
అత్యవసర సేవలకు విఘాతం కలిగించవద్దు: సీఎం
టీటీడీ, విద్యుత్, విద్య, వైద్యం తదితర అత్యవసర సేవలకు విఘాతం కలిగంచవద్దని సమ్మె చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అత్యవస సేవల ఆవశ్యకతను ఉద్యోగ సంఘాలకు వివరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టీటీడీ ఈవో, చిత్తూరు జిల్లా కలెక్టర్, విద్యుత్ అధికారులను ఆదేశించారు.
సమ్మె పరిస్థితిపై ముఖ్యమంత్రి బుధవారం సమీక్షించారని పేర్కొంటూ సీఎంవో పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాయలసీమ, ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై అధికారులను అడిగి తెలసుకున్నారు. సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు.