుకుంటే ఫేస్ ప్యాక్ రెడీ. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! ఎలా అప్లై చేయాలంటే.. 5-7 నిముషాలు ముఖానికి ఆవిరిపట్టించాలి. ఇలా చేయడం ద్వారా చర్మ గ్రంధులన్నీ తెరచుకుంటాయి. ఫలితంగా ఫేస్ ప్యాక్లో ఉన్న అన్ని పధార్థాలు చర్మంలోకి చొచ్చుకుని పోయి రెట్టింపు ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖం అంతటా ఫ్యాక్లా వేసుకుని 20 నిముషాల పాటు ఉంచుకుని, చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇవీ ప్రయోజనాలు.. వారానికి కనీసం ఒక్కసారైనా ఈ ఫేస్ ప్యాక్ వాడితే, దీనిలోని విటమిన్ సి, చర్మానికి న్యాచురల్ మాయిశ్చరైజర్లా పనిచేసి, తడిగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడి, చర్మం మెరిసేలా చేస్తుంది. అలాగే మందారం పువ్వు చర్మంలోని మృతకణాలను, మురికిని తొలగించి కాంతివంతం చేస్తుంది. నల్లని వలయాలను, ముడతలను కూడా నివారిస్తుంది. చదవండి: Health Tips: గుడ్డు, బీట్రూట్, ఉసిరి, పాలకూర.. వీటితో ఐరన్ లోపాన్ని తరిమేద్దాం..! -
Skin Care: ముడతలు, మచ్చలు, మృతకణాల నివారణకు అరటి తొక్క ఫేస్ మాస్క్..
అరటిపండు తిని తొక్కపడేస్తున్నారా? అరటి తొక్కతో మీ చర్మం మెరిసేలా చేయొచ్చని తెలుసా? అవునండి! దీనిలో చర్మానికి మేలు చేసే పోషకాలు, పైటోనూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పబ్మెడ్ సెంట్రల్ ప్రచురించిన నివేదికలో అరటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయని, ఇవి సూర్యరశ్మివల్ల దెబ్బతిన్న చర్మానికి, ప్రీరాడికల్స్ నుంచి రక్షించి చికిత్సనందిస్తుందని వెల్లడించింది. పొడి చర్మానికి కూడా ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇక అరటితోలుతో ఏ విధంగా చర్మాన్ని కాపాడుకోవచ్చో తెలుసుకుందామా.. అరటి తోలుతో మసాజ్ ముఖాన్ని నీటితో శుభ్రపరిచి టవల్తో తుడుచుకోవాలి. తర్వాత అరటి తొన లోపలిభాగంతో ముఖచర్మంపై 10 నిముషాలపాటు మర్దన చేయాలి. మరోపది నిముషాలు ఆరనివ్వాలి. చివరిగా చల్లని నీటితో కడిగెయ్యాలి. ఇలా చేయడం ద్వారా చర్మంపై వాపు, ముడతలు తొలగి ముఖం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. అరటి తోలు ఫేస్ మాస్క్ అరటి తొక్కల్లో రెండు అరటి ముక్కలను కూడా వేసి పేస్టులా అయ్యేంతవరకూ మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, పెరుగు కలపాలి. అవసరమైతే రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని ముఖానికి అప్లై చెయ్యాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. అరటిలోని బి6,బి12 విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ అనేక చర్మసమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అరటి తోలు ఫేస్ స్క్రబ్బర్ అరటి తోలును చిన్న ముక్కలుగా కట్చేసి, టేబుల్స్పూన్ చొప్పున పసుపు, చక్కెర, తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి 15-20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ స్క్రబ్బర్ను వారానికి ఒకసారైనా వాడితే చర్మంపై మృతకణాలను తొలగించి చర్మం కాంతులీనేలా చేస్తుంది. అరటి తోలు ప్యాచెస్ అరటి తొక్కను రెండు ముక్కలుగా కట్చేసి ఫ్రిజ్లో ఉంచాలి. పది నిముషాల తర్వాత బయటికి తీసి వీటిని రెండు కళ్ల మీద 15-20 నిముషాలుంచి కడిగేసుకోవాలి. ఈ ప్రక్రియ కంటి కింద నల్లని వలయాలు, ముడతలు రాకుండా నివారిస్తుంది. చదవండి: Vajrasana Benefits: మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి, ఎసిడిటీ నివారణకు.. యోగా మంత్రమిదే! -
ఆంధ్రప్రదేశ్లో నిలకడగా ‘కరోనా’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గణాంకాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కేరళలో ఇప్పటికే థర్డ్వేవ్ మొదలైనట్టు సంకేతాలొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా అదుపులోనే ఉన్నట్టు కేసుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనం సమూహాలుగా చేరుతుండటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం అనే మూడు అంశాలపైనే కరోనా నియంత్రణ ఆధారపడి ఉంటుందంటున్నారు. ఓ వైపు కరోనా నియంత్రణకు ప్రభుత్వం శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది. రిస్కు గ్రూపులుగా చెప్పుకునే ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు, 45 ఏళ్ల వయసు దాటిన వారు, గర్భిణులకు టీకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు కోట్ల డోసులు వేసిన 10 రాష్ట్రాల్లో ఏపీ చేరింది. ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ను నిలువరించేందుకు జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మాస్కుల్లేకుండా బయటకొస్తే రూ.100 జరిమానా, మాస్కుల్లేని వారిని లోపలకు అనుమతించే వాణిజ్య, వ్యాపార సముదాయాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ జరిమానా విధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. -
మాస్క్ మినహాయింపుల్లేవ్.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
VIRAL VIDEO: ‘వేర్ ఏ మాస్క్-సేవ్ ఏ లైఫ్’.. కరోనా టైం మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న నినాదం ఇది. దశల వారీగా, వేరియెంట్లతో మానవాళిపై వైరస్ విరుచుకుపడుతున్నా.. మాస్క్లు వీడొద్దంటూ వైద్య నిపుణులు మొత్తుకుంటున్నారు. కరోనా వచ్చి తగ్గినా.. వ్యాక్సినేషన్ నడుస్తున్నా.. పూర్తిస్థాయి రక్షణ కోసం మాస్క్.. వీలైతే డబుల్ మాస్కులు ధరించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆంక్షల సడలింపుతో చాలామంది ముఖానికి మాస్క్లు ధరించడం లేదు. ధరించినా కొందరు అసంపూర్తిగా పెట్టుకుంటున్నారు. రద్దీ మార్కెట్లు, ప్రయాణాల్లో, ఆఫీసుల్లో.. చాలామందిలో ఈ నిర్లక్క్ష్యం పెరిగిపోయింది. అడిగితే దురుసు-నిర్లక్క్ష్యపు సమాధానాలు వినిపిస్తున్నాయి. పైగా థర్డ్ వేవ్ ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నా.. చాలామందిలో ఈ ధోరణి మారడం లేదు. ఈ తరుణంలో ఓ పాత వీడియోను తెరపైకి తెచ్చారు కొందరు. పైగా సందర్భానికి తగ్గ వీడియో కావడంతో చాలామంది వాట్సాప్ స్టేటస్ల ద్వారా మళ్లీ వైరల్ చేస్తున్నారు. వైకల్యం ఉన్నా తమనే మాస్క్ ధరించడం నుంచి మినహాయింపు ఇవ్వకండని, తామే మాస్క్లు ధరించినప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నవాళ్లూ ధరించడం తప్పనిసరని గుర్తు చేసే ఆ వీడియో కిందటి ఏడాది ఫస్ట్ వేవ్ తర్వాత బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను మేరీల్యాండ్ యూనివర్సిటీ డాక్టర్ ఫహీమ్ యూనస్ ట్విటర్ అకౌంట్ నుంచి కిందటి ఏడాది సెప్టెంబర్ 16న పోస్ట్ అయ్యింది. కావాలంటే మరోసారి మీరూ చూసేయండి. బాధ్యతను గుర్తు చేసుకుని దయచేసి సక్రమంగా మాస్క్లు ధరించండి. -
మాస్క్ మినహాయింపుల్లేవ్.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
-
అదిరిపోయే ఫీచర్లు, మాస్కులోనే మైక్, స్పీకర్లు ఇంకా
కరోనా కారణంగా ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించాల్సి వస్తుంది. కొన్ని సార్లు మనం మాట్లాడే మాటల్ని ఎదుటి వారికి స్పష్టం చెప్పేందుకు మాస్క్లు తీస్తుంటాం. అదే సమయంలో నోట్లో నుంచి బయటకు వెళ్లే గాలి కళ్లద్దాల్లోకి వెళ్లి మసక ఏర్పడుతుంది. మాస్క్ ధరించి గాలి పీల్చడం సమస్యగా మారింది. అందుకే మాస్క్ ధరించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్లు ఎలక్ట్రానిక్ సంస్థలు గాడ్జెట్స్ను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ఎల్జీ సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఫేస్ మాస్క్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మాట్లాడే సమయంలో మాస్క్ తీయాల్సి ఉంటుంది. కానీ, ఎల్జీ అందుబాటులోకి తెచ్చిన ఈ ఫేస్ మాస్క్ తీసే పనిలేకుండా ఇన్ బిల్ట్ మైక్, స్పీకర్లతో ఓ మాస్క్ను తయారు చేసింది. మన మాటలు ఎదుటి వారికి అర్ధమయ్యేలా చేస్తుంది. 1000 ఎంఏ బ్యాటరీ కెపాసిటీ, 94 గ్రాముల బరువు ఉండే ఈ మాస్క్ ధరిస్తే తీసే అవసరం ఉండదు. దీన్ని రెండు గంటల పాటు ఛార్జ్ చేస్తే 8గంటల పాటు పనిచేస్తుంది. పీల్చే గాలిని ఫ్యూరిఫైర్ చేయడమే కాదు,కళ్లదాల్లోకి గాలివెళ్లకుండా చూసుకుంటుంది. నోటితోపాటు చెంపల్ని కవర్ చేస్తోందని ఎల్జీ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు కొన్ని గంటల పాటు ధరించిన అసౌకర్యం కలగకుండా చూసుకుంటుంది. ఇక, ఈ పరికరం ఆగస్ట్ నెలలో థాయ్లాండ్ మార్కెట్ లో విడుదల చేసేందుకు సిద్ధం కాగా.. ఇతర దేశాల్లో విడుదల చేసేందకు రెగ్యులేటర్ల ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. ధర ఇంకా ప్రకటించలేదు. ఇండియా మార్ట్లో దీని ధర రూ.32.200గా ఉంది. -
మాస్కు లేకపోతే రూ.100 కట్టాల్సిందే!
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ఎవరైనా మాస్కు లేకుండా బయటకు వస్తే రూ.100 జరిమానా వేస్తారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాస్కు విధిగా ధరించాలని, ఒకరినుంచి ఒకరికి కరోనా వ్యాపించకుండా ఉండాలంటే ఈ నిబంధన ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న కర్ఫ్యూను తిరిగి ఈ నెల 14 వరకు పొడిగించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోవిడ్ నిబంధనల మేరకు అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. షాపులు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు అన్నీ నిర్వహించుకోవచ్చు. ఏవైనా పబ్లిక్ ప్లేసుల్లో (మాల్స్లో గానీ, సినిమాహాళ్లలో గానీ) సీటు మార్చి సీటు నిర్వహణ చేసుకోవచ్చు. మనిషికి మనిషికీ కనీసం 5 అడుగుల దూరం ఉండాలి. గోదావరి జిల్లాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఎవరైనా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. కోవిడ్ నిబంధనలు పాటించే విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
UK: కోవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం వ్యక్తిగత బాధ్యతను గుర్తు చేస్తూ.. జులై 19 నుంచి ఫేస్ మాస్క్లు, సామాజిక దూరం వంటి కోవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసింది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఇష్టం ఉంటే మాస్కులు ధరించవచ్చు అని అన్నారు. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య ఆగస్టు 4 నుంచి టెస్ట్ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ను వీక్షించడానికి పూర్తిస్థాయిలో అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి బ్రిటన్ ప్రభుత్వం జూన్ 21న పూర్తి ఆంక్షలను ఎత్తివేయాలనుకుంది. కానీ డెల్టా వేరియంట్ విజృంభన కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. -
సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు
లక్నో: చిన్నపాటి గొడవలకే తుపాకీతో కాల్చడం ఈ మధ్యన ఫ్యాషన్గా మారిపోయింది. తాజాగా బ్యాంకుకు వచ్చిన కస్టమర్ మాస్క్ ధరించలేదని తుపాకీతో కాల్చిపారేశాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కాగా తుపాకీ తూటాలకు ఆ వ్యక్తికి తీవ్ర రక్తస్రావం కాగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుపాకీతో కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డ్ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న రాజేశ్ కుమార్ తన భార్యతో కలిసి శుక్రవారం పని నిమిత్తం బ్యాంక్ ఆఫ్ బరోడాకు వచ్చాడు. ఈ నేపథ్యంలో బ్యాంకకు ఎంటరవుతున్న సమయంలో రాజేశ్ ఫేస్మాస్క్ పెట్టుకోకపోవడంతో సెక్యూరిటీ గార్డ్ అడ్డగించాడు. మాస్క్ పెట్టుకుంటేనే లోనికి అనుమతి ఇస్తానని పేర్కొన్నాడు. దీంతో రాజేశ్, సెక్యూరిటీ గార్డ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన సెక్యూరిటీ గార్డ్ తనవద్ద ఉన్న తుపాకీతో రాజేశ్ తొడపై కాల్చాడు. తీవ్ర రక్తస్రావంతో రాజేశ్ అలాగే కిందపడిపోగా.. పక్కనే ఉన్న అతని భార్య..'' నా భర్తను ఎందుకు కాల్చావు'' అంటూ పెద్దగా కేకలు వేసింది. ఇది విన్న మిగతావారు అక్కడికి వచ్చి ఇంత చిన్న విషయానికి తుపాకీతో కాలుస్తావా.. నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని గార్డ్ను ఆక్షేపించారు. 27 సెకెన్ల నడివి ఉన్న ఫుటేజీ సీసీటీవీలో రికార్డు అయింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గార్డ్ను అదుపులోకి తీసుకున్నారు. '' రాజేశ్ మాస్క్ ధరించలేదని.. ఆ విషయం చెప్పానని.. కానీ అతను నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాడని.. నన్ను బూతులు తిట్టాడు.. దీంతో తుపాకీ చూపించి బెదిరిద్దాం అనుకున్నా.. కానీ తుపాకీ మిస్ఫైర్ అయి అతనికి తగిలింది. ఇది అనుకోకుండా జరిగింది''. అని సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు వివరించాడు. చదవండి: మహిళ విషయంలో గొడవ.. పక్కా ప్లాన్తో In #Bareilly a railway employee was allegedly shot by bank guard at Junction road branch of Bank of Baroda. Reports claimed that victim was shot following an argument over not wearing mask. Victim taken to district hospital. pic.twitter.com/SzuHRpGZv5 — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) June 25, 2021 -
ఘోరం: మాస్క్ ధరించలేదని మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం..
ముంబై: మాస్క్ ధరించలేదని ఓ మహళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కానిస్టేబుల్.. ప్రజలకు నీతి విషయాలు బోధించాల్సిన వ్యక్తే ఇలా నీచమైన పనికి దిగజారడంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతేడాది జరిగిన ఈ దారుణ ఘటన గుజరాత్లోని సూరత్లో ఆలస్యంగా వెలుగుచూసింది. 2020 లాక్డౌన్ సమయంలో 33 ఏళ్ల వివాహితను పాల్సానాలో పాలకోసం ముఖానికి మాస్క్ లేకుండా బయటికి వచ్చింది. ఈ విషయం గమనించిన నరేశ్ కపాడియా అనే కానిస్టేబుల్ ఆమెపై అనుచితంగా ప్రవర్తించాడు. తనకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటానని బెదిరించి అక్కడినుంచి అపహరించాడు. మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తానని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నగ్నంగా ఉంచి ఆమెపై చేయి చేసుకున్నారు. నిందితుడు సూరత్లోని ఉమర్పాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అంతేగాక మహిళకు చెందిన ప్రైవేటు ఫోటోలను తీసుకుని వాటిని బయపట పెడతానని బ్లాక్మెయిల్ చేసి కొన్ని నెలలపాటు తనపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. దీంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కానిస్టేబుల్ భార్య మహిళకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం బాధితురాలు కేసు నమోదు చేసింది.. మహిళ, తన భర్తతో కలిసి ఇంటికొచ్చి తమను కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు దూషించేవారని కానిస్టేబుల్ భార్య ఆరోపించింది. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిద్దరిపై షెడ్యూల్ కులాలు, తెగల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న ఈ కేసులో ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితుడు పోలీసు, మహిళతో ఒకరు ఎఫైర్ కలిగి ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. చదవండి: లైంగిక వేధింపులు: గుండెపోటు అంటూ నాటకం.. వేట మొదలు! -
మాస్కుతో ఇబ్బందులు.. పీల్చిన గాలే పీల్చి..!
సాక్షి,హైదరాబాద్: ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్కు తప్పనిసరి. కరోనా బారినపడకుండా ఉండేందుకు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాసు్కలు ధరిస్తున్నారు. చాలాసేపు మాస్కు ధరించడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తోంది. ఇది పరోక్షంగా గొంతు నొప్పి, చిగుళ్లవాపు, బ్లీడింగ్ సమస్యలకు కారణమవుతోందని దంత వైద్య నిపుణలు చెబుతున్నారు. కనీసం ఆరు నెలలకోసారైనా నోటిని క్లీనింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇతర చికిత్సలతో పోలిస్తే.. దంత చికిత్సలు ఎమర్జెన్సీ కాకపోవడంతో చాలా మంది వీటిని వాయిదా వేసుకుంటున్నారు. కోవిడ్కు భయపడి గతేడాది నుంచి వీటికి దూరంగా ఉంటున్నారు. అయితే నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నోటిలో సూక్ష్మజీవులు పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని దంత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లపై ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ పలు సూచనలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 90 శాతం మందిలో దంత సమస్యలు.. ప్రస్తుతం జనాభాలో 90 శాతం మంది ఏదో ఒక దంత సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. 45 నుంచి 48 శాతం మంది పిప్పి పళ్ల సమస్యతో బాధపడుతుండగా.. 75 శాతం మంది చిగుళ్లవాపుతో ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్ ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువ. జన సమూహంలోకి వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాక్ ధరించడం తప్పనిసరిగా మారింది. దీంతో పీల్చిన గాలే పీల్చడంతో నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. నోటి దుర్వాసన, గొంతు నొప్పికే కాకుండా గుండె రక్తనాళాల పనితీరును దెబ్బతీస్తూ గుండెపోటుకు కారణమవుతుంది. నోరు ఎండిపోయి సూక్ష్మజీవుల వృద్ధి నిజానికి 6 నెలలకోసారి దంతాలను క్లీన్ చేయించుకోవాలి. లేదంటే దంతాల చుట్టూ పాచీ పేరుకుపోయి వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్కు నిలయంగా మారుతుంది. అనేక మంది చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్నారు. దంతాల మధ్యలో పాచీ పేరుకుపోయి చిగుళ్ల సమస్యలు తలెత్తి దంతాలు పటుత్వాన్ని కోల్పోతాయి. రోజంతా మాస్కు ధరించడం వల్ల మంచినీరు తక్కువగా తీసుకోవడం వల్ల నోరు ఎండిపోతుంటుంది. దీంతో దుర్వాసన రావడమే కాకుండా బ్యాక్టీరియా, వైరస్ల వృద్ధికి కారణమవుతుంది. ఇప్పటికే కోవిడ్ టీకా తీసుకున్న వారు దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. పిప్పి పళ్లు ఉంటే బ్లాక్ ఫంగస్ ముప్పు.. కరోనా బారిన పడి, ఆస్పత్రుల్లో చేరిన వారిలో చాలామందికి స్టెరాయిడ్స్ అవసరమయ్యాయి. చికిత్సల్లో భాగంగా అవసరానికి మించి స్టెరాయిడ్స్ వాడటం వల్ల కొందరికి బ్లాక్ఫంగస్ సోకింది. స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడి ఇప్పటికే పిప్పి పళ్ల సమస్యతో బాధపడుతున్న వారికి బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువ. బ్లాక్ ఫంగస్ లక్షణాల్లో చిగుళ్లు, దవడ వాపు కూడా లక్షణం కావడంతో ఏది బ్లాక్ ఫంగసో? ఏదీ చిగుళ్ల వాపు వ్యాధో? గుర్తించడం వైద్యులకు కష్టంగా మారింది. పిల్లల్లో కూడా దంతాలను సరిగా శుభ్రం చేయకపోవడం, ఏడాదిగా ఫాలోఅప్ చికిత్సలకు దూరంగా ఉండటంతో వారిలోనూ దంత సమస్యలు రెట్టింపయ్యాయి. చదవండి: దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్వేవ్కు అదే కారణం -
UP..మాస్క్ వేసుకోలేదని మేకులు దించారు
బరేలీ(యూపీ): ఉత్తర్ప్రదేశ్ పోలీసులపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. మాస్కు పెట్టుకోలేదనే కారణంతో తన కొడుకు చేతులు, కాళ్లలో మేకులు దించారంటూ ఆరోపించింది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులు ఉన్నతాధికారులకు మొర పెట్టుకుంది. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మాస్క్లేదని ఉత్తర్ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో బారదరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తన కొడుకుని పోలీసులు పట్టుకెళ్లారని... అతని కోసం పోలీస్ పోస్ట్కి వెళిప్పటికే తన కొడుకుని వేరే ప్రాంతానికి తరలించారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. కొన్ని గంటల పాటు ఆ ప్రాంతలో వెతికితే తీవ్ర గాయలపాలైన కొడుకు కనిపించాడని ఆమె పేర్కొంది. ముఖానికి మాస్కు పెట్టుకోలేదనే కారణంతో తన కొడుకు చేతులు, కాళ్లకు పోలీసులు మేకులు దించారని ఆరోపించింది. తప్పుడు ఆరోపణలు ఈ ఆరోపణలపై బరేలీ పోలీసులు స్పందించారు. తమపై ఫిర్యాదు చేసిన మహిళ కొడుకుపై అనేక కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసుల విచారణ తప్పించుకునేందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు -
సరికొత్త మాస్కు.. దీనితో ఇలా ఈజీగా మాట్లాడొచ్చు!
సాక్షి. తిరువనంతపురం: దేశంలో కరోనా మహమ్మారి అల్లాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాయి. ఆయా రాష్ట్రాల్లో కఠినంగా లాక్డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికి తోడు ప్రతి ఒక్కరు ముక్కుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో కోవిడ్ను నుంచి రక్షణ పొందేందుకు పలువురు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఈనేపథ్యంలోనే కేరళకు చెందిన బీటెక్ విద్యార్థి కెవిన్ జాకబ్ సరికొత్త మాస్క్ను తయారు చేశాడు. మాస్కు ధరించినప్పటికీ వ్యక్తుల మధ్య సంభాషణలను సులభతరం చేయడానికి మైక్, స్పీకర్తో కూడిన మాస్క్ను రూపొందించాడు. ప్రస్తుతం వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది నిరంతరం మాస్క్లతోపాటు పీపీఈకిట్లు ధరించడం వల్ల సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. అయితే ఈ స్పీకర్ మాస్క్ ద్వారా వైద్యులు.. కోవిడ్ బాధితులతో సులభంగా మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. దీనిని 30 నిమిషాలు చార్జ్ చేస్తే ఆరు గంటలపాటు నిర్విరామంగా ఉపయోగించవచ్చని కెవిన్ తెలిపాడు. డాక్టర్లైన తన తల్లిదండ్రులు, పేషెంట్లతో కమ్యూనికేట్ అవడానికి పడే కష్టాలను చూసి ఈ మాస్క్ తయారు చేయాలన్న ఆలోచన కలిగినట్లు పేర్కొన్నాడు. ఇది అయస్కాంతం ద్వారా మాస్క్కు అంటించడం జరగుతుందన్నారు. చదవండి: లాక్డౌన్ ఉల్లంఘన.. స్టెప్పులేసిన మహిళా తహసీల్దార్ వైరల్: పెళ్లితో ఒక్కటైన జంట.. భూమ్మీద కాదండోయ్! Kerala | Kevin Jacob, a first year B Tech student from Thrissur, has designed a mask with a mic & speaker attached to ease communication amid pandemic "My parents are doctors & they've been struggling to communicate with their patients since the onset of COVID," he said (23.05) pic.twitter.com/pnvkhzZETt — ANI (@ANI) May 23, 2021 -
రైనోస్టోన్ మాస్క్.. వెలిగిపోండిక
ఫేస్మాస్క్ల కాలం ఇది. ఎప్పుడూ ఒకే స్టైల్వి ధరించాలన్నా బోర్గా ఫీలయ్యే కాలం. అందుకే డిజైనర్లు వీటిలో విభిన్నరకాల మోడల్స్తో మెరిపిస్తున్నారు. కొన్ని ముత్యాలు, ఇంకొన్ని రంగురాళ్లు.. అవీ కాదంటే కొన్ని రత్నాలతో సింగారించి ఇలా మెరిపిస్తున్నారు. ఆకాశంలో నక్షత్రాలను చీరలపై సింగారించారా.. అని పొగిడే కాలం పోయి మాస్క్ మీద మెరిపించారా.. అనకుండా ఉండలేరు. పార్టీవేర్ మాస్క్గా ఈ రైనోస్టోన్ మాస్క్లు అందుబాటులో ఉన్నాయి. ధరలు స్టోన్స్, డిజైన్ బట్టి ఉన్నాయి. ప్లెయిన్ శాటిన్ ఫ్యాబ్రిక్ను మూడు పొరలుగా తీసుకొని, మాస్క్ను కుట్టి, రైనోస్టోన్స్ అతికించినా పార్టీవేర్ మాస్క్ రెడీ అన్నమాట. డ్రెస్కు మ్యాచింగ్ అయ్యేలానూ డిజైన్ చేసుకోవచ్చు. -
చెన్నై వీధుల్లో రజనీకాంత్ .. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్యం, ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. 70 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇంత యాక్టీవ్గా ఉన్నాడంటే దానికి ఒకే ఒక్క కారణం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. కరోనా లాక్డౌన్లో కూడా ఆయన వ్యాయామం చేయడం ఆపలేదు. తనని తాను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మార్నింగ్ వాక్ చేస్తున్నారు రజనీకాంత్. చెన్నైలోని పోయెస్ గార్డెన్ వీధుల్లో వాకింగ్ చేస్తూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో ఆయన బూడిద రంగు టీ-షర్టు, బ్లాక్ జాగర్స్, వైట్ ఫేస్ మాస్క్ , బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ధరించి ఉన్నాడు. లాక్డౌన్ సమయంలో జనాలంతా ఇళ్లలో ఉంటే రజనీ మాత్రం చాలా యాక్టీవ్గా వీధుల్లో మార్నింగ్ వాకింగ్ వెళ్లడం అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం రజనీ మార్నింగ్ వాక్ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా, ఈ నెల 17న సూపర్స్టార్ రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కలిసి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు రూ .50 లక్షల చెక్కును అందజేశారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వంతో సహకరించాలని ఆయన కోరారు. అన్నాత్తే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన రజినీకాంత్ ఇటీవల చెన్నైకి వెళ్లిన సంగతి తెలిసిందే. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4 న దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. Live. Love. Run. ♥️ Here is the latest click of Superstar #Rajinikanth during his morning walk! Stay safe & healthy, folks!#Annaatthe pic.twitter.com/89VnubkSsU — Rajinikanth Fans (@RajiniFC) May 20, 2021 -
మాస్కు లేకుండా మాజీ ఎమ్మెల్యే తీగల, రూ.1000 ఫైన్
సాక్షి, హైదరాబాద్: మాజీ శాసన సభ్యులు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి సరూర్నగర్ పోలీసులు చలానా విధించారు. కారులో మాస్క్ లేకుండా వెళుతున్న తీగల కృష్ణారెడ్డికి పోలీసులు 1000 రూపాయల చలానా వేశారు. కర్మన్ఘాట్ చౌరస్తా వద్ద సరూర్నగర్ పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన కారులో వెళ్తున్నారు. పోలీసులు ఆయన కారును తనిఖీ చేశారు. ఆ సమయంలో తీగల కృష్ణారెడ్డి మాస్క్ ధరించలేదు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని సరూర్నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ముకేష్.. మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. కారులో వెళ్తున్నా మాస్కు ధరించాలా? అంటూ ఆయన ఎస్ఐతో గొడవకు దిగారు. ఈ క్రమంలో సబ్ఇన్స్పెక్టర్ ముకేశ్కు తీగల కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. మాకు అంతా సమానులే అంటూ పోలీసులు తీగలకు ఎట్టకేలకు 1000 రూపాయల చలానా విధించారు. -
ఈ పని సరిగా చేస్తే వ్యాక్సిన్ వేసుకున్నంత రక్షణ!
సాక్షి, సెంట్రల్ డెస్క్: ఓకే.. వ్యాక్సిన్ల కొరత ఉంది.. అందరికీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు.. మరేం చేద్దాం.. వ్యాక్సిన్ల ఉత్పత్తి, సరఫరా, కొనుగోలు ఇవన్నీ మన చేతిలో లేవు.. మరి మన చేతిలో ఉన్నదానిపైన దృష్టి పెడదామా.. ఎందుకంటే.. ఈ పనిని మనం సరిగా చేస్తే.. దాదాపు వ్యాక్సిన్ వేసుకున్నంత రక్షణ అని అంతర్జాతీయంగా పలు పరిశోధన సంస్థలు అధ్యయనాలు చేసి మరీ తేల్చాయి. ఇంతకీ ఏంటా పని? మాస్కు సరిగా వేసుకోవడం!! సింపుల్. ఆ చాలామంది వేసుకుంటున్నారుగా అని మీరు అనవచ్చు.. ఇక్కడ మేం అన్నది మాస్క్ను సరిగా వేసుకోవడం అని.. ఎందుకంటే.. మన దగ్గర మాస్కు ముక్కుకు కాదు..మూతికి అని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు కాబట్టి.. మాస్కు వేసుకుంటున్నవారిలో సగం మంది ముక్కు కిందకు దించి వాడుతున్నారు కాబట్టి.. అందుకే మన చేతిలో.. మనం చేయగలిగిన ఈ పనిని సరిగా చేస్తే.. వ్యాక్సిన్ మీ దాకా వచ్చేవరకూ అదే రక్షణ కలి్పస్తుందని అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) పేర్కొంది. అంతేకాదు..ఇటీవల మాస్క్ల ధారణ, కొనుగోలుపై మరోమారు మార్గరద్శకాలనూ విడుదల చేసింది.అవేంటో చూద్దామా.. ఎలాంటి మాస్కు తీసుకోవాలి? ♦ ఏది తీసుకున్నా.. అది మలీ్టలేయర్డ్ ఉండేలా చూసుకోండి.. కనీసం మూడు పొరలు ఉండాలి. దగ్గరగా నేసినవై ఉండాలి. మీరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. డిస్పోజబుల్ మాసు్కలకూ ఇదే వర్తిస్తుంది. ♦ నోస్ వైర్ తప్పనిసరిగా ఉండాలి. మాస్కును కాంతి వస్తున్న వైపు పెట్టినప్పుడు అది దాన్ని నిరోధించేలా ఉండాలి. ఇలాంటివి వద్దు ♦ చాలామంది మాస్కులకు వాల్వులు ఉన్నవి వాడుతున్నారు. అలాంటివి వద్దు. అలాగే ఒకే పొర ఉన్నవి.. కాంతిని నిరోధించలేని మాస్కులను కొనుగోలు చేయవద్దు. ♦ ఎన్–95 లేదా కేఎన్–95 వాడేటప్పుడు దాని మీద మరో మాస్కును వాడవద్దు. వైద్య సిబ్బంది ఎక్కువగా వాడే వీటిని ఇప్పుడు సామాన్య జనమూ వినియోగిస్తున్నారు. ఇవి మరింత సురక్షితమైనవి అని పేరు ఉండటంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, కేఎన్–95 మాసు్కలు ఎక్కువగా చైనాలో తయారవుతాయి. వీటిల్లో నకిలీలు ఎక్కువగా ఉన్నాయన్న ఫిర్యాదులు అమెరికాలో ఉన్నాయి. కాబట్టి వాటిని కొనేటప్పుడు కాస్త చూసి తీసుకోవాలి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నా.. వీటిని వాడవద్దు. ఎలా ధరించాలి? ♦ ఏ మాస్కు అయినా.. సరిగా ఫిట్ అయిందో లేదో చూసుకోవాలి. అన్ని వైపులా కవర్ అవ్వాలి. నోస్ వైర్ ఉన్న మాస్కు తీసుకోవడం వల్ల అది పై నుంచి గాలి బయటకు పోకుండా లేదా రాకుండా నిరోధిస్తుంది. దాన్ని మీ ముక్కుకు తగ్గట్లు ప్రెస్ చేయాలి. సరిగా ఫిట్ అయి ఉంటే.. వేడి గాలి మాస్కు ముందు భాగం నుంచి రావడాన్ని గమనిస్తారు. అంతేకాదు.. శ్వాస తీసుకుంటున్నప్పుడు, వదులుతున్నప్పుడు దానికి తగ్గట్లు మాస్కు కూడా ముందుకు వెనక్కు కదలడాన్ని గమనించవచ్చు. ♦ ముఖ్యంగా డిస్పోజబుల్ మాసు్కల విషయంలో పై ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఇవి కొంచెం లూజుగా ఉంటుంటాయి. సైడ్ నుంచి గాలి పోయే అవకాశము ఎక్కువ. అందుకే వీటి విషయంలో ఈ విధంగా తాళ్లను ముడివేయడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు. ♦ అలాగే.. ఈ మధ్య డబుల్ మాస్క్ ఎక్కువగా ధరిస్తున్నారు. దీని వల్ల అదనపు రక్షణ లభిస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అలాగని రెండు డిస్పోజబుల్ మాసు్కలు ఒకదానిపై ఒకటి పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అటూఇటూ గాలి పోతూనే ఉంటుంది. దానికి బదులుగా డిస్పోజబుల్ మాస్కు వేసుకుని.. దాని మీద క్లాత్ మాస్కు వేసుకుంటే.. ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. అది కూడా డిస్పోజబుల్ మాస్కు అంచులని ముఖానికి అదిమిపట్టేలా క్లాత్ మాస్కు వేసుకోవాల్సి ఉంటుంది. ♦ ఇక గడ్డం ఉన్నవారి విషయంలో మాస్క్ ఫిటింగ్ అన్నది సమస్యగా మారింది. వీరికంటూ ప్రత్యేకమైన మాసు్కలు లేని నేపథ్యంలో.. ఈ కరోనా కాలంలో అయితే షేవింగ్ చేసుకోవడం లేదా.. గడ్డం ట్రిమ్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించాలని సీడీసీ తెలిపింది. వీరు డబుల్ మాస్క్ ధరిస్తే.. మరింత సురక్షితమని పేర్కొంది. వీటితోపాటు సోషల్ డిస్టెన్స్ కూడా ముఖ్యమని మరోమారు స్పష్టం చేసింది. -
కరోనా: దంపతుల గొప్ప మనసు.. స్వయంగా మాస్కులు కుట్టి..
సాయం చేయాలనే మనస్సు ఉండాలేగాని.. ఆర్థిక స్థోమత లేకపోయినప్పటికీ ఏదోరకంగా చేతనైన సాయం చేయవచ్చని చెన్నైకి చెందిన ఓ జంట చేతలద్వారా చెబుతోంది. స్వయంగా మాస్కులు కుట్టి ఉచితంగా పంపిణీ చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఛండీరా, కరుణాకరన్ దంపతులు. కరుణాకరన్ ఆటోడ్రైవర్గా పని చేస్తుంటే.. ఛండీరా కుట్టుమిషన్ మీద బట్టలు కుట్టి భర్తకు ఇంటిపనుల్లోనూ, ఆర్థిక వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ఉంటుంది. అయితే గతేడాది మనదేశంలో కరోనా కేసులు నమోదవ్వడం ప్రారంభమైనప్పుడు ‘‘మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి, మాస్కులేకుండా బయటికి తిరగకూడదు’’ అని విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఎక్స్పోర్టు కంపెనీలో టైలర్గా పనిచేస్తోన్న ఛండీరాకు.. ‘‘బట్టలు కుట్టగా ముక్కలుగా మిగిలిపోయిన క్లాత్ వృథాగా పోతుంది. వీటిని మాస్కులుగా కుడితే అందరికి ఉపయోగపడతాయి’’ కదా! అనిపించింది. దీంతో తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మిగిలిపోయిన గుడ్డముక్కలతో మాస్కులు కుట్టి.. బంధువులు, ఇంటి చుట్టుపక్కల వారికి ఉచితంగా ఇచ్చేది. మాస్కులు నచ్చడంతో మాకు ఒకటివ్వారా! మా ఇంట్లో వాళ్లు అందరికీ కావాలి ఇస్తారా? అని అడిగేవారు. దీంతో ఛండీరా భర్త సాయం తీసుకుని మరిన్ని మాస్కులు కుట్టేది. కుట్టిన మాస్కులను కరుణాకరన్ ఆటో ఎక్కే ప్యాసింజర్లకు ఉచితంగా ఇచ్చేవాడు. అయితే మాస్కు తీసుకున్నవారు ‘‘ఎన్–95 మాస్కు పెట్టుకుంటే ఊపిరి సరిగ్గా ఆడడం లేదు. గుడ్డతో తయారు చేసిన మాస్క్లు ఏ ఇబ్బంది లేకుండా అనుకూలంగా ఉన్నాయి’’ అని చెప్పడంతో మరింత ప్రోత్సాహంతో ఎక్కువ మాస్కులు కుట్టేవారు. ‘‘ఒకపక్క ఎక్స్పోర్టు కంపెనీలో టైలర్గా పనిచేస్తూ.. మరోపక్క ఇంటి పనులు చక్కబెడుతూ కొంత సమయం కేటాయించి మాస్కులు కుడుతున్నాను. మధ్యాహ్నం భోజనం పదినిమిషాల్లో పూర్తిచేసి మిగతా సమయం అంతా మాస్కులు కుట్టేందుకు కేటాయిస్తున్నాను’’ అని ఛండీరా చెప్పారు. కరుణాకరన్ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా ఎన్ని మాస్కులు ఉచితంగా ఇచ్చామో ఎప్పుడూ లెక్కపెట్టలేదు. 500కి పైగా మాస్కులు పంచాము. నా ఆటోలో ఎక్కే ప్యాసింజర్లు ఎవరైనా మాస్కు పెట్టుకోవడం మర్చిపోతే విసుక్కోకుండా వారికి నా భార్య కుట్టిన మాస్కులు ఇస్తున్నాను’’ కస్టమర్లు కూడా మంచిగా స్పందిస్తున్నారు అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మనస్సు ఉంటే మార్గం ఉంటుందన్న మాటకు ఈ దంపతులు ఉదాహరణగా నిలుస్తున్నారు! చదవండి: కరోనా పేషంట్లకు వండిపెడుతోన్న తల్లీకూతుళ్లు -
మాస్కు ధరించలేదని చిన్నారులతో..
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం భాంజీపేటలో మాస్క్లు లేని చిన్నారులతో ఓ పంచాయతీ కార్యదర్శి రహదారిపై కప్పగంతులు వేయించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీరంగారెడ్డి మంగళవారం గ్రామంలో పర్యటిస్తూ మాస్క్లు ధరించని ఇద్దరికి జరిమానా వేశారు. ఆ తర్వాత పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులు మాస్క్ లేకుండా కనిపించగా.. వారిని కప్పగంతులు వేయాలని ఆదేశించారు. దీంతో చిన్నారులు మోకాళ్లపై కొద్దిదూరం కప్పగంతులు వేయగా, స్థానికులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, ఈ విషయమై శ్రీరంగారెడ్డి మాట్లాడుతూ కరోనాపై చిన్నారులకు అవగాహన కల్పించేందుకు కప్పగంతులు వేయించానే తప్ప మరే ఉద్దేశం లేదని తెలిపారు. ఒకే ఇంట్లో ఆరుగురికి పాజిటివ్ .. బాధితుల్లో ఐదు నెలల బాబు స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని అక్కపెల్లిగూడెంలో ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఇప్పగూడెం పీహెచ్సీ వైద్యాధికారి మౌనిక తెలిపారు. పీహెచ్సీకి వచ్చిన కుటుంబ సభ్యులను పరీక్షించగా కుటుంబంలోని ఆరుగురికి కరోనా పాజిటివ్గా తేలిందని చెప్పారు. కాగా, బాధితుల్లో ఐదు నెలల వయసు కలిగిన బాబు కూడా ఉన్నాడని తెలిపారు. చదవండి: ఇంట్లోనూ మాస్క్ ధరించండి..ఎందుకంటే ? -
మాస్క్లాగా పెయింటింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అధికారులు
మాస్క్లు ధరించడం.. భౌతిక దూరం పాటించడం...చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం.. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడం... ఇవన్నీ కరోనా కట్టడికి మనం పాటిస్తున్న జాగ్రత్తలు. ఇందులో మాస్క్లు కీలకమైనవి. దేశంలో రోజురోజుకూ కరోనా సెకెండ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు మన దేశంలో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్క్లను ధరించాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే మాస్క్ పెట్టుకోవడం అత్యంత అవసరమని ఎంత చెప్పినా కొందరు ఏమాత్రం లెక్కచేయడం లేదు. అందరూ ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవడం, ఎవరూ చూడని సమయంలో తీసేయడం వంటి పనులు చేస్తున్నారు. అంతేగాక మాస్క్ ధరించినా ముక్కు కిందకే ఉంచడం వంటి వింత చేష్టలు చేస్తున్నారు. తాజాగా ఇలాగే ఇండోనేషియాకు చెందిన ఓ యువతి మాస్క్ లేకుండా సూపర్ మార్కెట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. మాస్క్ లేకపోవడంతో సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. దీంతో మాస్క్ కోసం వినూత్నంగా ఆలోచించిన యువతి అచ్చం మాస్క్లాగా ముఖానికి పెయింటింగ్ వేసుకొని మరో వ్యక్తితోపాటు సూపర్మార్కెట్లోకి అడుగు పెట్టింది. ముఖానికి మాస్కే అనుకొని సెక్యూరిటీ కూడా ఆమెను లోపలికి వెళ్లనిచ్చాడు. అక్కడ జరిగేదంతా యువతి వీడియో తీసింది. అయితే ఈ వీడియో కాస్తా వైరల్ అవ్వడంతో సదురు యువతి మాస్క్కు బదులు పెయింటింగ్ చేయించుకోవడాన్ని గమనించారు. ఇది చట్ట విరుద్దమని నెటిజన్లు కామెంట్లు చేశారు. చివరికి ఆమె పనితనం అధికారుల దృష్టికి చేరింది. దీంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు యువతి పాస్పోర్టును ఇమిగ్రేషన్ అధికారులు రద్దు చేశారు. దీంతో ఆమెకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్లైంది. చదవండి: మాస్క్ పెట్టుకోలేదారా.. ఇన్స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు! -
మాస్క్ మస్ట్గా ధరించాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
మాస్క్.. సిరిసిల్ల మార్క్..!
‘‘జూకీ మిషన్పై మాస్క్లు కుడుతున్న ఈ అమ్మాయి పేరు దిడ్డి అనుప్రియ. సిరిసిల్ల పట్టణంలోని అనంతనగర్కు చెందిన అనుప్రియ డిగ్రీ చదివింది. ఏడాదిగా మాస్క్లు కుడుతోంది. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు 200 మాస్క్లు కుట్టగా.. ఒక్కో మాస్క్కు రూ.1.50 చొప్పున ఇస్తారు. ఈ లెక్కన నెలకు సగటున ఆరు వేల వరకు మాస్క్లు కుడుతూ.. రూ.9 వేలు సంపాదిస్తోంది. ఒక్క అనుప్రియనే కాదు.. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో మూడు వేల మంది యువతులు, మహిళలు మాస్క్లు కుడుతూ ఉపాధి పొందుతున్నారు.’’ సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్రోత్పత్తి ఖిల్లా. ఇక్కడ అన్ని రకాల వస్త్రాలు తయారు అవుతాయి. కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి మాస్క్ల తయారీకి శ్రీకారం చుట్టారు. 50 మంది హోల్సేల్ వ్యాపారులు నేరుగా వివిధ రంగుల్లో మాస్క్లను కుట్టిస్తున్నారు. నాణ్యమైన కాటన్ బట్టతో పాటు, మామూలు పాలిస్టర్ బట్టతోనూ మాస్క్లు కుడుతున్నారు. మెటీరియల్ అందిస్తూ.. జాబ్ వర్క్లాగా మహిళలు పని చేస్తున్నారు. మూడు వేల మంది మహిళలు నిత్యం నాలుగు నుంచి ఐదు లక్షల మేరకు మాస్క్లు కుడుతున్నారు. నాణ్యతను బట్టి ఒక్కో మాస్క్ ధర రూ.6 నుంచి రూ.25 వరకు ధర ఉంటుంది. సిరిసిల్ల మాస్క్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రస్తుతం మాస్క్ల వాడకం తప్పని సరైంది. వినియోగం కూడా భారీగా పెరిగింది. సిరిసిల్ల నుంచి నేరుగా హైదరాబాద్కు ఎగుమతి చేస్తున్నారు. అక్కడి నుంచి దేశ వ్యాప్తంగా వివిధ కంపెనీలకు, వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. కాటన్ మాస్క్లకు డిమాండ్ కాటన్ మాస్క్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. నా వద్ద 50 మంది మహిళలు జాబ్ వర్క్గా పని చేస్తారు. నేను హైదరాబాద్కు మాస్క్లు సరఫరా చేస్తాను. క్వాలిటీని బట్టి ధర ఉంది. సిరిసిల్లలో మాస్క్ల తయారీ భారీ ఎత్తున సాగుతోంది. మహిళలకు మంచి ఉపాధి లభిస్తుంది. –గుంటుక కోటేశ్వర్, యజమాని, సిరిసిల్ల బీడీల పని కంటే బెటర్ నేను గతంలో బీడీలు చేశాను. రోజుకు 500 బీడీలు చేస్తే నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 వచ్చేవి. నా భర్త సాంచాలు నడిపిస్తారు. ఇప్పుడు మాస్క్లు కుడుతున్న. ఏడాదిగా చేతి నిండా పని ఉంది. ఎన్ని మాస్క్లు కుడితే అంత కూలి వస్తుంది. నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వస్తుంది. బీడీల పని కంటే బెటర్. –దాసరి మాధవి, కార్మికురాలు నెలకు రూ.6 వేలు వస్తున్నాయి నేను మాస్క్లు, లంగాలు కుడుతూ.. నెలకు రూ.6 వేల వరకు సంపాదిస్తున్న. గతంలో నేను బీడీలు చేస్తే నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వచ్చేవి. ఇప్పుడు పని బాగుంది. ఎంత పని చేస్తే అంత కూలి వస్తుంది. నా భర్త గార్మెంట్ యూనిట్ నిర్వహిస్తాడు. ఆయనతో పాటు నేను పని చేస్తాను. –గాజుల జయలక్ష్మీ, కార్మికురాలు -
మాస్క్ పెట్టుకోలేదారా.. ఇన్స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు!
కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ముఖానికి మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అయిపోయింది. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అసలు మాస్క్ లేకుండా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇంట్లోంచి అడుగు కిదిపితే చాలు ముఖానికి మాస్కులు వేసుకోక తప్పడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే మాస్క్ పెట్టుకొని పెట్టుకొని ఓ రకంగా ప్రజలకు విసుగొస్తుంది. కానీ ప్రపంచాన్నే వణికిస్తున్న ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్కులు ధరించడం తప్పనిసరి. తాజాగా ఓ యువకుడు మాస్క్ పెట్టుకోలేదని ఆడిగినందుకు కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. రాష్ట్రంలో నిత్యం 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రభుత్వం మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటోంది. పోలీసులు తమ ప్రత్యేక వాహనాల్లో రౌండ్స్ కొడుతూ ఎక్కడైనా ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోతే.. రఫ్పాడిస్తున్నారు. ఈ క్రమంలో ఖుషీ నగర్లో ఓ యవకుడు మాస్క్ లేకుండా దర్జాగా వెళ్తుంటే.. కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే అతన్ని ఆపి జీపులో ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరకు పంపాడు. ఇన్స్పెక్టర్ ఆ కుర్రాడి కాలర్ పట్టుకొని... "మాస్క్ పెట్టుకోమని ఇంతలా చెబుతుంటే ఎందుకంత నిర్లక్ష్యం.. ఇంత బలుపేంటి... మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు.. పెట్టుకోమని చెబుతున్నాం కదా" అంటూ ఫైర్ అయ్యి చెయ్యి చేసుకున్నాడు. దీంతో ఆ యువకుడు పెట్టుకుంటాను సార్ అని అమాయకుడిలా నటిస్తుంటే.. పోనీలే అని అతనికి ఫైన్ వెయ్యకుండా వదిలాడు ఇన్స్పెక్టర్. అంతే ఆ క్షణంలో ఆ కుర్రాడు ఇన్స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు. షాకైన ఇన్స్పెక్టర్.. రేయ్ అనేసరికి. అక్కడి నుంచి పరుగందుకున్నాడు. అతన్ని పట్టుకుందామని పరుగెత్తిన కానిస్టేబుల్కి అతన్ని పట్టుకోవడం కుదరలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరి మీరు కూడా ఓ లుక్కేయండి.. చదవండి: ఆక్సిజన్ కొరత: ఢిల్లీలో మరో 20 మంది కరోనా రోగులు మృతి ఏ మాస్క్ ఎలా వాడాలి? ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.. -
ఏ మాస్క్ ఎలా వాడాలి? ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి..
మాస్క్లు ధరించడం.. భౌతిక దూరం పాటించడం... చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం.. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడం... ఇవి.. కరోనా కట్టడికి వైద్యులు సూచించే మార్గాలు. ఇందులో మాస్క్లు కీలకమైనవి. వీటిని శుభ్రపరచకుండా ధరిస్తే రిస్క్ తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాస్క్లపై అవగాహన పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు. దేశంలో రోజురోజుకూ కరోనా సెకెండ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు మన దేశంలో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్క్లను ధరించాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే, ధరించిన మాస్క్లను ఎలా శుభ్రం చేయాలి? వేటిని వాడగానే చెత్తబుట్టలో పారేయాలనే విషయాల్లో చాలామందికి సరైన అవగాహన లేక ఇష్టారీతిన వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల మాస్కులతో ముప్పు వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్పై చేరిన వైరస్ అంత సులువుగా చనిపోయే అవకాశం ఉండదు. ప్రస్తుతం ధరించి వాడుతున్న వివిధ మాస్కులలో ఒక్కోటి ఒక్కో రకంగా పనిచేయడంతో పాటు వాటిని వాడడంలో సరైన జాగ్రత్తలు తీసు కోవాలని చెబుతున్నారు. సర్జికల్ మాస్క్లు.. వీటిని శుభ్రం చేయడం చాలా కష్టం. ఎందుకంటే వీటిని త్వరగా డీగ్రేడ్ అయ్యే పేపర్ లాంటి మెటీరి యల్తో తయారు చేస్తారు. చాలా మంది వీటిని డిస్ఇన్ఫెక్ట్ చేసి మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదన్నది వైద్యుల మాట. సర్జికల్ మాస్క్ సెంటర్ పార్ట్ తయారు చేసేందుకు వాడే మెటీరియల్ వైరస్ను అంత ఈజీగా లోపలికి పోనివ్వదు. సర్జికల్ మాస్కు ధరించినప్పటి నుంచి ఆరు గంటల వరకు పనిచేస్తుంది. మాస్క్ను ఉతికినప్పుడు, పార్ట్ పాడైనా, తడిసినా అది పనికిరాకుండా పోతుంది. సర్జిక ల్ మాస్కు ధరిస్తే ప్రతి ఆరు గంటలకు ఒకసారి తప్పకుండా మార్చాలి. లేదంటే అటువంటివి వాడి తడిపి వేసుకుంటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్లాత్ మాస్క్లు.. కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది ఇళ్లలో కుట్టిన క్లాత్ మాస్కులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇంకొందరు బయట షాపుల లో, రోడ్లపై అమ్మే క్లాత్ మాస్కులను కొనుగోలు చేసి వాడుతున్నారు. మాస్క్లన్నింటి కంటే క్లాత్ మాస్క్ లే మంచివన్నది చాలా మంది అభిప్రాయం. అయి తే ఈ క్లాత్ మాస్క్లను రోజుకోసారి నాణ్యమైన సబ్బు లేదా డిటర్జెంట్ పౌడర్తో ఉతకాలని వైద్యు లు సూచిస్తున్నారు. క్లాత్ మాస్క్లను శుభ్రం చేసేందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. వైరస్ చనిపోవాలంటే క్లాత్ మాస్క్లను దాదాపుగా 60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగించిన వేడి నీళ్లలో డిటర్జెంట్ వేసి ఉతకాలని చెబుతున్నారు. చల్లని నీళ్లతో శుభ్రపరిస్తే వైరస్ చనిపోయే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు. డ్యూటీ మాస్క్లు... హెల్త్ ప్రొఫెషనల్స్ వాడే డ్యూటీ మాస్క్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఎన్–95, ఎఫ్ఎఫ్పీ–2 మాస్క్లను నీటితో శుభ్రం చేయడం వంటివి చేస్తే వాటిలో ఉండే ఫిల్టర్లు పాడవుతాయి. అందుకే వీటిని వాడిన అనంతరం మూత ఉన్న చెత్తబుట్టలో పారేయడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ చనిపోవాలంటే.. కరోనా వైరస్ బయటిపొర ఫ్యాటీ ఆయిలీగా ఉంటుంది. అందువల్ల డిటర్జంట్తో మాస్క్లను రుద్దుతూ ఉతికితే వైరస్ బయటి భాగం మాత్రమే పాడవుతుందని మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్లు తెలియజేస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందడానికి కారణ మయ్యేది ఆ భాగమేనని చెబుతున్నారు. సబ్బు, డిటర్జంట్ వాడితే జిడ్డు జిడ్డుగా ఉండే వైరస్ పైన ఉన్న లేయర్ పాడవుతుందని, దానివల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండదని సూచిస్తున్నారు. సబ్బు, డిటర్జంట్ వినియోగించి మాస్కులను ఉతికినప్పుడు కొద్ది నిమిషాల పాటు ఆ నురగ నీటిలో నానబెట్టాలని, అలా చేస్తే వైరస్ పూర్తిగా నశిస్తుందని స్పష్టం చేస్తున్నారు. శుభ్రం చేసుకున్న మాస్కులనే ధరించాలి.. రోజురోజుకు కరోనా కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పని సరిగా మాస్క్లు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. అత్యవసర పని ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. క్లాత్ మాస్క్లను ప్రతిరోజూ సబ్బు ద్వారా వేడినీటితో ఉతికి శుభ్రం చేసుకుంటే వైరస్ నశిస్తుంది. ముఖానికి ధరించిన మాస్క్లను ప్రతిసారి చేతులతో తాకకూడదు. మాస్క్ను తీసేటప్పుడు జాగ్రత్తగా ముఖానికి తగలకుండా తీయాలి. – డాక్టర్ ఆర్.త్రినాథరావు,సీహెచ్సీ సూపరింటెండెంట్, శృంగవరపుకోట -
‘‘నేను మాస్కు పెట్టుకోకపోతే.. మీ కేంటి’’
-
నటి వజ్రాల మాస్కు: ధర చూస్తే దిమ్మ తిరగాల్సిందే!
హిందీ ఐటమ్సాంగ్స్కు తనదైన స్టైల్లో ఆడిపాడి జనాలకు కిక్కెక్కించే భామ ఊర్వశి రౌతేలా. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయాలని తహతహలాడే ఈ మిస్ ఇండియా బ్యూటీ తాజాగా ఓ వెరైటీ మాస్క్తో జనాలకు షాకిచ్చింది. అదేంటీ.. మాస్కు మంచిదే కదా.. అందులో షాకింగ్ ఏముంది అంటారా? అక్కడికే వస్తున్నాం.. సాధారణంగా మాస్కు రూ.10 ఉంటుంది. లేదంటే వందల్లో ఉంటుంది. కరీనా కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే వేలు ఖర్చుపెట్టి మాస్కులు కొనుక్కుంటారు. కానీ ఊర్వశి మాత్రం వందలు, వేలు, లక్షల్లో కాదు.. ఏకంగా కోట్లు విలువైన మాస్కు ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం ముక్కు, నోటికి కాకుండా తల మొత్తాన్ని కప్పివేస్తున్నట్లుగా ఉంది. ఈ డైమండ్ మాస్క్ ధర రూ.3 కోట్ల రూపాయలట. ధరే కాదు దాని బరువు కూడా ఎక్కువగానే ఉందని క్యాప్షన్ ఇచ్చింది ఊర్వశి. ఈ మేరకు ఓ చిన్నపాటి వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్గా మారింది. ఇదిలా వుంటే ఊర్వశి ప్రస్తుతం "ద బ్లాక్ రోజ్"లో నటిస్తోంది. అలాగే తమిళ చిత్రం "తిరుట్టు పాయలే 2" హిందీ రీమేక్లోనూ నటించనుంది. హీరో శరవణన్ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తూ తమిళంలోనూ ఎంట్రీకి రెడీ అవుతోంది. బాలీవుడ్ హీరో రణ్దీప్ హుడాతో "ఇన్స్పెక్టర్ అవినాష్" అనే వెబ్ సిరీస్ చేస్తోంది. "మర్ జాయేంగే" మ్యూజిక్ వీడియోలో గురు రంధవాతో ఆడిపాడనుంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) చదవండి: -
అమానుషం: మాస్క్ సరిగా లేదని ఆటోడ్రైవర్పై పోలీసుల వీరంగం..
భోపాల్ : భారత్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. బహిరంగ ప్రదేశాలలో ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేశాయి. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో రాత్రి కర్ఫ్యూ విధించాయి. ఇక కరోనా నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బయటికి వచ్చిన వారిపై జరిమానా కూడా విధిస్తున్నారు. ఈ క్రమంలో ముఖానికి ఉన్న మాస్క్ సరిగా లేదన్న నెపంతో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై పోలీసులు చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇండోర్కు చెందదిన కృష్ణ కేయర్(35) అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన తండ్రి ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకొని ఆయన్ను కలవడానికి ఆటోలో బయలు దేరాడు. అయితే ఈ హడావిడిలో ముఖానికి పెట్టుకున్న మాస్కు కాస్త ముక్కు కిందకు జారింది. దీనిని గమనించిన ఇద్దరు పోలీసులు కృష్ణను ఆపి పోలీస్ స్టేషన్కు రావాలని డిమాండ్ చేశారు. దీనికి ఆటో డ్రైవర్ నిరాకరించడంతో పోలీసులు కృష్ణపై నడిరోడ్డుమీద దాడికి తెగబడ్డారు. అతన్ని నడిరోడ్డుపై కిందపడేసి కనికరం లేకుండా రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. కాళ్లతో తన్నారు. కాగా పోలీసుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించగా వారు ఇంకా రెచ్చిపోయారు. ఆటోడ్రైవర్పై తమ ప్రతాపం చూపించారు. అతనితో వచ్చిన కొడుకు కూడా సాయం చేయాలని అక్కడి వాళ్లను కోరినా.. చోద్యం చూస్తున్నట్లు ఉండిపోయారేగానీ ఎవరూ ముందుకు రాలేదు. ఈ తతంగాన్నంతా ఓ వ్యక్తి తన మొబైల్లో వీడియో తీశాడు. దాడి చేసిన పోలీసులను కమల్ ప్రజాపథ్, ధర్మేంద్ర జట్గా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వారిద్దరిని సస్పెండ్ చేశారు. కాగా కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. గత 24 గంటల్లో 3,722 కొత్త కేసులు, 18 మరణాలు సంభవించాయి. మార్చి నుంచి, ఇప్పటి వరకు మాస్క్ ధరించని 1,61,000 మందికి జరిమానా విధించారు. వారి నుంచి మొత్తం 1.85 కోట్లు వసూలయ్యాయి. చదవండి: కరోనా: ఒక్కరోజే లక్ష దాటిన కొత్త కేసులు -
ఏపీ: మాస్క్ పెట్టని సీఐకి జరిమానా
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ ఫలితాన్నిస్తోంది. ఎవరైనా మాస్క్ ధరించకుండా రోడ్డెక్కితే.. తొలుత అవగాహన కల్పించడం ఆపై జరిమానా విధించడం చేస్తుండటంతో ‘మాస్క్ మస్ట్’ అనే దిశగా ప్రజా చైతన్యం వెల్లివిరిస్తోంది. స్పెషల్ డ్రైవ్లో భాగంగా అన్ని జిల్లాల్లోనూ ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లు, డీఐజీలు, ఐజీలు సైతం రోడ్డెక్కి ప్రజలను అప్రమత్తం చేస్తున్న తీరు అందర్నీ ఆలోచింపజేస్తోంది. ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు రెండు గంటలపాటు మొత్తం పోలీస్ యంత్రాంగం రోడ్లపైనే ఉంటోంది. మాస్క్ ధరించకుండా ప్రయాణించే వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించడం, జరిమానాలు విధించడం వంటి కార్యక్రమాల్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. మాస్క్ ధరించే విషయంలో పోలీసులు సైతం మినహాయింపు లేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఓ సీఐకి సైతం జరిమానా విధించారు. గుంటూరు లాడ్జి కూడలిలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలనకు వెళ్లారు. ఆ సమయంలో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావు మాస్క్ ధరించకుండా వెళ్తుండటంతో ఆపి మాస్కు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. హడావుడిలో మర్చిపోయానని బదులిచ్చిన సీఐ మల్లికార్జునరావుకు జరిమానా విధించిన ఎస్పీ అమ్మిరెడ్డి ఆయనకు స్వయంగా మాస్క్ తొడిగారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. ఇందుకోసం యంత్రాంగం మొత్తం మూడు రోజులుగా రోడ్లపైనే ఉంటూ కోవిడ్ నిబంధనల అమలుకు కృషి చేస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు. వేడుకలు, విందులు, వినోదాలు వంటి వాటిని సాధ్యమైనంత తక్కువ మందితో జరుపుకోవాలి. వీలైతే వాటిని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మరీ మంచిది. బయటకి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించటం వంటి వాటిని అలవాటుగా మార్చుకోవాలి. దుకాణదారులు సైతం వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక దూరం ఉండేలా విద్యార్థులను కూర్చోబెట్టాలి. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
హైదరాబాద్: రోడ్డు పైకి వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ముఖానికి మాస్క్ ధరించకుండా రోడ్లపై, వాహనాల్లో తిరిగే వారిని ఫోటోలు తీసి జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇందుకు నేటి(మంగళవారం) నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాస్క్ లేకుండా ఎవరైనా బయట కనిపిస్తే వారికి భారీ జరిమానా విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు మాస్క్ లేకుండా వెళ్తున్నవారి ఫోటోలు తీసి వాహనం నంబరు ఆధారంగా ఇంటికి ఈ-చలానాలను పంపనున్నారు. జరిమానా ఎంత విధించాలనేది మాత్రం ఇంక నిర్ణయించలేదు. ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే మాస్కులు లేకుండా వాహనాల్లో వెళ్తున్న వారిపై హైదరబాద్ ట్రాఫిక్ పోలీసులు 15 వేల కేసులు నమోదు చేశారు. కాగా మాస్కులు లేకుండా ఉన్న వారిని గుర్తించడంలో ట్రాఫిక్ పోలీసులతోపాటు ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రధానపాత్ర పోషించనున్నాయి. చదవండి: మాస్కులేకుండా విధుల్లో సీఐ.. గుంటూరు ఎస్పీ ఏం చేశారంటే! -
మాస్కులేకుండా విధుల్లో సీఐ.. గుంటూరు ఎస్పీ ఏం చేశారంటే!
సాక్షి, గుంటూరు: దేశంలో కరోనా మళ్లీ విజృభిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్క్ వాడటం తప్పనిసరి. గుంటూరు అర్బన్ పరిధిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జికూడలి, ఎంటీబీ కూడలిలో స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నారు. లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడం ఎస్పీ గుర్తించారు. వేంటనే సీఐని ఆగమని కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలి మీరు ఎందుకు మాస్క్ ధరించలే అని ప్రశ్నించగా సీఐ హడావిడిలో మర్చిపోయాను సార్ అనిచెప్పారు. దీంతో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లి మల్లికార్జునరావుకు ఎస్పీ అమ్మిరెడ్డి జరిమానా విధించి, స్వయంగా మాస్కు తొడిగారు. కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. మాస్కు ధరించని కారణంగా సీఐకి అపరాధ రుసుం(ఫైన్) విధించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎస్పీ స్వయంగా మాస్కు తెప్పించి సీఐకి తగిలించారు. అలాగే వాహనదారులను ఆపి, మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. మాస్కులు ధరించిన వారినే అనుమతించాలంటూ సమీపంలోని దుకాణదారులకు సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఏప్రిల్ 1న కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్ -
మాస్క్పై ఏపీ పోలీసు స్పెషల్ డ్రైవ్
-
అడ్డంగా దొరికిన బండ్ల గణేష్: నెట్టింట్లో నవ్వులపాలు
టాలీవుడ్లో బండ్ల గణేష్ ప్రస్థానం ఓ పట్టాన అర్థం కాదు. కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఉన్నట్లుండి నిర్మాతగా మారి, ఆ వెంటనే స్టార్ హీరోలతో సినిమాలు తీసి, సూపర్ హిట్లు అందుకుని ఎంతో మందిని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అతడు తక్కువ కాలంలోనే యూటర్న్ తీసుకుంటూ పాలిటిక్స్కు గుడ్బై చెప్పాడు. తిరిగి సినిమాల బాట పట్టాడు, కానీ ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టు నెట్టింట్లో నవ్వులపాలైంది. ఒకసారి కాదు, రెండుసార్లు తప్పులో కాలేయడంతో అతడిని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ముఖాన మాస్కు లేకపోతే ఫైన్లు వేస్తూ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మాస్కు ధరించకపోతే రూ.2 వేల రూపాయల ఫైన్ వేస్తున్న ఫొటోను ఆయన ట్విటర్లో షేర్ చేశాడు. ఈ సందర్భంగా అందరూ మాస్క్ ధరించాలని సూచించాడు. ఆయన ఉద్దేశ్యం బాగానే ఉన్నా వాక్యంలో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. Wear Mask అని రాయాల్సింది పోయి Where Mask అని ట్వీట్ చేశాడు. దీన్ని చాలామంది వేలెత్తి చూపించడంతో వెంటనే దాన్ని డిలీట్ చేశాడు. ఈసారి Ware Mask అంటూ మరోసారి తప్పు ట్వీట్ చేసి మళ్లీ అడ్డంగా దొరికిపోయాడు. మనది ఏ స్కూల్ అన్నా.. అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 'ఈయన దెబ్బకు మాకు వచ్చిన స్పెల్లింగ్ కూడా మర్చిపోయేలాగా ఉన్నామే', 'అది ware, where, ware కాదు, wear' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 1at easdu😁 pic.twitter.com/6pOHLQgwBI — DILEEP (@superstar811995) March 29, 2021 Ware mask 😷 @besafe @CPHydCity @DCPWZHyd pic.twitter.com/v8DEWaeP1T — BANDLA GANESH. (@ganeshbandla) March 29, 2021 చదవండి: రోడ్డు మీద మహిళ ఇబ్బందులు: సన్నీలియోన్ భర్త సాయం ముక్కు అవినాష్ తల్లికి అనారోగ్యం: CMRF నుంచి చెక్ -
మున్సిపల్ సిబ్బందిపై మహిళ విశ్వరూపం.. వీడియో వైరల్!
కరోనా దెబ్బతో మాస్కుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. జేబులో పర్సు లేకుండా కాలు బయట పెడుతున్నారేమో గానీ ముఖానికి మాస్కు లేకుండా జనావాసాల్లోకి మాత్రం రావడం లేదు. అయితే సుమారు రెండు నెలలుగా మహమ్మారి ప్రభావం పెద్దగా లేకపోవడంతో జనాల్లో భయం వీడింది. నిబంధనలు పాటించకుండానే విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఈ క్రమంలో ముఖానికి మాస్కు ధరించలేదని అడ్డుకున్నందుకు మున్సిపల్ కార్మికురాలి చెంప చెళ్లుమనిపించింది ఓ మహిళ. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మహారాష్ట్రలో కోవిడ్ కేసులు అధికమవుతున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని ప్రజలందరు కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ముంబైలో మాస్కు ధరించకుండా బయటకు రావడం నిషేదం. ఇందుకు 200 రూపాయల జరిమానా కూడా విధిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ మహిళ మాస్కు ధరించకుండా ఆటోలో వెళుతూ మున్సిపల్ సిబ్బంది కంటపడింది. ముంబైలోని కండివాలి రోడ్లో ఆటో రిక్షాలో మాస్కు ధరించకుండా ప్రయాణిస్తున్నా మహిళను బృహాన్ ముంబై కార్పోరేషన్లో పనిచేస్తున్న కార్మికురాలు అడ్డుకుంది. మాస్కు ధరించాలని, లేకుంటే 200 రూపాయల ఫైన్ కట్టాలని కోరింది. ఈక్రమంలో వీరిద్దరి మధ్య కొద్దిసేపు వాదన సాగింది. నన్నే ఆపుతావా అని ఆగ్రహించిన మహిళా.. సదరు కార్మికురాలిపై చేయి చేసుకుంది. దీంతో మహిళను వెళ్లనివ్వకుండా గట్టిగా పట్టుకోడంతో బీఎంసీ కార్మికురాలిపై మహిళా తన ప్రతాపం చూపించింది. ఆటోలో నుంచి బయటకు దిగి వర్కర్పై దాడి చేసింది. ‘నన్ను ఆపడానికి నీకు ఎంత ధైర్యం, నన్నే ముట్టుకుంటావా అంటూ మహిళపై పిడిగుద్దులు గుద్దుతూ, కాలితో ఇష్టం వచ్చినట్లు తన్నింది. ఈ దృశ్యాలన్నింటిని ఓ వ్యక్తి తన మోబైల్లో వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా ముంబైలోని చార్కోప్ పోలీసులు చార్కోప్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారని బీఎంసీ పర్యవేక్షకుడు ప్రశాంత్ కాంబ్లే తెలిపారు. కాగా రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 25,681 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక కేసులు నమోదవ్వడం. గురువారం కూడా 25,853 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే మరోసారి రాష్ట్రంలో కఠినమైన లాక్డౌన్ విధిస్తామని సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి వైరస్ కట్టడికి సహకరించాలని కోరారు. థియేటర్లలు, ఆడిటోరియాలు, ప్రైవేటు కార్యాలయాలలు ఇక నుంచి 50 శాతం సామర్థ్యంతో కొనసాగించాలని ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా మార్చి 31 వరకు కొనసాగుతాయిన పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సిన్ అందరికీ అక్కర్లేదు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ -
నన్ను ఆపడానికి నీకు ఎంత ధైర్యం
-
ఆకట్టుకుంటున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి మాస్క్ డిజైన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నుంచి రక్షణ కోసం మాస్కులు వాడుతుంటాం. అయితే చాలా మంది విభిన్నమైన మాస్కులు ధరిస్తుంటారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలు కూడా మాస్కులు ధరించి వచ్చారు. అయితే మాజీ ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి రూపొందించిన ప్రత్యేకమైన మాస్కు గురించి సోమవారం సభలో చర్చనీయాంశమైంది. సోమవారం రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు నరేంద్ర జాదవ్ వినూత్నమైన మాస్క్ ధరించి సభకు వచ్చారు. అందరి దృష్టి ఆయన మాస్కుపైనే పడింది. మాస్కు గురించి అందరూ ఆరా తీశారు. దీంతో తన మిత్రుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తనకు ఈ మాస్కును బహుమతిగా ఇచ్చారని నరేంద్ర జాదవ్ తెలిపారు. 99.97% సామర్థ్యం కలిగిన హై ఎఫీషియెన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ (హెపా) మాస్క్ను సానుకూల పీడనం ఆధారంగా కొండా విశ్వేశ్వర్రెడ్డి రూపొందించారు. కరోనా సమయంలో మాస్కులతో పాటు, ఇంట్లోనే శానిటైజర్ తయారు చేసుకోవడం, కరోనా పేషంట్లకు ప్రత్యేక వెంటిలేటర్ ప్రిసెషన్ ఎయిర్ పంప్ (పీఏపీ)ను ఇంజనీర్ అయిన కొండా విశ్వేశ్వర్రెడ్డి తయారు చేసిన విషయం తెలిసిందే. -
కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం
కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం కురిసింది. కరోనా మహమ్మారి కారణంగా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థ చితికిపోతే, కరోనా పుట్టిలైన చైనాలో మాత్రం కాసుల వర్షం కురవడం విశేషం. చైనా ఎగుమతులలో వృద్ధి రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా అత్యధిక స్థాయికి చేరుకుంది. అదే సమయంలో దిగుమతులు కూడా పెరిగినట్లు ఆ దేశం కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. కరోనా కాలంలో మాస్క్ల వంటి వ్యక్తిగత రక్షణ సామగ్రి, ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఎలక్ట్రానిక్స్కు భారీ డిమాండ్ ఏర్పడింది. దింతో చైనా ఎగుమతులు భారీగా పెరిగాయి. జనవరి-ఫిబ్రవరి కాలంలో ఎగుమతులు సంవత్సరానికి 60.6శాతం పెరిగితే, అలాగే విశ్లేషకుల అంచనాలకు మించి దిగుమతులు 22.2 శాతం పెరిగాయి. దీనికి సంబందించిన అధికారిక సమాచారం చైనా విడుదల చేసింది. తాజా కస్టమ్స్ గణాంకాలు గత ఏడాది ఇదే సమయంలో చైనా ఎగుమతులు 17 శాతం తగ్గిపోగా, దిగుమతులు 4 శాతం పడిపోవడం గమనార్హం. కరోనా కాలంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 54.1 శాతం, టెక్స్టైల్స్ ఎగుమతులు 50.2 శాతం మేర పెరిగినట్లు తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే, చైనా మొత్తం వాణిజ్య మిగులు 103.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. చదవండి: రూ.1.97లక్షల కోట్ల ఎలాన్ మస్క్ సంపద ఆవిరి కరోనాతో ప్రజలకు రూ.13లక్షల కోట్ల నష్టం -
ఇదేందయ్యా ఇది.. ఇది నేను చూడలా!
ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్ పోలీసులు ప్రస్తుతం ట్విటర్లో తీవ్ర ట్రోలింగ్కు గురవుతున్నారు. ఇందుకు ఓ నిందితుడితోపాటు అతన్ని పట్టుకున్న పోలీసు ఉన్న ఫోటోకు ఫోటోషాప్ ద్వారా ముఖానికి మాస్కు ధరించినట్లు మార్పింగ్ చేయటమే కారణం. వివరాల్లోకి వెళితే.. భూ వివాద గొడవలో సొంత సోదరుడిని హతమార్చినందుకు గోరఖ్పూర్ జిల్లా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ నిందితుడిని పట్టుకున్న ఓ ఫోటోను తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరికి కూడా మాస్క్ లేదు. ఇది గుర్తించిన నెటిజన్లు కరోనా ప్రోటోకాల్ను పోలీసులు పాటించడం లేదని విమర్శలు గుప్పించారు. దీంతో ఈ పోస్టును పోలీసులు వెంటనే తొలగించారు. చదవండి: ‘నేను ఎవరికీ ఇష్టం లేదు.. బతకాలని లేదు’ తరువాత ఇదే ఫోటోను ఫోటోషాప్లో ఎడిట్ చేసి రీ పోస్టు చేశారు. ఇందులో అరెస్టు అయిన నిందితునితో పాటు పోలీసు ముఖానికి మాస్కు ధరించినట్లు ఫోటోను మార్ఫింగ్ చేశారు. దీనిని మళ్లీ ట్విటర్లో పోస్టు చేశారు. అయితే అంతకుముందు షేర్ చేసిన ఫొటోను, ఈ ఫొటోను చూసిన నెటిజన్లు పోలీసులను పదే పదే ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘డిజిటల్ మాస్క్@ గోరఖ్పూర్ పోలీసులు, మీలాగా డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’ అంటూ చురకలంటించారు. ఇట్లాంటి జిమ్మిక్కులు ఎప్పుడూ చూడలేని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తప్పిదాన్ని గ్రహించిన పోలీసులు ఆ ఫొటోను వెంటనే తొలగించారు. అయితే అప్పటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. Before After pic.twitter.com/p26Z2hIbfn — Piyush Rai (@Benarasiyaa) January 10, 2021 Nobody promotes Digital India like @gorakhpurpolice pic.twitter.com/7ExsHTb3J0 — Joy (@Joydas) January 10, 2021 -
ఈ మాస్క్ వెరీ స్పెషల్..ధర 69వేలకు పైనే..
కరోనా వైరస్ కారణంగా మార్కెట్లో రకరకాలైన ఫేస్ మాస్కులు లభ్యమవుతున్నాయి. అయితే జపాన్కు చెందిన ఓ దుకాణంలో మాత్రం వీటిని మరింత స్పెషల్గా డిజైన్ చేశారు. వీటితో మన ఫేస్ని కంప్లీట్గా కవర్చేస్తూ ఇతరుల పోలికలు ఉన్న మాస్క్ని ధరించవచ్చు. దీంతో మాస్క్ వెనకుంది ఎవరున్నారో కూడా గుర్తేపట్టనంతగా వీటిని తీర్చిదిద్దారు. అచ్చం మనిషి పోలికలతో ఎంతో రియలిస్టిక్గా రూపొందించిన ఈ ఫేస్ మాస్క్ అమ్మకాలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం అవుతాయని దుకాణపు యజమాని షుహీ ఓకావారా తెలిపారు. వెనిస్లోని ఈ షాపుకు సాధారణంగానే కస్టమర్లు క్యూ కడుతుంటారు. వివిధ రకాల పార్టీలు, నాటక ప్రదర్శనల్లోనూ వీరి ఉత్పత్తులు స్థానికంగా బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు అదే ఉత్సాహంతో అక్టోబరులో ఈ కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 3డి ప్రింటింగ్ ఉన్న ఈ ఫేస్మాస్కులకు గిరాకీ బాగానే ఉందని, భవిష్యత్తులో మరింత పుంజుకుంటుదని ఓకావారా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 100కు పైగానే ఆర్డర్లు వచ్చాయని, విదేశాల నుంచి కూడా వీటికి గిరాకీ ఉందని తెలిపారు. ఒక్కో మాస్క్ ధర దాదాపు 98,000 యెన్లకు (రూ .69,832) ఉండనుంది. అయితే ఇవి సాధారణ ఫేస్ మాస్కుల వలె వైరస్ నుంచి రక్షించలేవు. కానీ మనకు నచ్చిన ముఖాన్ని ధరించే సౌలభ్యాన్ని మాత్రం పొందవచ్చు. మాస్క్ వెనక ఎంకెవరైనా ఉన్నారన్న సందేహం కూడా కలగకుండకుండా వీటిని డిజైన్ చేశారు. -
ఒకే రోజు 12 వేల మందికి జరిమానా
సాక్షి, ముంబై: కరోనా వైరస్ను నియంత్రించేందుకు బీఎంసీ సిబ్బంది చాలా హుషారుగా పని చేస్తున్నారు. ఒకే రోజు మాస్క్ ధరించని 12 వేలకుపైగా మందిని పట్టుకుని రూ.24 లక్షలు జరిమాన వసూలు చేశారు. ఇలా బీఎంసీ సిబ్బంది ఇప్పటి వరకు దాదాపు 68 లక్షల మంది నుంచి రూ.14 కోట్లకుపైనే జరిమాన వసూలు చేయడంతో బీఎంసీ ఖజానాలోకి భారీగా అదనపు ఆదాయం వచ్చి చేరింది. కరోనా తీవ్రత రోజురోజుకు తగ్గుముఖం పట్టడం కొంత ఊరటనిచ్చే విషయమే. కానీ, మాస్క్ ధరించకుండా పట్టుబడుతున్న కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో బీఎంసీకి చెందిన ఆరోగ్య శాఖ ఆందోళనలో పడిపోయింది. 20 వేలకు తగ్గొద్దని.. కరోనా వైరస్ను నియంత్రణలో ఉంచాలంటే జనాలు మాస్క్ ధరించడం తప్పని సరిచేశారు. కొందరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. పట్టుబడితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇలాంటి వారికి ముకుతాడు వేసేందుకు బీఎంసీ ఆరోగ్య సిబ్బందితోపాటు క్లీన్ అప్ మార్షల్స్, అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్లు దాడులు చేస్తున్నారు. ప్రతీరోజు 20–24 వేల మందిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల బీఎంసీ కమిషనర్ ఇక్బాల్సింగ్ చహల్ ఆంక్షలు విధించారు. ఆ మేరకు దాడులు మరింత ఉధృతం చేశారు. రోజు ఐదారు వేల మందిని పట్టుకుని జరిమానా విధించేవారు. కానీ, మంగళవారం రోజంతా దాదర్, మాటుంగా, సైన్, అంధేరీ, గోరేగావ్, మలాడ్ తదితర రద్దీ ఉండే ప్రాంతాల్లో తిరిగి మాస్్కలు ధరించని 12 వేలకుపైగా జనాలకు జరిమానా విధించారు. ఒకేరోజు ఇలా భారీ సంఖ్యలో జనాకు జరిమానా విధించడం ఇదే ప్రథమమని బీఎంసీ తెలిపింది. ఇదిలాఉండగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 68,38,060 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి రూ.14,04,06,200 జరిమాన వసూలు చేసినట్లు బీఎంసీ వర్గాలు తెలిపాయి. -
కరోనా కట్టడిలో మాస్కు డిజైన్ కూడా కీలకమే!
సింగపూర్: కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగించే మాస్క్ తయారీలో వాడే పదార్థాలు, దాని రూపకల్పన, పొడవు తదితర అంశాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. ‘‘ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్’’ పేరిట ప్రచురితమైన జర్నల్లో వైద్య నిపుణులు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఫేస్ మాస్క్లు, వాటి ఉపయోగం గురించి చేసిన పరిశోధనల ఆధారంగా.. మాస్క్ డిజైన్లలో కూడా పలు సమస్యలు ఉన్నాయని, వాటిలో మార్పు చేయగలిగితే సత్ఫలితాలు పొందవచ్చని గ్రహించినట్లు పేర్కొన్నారు. ఫేస్ మాస్క్లు వైరస్ను ఫిల్టర్ చేయడం, దాన్ని నిరోధించే విధానం గురించి అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఈ బృందంలో భారతీయ సంతతికి చెందిన ఒక శాస్త్రవేత్త కూడా ఉన్నారు. "వైద్య సిబ్బంది ఉపయోగించే(శస్త్ర చికిత్స సమయంలో) సర్జికల్ మాస్కుల వినియోగం సమర్థవంతంగా కరోనా వ్యాప్తిని అరికట్టగలదు. సాధారణ ప్రజలు కూడా వీటిని విరివిగా ఉపయోగించాలి. కనీసం 70 శాతం మంది ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి మాస్క్లను ఉపయోగిస్తే మహమ్మారిని నిర్మూలించవచ్చు. అంతేకాదు.. సాధారణ వస్త్రాలతో తయారు చేసిన మాస్కులను తరచుగా ధరించడం ద్వారా కూడా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చు’’ అని సింగపూర్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య నిపుణుడు సంజయ్ కుమార్ అన్నారు. వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మినపుడు లేదా దగ్గినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరలు మనపై పడకుండా మాస్కు అడ్డుకుంటుంది. అంతేకాదు గాలిలోని అనేకానేక సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆపేస్తుంది. ఇక 5 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న తుంపరలు ఒక్కోసారి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఏరోసోలైజ్ అయి, ఎక్కువసేపు గాలిలోనే ఉండటం వల్ల వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం వస్త్రంతో తయారు చేసిన మాస్కులతో పాటు సర్జికల్, ఎన్95 మాస్కులను ప్రజలు విరివిగా ఉపయోగిస్తన్న విషయం తెలిసిందే. కాగా ఎన్95 మాస్కులు మాత్రమే ఏరోసోల్ పరిమాణ బిందువులను ఫిల్టర్ చేయగలవు. హైబ్రిడ్ పాలిమర్ పదార్థాలతో తయారు చేసిన ఫేస్ మాస్క్లు అధిక సామర్థ్యంతో కణాలను ఫిల్టర్ చేయగలవని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ప్రత్యేక మాస్క్లలో ఉపయోగించే ఫైబర్స్ పరారుణ వికిరణానికి పారదర్శకంగా ఉంటాయి. మాస్క్ కింద నుంచి వేడి తప్పించి ముఖాన్ని చల్లబరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. "శ్వాస నిరోధకత, ఫేస్ మాస్క్ ప్రవాహ నిరోధకత మధ్య కొంత సంబంధం ఉండవచ్చు. ఇది ఫేస్ మాస్క్ ధరించిన విరామం కోసం అధ్యయనం చేయవలసి ఉంటుంది" అని రచయిత హియో ప్యూహ్ లీ చెప్పారు. -
మాస్కులు పెట్టుకోవాలా, వద్దా?
కోపెన్హాగన్ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ఇంతవరకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రాకపోవడంతో దాని దాడి నుంచి తప్పించుకునేందుకు మాస్కులు ధరించడమే మంచి మార్గమని వైద్య నిపుణులు మొదటి నుంచి చెబుతున్న విషయం తెల్సిందే. కంటికి కనిపించని కరోనా వైరస్ను ఆపడం మాస్కుల తరం కాదంటూ, మాస్కులు ధరించడం వల్ల సరిగ్గా శ్వాస పీల్చుకోలేక ఊపిరి తిత్తులు దెబ్బతినే ప్రమాదం కూడా పొంచి ఉందని మరో పక్క ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంతకు మాస్కులు ధరించడం ఉత్తమమా, ధరించక పోవడం ఉత్తమమా!? అన్న సందేహం ఎంతో మందిలో నాటుకున్న విషయం తెల్సిందే. ఇదే విషయమై మరింత స్పష్టత కోసం కోపెన్హాగన్ యూనివర్శిటీ ఆస్పత్రి పరిశోధకులు తాజాగా ఆరువేల మంది డానిష్ ప్రజలపై ప్రయోగం చేశారు. వారిని మూడు వేల మంది చొప్పున రెండు బృందాలుగా విభజించి ఓ బృందానికి సురక్షితం అని భావిస్తోన్న ఎన్ 95 మాస్కులు ఇచ్చి, మరో బృందానికి మాస్కులు లేకుండానే నెల రోజులపాటు జనంలో తిరగాల్సిందిగా కోరింది. ముందు జాగ్రత్తగా ప్రయోగానికి ఎలాంటి ఇతర అనారోగ్య సమస్యలను లేనివారినే ఎంపిక చేసుకొంది. (గుడ్న్యూస్: క్రిస్మస్కు ముందే కరోనా వ్యాక్సిన్) నెల రోజుల తర్వాత రెండు బృందాలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, మాస్కులు ధరించిన వారిలో 1.8 శాతం మందికి, ధరించని వారిలో 2.1 శాతం మందికి కరోనా ఉన్నట్లు బయటపడింది. రెండు బృందాల మధ్య ఈ తేడా అతి స్వల్పమని, మాస్కులు ధరించిన వారిలో ఒక శాతానికి మించకుండా కరోనా వచ్చి ఉంటే అది ప్రయోజనంగా కనిపించేదని పరిశోధకులు తేల్చారు. రెండు బృందాల మధ్య స్వల్ప తేడా రావడానికి కూడా మాస్కులే కారణమని భావించినా వాటి ప్రయోజనం అతి స్వల్పమేనని పరిశోధకులు పేర్కొన్నారు. మాస్కులు ధరించడం వల్ల వారికి ప్రయోజనం లేకున్నా చుట్టుపక్కలున్న ఇతరులకు ఎంతో ప్రయోజనకరమని, కరోనా వచ్చిన వాళ్లు తప్పకుండా మాస్కులు ధరించాల్సిందేనని సీడీసీ మాజీ డైరెక్టర్ డాక్టర్ థామస్ ఫ్రీడెన్ తెలిపారు. ఈ విషయం ఇంతకుముందు నిర్వహించిన పరిశోధనల్లో కూడా తేలిందని ఆయన చెప్పారు. చుట్టుపక్కల మసలే కరోనా రోగుల నుంచి వైరస్ సోకకుండా ఉండాలంటే సీడీసీ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసిన మరుసటి రోజే ఈ తాజా అధ్యయనం ఫలితాలు వెలుగులోకి రావడం గమనార్హం. చదవండి: మాస్కు ధరించకుంటే రూ.2 వేలు ఫైన్! -
మాస్కు ఉంటేనే ఓటు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లే సిబ్బందికి, బ్యాలెట్ పేపర్లను ఒక దగ్గరకు చేర్చే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథికి సమగ్ర మార్గదర్శకాలను అందజేశారు. ఆ ప్రకారం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొనే వారందరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. లేకుంటే పోలింగ్ స్టేషన్లలోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ‘నో మాస్క్ నో ఎంట్రీ’అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ‘భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది తమ కార్యకలాపాలను పెద్ద పెద్ద హాళ్లలో నిర్వహించుకోవాలి. పోలింగ్, భద్రతా సిబ్బంది కిక్కిరిసినట్లు వెళ్లకుండా తగినన్ని వాహనాలను సమకూర్చుకోవాలి. ఎన్నికల సిబ్బంది అంతా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల’ని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆరడుగుల దూరం పోలింగ్స్టేషన్కు వచ్చే ఓటర్ల మధ్య ఆరడుగుల దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సందర్భంగా కోవిడ్ జాగ్రత్తలను పర్యవేక్షించేందుకు వార్డు స్థాయి వరకు నోడల్ హెల్త్ ఆఫీసర్లను నియమించాలి. పోలింగ్ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే, తక్షణమే వారి స్థానంలో రిజర్వుడు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి. అభ్యర్థులు తమ రోజువారీ ఎన్నికల ఖర్చులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. నామినేషన్ సమర్పించడానికి అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే అనుమతి ఇస్తారు. రెండు వాహనాలకే అనుమతి. మరికొన్ని మార్గదర్శకాలు... - ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. - పోలింగ్స్టేషన్ను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి కేటాయించాలి. - ఓటర్ల మధ్య ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించేలా వలయాలు గీయాలి. వాటిల్లో ఓటర్లు నిలబడేలా పర్యవేక్షించాలి. - స్త్రీ, పురుషులు, వికలాంగులు/ సీనియర్ సిటిజన్లకు... మూడు క్యూలు ప్రత్యేకంగా ఉండాలి. - అవకాశముంటే సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు క్యూలలో నిలబడకుండా నేరుగా పోలింగ్స్టేషన్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వాలి. - భౌతికదూరాన్ని పర్యవేక్షించేందుకు వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవాలి. - కోవిడ్ అవగాహనకు పోస్టర్లు ప్రదర్శించాలి. - సిబ్బంది, ఏజెంట్ల కోసం పోలింగ్స్టేషన్లలో భౌతికదూరం పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలి. - మాస్క్ లేకుండా ఓటర్లను పోలింగ్స్టేషన్లలోకి అనుమతించరు. అయితే ఓటరును గుర్తించేందుకు ఒకసారి మాస్క్ను తొలగించి వెంటనే పెట్టుకోవచ్చు. - ప్రతి పోలింగ్ అధికారి ముందు ఒక ఓటరు మాత్రమే నిలబడటానికి అనుమతిస్తారు. - పోలింగ్ అధికారులకు, భద్రతా సిబ్బందికి మాస్క్లు, శానిటైజర్లు, ఫేస్షీల్డ్లు ఇస్తారు. - ఇంటింటి ప్రచారానికి అభ్యర్థితో కలిపి ఐదుగురు వెళ్లొచ్చు. - రోడ్షోలలో వాహనాల మధ్య 100 మీటర్ల దూరం పాటించాలి. - ఒకేమార్గంలో రెండు వేర్వేరు రాజకీయ పార్టీ రోడ్ షోలు ఉంటే, వాటి మధ్య కనీసం అరగంట తేడా ఉండాలి. - కరోనా ప్రొటోకాల్ ప్రకారం బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చు. పర్యవేక్షించడానికి హెల్త్ రెగ్యులేటర్లను నియమించాలి. -
మాస్క్లు ధరించి ఉంటే లక్ష మరణాలు తగ్గేవి
వాషింగ్టన్ : కరోనా ఆరోగ్య నియమాలను పాటించకుండా, మాస్కులు ధరించవద్దని ప్రదర్శనలు నిర్వహిస్తోన్న నిరసనకారులను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ తప్పు పట్టారు. మాస్క్ ధరించని వారిని నగ్నంగా తిరిగేవారితో పోల్చి జోక్ చేశారు. అమెరికాలో మాస్క్లు ధరించడాన్ని రాజకీయ చేయడంపై ఇంటర్నెట్ ద్వారా ప్రసారం అయిన ఓ కార్యక్రమంలో కమేడియన్, సినీతార రషీదా జోన్స్తో కలిసి బిల్గేట్స్ మాట్లాడారు. ప్యాంట్లు ధరించమని చెబితే కొద్ది మంది అమెరికన్లు అదేదో ఘోర తప్పిదంగా చూస్తున్నారని ఆయన అన్నారు. మొదట్లో కోవిడ్ని ఆరోగ్య నిపుణులు సాధారణ ఫ్లూ, జ్వరంతో పోల్చారని, అయితే తర్వాత ఇదొక తీవ్ర వైరస్గా మారిందని ఆయన వీక్షకులకు వివరించారు. సాధారణ జలుబుతో బాధపడే వ్యక్తులు మాస్కు లేకుండా ఇంట్లో ఇతరులతో కలిసి ఉండవచ్చని, అయితే కోవిడ్ సోకిన వారు అలా చేయడానికి వీల్లేదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఉంటే కనుక లక్ష మరణాలను నివరించగలిగేవారమని, వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ పరిశోధనలో తేలిందని బిల్ గేట్స్ గుర్తుచేశారు. వ్యాక్సిన్ అభివృద్ధికి బిల్ గేట్స్ కోట్లాది రూపాయలను విరాళంగా ఇచ్చారు. -
‘మాస్కు’లతో మరో ప్రమాదం
లండన్ : ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ భయాందోళనలకు గురిచేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు నేడు ప్రజలందరికి మాస్కులు తప్పనిసరి అయిన విషయం తెల్సిందే. ఈ మాస్కులు మరో విధంగా మనకు ముప్పును తీసుకొస్తున్నాయి. ఉతికి ఆరేసుకునే గుడ్డ మాస్కులు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఏ రోజుకు ఆ రోజు వాడి పారేసే ప్లాస్టిక్తో కూడిన మాస్కులనే ఉపయోగిస్తున్నారు. ఒక్క బ్రిటన్లోనే పౌరులు ప్లాస్టిక్తో కూడిన మాస్కులు వాడుతూ ఏ రోజుకు ఆ రోజు వాటిని పారేస్తున్నారని భావిస్తే ఓ ఏడాదికి అంచనాల ప్రకారం 66 వేల టన్నుల కలుషిత వ్యర్థాలు, 57 వేల ప్లాస్టిక్ వ్యర్థాలు మహా కూడుతాయి. అంతేకాకుండా వైరస్ అంటుకున్న మాస్కుల వ్యర్థాల వల్ల మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ఆ వైరస్ మట్టిలోకి కూరుకు పోవడం, జల మార్గాల్లో, భూగర్భ జలాల్లో కలిసి పోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంటది. ప్లాస్టిక్ వాడ కూడదనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నా ప్లాస్టిక్ మాస్కులనే ఎక్కువగా వాడుతున్నారు. గ్లౌజులు కూడా ప్లాస్టిక్వే ఎక్కువగా వాడేవి. ప్రపంచవ్యాప్తంగా మాస్కులను ఎక్కువగా తయారు చేస్తోన్న దేశం ఇప్పటికీ చైనానే. గత ఫిబ్రవరి నెల నాటికి చైనా కంపెనీలు రోజుకు 11.60 కోట్ల యూనిట్ల మాస్కులను ఉత్పత్తి చేస్తూ వచ్చాయి. ఆ కంపెనీల రోజు వారి ఉత్పత్తి సామర్థ్యం ఇంకా పెరిగిందట. మాస్కుల్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. గుడ్డతో చేసినవి, సర్జికల్, ఎన్–95 మాస్కులు. గుడ్డతో చేసినవి మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చు. వీటికంటే ఎన్–95 మాస్కులు అత్యంత శ్రేయస్కరమైనవి. 95 శాతం ఇవి గాలిద్వారా వచ్చే వైరస్లను నియంత్రించగలవు. వీటిలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. క్లినికల్ మాస్కులు అంతంత మాత్రంగానే ఉపయోగపడతాయి. ఈ రెండు రకాల మాస్కులను ఏ రోజుకారోజు పారేయాల్సి ఉంటుంది. ఎన్–95 మాస్కుల స్ట్రాప్ను పోలిసొప్రేన్, స్టాపిల్స్ను స్టీల్తో, ముక్కు వద్ద పోలియురెథేన్, ముక్కు వద్ద క్లిప్ను అల్యూమినియం, ఫిల్టర్ను పోలిప్రొఫిలిన్లతో తయారు చేస్తారు. ముక్కు, మూతి పూర్తిగా మూసుకుపోయే మాస్కులను వాడితే తప్పా గుడ్డ మాస్కుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ ప్లాస్టిక్ మాస్కుల వల్ల పలు విధాల ప్రమాదం పొంచి ఉంది. రోజువారిగా ఉపయోగించే మాస్కులను మట్టిలో కలిసిపోయే పదార్థాలతోనే తయారు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: వ్యాక్సిన్ ముందుగా ఎవరెవరికి..) -
అందరూ చస్తారు: ప్రయాణికురాలి హల్చల్
లండన్: కరోనా కాలంలో మాస్కు ధరించడం తప్పనిసరిగా మారింది. పొరపాటున మాస్కు లేకుండా బస్సెక్కామనుకోండి. ఎన్నడూ చూడని కళ్లు మనల్ని శత్రవులా కన్నెర్ర చేసి చూస్తాయి. దీంతో ముఖాన్ని కవర్ చేసుకోలేక పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇక్కడో మహిళ మాత్రం మాస్కు లేకుండానే విమానమెక్కేసింది. అంతేనా.. కావాలని గట్టిగా అరుస్తూ దగ్గుతూ అందరూ చస్తారు అంటూ శాపనార్థాలు పెట్టింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ నుంచి స్కాట్లాండ్లోని ఈడిన్బర్గ్ వెళ్లడానికి సిద్ధమైన ఈజీజెట్ విమానంలో చోటు చేసుకుంది. ఎగరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఓ మహిళ మాస్కు లేకుండానే ఎక్కగా సిబ్బంది ఆమెను దిగిపోవాలని సూచించినట్లున్నారు. దీంతో కోపం నషాళానికంటిన సదరు మహిళ తోటి ప్రయాణికులపై తన ప్రతాపాన్ని చూపించింది. వాళ్ల ముఖాల్లోకి తొంగి చూస్తూ కావాలని దగ్గింది. (చదవండి: నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన వీడియో) "అందరూ చస్తారు, అది కరోనానే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రతిఒక్కరూ చచ్చిపోతారు. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది" అని పదే పదే అరిచింది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆమెను విమానం దిగిపోవాలని సూచించగా మళ్లీ మళ్లీ అదే శాపనార్థాలు పెడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'ఎంతో కష్టపడి టికెట్ రిజర్వేషన్ చేయించుకుని, విమానాశ్రయంలో చాలాసేపు పడిగాపులు కాసి, తర్వాత లైనులో నిలబడి, లగేజ్ అంతా ఎక్కించేసి, చివరాఖరకు లోపలకు వెళ్లి కూర్చుంటే కేవలం మాస్కు లేదన్న కారణంతో ఆమెను గెంటేస్తారా?' అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వాళ్లను కేవలం విమానంలో నుంచి వెళ్లగొడితే సరిపోదు, అరెస్టు చేయాలని కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: సెకన్లలో ప్లేట్ ఖాళీ.. రికార్డుకెక్కింది..) A rare, Shakespearean tragedy Karen, coughing and yelling “everybody dies!” pic.twitter.com/uICdy0z2QJ — Sarah Cooper (@sarahcpr) October 19, 2020 -
కోవిడ్-19: ఆ మాస్కులే ఉత్తమం!
వాషింగ్టన్: మహమ్మారి కరోనా కాలంలో ఫేస్మాస్కుల వినియోగం భారీగా పెరిగిపోయింది. కోవిడ్-19 బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు దాదాపు ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరిస్తున్నారు. కొంతమంది సర్జికల్, రిస్పిరేటర్ మాస్కులు ధరిస్తుంటే, చాలా మంది ప్రజలు ఇంట్లో అందుబాటులో ఉన్న వస్త్రంతో మాస్కు తయారు చేసుకుంటున్నారు. దీంతో క్లాత్ ఫేస్ కవరింగ్ మాస్కులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే ఇలాంటి మాస్కులు సురక్షితమేనా? వైరస్ కణాలను అడ్డుకోవడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయా? లేదా అన్న సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్కుల కంటే ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులే(సింగిల్ లేయర్వి అయినా సరే) ఉత్తమమైనవని పేర్కొన్నారు. (చదవండి: ‘కోవిడ్’ పెరుగుతున్నా మరణాలు ఎందుకు తక్కువ!) అదే విధంగా అవతలి వ్యక్తి దగ్గినపుడు, లేదా తుమ్మినపుడు వెలువడే నీటి తుంపరలు మనల్ని చేరకుండా ఆపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. సాధారణ వస్త్రం (ఉదా: టీషర్టు క్లాత్)తో తయారు చేసిన మాస్కులు మెడికల్ మాస్కుల కంటే ఏమాత్రం తీసిపోవని, పైగా గాలి పీల్చుకోవడంతో పాటు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు జర్నల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ మెకానిక్స్ లెటర్స్ అధ్యయనంలో తమ పరిశోధనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నావల్ కరోనా వైరస్ కణాల పరిమాణంలో ఉన్న కణాలతో కూడిన డిస్టిల్డ్ వాటర్ను ఇన్హెల్లర్లో నింపి, ఓ ప్లాస్టిక్ పాత్రలో దానిని అధిక ద్రవ్యరాశి గల తుంపరల రూపంలో వాటిని వదిలిపెట్టారు. వివిధ రకాల మెటీరియళ్లతో వాటిని వడకట్టి, వేటికైతే కణాలను ఆపగల శక్తి ఎక్కువగా ఉందో పరిశీలించారు. (చదవండి: ఫేస్మాస్క్ల గురించి మనకు ఏం తెలుసు?) ఈ విషయం గురించి అధ్యయనకర్త తాహిర్ సైఫ్ మాట్లాడుతూ.. ‘‘పాత్రలో పడుతున్న ప్రతీ నానో- పార్టికల్ను అత్యాధునిక మైక్రోస్కోపు ద్వారా పరిశీలించాం. వాటిని లెక్కించాం. వివిధ రకాల ఫ్యాబ్రిక్లను అడ్డుపెట్టి లేదా నేరుగా నీటి తుంపరలను వదిలి, ఏ ఫ్యాబ్రిక్ ఎంతమేర కణాలను బ్లాక్ చేయగలిగిందో పరిశీలించినపుడు సాధారణంగా ఇంట్లో ఉపయోగించే వస్త్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. నిజానికి శ్వాస పీల్చుకోకుండా అసౌకర్యాన్ని కలిగించే మాస్కుల వల్ల ఊపిరాడటం కష్టమవడమే గాకుండా, వైరస్ కణాలు కూడా లీకయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటి మాస్కులు ధరించినా ఉపయోగం ఉండదు కదా. నిజానికి మెడికల్ మస్కులు అందరికీ అందుబాటులో లేకపోయిన్పటికీ ఇంట్లో వాడే కామన్ ఫ్యాబ్రిక్లతో కూడా వైరస్ బారిన పడకుండా రక్షించుకునే అవకాశం ఉంటుందని నిరూపించడమే మా ఉద్దేశం. ఈ ప్రయోగంలో మేం మొత్తం 11 రకాల వస్త్రాల(బెడ్షీట్లు, కర్చిఫ్లు వంటివి)ను పరిశీలించాం. ఇందులో కొత్తవాటితో పాటుగా వాడినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అత్యంత వేగంతో ప్రయాణించే 100 నానోమీటర్ పార్టికల్స్ను కూడా సమర్థవంతంగా అడ్డుకోగలవని నిరూపితమైంది. ఇలాంటివి సింగిల్ లేయర్ మాస్కులైనా సరే ఎదుటి వ్యక్తి మాట్లాడినపుడు, తుమ్మినపుడు లేదా దగ్గినపుడు మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు’’ అని చెప్పుకొచ్చారు. -
ఎల్జీ ఎయిర్ ప్యూరిఫైర్ ఫేస్మాస్క్
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అయ్యింది. ముఖానికి మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే పోలీసులు జరిమానా కూడా విధిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. ఎల్జీ పూర్యరీకేర్ వేరబుల్ ప్యూరిఫైర్ ఫేస్ మాస్కును తయారు చేసినట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇప్పుడున్న మాస్కుల కన్నా మరింత ఎక్కువగా వడపోత ప్రక్రియ చేపడుతుందని ఎల్జీ కంపెనీ పేర్కొంది. దీనిలో బ్యాటరీతో నడిచే రెండు ఫ్యాన్లుతోపాటు రెస్పిరేటరీ సెన్సార్ పరిశుభ్రమైన, తాజా గాలిని అందిస్తుంది. అలాగే వేర్వేరు స్థాయిల్లో వేగాన్ని సర్దుబాటు చేసుకునేలా, అందరికీ సరిపోయేలా రూపొందించారు. అయితే ముఖానికి ధరించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్ ధర వంటి వివరాలను మాత్రం సెప్టెంబరులో జరగనున్న ఐఎఫ్ఏ 2020లో వెల్లడించనున్నారు. ఎల్జీ ప్యూరీకేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైర్లో గాలిని శుద్ధి చేసేందుకు రెండు హెచ్13 హెచ్ఈపీఏ ఫిల్టర్లు ఉపయోగించారు. అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవచ్చు. ఇందులో అంతర్గతంగా రెండు ప్యాన్లను ఉపయోగించారు. ఇవి మూడు స్పీడ్ లెవల్స్ కలిగి ఉంటాయి. గాలి పీల్చుకునేటప్పుడు ఇవి వాటంతట అవే వేగం పుంజుకుని, వదిలేటప్పుడు నెమ్మదిస్తాయి. ఈ మాస్క్లో ఉపయోగించిన రెస్పిరేటరీ సెన్సార్ మాస్క్ ధరించిన వారి శ్వాస చక్రం, పరిమాణాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా ఫ్యాన్ల వేగాన్ని సర్దుబాటు చేస్తుంది. (మాస్క్ ధరించలేదని ఫోన్ లాక్కొని..) ఫేస్మాస్క్లో 820 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. మోడ్లో 8 గంటలు, హై మోడ్లో రెండు గంటలు పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరం కావడం వల్ల, దీనిని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మాస్కులో చిక్కుకున్న హానికరమైన సూక్ష్మక్రిములను చంపే సందర్భంలో అతినీలలోహిత కాంతి వస్తుంది. ఫిల్టర్లను మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గుర్తించి ఎల్జీ థింక్యూ యాప్ ద్వారా మనకు సంకేతాలను ఇస్తుంది. ఫేస్ మాస్క్లతో ప్రజలు కలిగి ఉన్న ఆందోళనలలో ఒకటి సౌకర్యం, రెండోది గాలి బయటకు రాకుండా సరిపోయేలా పూరీకేర్ను రూపొందించినట్లు ఎల్జీ పేర్కొంది. చివరికి ఎక్కువ గంటలు ధరించేంత సౌకర్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. -
డాక్టర్ కాపర్ నుంచి కాపర్ ఫిల్టర్డ్ మాస్క్
లక్డీకాపూల్: డాక్టర్ కాపర్ బ్రాండ్తో రాగి ఉత్పత్తులు తయారీలో ఉన్న ఎంఎస్ఆర్ ఇండియా తాజాగా కాపర్ పిల్టర్డ్ ఎన్–95 రీయూజెబుల్ మాస్క్తో పాటు పేటెండెడ్ కాపర్ కేర్ కీను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ మెష్ క్లాత్, మాయిశ్చర్ కంట్రోల్, యాంటీ బ్యాక్టీరియల్ ఫినిష్, కాపర్ ఫిల్టర్, ఎన్–95 ఫిల్టర్, కాపర్ క్లాత్ ఫిల్టర్తో ఐదు లేయర్లతో కూడిన మాస్క్ను రూపొందించినట్టు ఎంఎస్ఆర్ సీఈఒ డాక్టర్ ఎం.మల్లారెడ్డి తెలిపారు. ఎన్–95 మాస్క్ కంటే 90 శాతం మెరుగ్గా ఇది పని చేస్తుందన్నారు. వీటిని అందరికీ అందుబాటు ధరలో ఉంచాలనే ఉద్దేశంతో రూ. 199లకే అందిస్తున్నామని తెలిపారు. 2021 మార్చి నాటికి ఒక కోటి యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మల్లారెడ్డి వెల్లడించారు. -
మాస్కు.. మరిచితిరా!
రోజురోజుకూ కరోనా పంజా విసురుతుండటంతో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు తప్పని సరిగా వాడాలని హెచ్చరిస్తున్నా.. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు మాస్కులను నామమాత్రంగా ధరిస్తూ మెడలో వేసుకోగా.. మరికొందరు గొంతుకు వేలాడదీస్తున్నారు. చాలామంది అసలు మాస్కులే ధరించడం లేదు. (అనారోగ్యంతో హోంగార్డు మృతి..) -
మాస్క్ ధరించలేదని ఫోన్ లాక్కొని..
సిరిసిల్లక్రైం: కోడి గుడ్లకోసం ఇంటిపక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లిన యువకుడిపై మాస్క్ ధరించలేదని కోనరావుపేట ఎస్సై అనుచితంగా ప్రవర్తించాడని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వంగళ భాస్కర్ వాపోయాడు. ఎస్సై తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి గురువారం సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయానికి రాగా అత్యవసర ఫిర్యాదులు మాత్రమే పరిశీలిస్తున్నట్లు సిబ్బంది తెలపడంతో మీడియాకు గోడు వెల్లబోసుకున్నాడు. బాధితుడి వివరాల ప్రకారం.. ఈనెల 11వ తేదీన రాత్రి 9.30 ఇంటి సమీపంలోని కిరాణంలో కోడిగుడ్ల కోసం వెళ్లగా అటుగా పెట్రోలింగ్కు వచ్చిన ఎస్సై మాస్క్ ధరించలేదని కేసు నమోదు చేస్తానని బెదిరించి సెల్ఫోన్ తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మరుసటిరోజు ఠాణాకు వెళితే కోపోద్రిక్తుడైన ఎస్సై తిడుతూ..్ఙనేను నీ గురించి ఎంక్వైరీ చేశా. నీవు నీ భార్యను కొడతవటా..వెళ్లి నీ భార్యను తీసుకుని రాపో..నేను కౌన్సెలింగ్ చేశాక.. నీ ఫోన్ ఇస్తానని అన్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. మా భార్యాభర్తల విషయం మీకు అవసరం లేదని చెప్పినా వినకుండా నీ భార్యను తీసుకువస్తేనే ఫోన్ ఇస్తానని అన్నట్లు బాధితుడు వివరించాడు. రెండు గంటలపాటు ఠాణా ఆవరణలో నిలుచోబెట్టారని, ఇక మీద ఠాణా చుట్టూ నిన్ను తిప్పించుకుంటానని ఫోన్ ఇచ్చే సమయంలో అన్నట్లు తెలిపాడు. చిన్న తప్పిదానికి భయభ్రాంతులకు గురి చేసిన ఎస్సై నుంచి రక్షణ కల్పించాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరేందుకు వచ్చినట్లు బాధితుడు తెలిపారు. -
మాస్క్ ఎలా ధరించాలో చెప్పిన నటి
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో మన జీవనశైలిలోనూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఫేస్ మాస్క్ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రపరుచుకోవడం తప్పనిసరైంది. కొంతమంది మాస్క్ను సరిగ్గా ధరించడం లేదు. కొందరు ముక్కున కవర్ చేయకుండా, మరికొందరు మెడలో వేలాడదీస్తూ మాస్కులు ధరిస్తున్నారు. మాస్క్ సరైన విధానంలో ఎలా ధరించాలన్న దానిపై అవగాహన కల్పిస్తూ నటి మలైకా అరోరా పోస్ట్ చేసింది. (ఇలా చేయడం వల్ల వారంలో కోలుకున్నా: విశాల్) అందరికీ అర్థమయ్యేలా సులభంగా 3 పద్ధతుల్లో మాస్క్ ధరించి అందులో ఏది సరైన విధానమో సూచిస్తూ ఓ పోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లోనే 56 వేలకు పైగానే లైకులు వచ్చాయి. కరోనా మహమ్మారి ప్రారంభైనప్పటి నుంచి పలువురు సెలబ్రిటీలు సామాజిక బాధ్యతగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. నటి మలైకా సైతం పసుపు, ఆపిల్, అల్లం, వెనిగర్, పెప్పర్ని ఉపయోగించి తయారు చేసుకున్న కషాయం తీసుకుంటే మంచిదని చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. (సంక్రాంతి బరిలోకి బ్యాచ్లర్) View this post on Instagram Please wear a mask n wear it the correct way . Protect urself and others 🙏 @my_bmc A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on Jul 28, 2020 at 12:11am PDT -
మాస్కు ధరించనందుకు మహిళపై..
హాంకాంగ్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఓ మహిళపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. తమపై దాడి చేయడంతో ఆమెను అదుపు చేసేందుకు పెప్పర్ స్ప్రే చేసినట్లు వెల్లడించారు. ఉత్తర హాంకాంగ్లో జరిగిన ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక మీడియా కథనం ప్రకారం... మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఓ మహిళ షెంగ్ షూయి పట్టణంలోని సూపర్ మార్కెట్కు వచ్చారు. అయితే ఆమె మాస్కు ధరించకపోవడంతో సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు మహిళ వారితో వాగ్వాదానికి దిగింది. (హాంకాంగ్తో ఒప్పందం రద్దు.. అయితే) ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆమె తన తీరును మార్చుకోలేదు. అంతేగాక వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి. దీంతో ఆమెను అదుపు చేసేందుకు ముఖంపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. క్షతగాత్రుడైన పోలీస్ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో హాంకాంగ్లో మాస్కు ధరించాలనే నిబంధన తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇక జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు అక్కడ 2884 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 23 మంది కోవిడ్తో మృతి చెందారు. -
ట్రోలింగ్: యూపీ పోలీసుల బిత్తిరి చర్య
కాన్పూర్ : మాస్క్ ధరించలేదన్న కారణంతో పోలీసులు ఓ మేకను అరెస్ట్ చేసిన వింత ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని బెకన్గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రోడ్డుపై మేకను తీసుకెళ్తున్న దాని యజమానిని పోలీసులు అడ్డగించి.. మేకకు మాస్కు పెట్టలేదేంటని ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు బిత్తరపోయిన మేక యజమాని భయంతో మేకను అక్కడే వదిలేసి అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు దానిని స్టేషన్కు తరలించారు. కాసేపయ్యాక యజమాని వచ్చి మేక కనపించలేదు. దాంతో అతను పోలీస్స్టేషన్ వెళ్లక తప్పలేదు. మాస్కు లేకపోవడంతో మేకన అరెస్టు చేశామని పోలీసులు చెప్పడంతో అతను షాక్ తిన్నాడు. ఎలాగోలా పోలీసులు బతిమాలుకుని మేకను విడిపించుకున్నాడు. అయితే, మాస్క్ ధరించకపోతే మేకను అరెస్ట్ చేయడమేంటని పోలీసులన అడగ్గా.. వారు తమ చర్యను సమర్థించుకున్నారు. కుక్కలకు కూడా మాస్కులు పెడుతున్నప్పుడు మరి మేకలకు కూడా మాస్కులు ఎందుకు ఉండకూడదంటూ ఎదురు ప్రశ్నించారు. ఇంకెప్పుడూ మేకను రోడ్డుపైకి తీసుకురానని యజమాని పోలీసులకు తెలిపాడు. రోడ్డుపైకి రావాల్సి వచ్చినా మాస్కు పెడతానని చెప్పాడు. పోలీసుల బిత్తిరి చర్యపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. (గ్రామస్తుల త్యాగంతో పిచ్చుక, పిల్లలు క్షేమం) -
‘గాడిద సార్.. మాస్క్ ధరించదు’
ఓ వైపు దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడకం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాను కట్టడి చేయగలమని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కానీ మన జనాలు మాత్రం వీటిని చెవిన పెట్టడం లేదు. పని ఉన్నా లేకపోయినా రోడ్ల మీద తిరుగుతుంటారు. మాస్క్ ధరించారు. సామాజకి దూరం మాట దేవుడేరుగు. ఈ క్రమంలో కొందిరిలోనైనా మార్పు తీసుకురావడానికి ఓ జర్నలిస్ట్ వినూత్న ప్రయత్నం చేశాడు. మాస్క్ ధరించని మనుషులకు బుద్ధి చెప్పడం కోసం గాడిదను ఇంటర్వ్యూ చేశాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం. ప్రస్తుతం ఈ గాడిద ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజనులు సదరు జర్నలిస్ట్ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు.. (ఎఫ్బీ పోస్ట్; టిప్గా 32 వేల డాలర్లు!) ఈ వీడియోలో ఓ జర్నలిస్ట్ రోడ్డు మీద మాస్క్ లేకుండా తిరుగుతున్న జనాలకు బుద్ధి చెప్పాలని భావించాడు. ఈ క్రమంలో రోడ్డు మీద ఉన్న గాడిద మూతి దగ్గర మైక్ పెట్టి.. ‘మాస్క్ ధరించకుండా రోడ్డు మీదకు ఎందుకు వచ్చావు’ అని ప్రశ్నిస్తాడు. కానీ అది జంతువు కదా సమాధానం రాదు. దాంతో పక్కనే మాస్క్ ధరించకుండా వెళ్తోన్న ఓ మనిషిని ఆపి.. ‘మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చావేందుకు అని అడిగాను. కానీ సమాధానం చెప్పడం లేదు ఎందుకు’ అని అడుగుతాడు జర్నలిస్ట్. అందుకు ఆ వ్యక్తి ‘ఎందుకంటే అది గాడిద’ అంటాడు. వెంటనే జర్నలిస్ట్ ‘ఓహో గాడిద లాక్డౌన్ సమయంలో మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీద తిరుగుతుంది. అంతే కదా’ అంటాడు. జర్నలిస్ట్ తనను గాడిదతో పోల్చాడని అర్థం చేసుకుని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలానే మాస్క్ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్న మరి కొందరిని ప్రశ్నిస్తాడు. (చావు కబురు చల్లగా చెప్పాడు..) Best media interview of the Lockdown period 😎 pic.twitter.com/qbHGflcoBx — Arun Bothra (@arunbothra) July 21, 2020 ఈ వీడియోను అరుణ్ బోత్రా అనే ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది. ‘లాక్డౌన్ సమయంలో బెస్ట్ మీడియా ఇంటర్వ్యూ’ అనే క్యాపన్ష్తో షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోది. చాలా బాగా బుద్ధి చెప్పాడని నెటిజనులు సదరు జర్నలిస్ట్ను ప్రశంసిస్తున్నారు. -
మాస్కులందు ఈ మాస్క్ వేరయా!
కోల్కతా: మాస్కులందు ఎల్ఈడీ మాస్కులు వేరయా! అవును.. ఈ వార్త చదివితే బహుశా మీరు కూడా ఇదే అంటారు కాబోలు. మార్కెట్లో రకరకాల మాస్కులు చూశాం. కాటన్ నుంచి బంగారంతో తయారు చేసిన మాస్కులన్నింటి గురించి విన్నాం, చూశాం.. ఇప్పుడు లేటెస్ట్గా మరో వెరైటీ మాస్కు మార్కెట్లోకి దిగింది. అదే రంగురంగుల లైట్లను విరజిమ్ముతున్న "ఎల్ఈడీ మాస్క్". పశ్చిమ బెంగాల్కు చెందిన గౌర్ నాథ్ అనే వ్యక్తి దీన్ని తయారు చేశాడు. అయితే దీనివల్ల ఓ ప్రయోజనం ఉందంటున్నాడు. ఈ మాస్కు ధరించినవారిని చూస్తేనైనా నిర్లక్ష్యంగా వ్యవహరించే కొందరికి మాస్కు పెట్టుకోవాలన్న విషయం గుర్తుకు వస్తుందని చెప్పుకొచ్చాడు. ఆ విధంగా ఎల్ఈడీ మాస్కు ప్రజల్లో అవగాహనను పెంచుతుందంటున్నాడు. (ఒక్క రాముడేంటి, అన్ని గ్రహాలు నేపాల్వే..) దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాస్కు అందాన్ని దాచేస్తోందని బాధపడేవారికి ఈ మాస్కు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే ఎంతమందిలో ఉన్నా ఈ మాస్కు పెట్టుకుంటే మిమ్మల్ని ఇట్టే గుర్తించొచ్చు. మరోవైపు సూరత్లో ఓ వజ్రాల వ్యాపారి వజ్రాలు పొదిగిన మాస్కులను అమ్ముతున్న విషయం తెలిసిందే. మరికొందరు బంగారం మీద ఉన్న మోజుతో బంగారు మాస్కులు తయారు చేయించుకుని పెట్టుకుంటున్నారు. ఏదైతేనేం.. కరోనా రాకుండా కాపాడే మాస్కు ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది. (గోల్డ్మేన్.. మూతికి బంగారు మాస్కు) -
విరజిమ్ముతున్న "ఎల్ఈడీ మాస్క్"
-
వైరల్: రిపోర్టర్కు కరోనా పేషెంట్ ఝలక్
-
చావు కబురు చల్లగా చెప్పాడు..
ఇస్లామాబాద్ : జన సమూహం ఉన్నచోట పొరపాటున తుమ్మినా అందరూ మనవైపే అనుమానంతో కళ్లు పెద్దవి చేసి చూస్తారు. ఆస్పత్రికిగానీ వెళ్లామంటే పక్కా కరోనానే అని ఫిక్సయిపోయి పలకరింపు కాదు కదా.. దరిదాపుల్లో కూడా కనిపించరు. అలాంటిది కోవిడ్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? అది కూడా మాస్కు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా! ఇంకేముందీ.. పై ప్రాణం పైనే పోతుంది. ఇలాంటి షాకింగ్ ఘటన పాకిస్తాన్లోని పెషావర్లో జరిగింది. స్థానిక న్యూస్ ఛానల్ రిపోర్టర్ పెషావర్లో పెట్రోల్ సంక్షోభం గురించి క్షేత్ర స్థాయిలో వివరిస్తూ ఉన్నాడు. ముఖానికి మాస్కు ఉన్నప్పటికీ కర్మకాలి దాన్ని కిందికి లాగి నేరుగా మాట్లాడుతున్నాడు. "చాలా చోట్ల పెట్రోల్ దొరకడం లేదు. ఉన్న కొద్ది పెట్రోల్ బంకుల్లో బారెడంత క్యూ ఉంది" అని చెప్పుకొస్తున్నాడు. (ప్రేయసి కోసం పాకిస్తాన్కు..!) అనంతరం అక్కడున్న ఓ వ్యక్తికి మైక్ అందించి తాజా పరిస్థితి గురించి చెప్పమన్నాడు. వెంటనే అతను 'అవును, ఇక్కడ పెట్రోలే దొరకట్లేదు' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత 'నాకు కరోనా ఉంది. ఆస్పత్రికి వెళ్తున్నా' అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఒక్క క్షణం ఆ జర్నలిస్టు గుండె ఆగి పోయినట్లు అనిపించింది. పైగా సదరు కరోనా పేషెంట్ కూడా ఫేస్ మాస్కు ధరించకపోవడం ఇక్కడ మరింత విషాదం. ఈ వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓవైపు తన్నుకొస్తున్న నవ్వును ఆపుకుంటూనే నెటిజన్లు.. పాపం రిపోర్టర్ అంటూ సానుభూతి కురిపిస్తున్నారు. కొందరేమో నిర్లక్ష్య కరోనా పేషెంట్పై మండిపడుతున్నారు. (వైరల్: గర్ల్ఫ్రెండ్కు ప్రపోజ్ చేయడానికి వెళ్తూ..) -
గోల్డ్మేన్.. మూతికి బంగారు మాస్కు
భువనేశ్వర్/కటక్: ఈ ఫొటోలో వ్యక్తి ధరించింది బంగారు మాస్కు. 3 తులాల బంగారంతో దీనిని తయారు చేయించుకున్నాడు. ఆయన కటక్ జిల్లాలోని కేశర్పూర్ ప్రాంతానికి చెందిన ఫర్నిచర్ వ్యాపారి అలోక్ మహంతి. బంగారు ఆభరణాలంటే అలోక్ మహంతికి మక్కువ. ఆయన నిత్యం వినియోగించే ప్రతి హంగులో బంగారం ఎంతో కొంత ఉండాలనే కోరుకుంటాడు. గొలుసులు, ఉంగరాలు వంటి సాధారణ ఆభరణాలతో పాటు చేతి గడియారం, టోపీ వంటి నిత్య వినియోగ సామగ్రిలో ఏదో ఒక రీతిలో బంగారం హంగు అద్దుకుని నగరంలో గోల్డ్మేన్గా చలామణి అవుతున్నాడు. ముంబైలోని జావేరి బజారులో పేరొందిన బంగారు ఆభరణాల డిజైన్తో ముచ్చట పడి స్థానిక కంసాలితో ఈ మాస్కు తయారుచేయించుకున్నాడు. ఇది తయారు చేసేందుకు 3 వారాలు వ్యవధి పట్టిందని వివరించాడు. బంగారం పట్ల మక్కువ ఎంతో మానవ సేవ పట్ల ఆసక్తి కూడా అంతే. కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరంతరం ఏదో ఒక రీతిలో మానవ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాడు. బాటసారులకు మజ్జిగ, అవసరమైన వారికి కిరాణా సరుకులు పంపిణీ చేశాడు. ప్రస్తుతం నిత్యం వీధుల్లో 12 పశువులకు దాణా అందజేస్తున్నట్లు వివరించాడు. ( పెళ్లి విందు అడ్డుకున్నారు..! ) సరాసరి ఎన్–95 మాస్కు శ్వాసక్రియకు వీలుగా బంగారు మాస్క్కు చిన్న రంధ్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. మందుల షాపుల్లో విక్రయిస్తున్న బంగారంతో తయారైన ఎన్–95 మాస్కు తరహాలోనే ఇది ఉంటుందని వివరించాడు. కరోనా మహమ్మారి మనుషుల సోకుల తీరు మార్చింది. వివాహాది శుభ కార్యాల్లో వస్త్రాలకు మ్యాచింగు మాస్క్లు తొడుగుతున్నారు. మాస్క్లపై వధూవరుల పేర్లు ముద్రించుకుంటున్నారు. షర్టు కొంటే మ్యాచింగు మాస్కు ఉచితమంటూ వ్యాపారాల్ని పెంపొందించుకుంటున్నారు. కరోనా నివారణకు మాస్కు తొడగడం అనివార్యం కావడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. -
మాస్కు ధరించి వ్యాయామం చేస్తున్నారా?
న్యూఢిల్లీ: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని కొందరు శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెప్తున్నారు. మొదట దీన్ని అంగీకరించని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) గాలి ద్వారా వైరస్ సంక్రమణ జరుగుతుందని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలతో సహా లేఖ రాయడంతో ఆ తర్వాత ఒప్పుకోక తప్పలేదు. కాబట్టి ముందుజాగ్రత్తగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాల్సిందేనంటున్నారు నిపుణులు. అయితే వ్యాయామం చేసే సమయంలో మాస్కు పెట్టుకోవాలా? వద్దా? అన్న సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. కానీ వ్యాయామం చేసినప్పుడు మాస్కు పెట్టుకుంటే ఊపిరి ఆడటం కష్టమవుతుంది. (మాస్క్ చాలెంజ్!) కాబట్టి ఎక్సర్సైజ్ చేసేటపుడు మాస్కు పెట్టుకోకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఆ సమయంలో మాస్కు ధరిస్తే వచ్చే ప్రతికూలతలను కూడా వివరించారు. 'వ్యాయామం వల్ల వచ్చే చెమటతో మాస్కు నానిపోతుంది. అది వైరస్ వంటి సూక్ష్మజీవుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు ఒక మీటర్ కన్నా ఎక్కువగా భౌతిక దూరం పాటిస్తే సరిపోతుంద'ని సూచించారు. (కరోనా: ఆ దశకు భారత్ ఇంకా చేరుకోలేదు) Can people wear #Masks while exercising? People should NOT wear masks when exercising, as masks may reduce the ability to breathe comfortably.#IndiaFightsCorona @MoHFW_INDIA pic.twitter.com/5RV0vWvEcP — Dr Harsh Vardhan (@drharshvardhan) July 16, 2020 -
చెప్పుల దుకాణంలో మహిళ అనుచిత ప్రవర్తన
-
మాస్కు ధరించమన్నందుకు షూ విసిరి..
ఓక్లహోమా: కరోనా వచ్చిన తర్వాత మాస్క్ కూడా మన జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. అనేక చోట్ల మాస్కు లేకుండా గడప దాటితే జేబుకు చిల్లు పడేలా జరిమానా వసూలు చేస్తున్నారు. అటు కరోనా కూడా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జనాలు స్వతాహాగానే మాస్కు ధరించే బయటకు వెళుతున్నారు. అయితే మాస్కు పెట్టుకోమని విజ్ఞప్తి చేసినందుకు ఓ మహిళ దురుసుగా ప్రవర్తించిన ఘటన అమెరికాలోని ఓక్లహోమాలో చోటు చేసుకుంది. ఓక్లహోమా సిటీకి చెందిన ఓ మహిళ మాస్కు లేకుండానే చెప్పుల షాపులోకి వెళ్లింది. అక్కడున్న మహిళా సిబ్బంది ఆమెను మాస్కు పెట్టుకోమని సూచించింది. సదరు వినియోగదారురాలు అదేమీ పట్టించుకోలేదు. (మాస్క్ చాలెంజ్!) దీంతో ఆమె మరోసారి చెప్పి చూసింది. అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన సదరు మహిళ దగ్గరున్న షూ బాక్సులను తీసుకుని సిబ్బందిపైకి విసిరిపారేసింది. అనంతరం ప్రధాన ద్వారం గుండా బయటకు నడుచుకుంటూ వెళ్లింది. ఈ హఠాత్పరిణామంతో షాక్ తిన్న మహిళా సిబ్బంది వెంటనే తేరుకుని "మీరు నాపై దాడి చేశారు.. మీ లైసెన్స్ నెంబర్ ఇవ్వండి" అంటూ ఆమె వెనకాలే వెళ్లింది. కానీ అప్పటికే ఆమె కారులో వెళ్లిపోయింది. అయితే ఆమె పర్సును కౌంటర్లో వదిలి వెళ్లిపోవడంతో దాని ఆధారంగా షాపు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 8న జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటన తాలూకు వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (అడ్రస్: అక్కడకు వచ్చి నన్ను పిలవండి !) -
మాస్క్ పెట్టుకోమన్నందుకు ప్రాణం తీశారు
బయోన్నె : బస్సులో ఎక్కిన ప్రయాణికులకు మాస్క్ పెట్టుకోవాలని సూచించిన బస్ డ్రైవర్ను ఇష్టం వచ్చినట్లుగా చితకబాదారు. గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. తమ మంచి కోసం చెప్పినా అర్థం చేసుకోకుండా ఒక మనిషి నిండు ప్రాణం అన్యాయంగా తీసిన ఘటన ప్రాన్స్లో చోటుచేసుకుంది. వివరాలు.. 59 ఏళ్ల ఫిలిప్పే మంగీల్లాట్ వృత్తి రిత్యా బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఫ్రాన్స్లోని బయోన్నెకు బస్ నడుపుతుంటాడు. ఈ సందర్భంగా వారం కిందట ఫిలిప్పే నడుపుతున్న బస్సులోకి ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. అయితే ముగ్గురు మాస్కులు ధరించకపోవడంతో వెంటనే మాస్కులు ధరించాల్సిందిగా ఫిలిప్పే తెలిపాడు. మీరు మాస్కు ధరించకపోతే బస్సు ముందుకు కదలదని, ఇక్కడే దింపేస్తానని పేర్కొన్నాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు వ్యక్తులు ఫిలిప్పేపై ఇనుపరాడ్తో విచక్షణారహితంగా కొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఫిలిప్పేను అక్కడే వదిలేసి ఆ ముగ్గురు పరారయ్యారు.(గొంతు కోసి.. అడవిలో వదిలేసి) సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫిలిప్పేను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ విషయాన్ని అతని కుటుంబసభ్యులకు చేరవేశారు. కాగా చికిత్స పొందుతున్న ఫిలిప్పేకు తలకు బలమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ అయిందని డాక్ఠర్లు పేర్కొన్నారు. శుక్రవారం కుటుంబసభ్యుల అనుమతితో ఫిలప్పేకు వెంటిలేటర్ తొలగించిన కాసేపటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఫిలిప్పేపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులపై మర్డర్ కేసు కింద కేసు నమోదు చేశామని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
మాస్క్ చాలెంజ్!
‘కరోనా’ విలయతాండవంచేస్తోంది. మాస్క్ లేకపోతేపోలీసులు చలాన్లు వేస్తున్నారు. మాస్క్ ధరిస్తే ఎదుటి వారినుంచి ఏ విధమైన హానిఉండదనేది ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం వెల్లడిస్తోంది.అయినా.. కొందరు ఏం కాదులే అంటూ మాస్క్ను ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఇటువంటి వారికోసం ‘డిగ్నిటీడ్రైవ్’ ఓ చాలెంజ్ విసురుతోంది. సోషల్ మీడియా వేదికగా ఆసంస్థ ప్రతినిధులు మాస్క్ ధరించి వాట్సాప్, ఫేస్బుక్లో వీడియో అప్లోడ్ చేస్తున్నారు. టాగ్ చేసిన వారు ఆ చాలెంజ్ని స్వీకరించి మాస్క్ ధరించి ఓ వీడియోను రూపొందించాలి. మూడు రోజులుగా ఈ చాలెంజ్ సోషల్ మీడియా హాట్ టాపిక్గా మారింది. ఏంటీ ఆ మాస్క్చాలెంజ్, ఎవరు ఎలా చేస్తున్నారు అనే విషయాలపై కథనం. హిమాయత్నగర్: డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్(డీడీఎఫ్) ఫౌండర్ రినీగ్రేస్ జయకుమార్, స్ప్రెడ్డింగ్ హ్యాపీనెస్ సంస్థ ఫౌండర్ శిప్రాగాంధీ, రాబిన్హుడ్ ఆర్మీ(ఆర్హెచ్ఏ)లు ఓ సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల మాస్క్లు లేకుండా చాలా మంది రోడ్లపై తిరుగుతున్న విషయాలను వీరు గమనించారు. మాస్క్లు ధరించకపోతే వారికి రావడమే కాకుండా.. ఎదుటి వారు సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆలోచన తట్టింది. అంతే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయా సంస్థల్లోని ప్రతినిధులంతా వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకుని ‘మాస్క్ చాలెంజ్’కు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరి వాట్సాప్ స్టేటస్లో చేరింది. సందేశం.. స్టేటస్.. ‘కరోనా’ సమయంలో అసలు మాస్క్ ఎందుకు ధరించాలి? మాస్క్ ధరించడం వల్ల లాభాలు ఏంటి? మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఇతరులను సైతం ఎలా సేవ్ చేయాలి అనే అంశాలపై ఒకటి నుంచి రెండు నిముషాల నిడివిగల వీడియో రూపొందించి ఆ వీడియోను మరోఫ్రెండ్కి చాలెంజ్ చేయాలి. చాలెంజ్ని స్వీకరించిన వ్యక్తి కూడా తనకు నచ్చిన స్టైల్లో వీడియోనురూపొందించి మరొకరికి చాలెంజ్ చేయాలి. ఇలా నాలుగు రోజులుగా నగరంలోని సాఫ్ట్వేర్కంపెనీల్లో టెకీలుగా చేసేవారంతా ఈ చాలెంజ్స్వీకరించడం గమనార్హం. టెకీలతో పాటు ఇంట్లోని తల్లిదండ్రులను సైతం చాలెంజ్లోకి లాగడంస్ఫూర్తిదాయకంగా ఉంది. ఇలా రూపొందించినప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ స్టేటస్లలో స్టోరీగా పెట్టుకోవడంతో.. ఆ స్టోరీని చూసిన వారు సైతం చాలెంజ్ స్వీకరించడం భలే సంతోషాన్నిఇస్తుందంటున్నారు నిర్వాహకులు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ అందరూ మాస్కులు ధరిస్తే లక్ష్యం నెరవేరినట్లేనని అంటున్నారు. మాస్క్ చాలెంజ్ స్వీకరిస్తున్నా.. మాస్క్ చాలెంజ్ నాకెంతో నచ్చింది. సమాజాన్ని అవగాహన కోణంలోకి తెప్పించి ప్రతిఒక్కరూ మాస్క్ధరించేలా చేయడమే ఈ చాలెంజ్ లక్ష్యం. అందుకే డిగ్నిటీడ్రైవ్, స్ప్రెడ్డింగ్ హ్యాపినెస్, రాబిన్హుడ్ ఆర్మీ వాళ్లు నన్ను అడగ్గానే ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాను అనే దానికంటే చాలెంజ్ని స్వీకరించానంటే బాగుంటుందేమో..(నవ్వుతూ). అందరూ మాస్క్ చాలెంజ్లో భాగస్వాములు కావాలి. – సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్. భాగస్వాముల్నిచేసేందుకే చాలెంజ్ ప్రతి ఒక్కరినీ భాగస్వాముల్ని చేసేందుకే ఈ చాలెంజ్కు శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఓ సందేశాన్ని పంపిస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ మంచి అవగాహన వస్తుందనేది మా నమ్మకం. – రినీగ్రేస్ జయకుమార్, డిగ్నిటీడ్రైవ్ ఫౌండేషన్ ఫౌండర్. మంచి పనితో ముందుకు.. ఓ చక్కని మంచి పనితో మేమంతా ముందుకెళ్తున్నాం. మీరు కూడా మీకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో చాలెంజ్ని విసురుకోండి. ఆ చాలెంజ్లో భాగస్వాములు అవ్వండి. మాస్క్ ధరిద్దాం‘కరోనా’ను తరిమి కొడదాం. – ఉమా చిలక్, రాబిన్హుడ్ ఆర్మీ, సిటీ హెడ్. ఆనందంగా అనిపిస్తుంది నాలుగు రోజులుగా కొన్ని వేలమంది ఈ చాలెంజ్లో పాల్గొనడాన్ని చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోంది. మాస్క్ ధరించడం వల్ల మనల్ని మనం రక్షించుకుంటామనేది యావత్ ప్రపంచానికి ఈ చాలెంజ్ ద్వారా తెలపగలుగుతున్నాం.– శిప్రా గాంధీ,స్ప్రెడ్డింగ్ హ్యాపినెస్ ఫౌండర్. -
ఈ ఫొటో చూసి మీ మాస్కు తినేయకండి
మధురై: ఫొటో చూడగానే కొంత ఆశ్చర్యం, మరికొంత సందేహం కలుగుతోందా?.. కానీ, మీరు అవునన్నా, కాదన్నా అది మాస్కే. కాకపోతే ముఖానికి ధరించే మాస్క్ మాత్రం కాదు. అచ్చంగా, స్వచ్ఛంగా పిండితో చేసిన నోరూరించే "పరోటా మాస్క్". తమిళనాడులోని మధురైలోని రెస్టారెంట్ నిర్వాహకులకు వచ్చిందీ అద్భుత ఆలోచన. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈ ఆలోచన అమలు చేయడం ద్వారా అటు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఇటు బిజినెస్ కూడా బాగుంటోంది. మొదట్లో రెండు మాస్క్ పరోటాలు ఉండే ప్లేట్ను 40 రూపాయలుగా నిర్ధారించారు. కానీ దానికి విపరీతమైన డిమాండ్ రావడంతో ఆ ధరను 50 రూపాయలకు పెంచారు. (బడా బాబు మాస్క్ ఖరీదు రూ.2.89 లక్షలు) దీనిపై హోటల్ యజమాని కేఎల్ కుమార్ మాట్లాడుతూ.. "ఇంతకుముందు మా హోటల్కు మాస్కు లేకుండా వచ్చేవారు. కానీ ఇప్పుడు మాస్కు పరోటాలు కొనడానికే వస్తున్నారు" అని తెలిపాడు. ఇంతకీ ఈ పరోటా మాస్క్ను పరోటా స్పెషలిస్టు ఎస్ సతీష్ రెండు రోజుల ప్రయోగం ద్వారా తుదిరూపు తీసుకొచ్చాడు. మాస్కుల్లో రకాలున్నట్టే.. మాస్కుల పరోటాలోనూ రకాలున్నాయంటున్నాడు. వీటి తయారీ విధానాన్ని అక్కడున్న వంటవారికి నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మాస్కుల పరోటాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. "ఈ ఫొటో చూసి మీ మాస్కు తినేయకండి" అంటూ కొందరు జోకులు పేల్చుతున్నారు. -
మాస్క్ 'ఫైన్' పడింది!
వరంగల్ క్రైం: కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ మేరకు మాస్క్ లేకుండా బయటకు రావొద్దని, అత్యవసర పనులపై బయటకు వచ్చిన సమయంలో భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం, వైద్యాధికారులు సూచిస్తున్నారు. అయినా చాలా మంది పట్టించుకోవడం లేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం నుంచి వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తనిఖీలు విస్తృతం చేశారు. ఈ మేరకు 467 మందిపై ఈ పిటీ కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి ఇష్టరాజ్యంగా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో భాగంగా మాస్కులు ధరించని వారి వివరాలను ట్యాబ్ల్లో నమోదు చేసి ఆన్లైన్ ద్వారా జరిమానా విధిస్తున్నారు. కేసులు నమోదైన వ్యక్తులు కోర్టుకు వెళ్లి జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. మాస్క్లు తప్పనిసరి... కరోనా వ్యాప్తిని నిరోధించడానికి, వ్యక్తిగతంగా ఎవరికి వారు రక్షణ కోసం తప్పక మాస్క్ ధరించాలి. ఈ మేరకు మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఈ విషయంలో ప్రజలు మరింత అవగాహన పెంపొందించుకోవాలి. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న పోలీసులకు సహకరించాలి.– వి.తిరుపతి, సెంట్రల్ జోన్ ఇన్చార్జ్ డీసీపీ -
పోలీసులపై దాడికి దిగిన బీజేపీ నేత
లక్నో : ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు పోలీసులపై ఓ బీజేపీ నేత విరుచుకుపడ్డారు. అధికార పార్టీకి చెందిన తనకే సూక్తులు చెప్తావా అంటూ దాడికి పాల్పడారు. ఈ ఘటన శనివారం ఉత్తరప్రదేశ్లోని వారణాసి పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక డీఎస్పీ ప్రభాకర్ చౌదరి ఘటన వివరాలను వెల్లడించారు. బీజేపీ నేత సురేందర్ పటేల్ అతని కుమారుడు వికాస్ ముఖాలను మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నారు. దీనిని గమనించిన స్థానిక పోలీసులు వారి వద్దకు వెళ్లి మాస్కులు ధరించాలని సూచించారు. దీంతో చిర్రెత్తిన తండ్రీకొడుకులు అక్కడున్న ముగ్గురు పోలీసు అధికారులపై దాడికి పాల్పడ్డారు. వీరిలో ఓ ఎస్సై కూడా ఉన్నారు. పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. ఘటనలో గాయపడ్డ పోలీసులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై వారణాసి బీజేపీ చీఫ్ మహేష్ చంద్రా శ్రీవాస్తవా మాట్లాడుతూ.. కరోనాపై పోరులో ముందున్న పోలీసులపై దాడికి పాల్పడం సరైనది కాదని అన్నారు. ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. -
విమానాల్లో ఇక ఈ రూల్స్ తప్పనిసరి
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా కరోనా కేసుల విషయంలో, మరణాలు రేటులోనూ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. అయినప్పటికీ విమానా ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ముఖ్యంగా మే, జూన్ నెలల్లో దేశంలో విమానాల ద్వారా ప్రయాణాలు చేసిన వారి సంఖ్య పెరిగిందని ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ర్టేషన్ నివేదించింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులందరూ కచ్ఛితంగా ముక్కు, నోరు కవర్ అయ్యేలా ఫేస్ మాస్క్ ధరించాలని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే నిబంధనలు జారీ చేశాయి. లేని పక్షంలో ప్రయాణికులపై తాత్కిలిక నిషేధం విధించేలా పలు సంస్థలు చర్యలకు పూనుకున్నాయి. విమానాల్లో ప్రయాణాలు చేయాలనుకునే వారు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాల్సిందే అని పలు అమెరికన్ ఎయిర్లైన్స్ నిబంధనల్లో పేర్కొన్నాయి. (కరోనా : 7500 ఉద్యోగాల కోత ) అలస్కా ఎయిర్ లైన్స్ కస్టమర్లు, ఉద్యోగులు సహా ప్రయాణికులందరూ కచ్ఛితంగా వారి ముక్కు, నోరు కవర్ అయ్యేలా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అలస్కా ఎయిర్లైన్స్ పేర్కొంది. అంతేకాకుండా అదనంగా మాస్క్ కావాలనుకునే వారికి కూడా ఎయిర్లైన్స్లోనే ఇచ్చే వెసులుబాటు ఉంది. తినేటప్పుడు, తాగేటప్పుడు మాత్రం మాస్క్ తీసేయోచ్చని పేర్కొంది. రెండు సంవత్సరాల లోపు పిల్లలు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, అంగ వైకల్యం ఉన్నవారికి సైతం మాస్క్ ధరించాలన్న నిబంధన నుంచి మినహాయింపు కల్పించారు. జూన్ 30న అలస్కా ఎయిర్లైన్స్ రెండు పాలసీలను తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా చెక్-ఇన్ దగ్గరే హెల్త్ ఆరోగ్య ఒప్పందం ( హెల్త్ అగ్రిమెంట్ )పై సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో ఎయిర్లైన్స్ సూచించిన నిబంధనలకు తగ్గట్లు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తామని సంతకం చేయాలి. ఒకవేళ ఎవరైనా పదేపదే దీన్ని విస్మరిస్తే వారికి యెల్లో కార్డు చూపిస్తారు. తద్వారా భవిష్యత్తులో వారిపై ట్రావెల్ బ్యాన్ విధిస్తార్నమాట. అమెరికన్ ఎయిర్లైన్స్ మాస్క్ ధరించకపోతే బోర్డింగ్ వద్దే నిలిపివేస్తాం అంటుంది అమెరికన్ ఎయిర్లైన్స్. ప్రయాణం మొత్తం వరకు మాస్క్ ధరించాల్సిందే. అయితే తినేపటప్పడు లేదా తాగేటప్పుడు మాత్రం మాస్క్ తీసేయొచ్చు. చిన్నపిల్లలు, దివ్యాంగులకు సైతం దీని నుంచి మినహాయింపు కల్పించారు. మిగతా ప్రయాణికులందరూ ప్రముఖులైనా సరే మాస్క్ ధరించాల్సిందే అని పేర్కొంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే సదరు ప్రయాణికులపై ట్రావెల్ బ్యాన్ విధిస్తారు. మాస్క్ ధరించేందుకు నిరాకరించిన కన్సర్వేటివ్ పార్టీ నేతను జూన్ 17న న్యూయార్క్లో విమానం ఎక్కకుండా అడ్డకున్నారు. నిబంధనలు అందరికీ సమానమే అని సంస్థ పేర్కొంది. డెల్టా ఎయిర్లైన్స్ లాబీ పాయింట్లో చెకింగ్ దగ్గరినుంచి ప్రయాణం ముగిసే వరకు మాస్క్ ధరించాలని డెల్టా ఎయిర్లైన్స్ తెలిపింది. ముక్కు, నోటిని కప్పి ఉంచేలా మాస్క్ దరించాలని అయితే భోజన సమయంలో మాత్రం తీసేయోచ్చని పేర్కొంది. ఒకవేళ మాస్క్ కావాలన్నా ఎయిర్లైన్స్లోనే కల్పిస్తారు. శ్వాస సంబంధిత సమస్యలున్నవారికి మాత్రం మాస్క్ ధరించాలనే నిబంధనను నుంచి మినహాయింపు కల్పించారు. ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ మాస్క్ లేనిదే ప్రయాణానికి అనుమతించరు. ఆరోగ్య సమస్యలున్న చిన్న పిల్లలకు మాత్రం మినహాయింపు కల్పించారు. అంతేకాకుండా సొంతంగా మాస్క్ తయారుచేసే విధానాన్ని తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఆసక్తి ఉన్నవాళ్లు స్వయంగా మాస్క్ తయారుచేసుకోవచ్చు. జెట్ బ్లూ ఎయిర్లైన్స్ ప్రయాణికులూ సిబ్బందితో సహా మాస్క్ ధరించాలని ఆదేశించిన మొదటి విమానయాన సంస్థ జెట్ బ్లూ. చెక్-ఇన్ మెదలుకొని ప్రయాణం ముగిసే వరకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. తినేపటప్పుడు లేదా తాగేటప్పుడు మాస్క్ తీసేయోచ్చు. చిన్నపిల్లలు, శ్వాస సంబంధిత సమస్యలున్నవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు కల్పించారు. ఎవరైనా మాస్క్ ధరించేందుకు ఎవరైనా నిరకారిస్తే వారిపై తాత్కాలికంగా నిషేధం విధిస్తారు. సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్, స్పిరిట్ ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానయాన సంస్థలు సైతం కరోనా నియంత్రణలో భాగంగా మాస్క్ ధరించాలనే నిబంధనను తప్పనిసరి చేశాయి. ప్రయాణికులందరూ తప్పనిసరిగా నోరు, ముక్కు కవర్ అయ్యేలా మాస్క్ ధరించాలని పేర్కొన్నాయి. ఎవరైనా ఈ నిబంధలన్ని ఉల్లంఘిస్తే వారిపై ట్రావెల్ బ్యాన్ విధిస్తామని తెలిపాయి. (దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విన్యాసాలు ) -
చైనా యాప్స్ డిలీట్ చేయండి..మాస్క్ పొందండి
లక్నో : తమ మొబైల్ ఫోన్లలో చైనా అప్లికేషన్లను తొలిగించే వారికి ఉచితం మాస్కులు అందిస్తామని ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, బహ్రాయిచ్ బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ ప్రకటించారు. దీనికి అణుగుణంగా ఇప్పటికే పలువరికి ఫేస్ మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. భారత దేశ సమగ్రతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో 59 చైనా యాప్లను భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. భారత్ వెలుపల ఉన్న సర్వర్లకు వినియోగదారుల డేటాను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉన్న కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా అందిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ప్రభుత్వం తెలపింది. ఈ నేపథ్యంలో చైనా అప్లికేషన్లను ప్రజలు స్వతహాగా తొలిగించేట్లు అనుపమ వినూత్నంగా ప్రయత్నించారు. పార్టీ స్థానిక మెర్చా యూనిట్ సహకారంతో ఆమె నియోజకవర్గంలో విసృతంగా ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా గతేడాది ఆమెను మంత్రి పదవి నుంచి తొలిగించారు. (టిక్టాక్ నిషేధంతో భారీగా నష్టపోయిన చైనా ) -
ఎఫ్బీ పోస్ట్; టిప్గా 32 వేల డాలర్లు!
కాలిఫోర్నియా : కరోనా వైరస్ వ్యాప్తితో మాస్కు ధరించడం అనివార్యంగా మారింది. బయటకు వెళ్లాలంటే తప్పని సరిగా మాస్క్ ఉండాల్సిందే. కొన్ని చోట్ల మాస్కు ధరించకుండా బహిరంగా ప్రదేశాలకు వచ్చే వారిపై జరిమాన సైతం విధిస్తున్నారు. ఈక్రమంలో ఓ రెస్టారెంట్కు మాస్కు ధరించకుండా వెళ్లిన మహిళకు వెయిటర్ సర్వ్ చేయని ఘటన కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో చోటుచేసుకుంది. అంతేగాక అతను చేసిన పని తనకు 32,000 డాలర్లను టిప్గా తెచ్చిపెట్టింది. వివరాలు.. అండర్ లిన్ గిల్లెస్ అనే మహిళ ఇటీవల స్టార్బక్స్ రెస్టారెంట్కు వెళ్లింది. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేయగా, సదరు మహిళ ముఖానికి మాస్క్ ధరించనందున రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తున్న లెనిన్ గుటిరెజ్ అనే వ్యక్తి ఆమెకు సర్వ్ చేసేందుకు నిరాకరించాడు. ఆమె ఎంత చెప్పినా వినకుండా మాస్క్ ఉంటేనే సర్వ్ చేయాలని, లేకుంటే చేయొద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని వెయిటర్ మొండి స్పష్టం చేశాడు. (భారత ఐటీపై హెచ్1బీ వీసాల రద్దు ప్రభావం?) దీంతో వెయిటర్పై కోపంతో ‘మాస్క్ వేసుకోనందుకు కాఫీ తీసుకు రాలేదు’ అంటూ మహిళ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుపై లక్ష మందిపైగా కామెంట్ చేయగా, 50 వేల మంది షేర్ చేశారు. వీరిలో అనేకమంది నెటిజన్లు గిల్లెస్కు వ్యతిరేకంగా స్పందించారు. వెయిటర్ తన పని తాను నిర్వహించాడని లెనిన్ను ప్రశంసించారు. అంతేకాదు 32 వేల డాలర్లను అతడికి టిప్గా ఇచ్చారు. కాగా మే 1 నుంచి శాన్డియాగో ప్రజలు తప్పని సరి మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు, పార్కులు, షాపింగ్, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్కు ఉండాలని ఆదేశించింది. (చీటీల పేరుతో రూ. 2 కోట్ల టోకరా! ) ఇదిలా ఉండగా గిల్లెస్ పోస్టును చూసిన మాట్ కోవిన్ అనే ఓ వ్యక్తి లెనిన్కు ఎదైనా సాయం చేయేఆలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ పోస్టును ట్యాగ్ చేస్తూ ‘లెనిన్ స్టాండింగ్ అప్ టు ఏ శాన్ డియాగో కరెన్’ పేరుతో డొనేషన్పేజిని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ చేసి ఆ మెత్తాన్ని టిప్ రూపంలో లెనిన్కు ఇవ్వాలని అనుకున్నాడు. జూన్ 22న మొదటు పెట్టిన ఈ ఫండింగ్ ద్వారా శుక్రవారం సాయంత్రం వరకు 32 వేల డాలర్లు వసూలు చేశాడు. ఈ మెత్తాన్ని కోవిన్ లెనిన్కు అందించాడు. దీనిపై లెనిన్ మాట్లాడుతూ.. ఫండ్ అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తమకు అందిన టిప్తో ఏం చేయాలో ఓ ప్రణాళిక ఉన్నట్లు తెలిపారు. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఈ డబ్బుతో డ్యాన్స్ స్కూల్ పెట్టి ఇతరులకు డ్యాన్స్ నేర్పిస్తానని వెల్లడించారు. (‘అలా చేస్తే.. చైనా ఆక్రమణలు తొలగిస్తారా? ) -
మాస్కుల పరిశ్రమలో 70 మందికి కరోనా
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాస్కులు తయారు చేసే యూనిట్లో పెద్ద మొత్తంలో కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. బుధవారం ఒక్కరోజే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీలో పని చేసిన 70 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్లాంట్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే 70 మంది కరోనా బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. (పరుగో పరుగు!) దీనికి కారణమైన సదరు ప్లాంట్ను వెంటనే సీల్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక దీన్ని నడుపుతున్న ప్రైవేటు కంపెనీపైనా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. వైరస్ సోకిన కార్మికులు ఫ్యాక్టరీకి ఏయే గ్రామాల నుంచి వస్తారో వాటిపైనా అధికారులు దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో వీరికి సన్నిహితంగా మెదిలిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక పుదుచ్చేరిలో ఇప్పటివరకు 461 కేసులు నమోదవగా ఇందులో 276 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రపంచంలో రికవరీ @ 50లక్షలు) -
ఇక నుంచి ఇవి ప్లాట్ఫాంపై అమ్మబడును
న్యూఢిల్లీ: కరోనా వైపరీత్యం వల్ల ముఖానికి మాస్కు, చేతికి గ్లవుజులు, బ్యాగులో శానిటైజర్ తప్పనిసరిగా మారిన విషయం తెలిసిందే. పొరపాటున అవి లేకుండా బయటకు వస్తే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనిని నివారించేందుకు రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్లాట్ఫామ్స్పై ఉండే స్టాల్స్లో కరోనా వ్యాప్తి నివారణా వస్తువులను అమ్మాలని నిర్ణయించింది. దీంతో రైల్వే స్టేషన్లలో ఉండే దుకాణదారులు పుస్తకాలు, మందులు, తినుబండారాలతోపాటు ఇక నుంచి కోవిడ్ను అడ్డుకునే అత్యవసరాలను కూడా అమ్మనున్నారు. ప్రయాణికులు మాస్కులు వంటివి ఇంట్లోనే మర్చిపోయినప్పుడు స్టేషన్లో కొనుక్కొని జాగ్రత్తలు పడే వీలుంటుందని తెలిపింది. (బ్రేక్డౌన్ కాదు.. లాక్డౌన్ !) రైళ్లలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అయితే ఎమ్మార్పీ ధరకు మాత్రమే వాటిని అమ్మాల్సి ఉంటుందని, ఒక్క పైసా కూడా అధికంగా వసూలు చేసేందుకు వీలు లేదని దుకాణదారులను హెచ్చరించింది. ఇక వీటితోపాటు బెడ్రోల్ కిట్ కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఇందులో ఒక దిండు, దిండు కవర్, దుప్పటి, ఫేస్ టవల్ ఉంటాయి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా నాణ్యతతో ఉండాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కాగా ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే శాఖ సాధారణంగా దుప్పట్లు, కర్టన్లు వంటివి ఏర్పాటు చేస్తుంది. కానీ వైరస్ కారణంగా ఆ సౌకర్యాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే. (వలస కష్టం కాటేసింది పసివాడిని వీడేసింది) -
దేశాధ్యక్షుడైనా మాస్కు ధరించాల్సిందే: కోర్టు
బ్రెసీలియా: దేశాధ్యక్షుడైనా, సామాన్య ప్రజలైనా కరోనాకు అందరూ సమానమే. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాల్సిందే. అయితే బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో ఈ మధ్య మాస్కు వాడటం లేదట. ప్రజలతో కలిసి ర్యాలీ తీస్తున్న సమయంలోనూ మాస్కు ధరించనేలేదట. ఈయన వ్యవహారంతో స్థానిక కోర్టుకు చిర్రెత్తుకొచ్చింది. దేశాధ్యక్షుడైనా మాస్కు ధరించాల్సిందేనని మంగళవారం స్పష్టం చేసింది. పబ్లిక్ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు మాస్కు వాడాలని బొల్సనారోని కోర్టు ఆదేశించింది. లేని పక్షంలో రెండు వేల రియాలు(రూ.29 వేలు) జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. (బ్రెజిల్ బేజార్) కాగా గత వారం తన పదవికి రాజీనామా చేసిన బ్రెజిల్ విద్యాశాఖ మంత్రి మాస్కు ధరించనందుకు రెండు వేల రియాల ఫైన్ కట్టిన విషయం తెలిసిందే. లాక్డౌన్, భౌతిక దూరం వంటి చర్యల్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ జెయిర్ బొల్సనారో కరోనాను తక్కువ అంచనా వేయడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించిందని కొన్ని రాష్ట్రాల గవర్నర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒక్క మంగళవారం నాడే ఆ దేశంలో 1374 మందిని కరోనా పొట్టన పెట్టుకోగా 39,436 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు బ్రెజిల్లో కరోనాతో 52 వేల మంది మరణించారు. 1.1 మిలియన్కు పైగా జనాభా కరోనా బారిన పడ్డారు. (డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగుతాం: బోల్సోనారో) -
మాస్క్ల వినియోగంపై విస్తృత అవగాహన
నెల్లూరు(క్రైమ్): పోలీస్ శాఖలో కరోనా భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు సిబ్బంది కరోనా బారినపడి ఐసొలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ ఉన్నతా«ధికారులు అప్రమత్తమయ్యారు. పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించడంతో పాటు పోలీస్స్టేషన్లలో కరోనా సోకకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ద్రావణం పిచికారీ లాక్డౌన్ ప్రారంభం నుంచి పగలు, రాత్రీ అనే తేడా లేకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు విధులు నిర్వర్తించారు. లాక్డౌన్ సడలింపుల అనంతరం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం, పలువురికి కరోనా సోకడంతో సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ భాస్కర్ భూషణ్ కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పటికే సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు. ప్రతి పోలీస్స్టేషన్లో సోడియం హైపోక్లోరైట్తో పిచికారీ చేయిస్తున్నారు. విధి నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జాగ్రత్తలు పాటిస్తూ విధులు కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. గ్లౌజ్లు, మాస్క్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. స్టేషన్లలో శానిటైజర్లను ఏర్పాటు చేశారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులు, ఇతరులు విధిగా చేతులను శుభ్రం చేసుకున్నాకే అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ వారి సమస్యలను వినడం, ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా వివిధ కేసుల్లో నిందితులను స్టేషన్కు తీసుకొచ్చిన వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నారు. కరోనా తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల వద్ద మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. స్టేషన్లోకి ఎవర్నీ అనుమతించడం లేదు. స్టేషన్ బయటే షామియానాలు, కుర్చీలు వేసి ఫిర్యాదుదారులను కూర్చోబెడుతున్నారు. అక్కడే వారి సమస్యలను విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్ జోన్లలో తగు జాగ్రత్తలు తీసుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. మాస్క్ల వినియోగంపై విస్తృత అవగాహన కరోనా విస్తరించకుండా ప్రణాళికలు రూపొందిస్తూనే ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టి సారించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మాస్కుల్లేకుండా రోడ్లపైకి వచ్చే పాదచారులు, వాహనదారులకు జరిమానాలు విధించడంతో పాటు వారికి మాస్క్ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వేళ తగు జాగ్రత్తలు పాటిస్తూ తమను తాము రక్షించుకోవడంతో పాటు ప్రజారక్షణలో పోలీసులు నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
మాస్క్లు లేకుండానే హోటళ్లలో వంట
శంషాబాద్: పట్టణంలో కోవిడ్ నింబంధనల అమలుపై అధికారులు దృష్టిసారించకపోవడంతో అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది. టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ తయారీ, హోటళ్లతోపాటు టీ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది కనీసం మాస్కులు కూడా ధరించడం లేదు. హోటళ్లలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆహార పదార్థాలను తయారీ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తుంపర్ల ద్వారా కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో కార్మికులు మాస్క్లు ధరించడం లేదు. పట్టణంలో టిఫిన్ సెంటర్లతో పాటు ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, హోటళ్లు, వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్న కార్యాలయాల్లో ఆరంభంలో హడావిడి చేసిన అధికారులు అనంతరం పట్టించుకోవడం లేదు. గతంలో మాస్కులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న కొందరికి జరిమానా వేశారు. పట్టణంలో కోవిడ్ వ్యాప్తి చెందకముందు చర్యలు తీసుకున్న అధికారులు ప్రస్తుతం మూడు కోవిడ్ కేసులు నిర్ధారణ అయినా దృష్టిసారించడం లేదు. పట్టణంలో కోవిడ్ నియంత్రణ కోసం నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. -
కరోనా : ఇకపై ఆ బాధ్యత పోలీసులదే
అహ్మదాబాద్ : ఫేస్ మాస్క్ లేకుండా బయట యథేచ్ఛగా తిరిగే వాళ్ల నుంచి ఇకపై పోలీసు శాఖ జరిమానా విధించనుంది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే రూ. 200 జరిమానా విధిస్తారు. ఈ బాధ్యతను ప్రస్తుతం పోలీసు శాఖకు అప్పజెప్పుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వేగంగా ప్రబలుతున్న రాష్ర్టాల్లో గుజరాత్ ఒకటి. వైరస్ విజృంభిస్తున్నా కొందరు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తూ నిబందనల్ని గాలికొదిలేస్తున్నారు. కొందరు మున్సిపల్ అధికారులు సైతం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ బాధ్యతను పోలీసు శాఖ పరిధిలోకి తెచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన వారికి ఇప్పటివరకు కేవలం 280 ఈ చలాన్లను మాత్రమే అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
కరోనాకు వర్షం తోడు..
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: స్వీయ సంరక్షణ తప్ప ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ఏ మందూ లేదు.. మొన్నటి వరకు ఓ ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు.. వానాకాలం ప్రారంభమైంది. జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభించేందుకు అనుకూల సమయమిది. అసలే వ్యాధుల సీజన్.. ఆపై కోవిడ్–19 మరింత భయపెడుతోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. నిబంధనలు పాటించకపోయినా మహమ్మారి మనల్ని చుట్టేయడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నాన్నారు. అసలే వానాకాలం సాధారణంగానే వానాకాలం అంటే వ్యాధుల సీజన్గా పేర్కొంటారు. ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తుంటాయి. కరోనాకు సైతం ఇవే లక్షణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది చిన్నపాటి జలుబు, దగ్గుకు భయపడుతున్నారు. నలుగురిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి చిన్నగా తుమ్ము, దగ్గు వచ్చినా మిగతా వారు అనుమాన పడుతున్నారు. బేఖాతర్ చేస్తే అంతే ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో 20 రోజులుగా చాలా మంది కరోనాను లైట్గా తీసుకుంటున్నారు. సడలింపులతో పాటు జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరించినా చాలా మంది పట్టించుకోవడం లేదు. కొంత మంది కనీసం మాస్క్లు కూడా ధరించడం మరిచారు. భౌతిక దూరం నిబంధన సైతం కానరావడం లేదు. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో నిబంధనలు పాటించకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా వచ్చింది.. జిల్లాలో కరోనా వైరస్ మార్చి 24న అడుగు పెట్టింది. లండన్ వెళ్లి వచ్చిన రాజమహేంద్రవరానికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలు ఉండడంతో ఆయన్ని కాకినాడ జీజీహెచ్కు తీసుకెళ్లి పరీక్షల అనంతరం అధికారులు కరోనా పాజిటివ్గా ధ్రువీకరించారు. ఆ తరువాత ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తులతో కరోనా కేసులు పెరిగాయి. ఏప్రిల్ 26వ తేదీ వరకు జిల్లాలో ఈ కేసులు క్రమేపీ పెరుగుతూ 31గా నమోదయ్యాయి. వీరిలో దాదాపుగా 17 మంది అప్పటికే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ ఆయ్యారు. తరువాత ఈ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న తరుణంలో మే నెలలో జి.మామిడాడకు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందాడు. తర్వాత జి.మామిడాడ, బిక్కవోలు, ఊలపల్లి, రాయవరం, మేడపాడు, రామచంద్రపురం, పెద్దాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, అయినవిల్లిల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. పక్షం రోజుల వ్యవధిలోనే దాదాపు 460కి పైగా కేసులు నమోదవడం గమనార్హం. కొత్త కేసులన్నీ మహారాష్ట్ర, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వలస కార్మికులతో ముడిపడి ఉన్నవే. నిబంధనలను పట్టించుకోక.. కరోనాను కట్టడి చేయాలంటే స్వీయ రక్షణే మందు. లాక్డౌన్ కఠినంగా అమలు చేసిన సమయంలో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను పెడచెవిన పెడుతూ కొందరు తిరగడంతో కరోనా వ్యాప్తికి కారణమైంది. ముఖానికిమాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, అత్యవసరమైతే మినహా ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం, సమూహాలుగా కాకుండా దూరంగా ఉండటం, వంటి చిన్న జాగ్రత్తలను పాటించినా కరోనాను కట్టడి చేయవచ్చు. ప్రస్తుతం వానాకాలం సీజన్ దృష్టిలో పెట్టుకొని కచ్చితంగా ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు కోరుతున్నారు. భయపడొద్దు.. జాగ్రత్తలే ముద్దు వానాకాలంలో జ్వరాలు, వివిధ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. జలుబు, దగ్గు వంటి లక్షణాలు కరోనాకు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలి. జిల్లా ఆసుపత్రుల్లో నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత సీజన్ను దృష్టిలో పెట్టుకుని కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా @ 39 జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 39 మందికి వైరస్ సోకింది. రాయవరం మండలం చెల్లూరు శివారు సూర్యారావుపేటలో మొత్తం 26 కరోనా కేసులు నమోదయ్యాయి. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్లో 4, పెద్దాపురంలో 1, తొండంగి మండలం ఏవీ నగరంలో 1, అయినవిల్లి మండలం ఎన్.పెదపాలెంలో 2, పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగుపల్లి గ్రామంలో ఒకే కుటుంబంలో నలుగురికి వైరస్ సోకింది. ముంబయి నుంచి రైలులో వచ్చిన నాగుల్లంక శివారు పెదకందాలపాలెం గ్రామానికి చెందిన ఓ బాలికకు కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. -
కరోనా కట్టడిలో అతి ముఖ్యమైనది అదే..
వాషింగ్టన్ : ఫేస్ మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టన్స్..కరోనాకు ముందు పెద్దగా పరిచయం లేని పేర్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికా నుంచి అమలాపురం దాకా పట్టణాల నుంచి పల్లెల దాకా ఇప్పుడు అందరికీ సుపరిచతం అయ్యాయి. వీటి వాడకం కూడా బాగా పెరిగింది. దాదాపుగా అన్ని కరోనా ప్రభావిత దేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వైరస్ వ్యాప్తిని నియంత్రంచడంలో ఫేస్ మాస్క్ చాలా ముఖ్యమైందంటూ తాజాగా అమెరికా పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఒకవేళ ఈ నిబంధన లేకపోతే కరోనా కేసులు మరిన్ని పెరిగేవని తెలిపింది. స్టే ఎట్ హోమ్, సోషల్ డిస్టన్స్ కంటే ఫేస్ మాస్క్ ద్వారా వైరస్ను ఇతరులకు సోకకుండా రక్షిస్తుందని ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీలో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడైంది. (మరోసారి లాక్డౌన్ దిశగా చైనా..! ) ఫేస్ మాస్క్ తప్పనిసరి చేస్తూ ఏప్రిల్ 6 న ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని పరిశోధనలో తేలింది. ఏప్రిల్ 17న న్యూయార్క్లోనూ ఫేస్ మాస్క్ తప్పనిసరి చేయడం ద్వారా 66,000 వేల కేసులు తగ్గినట్లు పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ నిబంధన ద్వారా న్యూయార్క్లో ఇన్ఫెక్షన్ల రేటు రోజుకు సుమారు 3 శాతం తగ్గినట్టు తెలిపారు. కరోనా వల్ల అత్యధిక మరణాలు చోటుచేసుకున్న ఇటలీలోనూ పేస్ మాస్క్ కారణంగా 78,000 వేల కరోనా కేసులు తగ్గాయని వివరించారు. ఇటలీ,న్యూయార్క్ నగరాల్లో ఫేస్ మాస్క్ నిబంధనల కంటే ముందు క్వారంటైన్, సోషల్ డిస్టన్స్ లాంటివి అమల్లో ఉన్నాయని అవి డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కేసులు పెరగకుండా మాత్రమే ఇవి నియంత్రంచగలిగాయని పరిశోధకులు వెల్లడించారు. అయితే గాల్లో కొన్ని గంటల పాటు నిలిచి ఉండే వైరస్ కణాలతో ఇతరులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున ఫేస్ మాస్క్ దీని నుంచి రక్షిస్తుందని పేర్కొంది. (అమెరికాలో సిక్కు యువతి అరుదైన ఘనత ) -
మాస్క్.. 3 పొరలుంటే భేష్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణతో పాటు, తుంపర్లు, ఇతర రూపాల్లో ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఫేస్ మాస్క్లు ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం మాస్క్లు ధరిస్తేనే సరిపోదని, వైరస్ సోకిన వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా మాస్క్లను ఉపయోగించడంతో పాటు చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తుల మధ్యదూరం (ఒక మీటర్) కచ్చితంగా పాటించడం, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ఐపీసీ)పద్ధతులు పాటించడం ద్వారా మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజాగా సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ల వినియోగానికి సంబంధించి, ఎలాంటి మెడికల్, నాన్ మెడికల్ మాస్క్లను ఉపయోగించాలి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, తదితర అంశాలపై గతంలో జారీచేసిన సూచనలు, సలహాలకు అదనంగా కొత్తవాటిని డబ్ల్యూహెచ్వో విడుదల చేసింది. ఎవరు, ఏ పరిస్థితుల్లో ఎటువంటి మాస్క్ ధరించాలి? నాన్ మెడికల్ మాస్క్: ♦ వైరస్ వ్యాప్తికి అనుమానాలున్న చోట రక్షణ కోసం సాధారణ ప్రజలు ధరించాలి ♦ సరుకుల దుకాణాలు, ప్రార్థన స్థలాలు, ఇతర జన సమూహాలున్న చోట్ల.. ♦ జనాభా ఎక్కువ ఉన్నచోట్ల, మురికివాడలు, ఇరుకు ప్రాంతాల ప్రజలు.. ♦ వ్యక్తుల మధ్య భౌతికదూరం పాటించడం సాధ్యం కాని చోట్ల, బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణిం చే వారు, క్యాషియర్లు, సర్వర్లు, సోషల్ వర్కర్లు.. మెడికల్ మాస్క్: ♦ భౌతికదూరం పాటించడం సాధ్యం కానిచోట్ల, వైరస్ సోకే అవకాశాలున్న చోట్ల.. 60 ఏళ్లకు పైబడిన వారు, గుండెజబ్బులు, డయాబెటిస్ వంటి ఇతర సమస్యలున్న వారు.. ♦ కేన్సర్, శ్వాసకోశ సమస్యలు, ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు.. ♦ సమాజంలోని అన్నిచోట్లా కరోనా లక్షనాల్లో ఏవైనా ఉన్నవారు, వ్యాప్తి నియంత్రణకు మెడికల్ మాస్క్ ధరించాలి.. మాస్క్ల నిర్వహణ ఎలా ? ♦ ఒక మాస్క్ను ఒక్కరే ఉపయోగించాలి ♦ తడిసినప్పుడు లేదా మాసిపోయినప్పుడు మాస్క్లను మార్చాలి. తడిచిన వాటిని ఎక్కువ కాలం వాడకూడదు. ♦ నాన్ మెడికల్ మాస్క్లను తరచుగా ఉతకాలి. ఇతర వస్తువులతో కలిసి కలుషితం కాకుండా జాగ్రత్త పడగాలి. ♦ ఎక్కువ వేడిలో ఉతికినా తట్టుకునేలా ఫ్యాబ్రిక్ను ఎంచుకోవాలి ♦ మాస్క్ ల ను ఉతికేం దుకు వేడినీళ్లు వాడాలి. అవి అందుబాటులో లేని సంద ర్భంలో సబ్బు, డిటర్జెంట్తో కూడా వాటిని ఉతకొచ్చు. నాన్ మెడికల్ మాస్క్ల నిర్వహణ... ఫ్యాబ్రిక్ ఎంపిక : ♦ తుంపర్ల వంటి వాటిని అడ్డుకోవడం, గాలి తీసుకునేందుకు వీలుగా ఉండేలా ఎంపిక. ♦ మాస్క్ల తయారీకి సాగే గుణమున్న మెటీరియల్, తక్కువ ఫిల్టర్, ఉతికితే మనగలగని గుడ్డను ఎంపిక చేయరాదు ♦ 60 డిగ్రీల ఉష్ణోగ్రతలు తట్టుకునే ఫాబ్రిక్ను ఎంపికచేయాలి. ఉత్పత్తి, తయారీ ఎలా ? ♦ కనీసం మూడు పొరలవి అవసరం. నోటికి తగిలేలా ఇన్నర్ లేయర్ ఫ్యాబ్రిక్, బయటి పొర బయటి వాతావరణానికి ఇమిడేలా ఉండాలి. ♦ నీటిని పీల్చగలిగే (హైడ్రోఫిలిక్) మెటీరియల్ ఎంపిక చేయాలి. బయటి, లోపలి పొరలకు తగ్గట్టుగా ఫాబ్రిక్ను ఎంపికచేయాలి. బయటి పొర మెటీరియల్ లిక్విడ్ను పీల్చుకునే గుణం లేనిది (హైడ్రోఫోబిక్) అయ్యి ఉండాలి. మాస్క్ సరైన వినియోగం ఇలా ♦ మాస్క్ పెట్టుకునే ముందు చేతులు శుభ్రపరచుకోవాలి. ♦ నోరు, ముక్కు కవర్ అయ్యేలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ముఖం, మాస్క్ మధ్య గ్యాప్ ఎక్కువగా లేకుండా ఉండేందుకు వెనకవైపు ముడేసుకోవాలి ♦ మాస్క్ ధరించినపుడు దానిని పదేపదే తాకరాదు ♦ మాస్క్ ముందు భాగాన్ని చేతులతో తాకకుండా, వెనకనుంచి విప్పేలా ఏర్పాటు చేసుకోవాలి ♦ మాస్క్లను విప్పిన వెంటనే శానిటైజర్తో లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి ♦ సింగిల్ యూజ్ మాస్క్లను ఒకసారి కంటే ఎక్కువ ఉపయోగించరాదు. వాడిన అనంతరం పారవేయాలి. -
మాస్కు కట్టుకోండి సారూ...!
సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు: కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రచారం చేస్తున్నా కొందరు నిర్లక్ష్యం వీడటం లేదు. గుంటూరు లాడ్జి సెంటరులో ద్విచక్రవాహనంపై మాస్క్ ధరించకుండా వెళ్లే వారిని ఆపి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాస్కు కట్టిస్తున్న దృశ్యం. -
జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం మరవకముందే..
మెక్సికో : ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై నిరసన జ్వాలలు చల్లారకముందే మరో ఉదంతం చోటుచేసుకుంది. మెక్సిలో ఆందోళనకారులు ఓ పోలీసుకు నిప్పటించారు. ఈ ఘటన మెక్సికోలోని గాదల్రాజారా నగరంలో చోటుచేసుకుంది. ముఖానికి మాస్క్ ధరించలేదన్న కారణంతో 30 ఏళ్ల వయసున్న లోపెజ్ అనే కార్మికుడిని మెంబ్రిలోస్ అనే పట్టణంలో మే 4న పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పోలీసు కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. (అమెరికా: పోలీసుల చర్యతో తల పగిలింది! ) ఈ నేపథ్యంలో గాదల్రాజారా నగరంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆగ్రహంతో ఊడిపోయిన నిరసనకారులు ఓ పోలీసు అధికారికి నిప్పంటించేశారు. వెంటనే స్పందించిన అధికారులు మంటలను ఆర్పివేసి అతడిని ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా పలు పోలీసు వాహనాలు సహా పలు భవనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండటంతో 22 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకోగా వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. (జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి) -
ఎలక్ట్రికల్ మాస్క్
నాగోలు: కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే.. కరోనా నుంచి కాపాడుకునేందుకు కొంత మంది విద్యార్థులు, యువకులు కలిసి కొత్త పద్ధతిలో తక్కువ ఖర్చుతో కోవిడ్–19 ఎలక్ట్రికల్ మాస్క్ తయారు చేశారు. ఈ మాస్క్ గాలి ద్వారా వచ్చే అంటువ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. ఇది చెమట, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుందని నిర్వాహకులు తెలిపారు. నాగోలు జైపురికాలనీ ప్రాంతానికి చెందిన శివ(బీకామ్), ప్రభాకర్(ఇంటర్), రామకృష్ణా(క్యాబ్ డ్రైవర్), రమేష్ (ఐటీఐ ఎలక్ట్రికల్), దుర్గా(బీఎస్సీ), శీరిషా(పాలిటెక్నిక్) కలిసి బ్లూ వింగ్స్ టీం ఏర్పాటు చేసుకున్నారు. గతంలో మహిళల భద్రత కోసం సన్ట్గన్ పవర్ బ్యాంక్ తయరు చేశారు. అందరూ కలిసి నూతన ఆలోచనతో మాస్క్లను తయారు చేశారు. కోవిడ్–19 ఎలక్ట్రికల్ మాస్క్ వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు శ్యాస సమస్యలు, గాలి ద్వారా వచ్చే అంటు వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచుకునేందుకు ఈ మాస్క్ ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, బాడీ పెయిన్ రాకుండా కాపాడుతుందని బ్లూ వింగ్స్ టీం సభ్యులు తెలిపారు. దీన్ని వాష్ చేసి మళ్లీ వాడొచ్చని అన్నారు. చిన్న పిల్లలు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నవారు ఈ మాస్కులను వాడొచ్చని తెలిపారు. డీసీ మోటారు, కాటన్ క్లాత్, రీఛార్జ్ బ్యాటరీలు, ఎయిర్ పైపు, ప్యాకెట్ నిబ్యులైజర్ ఉపయోగించి మాస్క్లను తయారు చేశారు. ఇందులో మనకు కావాల్సిన జిందా తిలిస్మాత్, జండుబాం, ఏదైనా ఫ్లేవర్ను ఉపయోగిస్తే తక్షణమే ఉపశమనం కలుగుతుందని వివరించారు. -
‘కాటన్ ఉత్పత్తికి సరిపోను గొర్రెలు లేవు’
సింగపూర్: సింగపూర్ మినిస్టర్ ఒకరు తప్పులో కాలేశారు. కాటన్ ఉత్పత్తికి తగినన్ని గొర్రెలు లేవంటూ నవ్వుల పాలయ్యారు. అది కూడా ఓ వీడియో ఇంటర్వ్యూలో. ఇంకేముంది జనాలు సదరు మినిస్టర్ను ఓ ఆట ఆడుకుంటున్నారు. వివరాలు.. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి చాన్ చున్ సింగ్ ఓ వీడియో ఇంటర్వ్యూలో విదేశీ వాణిజ్యం మీద సింగపూర్ ఎలా ఆధారపడిందో వివరిస్తూ.. ‘ఫేస్ మాస్క్లు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి. కానీ వాటి తయారీకి తగిన ముడి సరుకులు మన దగ్గర లభించటం లేదు. కాటన్ను ఉత్పత్తి చేయడానికి తగినన్ని గొర్రెలు సింగపూర్లో లేవు’ అన్నారు. తర్వాత తన పొరపాటును గ్రహించి తనలో తానే నవ్వుకున్నారు చాన్. కానీ ఈ లోపే నెటిజనులు ఆయనను ఓ ఆట ఆడుకున్నారు. ‘బాబా బ్లాక్ షీప్ రైం గుర్తు పెట్టుకుంటే సరి’.. ‘ఈ వీడియో చేసే వారేవరైనా.. ముఖ్యంగా చిన్న పిల్లలు సైతం కాటన్, పత్తి చెట్ల నుంచి వస్తుంది కానీ గొర్రెల నుంచి రాదని చెప్పగలరు’.. ‘నేను గొర్రెలను లెక్కిస్తున్నాను’ అంటూ నెటిజనులు కామెంట్ చేశారు. అయితే చాన్ ఇలా నోరు జారడం ఇదే ప్రథమం కాదు. గతంలో లాక్డౌన్ నేపథ్యంలో మాల్స్ ముందు క్యూ కట్టిన జనాలను ఉద్దేశిస్తూ.. ‘ఇడియట్స్’ అని కామెంట్ చేశాడు. -
థింక్.. డిఫరెంట్
పెద్దపల్లి: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్తో చాలా మంది పనిలేదు.. ఉపాధి లేదు అంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో సుల్తానాబాద్కు చెందిన ఈ ఫొటోగ్రాఫర్ రామకృష్ణ విభిన్నంగా ఆలోచించాడు. శుభకార్యాలు లేక తాను కూడా ఉపాధి లేకపోవడంతో తన ఆలోచనలకు పదునుపెట్టి కరోనా కట్టడిని ఉపాధిగా మలుచుకున్నాడు. మాస్క్లు జీవితంలో తప్పనిసరి కావడంతో ఎవరికి నచ్చిన డిజైన్లలో వారి చిత్రాలతో మాస్క్లు తయారుచేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఒక్కో మాస్కును రూ.40కి విక్రయిస్తున్నాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్ -
మాస్క్.. 'ఆర్ట్' టచింగ్
కరోనా రాకాసి కోరలు చాచుకొని కూర్చుంది. దీని బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. విజయవాడ నగరపాలక సంస్థ(వీఎంసీ) పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు లాక్డౌన్ సడలింపుతో కొంతమంది మాస్క్లు ధరించకుండానే బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఫైన్ వేస్తారని తెలిసినా లైట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను మరింత చైతన్యవంతం చేసేందుకు వీఎంసీ నగరంలోని పలు గోడలపై మాస్క్లతో కూడిన చిత్రాలను గీయిస్తోంది. పాత బస్టాండ్ వద్ద ఓ గోడపై వేసిన దృశ్యాన్ని చిత్రంలో చూడొచ్చు.-సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
మ్యాచింగ్ మాస్క్..
కాదేదీ ఫ్యాషన్కు అనర్హం అంటున్నారు నగరవాసులు. కరోనా నుంచి కేర్ కోసం కావచ్చు.. కనువిందు చేసే ఏదైనా ఫ్యాషన్లో ఇమిడిపోవాల్సిందే అంటున్నారు. మాస్క్లు జీవితంలో భాగం కావాలని చెబుతుంటే.. మా వస్త్ర ధారణకు అతికినట్టుగా అవి సరిపోవాలని ఫ్యాషన్ ప్రియులు కోరుతున్నారు. దీనికి ప్రసిద్ధ బ్రాండ్లతో పాటు పలువురు డిజైనర్లు మ.. మ.. మాస్క్ అంటూ కోరస్ పాడుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: సిటీలో ఫ్యాషన్ని అప్ టు డేట్గా ఫాలో అయ్యేవారు తమ అవుట్ ఫిట్కు తగ్గట్టు వీటిని మ్యాచింగ్గా ఎంచుకుంటున్నారు. దీంతో కస్టమైజ్డ్ మాస్కులకు డిమాండ్ పెరిగింది. ప్రముఖ భారతీయ డిజైనర్ పాయల్ సింఘాల్ మాస్కుల తయారీకి శ్రీకారం చుట్టారు. మాస్కులు అనేవి తమకు భవిష్యత్లో కూడా తమ ఉత్పత్తుల జాబితాలో ఓ విభాగంగా చోటు చేసుకుంటాయని ఆమె అంచనా వేస్తున్నారు. మాస్కులు ఇప్పుడు అవసరంగా మారాయని, ప్రతి ఒక్కరూ వాటిని ధరించాల్సిందే కాబట్టి ఇవి ఒక ట్రెండ్గా మారనున్నాయన్నారు. బ్రాండెడ్.. ట్రెండ్.. ముఖాన్ని కవర్ చేసుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా.. అంతకుమించి తప్పనిసరిగా మారిపోవడంతో ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా మాస్కులపై దృష్టి సారించాయి. వెరైటీ ప్రింట్స్, డిజైన్స్లలో కస్టమర్లకు ఎంపిక అవకాశాలను పెంచుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్స్ పీటర్ ఇంగ్లాండ్, అలెన్ సోలీ, లూయిస్ ఫిలిప్, వ్యాన్ హ్యూసన్ కూడా కాటన్ మాస్కులను లాంచ్ చేశాయి. ఐదు మాస్కులు ఉండే ఒక ప్యాక్కి రూ.500 చొప్పున ఇవి అందిస్తున్నాయి. రూ.100 నుంచి రూ.500 దాకా పలు ధరల్లో కాంబో ప్యాక్స్లో కూడా అందిస్తున్నారు. మరోవైపు చొక్కాల ఉత్పత్తికి పేరొందిన జోడియాక్ క్లాతింగ్ కంపెనీ లిమిటెడ్ కొత్త రకం చొక్కాలను కాంప్లిమెంటరీ మ్యాచింగ్ మాస్కులతో సహా అందుబాటులోకి తెచ్చింది. డబుల్ లేయర్డ్, వాషబుల్, రీ యూజబుల్ మాస్క్ని ఫ్యాబ్ ఇండియా రూపొందించింది. రూ.100కి మూడు మాస్కులు ఉన్న ప్యాక్ అలాగే రూ.150కి ఐదు మాస్కులున్న ప్యాక్ అందిస్తోంది. ‘డిమాండ్ను బట్టి ఉత్పత్తి పెంచుదామని అనుకుంటున్నాం. తక్కువ ధరలో లభించే సురక్షితమైన ఉత్పత్తి ఇది. మా సంస్థ మీద ఆధారపడిన చేనేత కళాకారులకి జీవనాధారంగా సహకరిస్తోంది. చిన్నారులకు మరో రెండు సైజుల్లో.. ఫ్యాబ్ ఇండియా ప్రతినిధి త్వరలో చిన్నారులకు మరో రెండు సైజుల్లో మాస్కులు తయారు చేయాలని, అలాగే సంస్థలకు, కార్పొరేట్స్కి పెద్ద మొత్తంలో బల్క్ ఆర్డర్స్పై సరఫరా చేయాలని సంస్థ ఆశిస్తోంది. సురక్షితమైన పద్ధతులు పాటించడం అలవాటు చేసుకోండని ప్రజలకు గుర్తు చేసేవే మాస్కులు. అందుకే మేం మాస్కులకు ధర చెల్లించమనడం లేదు. కస్టమర్స్ కొన్న ప్రతి షర్ట్కి ఒక మాస్క్ని ఉచితంగా పొందవచ్చు. మా కస్టమర్ల శ్రేయస్సు కోసమే అంటున్నారు జోడియాక్ క్లోతింగ్ కంపెనీ ప్రతినిధి. నగరానికి చెందిన నీరూస్ బ్రాండ్ కూడా నాన్ సర్జికల్ ఫేస్ మాస్క్ను రూపొందించి విడుదల చేసింది. జిప్ మాస్క్.. సేఫ్టీ టాస్క్.. సేఫ్టీ కోసం మాస్కులు ధరించడం ఇక లైఫ్లో భాగం కానుంది. ఇందులో కూడా స్టైల్ మిక్స్ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇటీవలే నేను తయారు చేసిన జిప్ మాస్క్కి మంచి డిమాండ్ వచ్చింది. ఎప్పటి నుంచో వినియోగిస్తున్న మంకీ క్యాప్, ముస్లిం మహిళలు వాడే స్కార్ఫ్ని స్ఫూర్తిగా తీసుకుని వర్కింగ్ ఉమన్కి రెడీ టు వేర్గా దీన్ని తయారు చేశా. బైక్స్ మీద ప్రయాణాలు, రకరకాల పనులు చేసేవారికి ఈ మాస్క్ చాలా సౌకర్యంగా ఉంటుంది. వింటర్లో వినియోగించే మంకీ క్యాప్స్.. బాయ్స్ టీ షర్ట్స్కి హెయిర్ కవర్గా వచ్చే హుడ్ని స్ఫూర్తిగా తీసుకుని బాయ్స్ మాస్కు తయారు చేశా. ఈ మాస్క్కి ఫ్రంట్ సైడ్ ఉండే జిప్ తీసేస్తే రెగ్యులర్ క్యాప్లా కూడా వినియోగించుకోవచ్చు. మల్టీ సైజ్కి సరిపోవాలంటే కాటన్ స్ట్రెచ్ అవదు కాబట్టి చేనేత ఫ్యాబ్రిక్తో రూపొందిన ఈ మాస్క్లో 90శాతం కాటన్ 10శాతం స్ట్రెచ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. వీటిని రానున్న వింటర్, వర్షాకాలానికి కూడా వినియోగించుకోవచ్చు. విభిన్న రకాల సింబల్స్తో, అన్ని వయసుల వారికి, టేస్ట్కి తగ్గట్టుగా తయారు చేస్తున్నా. – హేమంత్శ్రీ, ఫ్యాషన్ డిజైనర్ -
పిల్లలకు మాస్కులు పెను ప్రమాదం
ఫేస్ మాస్క్.. ఇప్పుడు జీవన విధానంలో ఒక భాగమైపోయింది. ఇది లేకపోతే ప్రమాదం అని అందరూ చెప్తున్న మాట. హాంకాంగ్లోని పరిశోధకుల అధ్యయనం ప్రకారం మాస్కులు కరోనా వంటి వైరస్ల వ్యాప్తిని నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సుమారు 3వేలమందిపై అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. ఫేస్ మాస్క్ ధరించనివారిలో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ ఫేస్ మాస్క్ వల్ల దుష్ప్రభావాలు లేవా? అంటే ఉన్నాయనే చెప్పొచ్చు. పైగా పిల్లలకు ఇవి ఎంతో హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో తగ్గిన ఆక్సిజన్ స్థాయి కొన్ని సందర్భాల్లో గంటల తరబడి మాస్క్ ధరించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గినట్లు తేలింది. సింథటిక్ పదార్థంతో తయారు చేసిన మాస్క్లను వినియోగించిన వారిలో ముఖంపై దద్దుర్లు వస్తున్నాయి. దీంతో ఎన్ 95, ఎన్ 99, కాటన్ మాస్క్ లేదా సొంతంగా మాస్క్లు తయారు చేసి వినియోగించుకోండని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు మాస్కులు ధరించడం ప్రమాదకరం అని జపాన్ పీడియాట్రిక్ అసోసియేషన్ సోమవారం హెచ్చరించింది. (ఫేస్మాస్క్ల గురించి మనకు ఏం తెలుసు?) అదే పనిగా మాస్క్.. న్యూమోనియాకు అవకాశం! 'ఫేస్ మాస్క్ ధరించడం వల్ల వారికి ఊపిరి పీల్చుకోవడం కష్టతరమవుతుంది, గుండెపై అధిక భారం పడుతుంది' అని అధ్యయనంలో తెలిపింది. మాస్కులు వాడటం వల్ల పిల్లల్లో శ్వాసకోస సమస్యలు ఎదురవుతాయని, న్యూమోనియాకు దారి తీసే ప్రమాదముందని హెచ్చరించింది. పిల్లల శరీరం నుంచి వెలువడే వేడిని సైతం బయటకు వెళ్లనివ్వకుండా మాస్కులు అడ్డుపడతాయని పేర్కొంది. రెండేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు మాత్రమే ఫేస్ మాస్కులను వినియోగించాలని అమెరికన్ సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) నొక్కి చెప్తోంది. (మాస్క్లతో రన్నింగ్ చేయవచ్చా?!) -
నిన్నటి వరకు సర్జికల్.. ఎన్–95లు.. నేడు..?
కుత్బుల్లాపూర్: కోవిడ్–19 ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల పరిశ్రమలు కుదేలవుతున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మన దగ్గర కరోనా పాజిటివ్ కేసులు అప్పుడప్పుడే కనిపిస్తున్న నాటి నుంచి ఒక్కో పరిశ్రమ ఉత్పత్తులు క్రమక్రమంగా తగ్గిపోతూ కొన్ని పూర్తిగానూ మరికొన్ని పాక్షికంగానూ దెబ్బతిన్నాయి. కరోనా ప్రభావంతో పరిశ్రమలు, వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయిన సందర్భంలో అప్పటి వరకు అంతగా డిమాండ్ లేని ఉత్పత్తులైన మాస్క్లు, గ్లౌజ్ల తయారీ ఇతర శరీర రక్షణ పరికరాల ఉత్పత్తుల పరిశ్రమలకు డిమాండ్ పెరిగింది. ఇందులో ముఖ్యంగా ‘మాస్క్’ ఉత్పత్తుల రంగం ఊపందుకుంది. నిన్నటి వరకు సర్జికల్.. ఎన్–95లు.. నేడు..? కోవిడ్– 19కు ముందు మాస్క్లు వేసుకునే వారే లేరు. తీవ్రంగా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, ఔషధ, కెమికల్ పరిశ్రమల్లో పనిచేసేవారు, పొల్యూషన్ పట్ల పూర్తి అవగాహన ఉన్నవారితో పాటుగా కొన్ని సందర్భాల్లో డాక్టర్లు, నర్సులు సర్జికల్ మాస్క్లు, ఎన్–95 మాస్క్లను ధరించేవారు. క్రమక్రమంగా కోవిడ్–19 ప్రభావం చూపిస్తున్న తరుణంలో నిన్నటి వరకు అందుబాటులో ఉన్న సర్జికల్, ఎన్–95 మాస్క్ల స్థానంలో కాటన్ గుడ్డలతో చేసిన మాస్క్లకు సైతం మంచి డిమాండ్ వచ్చింది. (ఫేస్మాస్క్ల గురించి మనకు ఏం తెలుసు?) విభిన్నంగా తయారీలో.. నిన్నటి వరకు సర్జికల్ లేదా ఎన్–95 తరహా మాస్క్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు విభిన్నమైన మాస్క్లు తయారు చేసి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. కోవిడ్ అనంతరం కూడా మాస్క్లకు డిమాండ్ ఉంటుందనేది స్పష్టమవుతున్న సందర్భంలో ఇప్పుడుమాస్క్ల తయారీతో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు తమ కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయి. వంద శాతం శానిటైజ్డ్, 100 శాతం కాటన్, ఇకో ఫ్రెండ్లీ నినాదాలతో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. కస్టమైజ్డ్.. ఎంబ్రయిడరీ మాస్క్లు.. మాస్క్ల తయారీ రంగం ఊపందుకోవడంతో కుటీర పరిశ్రమలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఎవరికి వారు విభిన్నంగా మాస్క్లను అందంగా, ఆకర్షణీయంగా రూపొందించేందుకు పోటీ పడుతున్నారు. పూర్తి రక్షణతో, అన్ని రకాల వయసు వారికి రకరకాల రంగులు– డిజైన్లతో కాంబో ప్యాక్లతో మార్కెట్లో ఉంచుతున్నారు. సాధారణంగా కాటన్ గుడ్డతో చేసిన మాస్క్ రూ.20 నుంచి రూ.40 వరకు ఉండగా వివిధ రకాల ప్యాటర్న్లు అయిన కలంకారీ– రూ.70, ఇకాట్– రూ.70, లెనిన్ ప్లేయిన్– రూ.85, కస్టమైజ్డ్ ఎంబ్రయిడరీ డిజైన్ మాస్క్లు– రూ.100, కిడ్స్ కార్టున్ బొమ్మలు ఉన్న మాస్క్ రూ.120లుగా విక్రయిస్తున్నారు. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ సైజ్లలో ఇవి లభ్యమవుతున్నాయి. -
ఫేస్మాస్క్ల గురించి మనకు ఏం తెలుసు?
ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాల పరిశోధకులు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వ్యాక్సిన్ తయారు చేసిన కొన్ని దేశాలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాయి. అయితే అప్పటి వరకు మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించడం, సామాజిక ఎడబాటు, వ్యక్తిగత పరిశ్రుభత పాటించడం మాత్రమే మనముందున్న మార్గాలు. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పలు దేశాలు లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయగా.. మరికొన్ని నిబంధనలు సడలించి ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాయి. ఇందులో భాగంగా దాదాపు 50 దేశాలు మాస్కు ధరించడం తప్పనిసరి చేశాయి. లేనిపక్షంలో భారీ జరిమానాలు విధించేందుకు సన్నద్ధమయ్యాయి. కరోనా కాలంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ఫేస్మాస్క్ల గురించి మనకు ఏయే విషయాలు తెలుసు?! ఒక్కసారిగా పెరిగిన రేట్లు.. కరోనా సోకకుండా ఉండేందుకు దాదాపుగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తున్నారు. వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మినపుడు లేదా దగ్గినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరలు మనపై పడకుండా ఇది అడ్డుకుంటుంది. అంతేకాదు గాలిలోని అనేకానేక సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆపేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరిస్తున్నారు. అంటువ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో మాస్కు వినియోగం తప్పనిసరిగా మారడంతో ఒక్కో మాస్కు ధర దాదాపు 1.25 డాలర్లకు పెరిగింది. ఇక హానికారక క్రిములను 95 శాతం ఆపగల సామర్థ్యం ఉన్న ఎన్95 వంటి మాస్కుల దాదాపు 25 డాలర్ల మేర రేటు పెరిగింది. ఇలాంటి తరుణంలో ఫ్యాషన్ హౌజ్లతో పాటు బీఎండబ్ల్యూ వంటి ప్రఖ్యాత కార్ల కంపెనీలు సైతం తమ సిబ్బంది కోసం ప్రత్యేకంగా మాస్కులు తయారు చేసేందుకు ఉపక్రమించాయి. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది? ఓ వ్యక్తి ఆరోగ్యవంతుడు అయినప్పటికీ కోవిడ్-19 సోకిన వ్యక్తికి సేవలు అందిస్తున్నట్లయితే తప్పనిసరిగా మాస్కు ధరించాలి. అదే విధంగా తుమ్ములు, పొడిదగ్గుతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు శానిటైజర్ వాడటంతో పాటుగా మాస్కు వేసుకోవాలి. ప్రాణాంతక వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఒక్కరు సాధారణ మాస్కు ధరించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇక యూకే ప్రభుత్వం... సామాజిక ఎడబాటు సాధ్యం కాని తరుణంలో(ఉదా: ప్రజా రవాణా) తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది. సామాన్య పౌరులు సాధారణ వస్త్రంతో తయారు చేసిన మాస్కుతో ముఖాన్ని కవర్ చేసుకోవచ్చని.. అయితే హెల్త్ వర్కర్లు మాత్రం సర్జికల్ మాస్కు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సైతం ఇదే తరహా సూచనలు చేసింది. ఏయే దేశాల్లో మాస్కులు తప్పనిసరి? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం తప్పనిసరిగా చేశాయి. వెనిజులా, వియత్నాం మార్చి 18న తొలుత నిబంధన విధించగా.. చెక్ రిపబ్లిక్ సైతం ఇదే బాటలో నడిచింది. అమెరికన్, లుఫ్తాన్సా, యునైటెడ్ తదితర ఎయిర్లైన్స్ కూడా విమానప్రయాణాల్లో మాస్కు ధరించాలని స్పష్టం చేశాయి. ఇంగ్లండ్, ఫ్రాన్స్ల మధ్య రైలు సర్వీసులు నడిపే యూరోస్టార్ కూడా కరోనా ప్రబలిన తొలినాళ్లలోనే మాస్కుల ఆవశ్యకతను అనుసరించి నిబంధన తీసుకువచ్చింది. కాగా కొన్ని దేశాల్లో మాస్కులు ధరించనట్లయితే భారీ జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్లో మాస్కులేకుండా ప్రజా రవాణాలో ప్రయాణం చేస్తే 145 డాలర్ల ఫైన్ చెల్లించాలి. ఎక్కడెక్కడ తయారవుతున్నాయి? మహమ్మారి కరోనాకు జన్మస్థానంగా భావిస్తున్న చైనా గతేడాది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మాస్కులు తయారు చేసిన దేశంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న సగం మాస్కులు చైనా తయారు చేసినవే. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డిస్పోజబుల్ మాస్కుల గ్లోబల్ మార్కెట్ విలువ 75 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వచ్చే ఏడేళ్లలో ఇది 50 శాతం మేర పెరుగనున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో మాస్కులకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఎంటర్ప్రెన్యూర్లు మాస్కుల తయారీకి ఆసక్తి చూపుతున్నారు. అయితే వారిలో చాలా మంది అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోతున్నారు. ఈ నాణ్యతను దృష్టిలో పెట్టుకుని అమెరికా, నెదర్లాండ్స్, స్పెయిన్, టర్కీ వంటి దేశాలు కొన్ని సంస్థలు తయారు చేసిన మాస్కులను తిరస్కరిస్తున్నాయి. ఎన్ని మాస్కులు అవసరం? ఎంత మేర ఉత్పత్తి? మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నెలకు దాదాపు 89 మిలియన్ల మాస్కులు అవసమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. అదే విధంగా 76 మిలియన్ల గ్లోవ్స్, 1.6 మిలియన్ గాగుల్స్, ఫేస్ విజర్స్ అవసరం పడుతాయని పేర్కొంది. కాగా కరోనా విజృంభించిన తొలినాళ్లలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు 300 మిలియన్ మాస్కులు అందుబాటులో ఉంచాలని అమెరికా అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో గతేడాది 550 మిలియన్ మాస్కులు తయారీ చేసిన స్థానిక ఫ్యాక్టరీ ఒకటి.. ఈ ఏడాది ఉత్పత్తిని గణనీయంగా పెంచి ఆ సంఖ్యను 2 బిలియన్లకు చేరుస్తామని వెల్లడించింది. డ్రాగన్ దేశం చైనా సైతం అన్ని రకాల మాస్కుల తయారీ సామర్థ్యాన్ని 10 మిలియన్ల నుంచి 115 మిలియన్లకు పెంచినట్లు ఫిబ్రవరిలో వెల్లడించింది. కాగా కొన్ని దేశాలు మాత్రం ఇతర దేశాల నుంచి మాస్కులు దిగుమతిపై నిషేధం విధించి.. ప్రత్యేక ఫ్యాబ్రిక్లతో అత్యాధునిక మాస్కులు రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి. మూడు రకాల మాస్కులు.. ప్రపంచవ్యాప్తంగా మూడు రకాల మాస్కులు ఉత్పత్తి అవుతున్నాయి. సర్జికల్, రిస్సిరేటర్, క్లాత్ ఫేస్ కవరింగ్ మాస్కులు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా సర్జరీ సమయంలో పేషెంట్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఆపరేషన్ థియేటర్లో సర్జికల్ మాస్కులు ఉపయోగిస్తారు. గాలిని శుద్ధి చేసే రిస్సిరేటర్లను కూడా రోగుల కోసం ఉపయోగిస్తారు. ఇక కరోనా కాలంలో మాస్కుల వినియోగం తప్పనిసరి కావడంతో ముఖాన్ని కవర్ చేసుకునేందుకు ఇంట్లోనే క్లాత్ మాస్కులు తయారు చేసుకోవాల్సిందిగా సీడీసీలు సూచిస్తున్నాయి. ఫేస్మాస్కుతో పాటు కళ్ల నుంచి వైరస్ లోపలికి ప్రవేశించే వీల్లేకుండా గాగుల్స్ ధరించాలని సలహా ఇస్తున్నాయి. -
మాస్కు జరిమాన: 3 లక్షల 43 వేలు వసూలు
బెంగళూరు : కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరి అయ్యింది. కొన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి .ఈ క్రమంలో మాస్కు ధరించకుండా బయటికి వచ్చిన వారిపై కర్ణాటక ప్రభుత్వం రూ. 200 జరిమాన విధించింది. ఈ జరిమానా ద్వారా ఇప్పటి వరకు 15 వేల మంది నుంచి మూడు లక్షల 43 వేలు వసూలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం సైతం మాస్కు ధరించకుండా బహిరంగంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై రూ. 1000 ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (కోవిడ్: ఆ కాంబినేషన్తో అద్భుత ఫలితాలు!) ‘మే 5 నుంచి ముఖానికి మాస్కులు ధరించకుండా బయటికి వచ్చిన 1715 మంది నుంచి రూ. 3,43,000 వేలను ప్రభుత్వం వసూలు చేసింది’ అని బెంగుళూరు మున్సిపల్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే జోన్ల వారిగా ఎంతమంది నుంచి ఎన్ని డబ్బులు వసూలు అయ్యాయనే విషయాన్ని చార్ట్ ద్వారా విడుదల చేసింది. కాగా కర్ణాటకలో ప్రతిరోజు 10 వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తన్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు.గురువారం రోజు 11,449 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు కర్ణాటకలో 1605 మంది కరోనా బారిన పడగా, 571 మంది మృతిచెందారు. వైరస్నుంచి కోలుకొని 41 మంది డిశ్చార్జి అయ్యారు. (విమాన సర్వీసులు అప్పుడే వద్దు) ఆదివారాల్లో పెళ్లిళ్లకు అనుమతిస్తాం.. ! -
మాస్క్లతో రన్నింగ్ చేయవచ్చా?!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా లాక్డౌన్ విధించిన పలు ప్రపంచ దేశాలు క్రమంగా సడలింపులు ఇస్తున్నాయి. అయితే కరోనా ముప్పు పూర్తిగా పోనంతకాలం లేదా కరోనాకు వ్యాక్సిన్ను కనుగొనేంతవరకు ముఖానికి మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని అన్ని దేశాలు చెబుతున్నాయి. వాకింగ్, జాగింగ్ల కోసం, వాహ్యాలీకి పార్కులకు వెళ్లేందుకు యూరప్ దేశాలు ఇప్పటికే అనుమతి ఇచ్చాయి. మున్ముందు భారత్లో కూడా వాకింగ్, జాగింగ్లకు అనుమతిచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మరి మాస్క్లు ధరించి జాగింగ్లు, వాకింగ్లు చేయవచ్చా? ముఖ్యంగా జాగింగ్లు చేసేటప్పుడు ఆయాసం రాదా? అదే క్రీడాకారులు రన్నింగ్ చేస్తే మరింత ఇబ్బంది ఉండదా? మాస్క్లు ధరించిన సాధారణ ప్రజలే దమ్మాడడం లేదని, ఆయాసం వస్తోందని చెబుతున్నారుగదా! మాస్క్లు ధరించడం వల్ల సరిగ్గా ఆక్సిజన్ అందగా ఆయాసం వస్తోందని, అనారోగ్యం కూడా ఏర్పడవచ్చని కొందరు వైద్యులు ఇప్పటికే హెచ్చరించారు. చైనాలో ఇటీవల ఓ 26 ఏళ్ల జాగర్ ముఖానికి మాస్క్ ధరించి నాలుగు కిలోమీటర్లు పరుగెత్తి కుప్పకూలిపోయారు. ఆయన్ని వుహాన్ సెంట్రల్ ఆస్పత్రిలో చేర్చగా, అతని ఎడమ ఊపిరితిత్తి 90 శాతం కుంచించుకు పోయిందని, గుండె కూడా కుడి వైపునకు జరిగిందని వైద్యులు తేల్చారు. అదే చైనాకు చెందిన ఇద్దరు 14 ఏళ్ల పిల్లలు మాస్క్లు ధరించి జాగింగ్ చేస్తూ కుప్ప కూలిపోయి చనిపోయారు. మాస్క్లు ధరించడం వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయా? చనిపోయిన ఆ ఇద్దరు పిల్లలకు అటాప్సీ చేయలేదు కనుక మాస్క్ల కారణంగానే వారు మరణించారని చెప్పలేం. కరోనా నుంచి తప్పించుకోవాలంటే బయటకు వెళ్లినప్పుడు మూడు లేయర్లుగల మాస్క్లు, లేదా ఎన్95 మాస్క్లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవి ధరించినా గాలిని పీల్చుకోగలం. ముక్కు, నోరుకు ఎలాంటి ఫిల్టర్ ఉన్నా గాలి పీల్చుకోవడం ఇబ్బందే అవుతుంది. పరుగెత్తుతున్నప్పుడు ముక్కుతోపాటు, నోటితో కూడా గాలిని ఎక్కువగా పీలుస్తారని, ఆ సమయంలో నోటికి ఆక్సిజన్ అవసరం పెరుగుతుందని ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’లో పని చేస్తోన్న డాక్టర్ అమోల్ పాటిల్ తెలిపారు. ముఖానికి మాస్క్ ధరించి పరుగెత్తడం కన్నా మాస్క్లు లేకుండా పరుగెత్తడమే బాగుంటుందని దర్శన్ వాగ్ లాంటి పలువురు కోచ్లు తెలిపారు. మాస్క్లు ధరించడం తప్పనిసరి అయినప్పుడు వాటిని క్రమంగా అలవాటు చేసుకోవడం మంచిదని వారు సూచించారు. మొదట్లో మాస్క్లతోని మెల్లగా ప్రాక్టీస్ చేయాలని, తర్వాత క్రమేణ వేగం పుంజుకోవాలని చెప్పారు. పరుగెత్తడం ఆపి, ఆయాసం తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఇతరులకు దూరంగా వెళ్లి మాస్క్లను తొలగించి గాలి పీల్చుకోవచ్చని చెప్పారు. మాస్క్లను ధరించి పరుగెత్తడం వల్ల ఊపిరితిత్తులు మరింత బలపడే అవకాశం ఉందని దర్శన్ వాగ్ తెలిపారు. -
మాస్క్లతో శ్వాసకోశ సమస్యలు!
లండన్: ఊపిరితిత్తులు లేదా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు కరోనా–మాస్క్లు ధరించరాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు. ఇవి ధరించడం వల్ల వారికి శ్వాసకోశ సంబంధిత సమస్యలు మరింత తీవ్రమైయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. సాధారణ ప్రజలు బిగువుగా ఉండే మాస్క్లను ధరించడం వల్ల వారికి ఆక్సిజన్ సరిగ్గా అందక ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని, వారు కూడా ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్లు ధరించక పోవడమే మంచిదని వారు సూచించారు. బయటకు వెళ్లినప్పుడు, అదీ పక్కవారితో రెండు మీటర్లు భౌతిక దూరాన్ని పాటించడం కుదరనప్పుడు మాత్రమే బిగువైన మాస్క్లను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ల గురించి ఆది నుంచి నిపుణుల పరస్పర విరుద్ధమైన ప్రకటనలతోని గందరగోళం నెలకొని ఉంది. తాజా ప్రకటనతోని అది మరింత గందరగోళంగా మారింది. సర్జికల్ మాస్క్లనేవి సర్జికల్ సిబ్బంది నుంచి రోగులకు రక్షణ కల్పించడంలో భాగంగా వచ్చాయని, వారు, వారితోపాటు రోగులు మాత్రమే మాస్క్లు ధరిస్తే సరిపోతుందనే వార్తలు తొలుత వచ్చాయి. సాధారణ సర్జికల్ మాస్క్ల వల్ల ప్రయోజనం లేదని, మూడు పొరలు కలిగిన ఎన్–95, అంతకన్నా నాణ్యమైన మాస్క్లు వేసుకోవడమే ప్రయోజనకరమని వైద్య నిపుణులు ఆ తర్వాత సూచించారు. (‘కరోనా’ను అడ్డుకునే మాస్క్లేమిటి?) వదులుగా ఉండే మాస్క్ల వల్ల లాభం లేదని, బిగుతుగా ఉండే మాస్క్లతోనే ప్రయోజనమంటూ ఆ తర్వాత వివరణలు వచ్చారు. రోగులు తప్పా ఇతరులు మాస్క్లను వాడడం వల్ల వారికి ప్రయోజనంకన్నా రిస్కే ఎక్కువంటూ హెచ్చరికలు చేశారు. మాటిమాటికి మాస్క్లను చేతులతోని సర్దు కోవడం వల్ల లేనివారు కూడా అనవసరంగా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి గందరగోళం కొనసాగుతుండగానే, ఎవరికి వైరస్ సోకిందో, ఎవరికి సోకలేదో తెలియదుకనుక ప్రజలందరూ మాస్క్లు ధరించాలంటే ప్రభుత్వాలే హెచ్చరికలు జారీ చేశాయి. పైగా 200 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఇప్పుడేమో బిగువైన మాస్క్ల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పా మిగతా వేళల్లో మాస్క్లు ధరించవద్దని చెబుతున్నాయి. (కరోనా: రోడ్డున పడ్డ 11 లక్షల మంది) -
ఇలా మాస్కు తీయకుండా తినేయండి
జెరూసలెం: నలుగురు స్నేహితులు ఒకచోట కలిసారంటే హైఫై ఇచ్చుకోవడాలు, గంటల తరబడి కబుర్లు చెప్పుకోడాలు ఉండేవి. కానీ కరోనా వల్ల ఈ పరిస్థితులు ఇప్పట్లో కనిపించేలా లేవు. దూరం నుంచే నమస్కారాలు, పలకరింపుగా నవ్వినా దాన్ని బయటకు కనిపించనీయకుండా అడ్డుగా ఉండే మాస్కులు. చిన్నా పెద్దా ప్రతి ఒక్కరి జీవనశైలిలో మాస్కు తప్పనిసరిగా మారిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో మాస్కు చికాకు పెట్టిస్తోంది. ముఖ్యంగా తినే సమయంలో మాస్కు ధరించి తినడం అసాధ్యం. కానీ దాన్ని సుసాధ్యమని నిరూపించాడో వ్యక్తి. మాస్కు పెట్టుకునే సుష్టిగా భోజనం చేశాడు. అదెలాగంటారా? మరేం లేదు. అది మామూలు మాస్క్ కాదు.. రిమోట్ కంట్రోల్ మాస్క్. నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఇది పెట్టుకుని భోజనం చేయడం ఎంతో సులువు. (మాస్కు పెట్టుకుంటారా? చీపురు పట్టుకుంటారా?) దానికి ఉన్న బటన్ను నొక్కితే నోటి దగ్గర మాస్కును తెరవచ్చు, మూయవచ్చు. తద్వారా ఎంతో సులువుగా భోజనం ముగించవచ్చు. ఎంతో ముచ్చటగా ఉన్న ఈ కొత్త రకం మాస్కును ఇజ్రాయెల్ ఇన్వెంటర్స్ తయారు చేశారు. దీని గురించి అవ్టీపస్ పేటెంట్స్ అండ్ ఇన్వెన్షన్స్ ఉపాధ్యక్షుడు అసఫ్ గిటెలీస్ మాట్లాడుతూ.. తినే సమయంలో మాస్కు దానంతటదే తెరుచుకుంటుందన్నారు. ఫోర్క్ మాస్క్ దగ్గరకు తేగానే గుర్తించి అది ఓపెన్ అవుతుందని, ఫోర్క్ను దూరం పెట్టగానే మళ్లీ మూసుకుపోతుందని తెలిపారు. లేదంటే బటన్ నొక్కి కూడా మాస్కును మూస్తూ తెరవచ్చన్నారు. త్వరలోనే ఈ మాస్కును మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ మాస్క్ ధరించి ఐస్ క్రీమ్ తినడం, జ్యూస్లు తాగడం మాత్రం కాస్త కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి, మున్ముందు దానికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా పరిష్కారం కనిపెడతారేమో! (కోవిడ్పై పోరులో ఇజ్రాయెల్ ముందంజ! ) -
రెడ్జోన్లో పోలీసులపై దాడి
ముంబై: ఫేస్ మాస్క్ లేకుండా బయటకు వస్తూ, లాక్డౌన్ నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రశ్నించిన పోలీసులపై దాడికి దిగారు కొందరు దుండగులు. ఈ దారుణ ఘటన గురువారం ముంబైలో చోటు చేసుకుంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఆంటోప్ హిల్ ప్రాంతం రెడ్ జోన్ పరిధిలో ఉంది. అక్కడ గురువారం 15 మంది వ్యక్తులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వచ్చారు. దీంతో వారిని గమనించిన పోలీసులు కరోనా వ్యాప్తి నివారణ జాగ్రత్తలు ఏమాత్రం పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (టార్గెట్ ‘ఆర్మీ’ !) ఫేస్ మాస్క్ కూడా ధరించకుండా బయట ఎందుకు తిరుగుతున్నారని వారిని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. వెంటనే ఆవేశంతో దుండగులు పోలీసులపై పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఒక ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయాలపాలయ్యారు. వారిని ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులపై దాడిని తీవ్రంగా పరిగణించిన పై అధికారులు దీనికి కారణమైన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (లాక్డౌన్: మహిళపై అఘాయిత్యం) -
మందు బంద్.. 50మంది మాత్రమే
బెంగళూరు: పెళ్లి అంటే ఒకప్పుడు బంధువుల హడావుడి.. డీజే సందడి, మందు-విందు కనిపించేవి. కానీ కరోనా దెబ్బతో ఇలాంటి వేడుకల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే ఇలాంటి వేడుకల మీద అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. పెళ్లి, ఇతర శుభకార్యాల్లో మందుకు అనుమతిలేదని.. 50 మందికి మించి ఈ వేడుకలకు హాజరు కాకుడదని తెలియజేసింది. ఈ నెల 17న దేశవ్యాప్తంగా మూడో దశ లాక్డౌన్ ముగియనుండటంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. (మాస్క్ ధరించడం ‘బలహీనతకు సంకేతం’! ) పెళ్లి, ఇతర ప్రైవేట్ ఫంక్షన్లకు 50మందికి మించి అనుమతి లేదని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. అలానే ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి అంది. పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల పైబడిన వారిని ఈ వేడుకలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వేడుకకు హాజరయ్యే వారి పూర్తి వివరాలను సేకరించాలని సూచించింది. అంతేకాక వేడుక జరిగే చోట శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్లు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించింది. మరి ముఖ్యంగా ఈ వేడుకల్లో మద్యపానానికి ఎట్టి పరిస్థితుల్లోను అనమతిచ్చేది లేదని కర్ణటక హోం శాఖ తెలిపింది. అలానే కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలు ఈ వేడుకలకు ఎట్టి పరిస్థితుల్లో హాజరుకాకుడదని పేర్కొంది.(లాక్డౌన్: ముంబై నుంచి బిహార్కు ఆటోలో) -
మాస్క్ ధరించడం ‘బలహీనతకు సంకేతం’!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తుంది. ఈ మహమ్మారి దరి చేరకుండా ఉండేందకు తీసుకునే జాగ్రత్తలో మాస్క్ ధరించడం తప్పనిసరి. అయితే స్క్ను ధరించేందుకు కొంతమంది పురుషులు ఇష్టపడటం లేదని యుకే, కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల ఆధ్యయనంలో తెలింది. ఎందుకంటే పురుషులు మాస్క్ ధరించడాన్ని బలహీనతకు సంకేతంగా భావిస్తున్నారని అందుకనే ఎక్కవ మంది పురుషులు మాస్క్ ధరించేందుకు ఆసక్తి చూపడం లేదని ఆధ్యయనంలో పేర్కొన్నారు. (మాస్కులు లేకుండా రోడ్డెక్కితే అంతే!) యుకేలోని మిడిల్ సెక్స్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియాలోని బర్కిలోని మ్యాథమెటికల్ సైన్స్ రీసెర్చ్ ఇనిస్టీట్యూట్ పరిశోధకులు మాస్క్ ధరించని పురుషులపై ఆధ్యయనం చేశారు. తప్పనిసరిగ ఫేస్ మాస్క్లు ధరించడమనేది మహిళల కంటే పురుషులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతున్నట్లు వారి అధ్యయనంలో వెల్లడించారు. అంతేగాక దీనిపై రచయితలు వాలెరియో కాపారో, హెలెన్ బార్సిలు కూడా వివరించారు. కొంత మంది పురుషుల మహిళలతో పోలీస్తే వారు ఈ వ్యాధి బారిన తక్కువగా పడతారని భావిస్తున్నారని వారి తెలిపారు. ‘ఫేస్ మాస్క్ ధరించడాన్ని సిగ్గుచేటుగా బలహీనతకు సంకేతంగా, కళంకం అని మహిళల కంటే ఎక్కువగా పురుషులు భావిస్తున్నారని వారి పరిశోధనలో వెల్లడించారు. అదే విధంగా ఈ లింగ భేదాలు కూడా ఫేస్ మాస్క్ ధరించడంపై కూడా ప్రభావం చూపుతున్నాయని కాపారో, బార్సిలో పేర్కొన్నారు. (సూర్యుడు కూడా ‘లాక్డౌన్’!) అయితే మహిళలతో పోలీస్తే పురుషులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తమ పరిశోధనలలో తెలినట్లు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి మహిళలో కంటే పురుషులలోనే అధిక రెట్టింపు ఉందని మంది వైద్య నిపుణులు కూడా అంచనా వేశారు. ఎందుకంటే పురుషుల రక్తంలో సాంద్రత ఎక్కువగా ఉన్నందున్న కణాలకు వైరస్ సోకడానికి సహాయపడే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుందని వైద్యులు పేర్కొన్నారు. కాగా ఈ ప్రాణాంతక వైరస్ తమ్ము, శ్వాస కోశ బిందువుల ద్వారా మాత్రమే కాకుండా మనిసి దగ్గరగా ఉండి మాట్లాడే సమయంలో ఏరోసోల్స్ నుంచి కూడా వ్యాపిస్తుందని కొన్ని ఆధ్యయనాలల్లో వెల్లడవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి అని సిఫారసు చేసింది. (కరోనా పేషెంట్పై కేసు నమోదు..) -
మాస్కులు లేకుండా రోడ్డెక్కితే అంతే!
సాక్షి, హైదరాబాద్ : ఇకపై మాస్కులు లేకుండా రోడ్డెక్కితే చర్యలు తప్పవు. ఇందుకోసం తెలంగాణ పోలీస్ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. రోడ్డుపై మాస్కులు లేకుండా తిరిగేవారిని గుర్తించటానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనుంది. సీసీటీవీ నిఘాలో లివరేజింగ్ కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్ టెక్నిన్కు ప్రవేశపెట్టనుంది. తద్వారా మాస్కులు ధరించని వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోనుంది. త్వరలో హైదరాబాద్-రాచకొండ-సైబరాబాద్ కమిషనరేట్లో ఈ టెక్నాలజీని అమలు చేయనుంది. ఇలాంటి పద్దతిని పాటించటం ఇండియాలో ఇదే మొదటిసారి కావటం గమనార్హం. కాగా, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు లేకుండా తిరిగిన వారిపై రూ.1000 జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జరిమానా ఒక్కసారికి మాత్రమే పరిమితం కాదు. మాస్కులు లేకుండా తిరిగి పట్టుబడిన ప్రతీసారి రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. చదవండి : మాస్క్ లేకుంటే జరిమానా రూ. 1,000 -
తిరిగి సెట్స్కు వెళ్లాలంటే భయంగా ఉంది
పలు రాష్ట్రాల్లోని ఆరెంజ్, గ్రీన్ జోన్లలో లాక్డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చాయి. పలు పరిశ్రమలు కొన్ని నిబంధనలు పాటిస్తూ తిరిగి యథావిధిగా పని చేసుకోవాల్సి ఉంటుంది. మరి చిత్ర పరిశ్రమ? సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ ధరించడం, పరిమిత వ్యక్తులతో పనిచేయడం ఎంతవరకు జరిగే పని? ఇది అసాధ్యమంటున్నాడు బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్. కరోనా కారణంగా ఇప్పటికే షూటింగ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సినిమాలు వాయిదా పడ్డాయి. కరోనా తర్వాత పరిస్థితులు ఎంతలా మారనున్నాయో తలచుకుంటేనే ఆందోళగా ఉందంటున్నాడు. తిరిగి సెట్స్కు వెళ్లాలంటే తనకూ అభద్రతగానే ఉందంటున్నాడు. (‘నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా’) "లాక్డౌన్ తర్వాత నటుడు ఫేస్ మాస్క్ లేకుండానే కెమెరా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల నుంచి ఇతరులతో అత్యంత సన్నిహితంగా మెలగడం వరకు అన్నీ ఉంటాయి. వీటన్నింటినీ ఇండస్ట్రీ ఎలా ఎదుర్కొంటుందా అని ఆలోచిస్తున్నాను. ఇక మా ఇంటి విషయానికొస్తే.. నా పిల్లలు ఇప్పుడు బుద్ధిగా ఆలోచిస్తున్నారు. నా కుమార్తె మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్లి అక్కడ తన స్నేహితురాలితో ఆడుకునేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకుని అక్కడికి వెళ్లడమే మానేసింది. లాక్డౌన్ తన ఇంట్లో ఎన్నో పాజిటివ్ అంశాలను నేర్పించింది" అంటున్నాడు సంజయ్ కపూర్. కాగా ఆయన సినీ పరిశ్రమకు వచ్చి నేటితో 25 వసంతాలు పూర్తయ్యాయి. (బుల్ బుల్ మ్యారేజ్ హాల్) -
ఫేస్ మాస్క్ ఉంటేనే పెట్రోల్, డీజిల్
పనాజి : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు గోవా ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న గోవా.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ముఖాలకు మాస్క్ లేకపోతే వాహనాలకు పెట్రోల్ పోసేదిలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ బంకుల యాజామాన్యలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే రేషన్ షాపుల వద్దకు కూడా మాస్క్లతో రావాలని, లేకపోతే రేషన్ నిలిపివేస్తామని హెచ్చరించింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది. (రెడ్ జోన్లో దేశ రాజధాని జిల్లాలు) కాగా గోవాలో ఇప్పటి వరకు కేవలం 7 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైన విషయం తెలిసిందే. వారంతా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గతంలోనే ప్రకటించింది. అయినప్పటికీ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్త చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగా బహిరంగ ప్రదేశాలకు వచ్చిన్నప్పుడు ప్రజలంతా మాస్క్లు ధరించేలా ప్రజల్లో చైతన్యం కలిగిస్తంది. (కిలో మటన్ రూ. 700కే అమ్మాలి) -
మాస్కు పెట్టుకుంటారా? చీపురు పట్టుకుంటారా?
కరోనా వైరస్ పుణ్యమాని మనుషుల మధ్య దూరం పెరిగింది. ముఖం కూడా సరిగా కనిపించకుండా మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. పొరపాటున మాస్కు లేకుండా వెళ్లామో.. జేబుకు చిల్లు పడక తప్పదు, లేదా పోలీసుల చేతిలో చీవాట్లు తప్పవు. అయితే ఓ దేశం మాత్రం తప్పు చేసినవారికే బుద్ధి వచ్చేలా తగిన గుణపాఠం చెబుతోంది. అందుకోసం బలవంతంగా వారితో రోడ్లు శుభ్రం చేసే కార్యక్రమానికి పూనుకుంది. వివరాల్లోకి వెళితే.. మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజొలీనా కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశంలోని పలు నగరాల్లో ఫేస్ మాస్కు ధరించడం తప్పనిసరి చేశాడు. ఈ కొత్త నిబంధన సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ కొంతమంది ఈ మాటలను పెడచెవిన పెట్టి దర్జాగా రోడ్ల మీదకు వచ్చారు. (కరోనా: 189 మంది వలస కార్మికుల మృతి) ఇంకేముందీ పోలీసులు వారిని రౌండప్ చేసి చేతికి చీపురిచ్చారు. "మమ్మల్ని వదిలేయండి, ఇంకోసారి మాస్కు లేకుండా బయటకు రాబోమ"ని చెప్పినప్పటికీ వదల్లేదు. దీంతో చేసిన పాపం ఊరికే పోతుందా అనుకుంటూ భారంగా ఓ నిట్టూర్పు వదులుతూ రోడ్లపై ఊడ్చే కార్యక్రమానికి దిగారు. ఇలా ఒకరిద్దరికి కాదు.. 25 మందికి దుమ్ము దులిపే శిక్షను విధించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదిలా వుండగా ఈ దేశంలో ఇప్పటివరకు 128 కరోనా వైరస్ కేసులు నమోదవగా 75 మంది కోలుకున్నారు. ఇంతవరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. (సముద్ర వీరుల ప్రపంచ రికార్డు) -
తల్లీబిడ్డల ఫేస్ మాస్క్ : వైరల్ ఫోటో
సాక్షి, కొత్తగూడెం : అడవి బిడ్డలకు అక్కడ దొరికే అకులు అలమలే వారికి ఆహారము, వైద్యమూ. సరిగ్గా వైద్య సదుపాయంలేని ఆ కొండకోనల్లో దొరికే ప్రతి మొక్క వారికి ఓ మూలికే. చిన్న చిన్న అనారోగ్యాలకు గాయాలకు సైతం ఆకుపసర వైద్యంతోనే నెట్టుకొచ్చేస్తుంటారు. ప్రపంచమంతటా మానవాళిని కరోనా మహమ్మారి కలవరపెడుతున్న వేళ మాస్క్లనీ, శానిటైజర్లనీ, సామాజిక దూరమంటూ జాగ్రత్త పడతున్న తరుణమిది. ఈ నేపథ్యంలో కరోనా నుంచి తమను తాము కాపాడుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గంగమ్మ కాలనీలో ఆకులను మాస్క్కు మార్చి ఓ తల్లీబిడ్డా ధరించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలువురు ప్రముఖులు సైతం దీనిని నెట్టింట షేర్ చేస్తున్నారు. (బళ్లారి టు భద్రాద్రి.. 637 కి.మీ నడకయాతన) ఇక కరోనా సోకకుండా అడవుల్లో ఉండే గిరిజనులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆకులతో సొంతంగా మాస్క్లు తయారుచేసి ముఖాలకు ధరిస్తున్నారు. నాలుగు గంటలపాటు తాజాగా ఉండే ఈ ఆకుల మాస్కులు ధరించి గొత్తికోయలు రోజువారి పనులు చేసుకుంటున్నారు. – దశరథ్ రజువా, సాక్షి ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం -
విమానం ఎక్కాలంటే మాస్క్లు ఉండాల్సిందే
ఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభణతో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో నిత్యావసరాల సేవలు మినహా అన్ని ప్రయాణాలు రద్దయ్యాయి. మార్చి 25 నుంచి కేంద్రం అన్ని రకాల విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ముందులాగే విమానాల్లో ప్రయాణం చేయడం అంత ఈజీ కాదని తెలుస్తుంది. కఠిన ఆంక్షలు, భద్రత మధ్యే ప్రయాణికులు విమానాలు ఎక్కనున్నారు. (ధారావిలో కరోనా కేసుల తగ్గుముఖం) ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కేవారు తప్పనిసరిగా మాస్క్ను ధరించాల్సిందేనని, ఇది ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందికి కూడా అమలవుతుందంటూ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విమానంలో అందించే మీల్స్ను రద్దు చేయడంతో పాటు లావెటరీ(టాయిలెట్)లను కూడా పరిమితం సంఖ్యలో వాడనున్నట్లు తెలిపారు. లాక్డౌన్ తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల పట్ల కొత్త రూల్స్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర విమానాయాన శాఖకు లేఖ ద్వారా సమాచారం అందిచినట్లు తెలిసింది. ఒకవేళ మే 3 తర్వాత లాక్డౌన్ ఎత్తివేస్తే విమాన సేవలు తిరిగి ప్రారంభమైతే ప్రయాణికులు ఎలాంటి సామాజిక దూరం పాటించకుండానే రోజుకు వందల సంఖ్యలో విమానాశ్రయాలకు పోటెత్తుతారు. దీంతో వారిని అదుపు చేయలేక పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండొచ్చనే భావనతో లాక్డౌన్ తర్వాత కూడా కొన్ని రోజులు ఆంక్షలు కఠినతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. (లాక్డౌన్ వేళ.. ఏఈఓ హోంవర్క్) ఇదే విషయమై ఒక సీఐఎస్ఎఫ్ అధికారి మాట్లాడుతూ.. 'కట్టుదిట్టమైన భద్రత మధ్యే ప్రయాణికులను అనుమతిస్తాము. ఎయిర్పోర్ట్కు వచ్చే ప్రయాణికులకు ముందుగా థర్మల్ స్క్రీనింగ్ చేస్తాము. వారికి ఎలాంటి లక్షణాలు , ఫ్లూ జ్వరం లాంటివి లేకపోతేనే టర్మినెల్కు వెళ్లేందుకు అనుమతిస్తాము. ఫేస్ మాస్క్ను ధరించని వారిని టర్మినెల్లోకి అనుమతించే అవకాశం లేదు. ప్రయాణికుల మధ్య సామాజిక దూరం పాటిస్తూనే వారిని విడతల వారిగా విభజించి అన్ని రకాల మెడికల్ టెస్టులు చేసిన తర్వాతే విమానం ఎక్కడానికి అనుమతిస్తాం.ప్రయాణ సమయంలో ప్రయాణికులకు కేవలం నీరు తప్ప ఎలాంటి స్నాక్, మీల్స్ అందించరు. విమానంలోని లావెటరీస్ను కూడా పరిమిత సంఖ్యలోనే వాడుతారని' వెల్లడించారు. దీనిపై ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. -
మాస్క్తో భూమికి సమీపంలో 1998 గ్రహశకలం..!
ఫేస్ మాస్క్ ధరించినట్లుగా కనిపిస్తున్న ఓ గ్రహశకలం ఫొటో ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. దాదాపు మౌంట్ ఎవరెస్ట్లో సగపరిమాణం ఉన్న ఈ గ్రహశకలం ఫొటోలను నాసా శాస్త్రవేత్తల బృందం ట్విటర్లో శుక్రవారం షేర్ చేసింది. అత్యంత పెద్ద పరిమాణాన్ని కలిగిన గ్రహశకలం.. కనీసం 1.5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచన వేస్తున్నారు. అయితే ఇది వచ్చేవారంలో భూమి నుంచి ఎగురనున్నట్లు కూడా శాస్త్రవేత్తలు వెల్లడించారు. (కరోనా: చనిపోతానని తెలిసి.. భార్యను..!) ఈ ఫొటోను ‘#రాడార్టీం,@NAICobservatory శాస్త్రవేత్తల బృందం.. సరైనా రక్షణ చర్యలతో పరిశీలిస్తున్న సమయంలో ఈ చిత్రాన్ని కనుగొన్నాము. దీనిని 1998 OR2 నాటి గ్రహశకలంగా గుర్తించాం. ఇది భూమీకి అత్యంత సమీపంలో ఉండి ముసుగును ధరించిన ఆకారంలో కనిపిస్తుంది’ అంటూ ట్వీట్ చేసిన ఈ ఫొటోకు ఫేస్ మాస్క్ ధరించి ఉన్న సిబ్బంది ఫొటోలను జత చేసి షేర్ చేశారు. ప్యూర్టో రికోలోని అరేసిబో అబ్జర్వేటరీ రాడార్ తీసిన ఈ ఫొటోలో గ్రహశకలం ఫేస్ మాస్క్ను ధరించినట్లు కనిపిస్తుండంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సిఎన్ఎన్ న్యూస్ ప్రకారం.. 52768 (1998 OR2) అని పిలువబడే గ్రహశకలం మొట్టమొదట 1998లో గుర్తించబడింది. ఏప్రిల్ 29న ఇది భూమికి 3.9 మిలియన్ మైళ్ళ దూరంలో వెళుతుందని, ఇది భూమి, చంద్రుల మధ్య 16 రెట్లు దూరం కలిగి ఉంటుందని సమాచారం.(అప్పట్లో స్కైల్యాబ్.. ఇప్పుడు కరోనా!) #TeamRadar and the @NAICobservatory staff are taking the proper safety measures as we continue observations. This week we have been observing near-Earth asteroid 1998 OR2, which looks like it's wearing a mask! It's at least 1.5 km across and is passing 16 lunar distances away! pic.twitter.com/X2mQJCT2Qg — Arecibo Radar (@AreciboRadar) April 18, 2020 కాగా అరేసిబో అబ్జర్వేటరీ రాడార్ ఇటీవల ఈ గ్రహశకలం చిత్రాన్ని తీసింది. అబ్జర్వేటరీలోని శాస్త్రవేత్తలు, టెలిస్కోప్ ఆపరేటర్ల బృందం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఫేస్మాస్క్ ధరించి పనిచేస్తుండగా రాడార్ పంపిన ఈ చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది అచ్చం ఫేస్ మాస్క్ను ధరించినట్లు ఉండటంతో ఈ ఫొటోను ట్విటర్లో పోస్టు చేశారు. కాగా దాదాపు 500 అడుగుల మించిన పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం భూమి కక్ష్య నుంచి 5 మిలియన్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ప్రమాదకరమైన గ్రహశకలమని కూడా చెప్పారు. అయితే ఇది భూమి సమీపంలో ఉన్నప్పటికీ భూమిని తాకే అవకాశం లేదని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
మాస్కులు తయారు చేసిన భారత ప్రథమ మహిళ
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్ కరోనాపై వ్యతిరేక పోరులో తనవంతు చేయూతను అందించారు. కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న కృషికి ఆమె బాసటగా నిలిచారు. నిరాశ్రయుల కోసం బుధవారం రాష్ట్రపతి భవన్లోని శక్తి హాత్ వద్ద స్వయంగా కుట్టు మిషన్పై ఫేస్ మాస్క్లు కుట్టారు. వీటిని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు ద్వారా వివిధ ప్రదేశాలలో ఆశ్రయం పొందుతున్న వారికి అందజేయనున్నారు. సవితా స్వయంగా మాస్కులు తయారు చేస్తూ.. కరోనాపై వ్యతిరేక పోరాటంలో దేశంలోని ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలనే సందేశాన్ని ఇచ్చారు. అయితే మాస్కులు కుడుతున్న సమయంలోనూ ఆమె ముఖానికి మాస్కు ధరించడం విశేషం. ( ఆ ఎడిటర్ను పెళ్లి చేసుకోవాలని ఉంది: వర్మ) ఇక దేశ వ్యాప్తంగా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. 130 కోట్ల మందికి పైగా ఉన్న దేశంలో కరోనాను కట్టడి చేయడం కత్తి మీద సాములాగా తయారయింది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు దేశంలో మే 3 వరకు లాక్డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత, ముఖానికి మాస్క్లు ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని వైద్యులు తెలియజేస్తూనే ఉన్నారు. కాగా భారత్లో కరోనా కేసులు గురువారం ఉదయం నాటికి 20, 471 నమోదవ్వగా.. 652 మంది మృత్యువాత పడ్డారు. 3960 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. (‘రాజీనామా చేయమంటున్నారు.. కానీ..’ ) -
ఫోర్హెడ్ థర్మామీటర్, ఫేస్ మాస్క్ ఆవిష్కరణ
-
దేశీయ ఫోర్హెడ్ థర్మామీటర్, ఫేస్ మాస్క్ ఆవిష్కరణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్కు చెందిన గ్రీన్ ఓషన్ రీసెర్చ్ లాబ్స్ రూపొందించిన ఇన్ ఫ్రా రెడ్ నాన్ కాంటాక్ట్ ఫోర్ హెడ్ థర్మామీటర్, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్లను బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ మాస్క్, థర్మామీటర్ పని తీరును ఏపీ మెడ్టెక్ జోన్కు చెందిన గ్రీన్ ఓషన్ రీసెర్చ్ ల్యాబ్స్ డైరెక్టర్స్ ఏ శృతి, ఎం సాయిరాం ముఖ్యమంత్రికి వివరించారు. ► తొలిసారి దేశీయంగా ఇన్ ఫ్రా రెడ్ నాన్ కాంటాక్ట్ ఫోర్ హెడ్ థర్మామీటర్, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్లు తయారు చేస్తున్నామని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో స్థానికంగా ఉన్న ఉద్యోగులతోనే ఈ పరికరాలను తయారు చేస్తున్నామని వెల్లడించారు. ► కోవిడ్–19 వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా స్థానికంగా అందుబాటులో ఉన్న ఉద్యోగులతోనే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ► ప్రస్తుతం రోజుకు 1,000 థర్మామీటర్లు తయారు చేస్తున్నామని, మన రాష్ట్ర అవసరాల అనంతరం త్వరలోనే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే దిశగా ఉత్పత్తిని పెంచుతామని వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. -
మాస్కు పెట్టుకోనందుకు కొడుకును..
కోల్కతా: ఫేస్ మాస్క్ పెట్టుకోడానికి నిరాకరిస్తున్నాడని కన్న కొడుకుని హతమార్చాడో తండ్రి. ఈ దారుణ ఘటన శనివారం కోల్కతాలో చోటు చేసుకుంది. ఉత్తర కోల్కతాలోని శోవాబజార్లో బన్సీదార్ మాలిక్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి దివ్యాంగుడైన ఓ కొడుకున్నాడు. ఇదిలా వుండగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఫేస్ మాస్క్ తప్పనిసరని అధికారులు సూచిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతని కుమారుడు ముఖానికి ఎలాంటి మాస్కు ధరించకుండానే బయట తిరుగుతున్నాడు. లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్లడమే తప్పంటే, పైగా మాస్కు ధరించకుండా తిరగడమేంటని.. పలుసార్లు చెప్పేందుకు ప్రయత్నించాడు. (పోలీసులంటే జనాల్లో ఉండే జవాన్లు..) అయినప్పటికీ అతని మాటలను బేఖాతరు చేస్తూ అతని కుమారుడు శనివారం మరోమారు మాస్కు కట్టుకోకుండా బయటకు వెళ్లాడు. దీంతో ఆగ్రహం చెందిన బన్సీదార్.. కొడుకు ఇంటికి రాగానే నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరికీ మాటామాటా పెరగడంతో పెద్ద గొడవగా మారింది. సహనం కోల్పోయిన తండ్రి ఆవేశంలో కొడుకును గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (అంధులకు సవాల్గా మారిన భౌతిక దూరం) -
డైపర్ను మాస్కుగా వాడిన సన్నీలియోన్
ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే సమయంలో మాస్క్ తప్పనిసరి. మరి ప్రతి ఒక్కరి దగ్గరా మాస్కులు ఉన్నాయా అంటే నిశ్శబ్ధమే రాజ్యమేలుతుంది. అత్యవసర పని పడినప్పుడు ముఖానికి ఏం కట్టుకుని వెళతారు? మాస్కు ఉంటే సరి, లేకపోతే కర్చీఫ్, దుపట్టా, స్కార్ఫ్ ఇలా మిగతా దారులను చూసుకుంటాం. కానీ వీటితోపాటు మరో వస్తువు కూడా ఎమర్జెన్సీ మాస్క్గా ఉపయోగపడుతుందంటోంది బాలీవుడ్ హాట్ స్టార్ సన్నీలియోన్. మొదట్లో తన పిల్లలకు మాస్కు కట్టడానికి ఎంతో బాధపడిన ఈ భామ ఇప్పుడు వాటితోనే ఎన్నో ప్రయోగాలు చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. (తిరుగులేని సన్నీలియోన్, మళ్లీ..) ఎలాంటి కష్టం లేకుండా కూచున్న చోటే కొంగొత్త మాస్కులను మాస్కు సిద్ధం చేసుకోవచ్చని సెలవిస్తోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో డైపర్లను ముఖానికి ధరించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇలా అత్యవసర పరిస్థితుల్లో డైపర్ను ఎమర్జెన్సీ ఫేస్మాస్క్గా వాడుకోండని సలహా ఇచ్చింది. ముఖానికి ఓసారి స్కార్ఫ్ కట్టుకోగా, మరోసారి బాక్సింగ్ గ్లవ్స్ను ధరించింది. చిన్నపిల్లల ఆటబొమ్మలను కూడా వదిలిపెట్టకుండా సింహం బొమ్మను ముఖానికి కట్టుకున్న ఫొటోను సైతం షేర్ చేసింది. సన్నీ క్రేజీ ఆలోచనలకు అభిమానులు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. (కరోనా: మాస్క్ పెట్టుకోలేదని లేదని కేసు) View this post on Instagram When you have just 30 secs to make an emergency Face mask 😷 during evacuation!! Just here to bring a little sunshine and humor to the stressful lockdown we all are facing !!!! Keep safe and be smart !!! Love you all !!! . #LockedUpWithSunny #SunnyLeone @lockedupwithsunny A post shared by Sunny Leone (@sunnyleone) on Apr 16, 2020 at 2:44am PDT -
ఇలా మాస్క్ తయారు చేయండి: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ : కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. దీంతో అత్యవసర పని మినహా మిగతా వాటికి జనాలు బయట తిరగడానికి వీల్లేదని అధికారులు తేల్చి చెప్తున్నారు. అయితే ఆ అత్యవసర పని నిమత్తం గడప దాటిన మరుక్షణం నుంచి మాస్క్ తప్పనిసరి. దీంతో మార్కెట్లో వాటి డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో.. దొరికిందే చాన్సని కొందరు రెట్టింపు ధరలకు అమ్మడం ప్రారంభించారు. దీనిపై మండిపడ్డ ప్రభుత్వం మాస్కులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో వాటి రేట్లు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే మాస్కుల కోసం దుకాణాల వెంట తిరగాల్సిన పని లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్తున్నారు. (లోక్సభలో ‘ఉన్నావ్’ రభస) ఇంట్లోనే ఉండి ఎంతో సులువుగా మాస్కు తయారు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో మాస్క్ ఎలా తయారు చేయాలో చెప్తూ దానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ముందుగా కత్తెరతో వస్త్రాన్ని నిర్దిష్ట ఆకృతిలో కత్తిరించారు. అనంతరం కుట్టు మిషన్ లేకపోతే దానికి బదులుగా సూది, దారాన్ని వాడమని చెప్తూ చేతిపైనే ఎలా కుట్టాలో చూపించారు. ఈ విధంగా సులభంగా మాస్క్ తయారు చేసుకోండంటూ.. చివరగా తాను చేసిన ఫేస్ మాస్క్ను చూపించారు. కాగా మాస్క్ లేకుండా బయటకు వస్తే కొన్నిచోట్ల జరిమానాలు సైతం విధిస్తున్న విషయం తెలిసిందే. (కుప్పలు కుప్పలుగా కరోనా మృతదేహాల ఖననం) -
ముఖానికి మాస్క్ పెట్టుకోలేదని..
పుణె: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల నేపథ్యంలో నిబంధనలు ఉల్లఘించిన వారిపై మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. లాక్డౌన్లో ఇంటి నుంచి బయటకు రాడమే కాకుండా, ముఖానికి మాస్క్ పెట్టుకోలేదన్న ఆరోపణలతో ఏడుగురిపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. కుడ్లీవాడీ ప్రాంతానికి చెందిన ఈ ఏడుగురు గురువారం మాస్క్ లేకుండా బయట తిరుగుతుండటంతో పింప్రీ-చించవాద్ పోలీసులు ఈ మేరకు చర్య తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. కోవిడ్-19 విస్తృతి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో విధిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించని వారిని అరెస్ట్ చేసేందుకు వెనుకాడమని బీఎంసీ అధికారులు హెచ్చరించారు. కాగా, దేశంలోని చాలా నగరాల్లో ఈ నిబంధన అమలు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబైతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి. జమ్మూకశ్మీర్లో కూడా ముఖానికి మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. చదవండి: కరోనా.. ఐటీ శాఖ కీలక నిర్ణయం -
మాస్క్లు వదిలేసి, చున్నీ కట్టుకోండి: విజయ్
కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విజయ్ దేవరకొండ ముందు నుంచీ సలహాలు అందిస్తూనే ఉన్నాడు. తాజాగా మాస్కుల కొరత ఎక్కువగా ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభిమానులకు ఓ ముఖ్య విషయాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కర్ఛీఫ్ ధరించి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. "ప్రియమైన అభిమానులందరూ జాగ్రత్తగానే ఉన్నారని ఆశిస్తున్నాను. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అందరూ ఏదో ఒకలాగానైనా ముఖాన్ని కవర్ చేసుకోండి. (ఆ ఇద్దరితో నటించాలని ఉంది: విజయ్) అయితే మాస్క్లు మాత్రం వైద్యులకు వదిలేయండి. దానికి బదులుగా కర్ఛీఫ్ కట్టుకోండి. లేదంటే స్కార్ఫ్ ధరించండి, అదీ కుదరకపోతే కనీసం మీ తల్లి చున్నీనైనా వాడండి" అని సూచించాడు. అయితే విజయ్ టిప్స్పై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. మమ్మీ చున్నీ కట్టుకుని అబ్బాయిలు రోడ్లపై ఎలా తిరుగుతారు? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అతని అభిమానులు మాత్రం.. విజయ్ ఏది చెప్పినా క్రేజీగా ఉంటుందని వెనకేసుకొస్తున్నారు. కాగా ఈ రౌడీ మోస్ట్ డిజైరబుల్ మెన్-2019 జాబితాలో వరుసగా రెండో సారి మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. (వరుసగా రెండోసారి రౌడీనే..) -
ఆ రెండూ దొరకట్లేదు..
సాక్షి, హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్ను కట్టడి చేసేందుకు దోహదం చేసే మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్వాష్, డెటాల్ తదితర ఉత్పత్తుల రేట్లు గణనీయంగా పెరిగాయి. మరోవైపు కృతిమ కొరత కూడా సృష్టిస్తూ రేట్లు పెంచి యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లాక్డౌన్ను మరికొన్ని రోజులు పొడిగిస్తారనే ప్రచారంతో రక్తపోటు, మధుమేహానికి సంబంధించిన మాత్రలు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఇక అజిత్రోమైసిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. అజిత్రోమైసిన్ మాత్ర రూ.22 ఉండగా, ఇప్పుడు రూ.30–32 వరకు పలుకుతోంది. మాస్కులకు కటకట.. కరోనా మహమ్మారి విశ్వరూపం చూపుతుండటం.. వైరస్ నియంత్రణకు నిరంతరం చేతులు శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు, ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. దీంతో మార్కెట్లో మాస్కులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇక ఎన్–95 మాస్కుల ధరలకైతే రెక్కలొచ్చాయి. నెల రోజుల క్రితం వరకు రూ.75 ఉన్న ఈ మాస్కు ధర ప్రస్తుతం రూ.350 నుంచి 400కు చేరింది. మామూలు మాస్కుల ధర రూ.3–5 నుంచి 25–30 వరకు పెరిగింది. ఇక హ్యాండ్వాష్లు అంతంతగానే లభ్యమవుతున్నాయి. హ్యాండ్వాష్కు ఉపయోగించే శానిటైజర్లు, డెటాల్, శావిలియన్ సబ్బులు కూడా దొరకడంలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు నకిలీ శానిటైజర్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. కరోనా భయంతో ఉన్న ప్రజలను మోసగించేందుకు నకిలీ శానిటైజర్ల తయారీ ముఠాలు రంగంలోకి దిగాయి. పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో నకిలీ శానిటైజర్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. నకిలీ శానిటైజర్ల వాడకంతో చేతులకు బొబ్బలు వస్తున్నట్లు గుర్తించినందున జాగ్రత్త వ్యవహరించాలని సూచించింది. మరోవైపు ప్రముఖ కంపెనీలు విక్రయించే శానిటైజర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనికితోడు లాక్డౌన్తో సరుకు రవాణా నిలిచిపోవడం, ఉత్పత్తులపై కూడా ప్రభావం చూపడంతో ప్రస్తుతం మార్కెట్లో శానిటైజర్లు మచ్చుకైనా కనిపించట్లేదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ అమ్మకాలు బంద్ హైడ్రాక్సీ క్లోరోక్విన్, హెచ్సీక్యూఎస్ టాబ్లెట్ల అమ్మకాలను ప్రభుత్వం దాదాపు నిలిపేసింది. శ్వాసకోస, మలేరియా రోగుల కోసం వినియోగించే ఈ మాత్రలే ప్రస్తుతం కరోనా బాధితుల కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉపద్రవం ముంచుకొస్తే ఈ మాత్రల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే హోల్సేల్ డీలర్ల నుంచే కాకుండా మెడికల్ షాపుల నిర్వాహకుల వద్ద ఉన్న ఈ మాత్రలను వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచారం. పైగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులు విచ్చలవిడిగా వాడితే గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని, డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుండగా, బీపీ, షుగర్ పేషెంట్లు మాత్రం ముందుచూపుతో మూడు నెలలకు సరిపడా మందులు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ రోగుల మాత్రలు ఇట్టే అమ్ముడుపోతున్నట్లు మందుల దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే.. కండోమ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. లాక్డౌన్ నేపథ్యంలో 15 రోజులు ఎవరూ గడప దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి లేకపోవడంతో అంతా ఇంటికి పరిమితమయ్యారు. కరోనాకు ముందు మార్కెట్లో కండోమ్ల అమ్మకాలు విరివిగా ఉండేవి. ప్రస్తుతం వీటిని అడిగేవారే కరువయ్యారని ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడు చెప్పారు. -
కోవిడ్-19: చైనా కంపెనీ సరికొత్త రికార్డు!
బీజింగ్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో చైనా విజయం సాధించింది. ముఖ్యంగా టెక్నాలజీ వాడకం, సత్వర వైద్య సదుపాయాలతోనే ఈ విజయం సాధ్యమైంది. ఇక వైరస్ వ్యాప్తి నియంత్రణలో కీలక పాత్ర పోషించే మాస్కుల తయారీలో డ్రాగన్ దేశం ఆదర్శంగా నిలిచింది. వైరస్ విజృంభణతో మాస్కులకు భారీ డిమాండ్ ఏర్పడటంతో.. 20 రోజుల వ్యవధిలోనే 2.8 రెట్లు అధిక ఉత్పత్తితో.. చైనా రోజుకు 44.9 మిలియన్ల మాస్కులు తయారు చేసిందని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ ప్రశంసలు కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సాధించిందని తెలిపింది. ముఖ్యంగా షెంజెన్లో ఉన్న బీవైడీ కంపెనీ కృషి అభినందనీయమని పేర్కొంది. రోజుకు 5 మిలియన్ల మాస్కుల తయారీతో బీవైడీ అతిపెద్దగా సంస్థగా ఆవిర్భవించిందని తెలిపింది. దాంతోపాటు.. రోజూ మూడు లక్షల వైరస్ నిర్మూలనా ద్రావణం బాటిళ్లు తయారీ చేస్తోందని వెల్లడించింది. (చదవండి: కరోనా అలర్ట్ : మాస్క్లు, గ్లోవ్స్ కంటే ఇదే ముఖ్యం) మాస్కుల తయారీలో చైనాలో మూడో వంతు ఉత్పత్తిని బీవైడీ కంపెనీ సాధిస్తోందని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ చెప్పింది. డిమాండ్ అమాంతం పెరడంతో.. మూడు వేల మంది ఇంజనీర్లతో అందుబాటులో ఉన్న వనరుల సాయంతో రెండు వారాల్లోనే సామర్థ్యం పెంచుకోగలిగామని బీవైడీ కంపెనీ చైర్మన్, ప్రెసిడెంట్ వాంగ్ చౌన్ఫూ చెప్పారు. ఇక కోవిడ్ పుట్టుకకు కేంద్రమైన చైనాలోని వుహాన్లో కొత్తగా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులుగా అక్కడ పదుల సంఖ్యలోనే కేసులు నమోదవుతుండగా.. కోవిడ్తో మరణించే వారి సంఖ్య పడిపోయింది. అప్రమత్తంగా ఉంటే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని.. చైనా, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలు నిరూపించాయి. (చదవండి: కరోనా వ్యాప్తి: భారీగా వాల్మార్ట్ నియామకాలు) -
కరోనా: మనుషులకు సరే, మరి దేవుళ్లకు
వారణాసి: కోవిడ్-19(కరోనా వైరస్).. ఈ పేరొక భూతం.. ఈ మాటొక విపత్తు.. దీని ఉనికి మనకు వినాశనం. ప్రస్తుతం కరోనా భయం లేనిదెవరికి. ఇది దేశంలోకి ఎంటరైన క్షణం నుంచి భారతీయుల హైరానా అంతా ఇంతా కాదు. ‘మాస్క్లు ధరించండి, దగ్గు, జలుబు చేస్తే ఆసుపత్రికి వెళ్లండి, ఓ సారి పరీక్ష చేయించుకోండి.. కరచాలనం వద్దు, నమస్కారం ముద్దు, వీలైనంతవరకు జనసందోహం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో తిరగకండి..’ ఇలా ఒకటేమిటి బోలెడు సూచనలు వినిపిస్తున్నాయి. సరే బయట తిరగడం కూడా వద్దంటున్నారని కాసేపు ఫోన్ మాట్లాడదామనుకుంటామా..! ఇంతలో అటు నుంచి దగ్గు. ఇంకేముందీ.. కాలర్ ట్యూన్కు కరోనా సోకినట్టుందని దాని రొద వినలేక ఫోన్ అవతలి వారికి కనెక్ట్ అయిపోయేలాగా మనమే డిస్కనెక్ట్ అవుతున్నాం(ఫోన్ కట్ చేస్తున్నాం). సరే మనుషుల పరిస్థితి ఇలా ఉంటే.. మరి దేవుళ్లు. ఇదేం దిక్కుమాలిన ప్రశ్న అని తిట్టుకోకండి. దేవుడికి కరోనా సోకకుండా ఓ పూజారి విగ్రహానికి ఫేస్ మాస్క్ తొడిగి పూజలు చేస్తున్నాడు.(పుట్టగానే ఆ బిడ్డ చేసిన పనికి డాక్టర్లే షాక్) ఈ విచిత్రం చూడాలంటే ఉత్తర ప్రదేశ్లోని వారణాసి ప్రహ్లాదేశ్వర ఆలయానికి వెళ్లాలి. ఇక అక్కడికి వచ్చిన భక్తులు సైతం శివలింగానికి మాస్కు చూసి ఖంగుతిన్నారు. అందరినీ ఆదుకునే దేవునికి ఆపద వస్తుందా? అని నోరెళ్లబెట్టారు. దీనిపై ఆలయ పూజారి కృష్ణ ఆనంద్ పాండే మాట్లాడుతూ ‘వాతావారణం చల్లగా ఉన్నప్పుడు శిలామూర్తులకు వస్త్రాలు కప్పుతాం. ఉక్కపోతగా ఉన్నప్పుడు ఏసీ, ఫ్యాన్లు పెడుతాం. ప్రస్తుతం కరోనా ప్రబలుతోంది కాబట్టి విగ్రహానికి ఫేస్ మాస్క్ పెట్టాం. కరోనాపై అవగాహన కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని స్పష్టం చేశారు. అంతేకాక ఆలయానికి వచ్చే భక్తులకు సైతం కొన్ని నిబంధనలు విధించాడు. భక్తులెవరూ దేవతామూర్తుల విగ్రహాలను తాకరాదని పేర్కొన్నారు. ఎవరైనా ఒకరు విగ్రహాన్ని తాకడం వల్ల దాన్ని మిగతావారు తాకినప్పుడు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. ఇక ఈ ఆలయంలో పూజారితోపాటు భక్తులు కూడా మాస్కులు ధరించే పూజాపునస్కారాలు చేయడం గమనించవచ్చు. (కరోనాతో వ్యక్తి మృతి : భారత్లో తొలి కేసు..!) చదవండి: కరోనా భయంతో ఇళ్లలోనే ఇటాలియన్లు -
కరోనా ఎఫెక్ట్.. దేవుని విగ్రహాలకు..
సాక్షి, వారణాసి : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్(కోవిడ్-19) ఇప్పుడు దేవుడిని సైతం భయపెడుతోంది. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు దేవుని విగ్రహానికి మాస్క్లు పెట్టారు ఓ పూజారి. అంతేకాదు భగవంతుని విగ్రహాన్ని భక్తులు ఎవరూ తాకరాదని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గల విశ్వనాథ్ ఆలయంలో చోటు చేసుకుంది. ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే ఆలయంలోని విగ్రహానికి మాస్క్ కట్టినట్లు పూజరి వివరించారు. (చదవండి : మూడేళ్ల చిన్నారికీ కోవిడ్) ‘ కరోనావైరస్ దేశవ్యాప్తంగా వ్యాపించింది. దీని గురించి అవగాహన పెంచడానికే విశ్వనాథ్ స్వామి విగ్రహం మీద మాస్క్ ఉంచాం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు విగ్రహంపై వస్త్రాన్ని ఉంచుతాం.. వేడిగా ఉన్న సమయంలో మాస్క్ను కడుతాం’ అని పూజరి పేర్కొన్నారు. (చదవండి : ఇప్పటివరకు 3,800 మంది మృతి) అలాగే విగ్రహాన్ని ఎవరూ తాకరాదని విజ్ఞప్తి చేశారు. ‘ చేతులలో విగ్రహాన్ని తాకడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది. భక్తులు స్వామివారిని చేతితో తాకితే.. కరోనావైరస్ ఎక్కువ మందికి సోకే ప్రమాదం ఉంది. కావున కొద్ది రోజుల వరకు భక్తులు విగ్రహాన్ని తాకరాదు’ అని పూజరి విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా వైరస్ గురించి అక్కడి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్లు ధరించాలని సూచిస్తున్నారు. కాగా, కోవిడ్ కారణంగా ప్రపంచం వ్యాప్తంగా ఇప్పటివరకూ 3,800 మంది మరణించారు. లక్షాపదివేల మంది వైరస్ బారిన పడ్డారు. ఇక భారత్లో ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 44కు చేరింది. -
కరీంనగర్ జిల్లాలో మాస్కుల కొరత
-
కరోనా ఎఫెక్ట్: 25 కోట్ల మాస్క్ల స్మగ్లింగ్
కోవిడ్-19(కరోనా) వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఫేస్ మాస్క్లకు కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కొరతను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించిన ఓ బ్రిటిష్ ట్రక్కు డ్రైవర్ను మొరాకోలోని టాంగర్ మెడ్ కార్గో రేవు వద్ద మొరొక్కో అధికారులు అరెస్ట్ చేశారు. బ్రిటన్ నుంచి మొరొక్కో రేవుకు 25 కోట్ల రూపాయలు విలువైన లక్ష ఫేస్ మాస్క్లను బ్రిటన్ డ్రైవర్ తీసుకొచ్చారు. ఆ డ్రైవర్ సరకు అన్లోడ్ చేయకుండా వాటిని బ్లాక్లో విక్రయించేందుకు తిరిగి లండన్కు తీసుకెళుతూ కస్టమ్స్ అధికారులకు మంగళవారం సాయంత్రం దొరకిపోయాడు. ఒక్కో మాస్క్ను రెండున్నర వేల రూపాయల చొప్పున విక్రయించాలనుకున్నట్లు మొరాకో పోలీసుల విచారణలో ఆ డ్రైవర్ వెల్లడించాడు. అయితే ఆ డ్రైవర్ పేరును తెలిపేందుకు మొరాకో అధికారులు నిరాకరించారు. మొరాకోలో సోమవారం నాడు మొదటి కరోనా కేసు బయట పడింది. ప్రస్తుతం ఆయన్ని కాసాబ్లాంక ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు. ప్రపంచంలో సగం మార్కెట్కు ఫేస్ మాస్క్లను సరఫరా చేస్తోన్న చైనా కంపెనీల్లోనే పలు కంపెనీలు కరోనా వైరస్ విస్తరణ కారణంగా మూత పడడంతో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ల కొరత ఏర్పడింది. పర్యవసానంగా ప్రపంచవ్యాప్తంగా మాస్క్ల ధరలు అడ్డగోలుగా పెరగి పోయాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్లోని పలు సర్జికల్ షాపులు, ఆస్పత్రుల నుంచి మాస్క్ల చోరీలు జరగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. వల్లాడాలిడ్ యూనివర్శిటీ క్లినిక్ ఆస్పత్రి నుంచి ఐదువేల మాస్క్ల చోరీ జరిగినట్లు ప్రాంతీయ వైద్య అధికారులు తెలిపారు. కోస్టా డెల్ సోల్ ఆస్పత్రి స్టోర్ నుంచి 300 మాస్క్లు చోరీ అయ్యాయి. ఇదిలావుండగా, థాయ్లాండ్ ఉపయోగించి పడేసిన ఫేస్ మాస్క్లను తీసుకొచ్చి ఉతికి, ఇస్త్రీ చేసి అమ్ముతున్న కార్మికులను అరెస్ట్ చేశారు. బ్యాంకాక్కు ఉత్తరాన సారాబురి రాష్ట్రంలోని ఓ ఇంట్లో ఆరుగురు కార్మికులు వాషింగ్ మిషిన్లలో మాస్క్లు ఉతికి, ఇస్త్రీ చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. -
బ్లాక్హెడ్స్ను తొలగించే ఎఫెక్టివ్ టిప్
అందంగా, కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఉన్నంతలో చక్కగా తయారవ్వడం ఎవరికైనా ఇష్టమే. అందం మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే కొంత మందికి అనేక కారణాలతో ముఖం మీద మచ్చలు, బ్లాక్హెడ్స్ వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాంటి బ్లాక్హెడ్స్ను వదిలించుకోవడానికి చాలా మంది సెలూన్తోపాటు బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. అయితే అలాంటివి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని చాలా మంది భయపడుతుంటారు. చాలామంది ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కూడా చర్మం పొడిబారి పోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక ఎండలో బయట తిరిగినప్పుడు ముఖం మీద ధూళి కణాలు చేరి చివరికి బ్లాక్ హెడ్స్ ఏర్పడటానికి దారితీస్తాయి. మొటిమలు, వైట్హెడ్స్, బ్లాక్హెడ్స్ వంటి చర్మ సమస్యలు గల వారికి చర్మం జిడ్డులాగా మారుతుంది. అయితే ఇంట్లో లభించే కొన్ని వస్తువుల ద్వారా ఇలాంటి వాటిని సులువుగా వదిలించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మచ్చలు, బ్లాక్హెడ్స్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. అంతేగాక మీ చర్మం బయటి నుంచే కాకుండా లోపల నుంచి తాజాగా మెరిసిపోవడం గ్యారంటీ అంటున్నారు నిపుణులు... అవేంటో వాటి వైపు ఓ కన్నేద్దాం... కావలసిన పదార్థాలు ► అరటిపండు ► తేనే(ఒక టేబుల్ స్పూన్) ► ఓట్స్(ముద్దగా చేయాలి) ఉపయోగించే విధానం ముందుగా అరటి పండును గుజ్జుగా, ఓట్స్ను మెత్తగా పొడి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తరువాత ఓ గిన్నె తీసుకొని అందులో ఓట్స్, తేనె, గుజ్జుగా చేసిన అరటిపండుతో కలిపి మిక్స్ చేయాలి. బాగా కలిపిన తర్వాత దానిని జాగ్రత్తగా ముఖానికి బ్లాక్హెడ్స్ ఉన్న చోట మాస్క్లాగా అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత 5 నుంచి 7 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. చివరగా ముఖంపై మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఉపయోగాలు.. ► ఓట్స్ వల్ల చర్మంలోని మృతకణాల తొలగించడంతోపాటు, ముఖంపై ఉన్న ధూళిని తొలగిస్తుంది. ► అంతేగాక చర్మం నుంచి అధికంగా ఉన్న ఆయిల్ను గ్రహించే శక్తి ఓట్స్కు ఉంటుంది. ► ఇక తేనె ముఖంలోని బాక్టీరియాను పొగొట్టేందుకు ఉపయోగపడుతుంది. ► మోముపై మెరుపును తీసుకువచ్చి..కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. చర్మంలో కోల్పోయిన తేమను తిరిగి తెస్తుంది. ► ఓట్స్, అరటిపండు మిక్స్ చేయడం వల్ల ఎక్స్ఫోలియేటింగ్ శక్తిని రెట్టింపు చేస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఇది జిడ్డుగల చర్మం వారితోపాటు అన్ని రకాల చర్మం గల వారికి సహాయపడుతుది. ఇంకేందుకు ఆలస్యం ఇకపై ఫేస్ ప్యాక్ చేసుకునే ముందు దీన్ని ప్రయత్నించండి. ఇక బ్లాక్హెడ్స్కు బై-బై చెప్పండి. -
‘మాస్క్’లు కాలుష్యాన్ని ఆపుతాయా!?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢీల్లీతోపాటు ప్రపంచంలోని పలు నగరాలు నేడు అధిక వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త డీజిల్ కార్ల కొనుగోలుపై నిషేధం విధించడంతోపాటు ప్రస్తుత కార్లను రోడ్లపైకి ‘సరి బేసి’ విధానంతో అనుమతిస్తున్నారు. అంటే నెంబర్ ప్లేట్పై సరి సంఖ్య కలిగిన కార్లను ఒక రోజు అనుమతిస్తే బేస్ సంఖ్య కలిగిన కార్లను ఆ మరుసటి రోజు అనుమతిస్తున్నారు. లండన్లో ‘కంజెషన్ చార్జింగ్ (రద్దీ నివారణకు చార్జీలు)’ అమలు చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు తిరిగే అన్ని వాహనాలపై నిర్దేశిత చార్జీలు వసూలు చేస్తారు. శని, ఆదివారాల్లో, ఇతర సెలవు దినాల్లో వసూలు చేయరు. పారిస్లో ‘బైక్ షేరింగ్’ విధానాన్ని అమలు చేస్తుండగా, చైనాలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ దళం రోడ్లపై, ఖాళీ ప్రాంతాల్లో ఎక్కడా చెత్తా చెదారాన్ని ప్రజలు కాల్చకుండా చూడడంతోపాటు కాలం తీరిన వాహనాలను పట్టుకొని డంపింగ్ యార్డ్కు తరలిస్తారు. ప్రధానంగా వాయు కాలుష్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ధూళి లేదా నుసి రేణువులు కాగా, మరొకటి గ్యాసెస్. ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ప్రమాదకర గ్యాస్లు. నుసి రేణువులతోపాటు గ్యాస్లను పీల్చడం వల్ల ప్రజల ఉపిరితిత్తులు, గుండె మాత్రమే కాకుండా మెదడు కూడా దెబ్బతింటుంది. వీటినుంచి రక్షించుకోవడానికి పాదాచారులు, సైక్లిస్టులు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు మాస్క్లు ధరిస్తున్నారు. అవి ఎంత వరకు సురక్షితం ? అవి ఎన్ని రకాలు ? ఇవి పలు రకాలు తక్కువ ధర కారణం కావొచ్చేమోగానీ ఎక్కువ మంది ‘పేపర్ డస్ట్ మాస్క్’లను ఉపయోగిస్తున్నారు. ఈ మాస్క్లు కేవలం పది శాతం కాలుష్యాన్ని మాత్రమే నివారిస్తాయి. కనుక వీటి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. హెపా ఫిల్టర్ మాస్క్లు, అందులో ముఖ్యంగా ‘ఎన్95 రెస్పిరేటర్లు’ బాగా పనిచేస్తాయని, ఇవి 0.3 మైక్రాన్ల నుసి రేణువులను కూడా అడ్డుకోగలవని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇవి వాయు కాలుష్యాన్ని మాత్రమే అడ్డుకుంటాయి. గ్యాసుల కాలుష్యాన్ని అడ్డుకోవాలంటే ‘ఫేస్మాస్క్’లను ధరించాలి. వీటి మీద ఇప్పటి వరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. ఒక్క చైనాలోనే మూడు పరిశోధనలు జరిగాయి. 2009, 2012, 2017 సంవత్సరాల్లో అధ్యయనం చేసి చైనా ‘ఎన్95 మాస్క్ల’ను అభివద్ధి చేసింది. ఈ మాస్క్లతోని కొంత ప్రయోజనం ఉన్నా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏ మాత్రం గాలి జొరబడకుండా ఫేస్ మాస్క్లను సీల్ చేసినట్లుగా ధరించాలి. దాని వల్ల చాలా మందికి చికాకుగా ఉంటుంది. గెడ్డం పెంచిన వాళ్లే కాకుండా గెడ్డం గీసుకోని వాళ్లు వీటిని ధరించడం కుదరదు. పైగా ఖరీదు కూడా కాస్త ఎక్కువే (600 నుంచి 2,500 రూపాయల వరకు). ఈ ప్రత్యామ్నాయాలను పాటించే బదులు ‘నేను సైతం పర్యావరణ పరిరక్షణకు ప్రమిదనవుతాను’ అంటూ ప్రజలు ముందుకు వస్తే అందుకు ప్రభుత్వాలు కూడా మోకరిల్లక తప్పదు! -
ముసుగు వెయ్యొద్దు...
... మనసు మీద’ అని ‘ఖడ్గం’లో పాట గుర్తుండే ఉంటుంది. ఇక్కడున్న రెండు ఫొటోలు చూస్తుంటే.. ముసుగు వెయ్యొద్దు ముఖము మీద అనాలనిపిస్తోంది. ఈ మాస్క్ వెనకాల ఉన్న ముఖారవిందాలు ఎవరివో తెలుసుకోవాలని ఉంది కదూ. అయితే చిన్న క్లూ. ఒక ముఖం లోకనాయకుడి కుమార్తెగా ఇండస్ట్రీకి వచ్చి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ది. మరో ముఖం ఎవరిదో తెలుసుకోవాలంటే బాలీవుడ్కి వెళ్లాల్సిందే. జర్మనీలో పుట్టి, పెరిగిన ఈ భామ ‘ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్’ అనే హిందీ సినిమా ద్వారా భారతీయ తెరకు పరిచయమయ్యారు. ఇప్పుడు తెలుగులో మిర్చిలాంటి కుర్రాడి సరసన నటిస్తున్నారు. ఈ క్లూస్తో ఈ ఇద్దరు ముఖాలు ఎవరివో కనిపెట్టేసి ఉంటారు. అయినా మేమే చెప్పేస్తున్నాం. ఒకరు లోకనాయకుడు కమల్హాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతీహాసన్, మరొకరు ఎవెలిన్ శర్మ. ఇంతకీ వీళ్లిద్దరూ ఎందుకిలా ఫేస్ని కవర్ చేశారంటే.. ముఖారవిందం తళుకులీనడానికి ఫేస్ మాస్క్ వేసుకున్నారేమో! -
చమక్కు స్కిన్
చర్మ సౌందర్యాన్ని ఇనుమడింప చేయడంలో శనగపిండి స్పెషల్. అన్ని రకాల చర్మతత్త్వాలకు శనగపిండి బాగా పనిచేస్తుంది. రోజుల పాపాయికి కూడా చలి కాలంలో శనగపిండితో నలుగు పెట్టి స్నానం చేయించేవాళ్లు. శనగపిండి–పసుపు మాస్క్ ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల పాలు కాని తాజా మీగడ కాని కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు వీలైతే శరీరం మొత్తానికి రాసుకోవచ్చు. ఆరిన తర్వాత మాస్క్ని వేళ్లతో సున్నితంగా రుద్దుతూ తీసేయాలి. ఇది ముఖంపై ఉన్న దుమ్ము,ధూళిని తీసివేసి చర్మాన్ని ఫ్రెష్గా, సున్నితంగా తయారు చేస్తుంది. శనగపిండి – ఆరెంజ్ పీల్ మాస్క్ ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో పావు టీ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ (పౌడర్ లేనప్పుడు పీల్ని మెత్తగా గ్రైండ్ చేసి ఆ గుజ్జును వాడాలి), ఒక టేబుల్ స్పూన్ చిలికిన పెరుగు, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఆరిపోయే వరకు ఉంచి మెల్లిగా రుద్ది తీసేయాలి. ఈ మాస్క్ను వదిలించేటప్పుడు గట్టిగా రుద్ద కూడదు. -
ఈ మాస్క్తో వైరస్లకూ అడ్డుకట్ట
బీజింగ్: వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. దీనికి కారణం మెర్స్, సార్స్ అనే వైరస్లే. వీటిబారిన పడకుండా ఉండాలంటే మాస్క్లు ధరించాలని చెబుతారు వైద్యులు. అయితే ఇప్పుడున్న మాస్క్లు కేవలం గాలిలోని ధూళి కణాలను అడ్డుకుంటాయే తప్ప వైరస్ల వంటి సూక్ష్మజీవులను ఇవి నిలువరించలేవనే విషయం ఎన్నో పరిశోధనల్లో రుజువైంది. అయితే మెర్స్, సార్స్, ఇన్ఫ్లుయెంజా-ఏ వంటి అతి సూక్ష్మ వైరస్లను కూడా అడ్డుకునే ఓ మాస్క్ను హాంగ్కాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీకి చెందిన వాలెస్ తెంగ్ రూపొందించాడు. నానో పార్టికల్స్తో పలు పొరలుగా రూపొందించిన ఈ మాస్క్ పరిశుభ్రమైన గాలిని మాత్రమే లోనికి పంపుతుందని, ఒక నానోమీటర్(మనిషి వెంట్రుక మందం లక్ష నానో మీటర్లు) పరిమాణంలో ఉంటే వైరస్లను కూడా ఇది అడ్డుకుంటుందని తెంగ్ చెబుతున్నాడు.